61 - అనిరుద్దుని వివాహము - రుక్మి సంహారము

శ్రీశుక ఉవాచ

ఏకైకశస్తాః కృష్ణస్య పుత్రాన్ దశ దశాబలాః

అజీజనన్ననవమాన్ పితుస్సర్వాత్మసంపదా

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఆ యువతులు ప్రతి ఒక్కరు శ్రీకృష్ణునకు పదేసిమంది చొప్పున పుత్రులను కనిరి. వారు తమయందలి సమస్త మైన రూపొదిసంపత్తిచే తండ్రికి తీసిపోనివారు.

గృహాదనపగం వీక్ష్య రాజపుత్ర్యోఽచ్యుతం స్థితమ్

ప్రేష్ఠం న్యమంసత. స్వం స్వం న తత్తత్త్వవిదః స్త్రియః

శ్రీకృష్ణ భగవానుడు ఆ రాజకుమార్తెల ఇళ్లలో దూరము కాకుండా స్థిరముగా నుండెను. దానిని చూచి ఆ యువతులు ప్రతివారు తామే ఆయనకు మిక్కిలి ప్రియమైనవారని తలపోసిరి. వారికి ఆయన - ఆత్మారాముడని తెలియదు.

చార్వబ్జకోశవదనాయతబాహునేత్ర-

సప్రేమహాసరసవీక్షితవల్గుజల్పైః

సమ్మోహితా భగవతో న మనో విజేతుం

స్వైర్వీభ్రమైస్సమశకన్ వనితా విభూమ్నః

శ్రీకృష్ణ భగవానుని అందమైన పద్మపు మొగ్గవంటి ముఖము, పొడవాటి చేతులు, విశాలమైన కళ్లు, ప్రేమతో కూడిన చిరునవ్వు, రసమయమగు చూపు, మనోహరమగు పలుకులు ఆ యువతులను సమ్మోహపరచినవి. కాని, పోరు మాత్రము తమ విలాసలచే పరిపూర్ణుడగు ఆయన మనస్సును జయించలేకపోయిరి.

స్మాయావలోకలవదర్శితభావహారి-

భ్రూమండలప్రహితసొరతమంత్రశౌండైః

పత్న్యస్తు షోడశసహస్రమనంగబాణైః

య సేంద్రియం విమథితుం కరణైర్న శేకుః

పదునారువేల భార్య లైతే చిరునవ్వుతో కూడిన ప్రక్క చూపులతో ప్రేమను సూచిస్తూ, కనుబొమల త్రిప్పుటలచే మనస్సును దోచివేసెడి వారు. ప్రేమమంత్రమునందు సమర్థములైన మన్మథబాణములను వారు చూపుల ద్వారా విసి రెడివారు. ఇంతేగాక, హావభావములు మొదలైన ఇతరోపాయములను కూడ ప్రయోగించెడివారు. కానీ, వారు ఆయన మనస్సును కల్లోలపరచలేకపోయిరి.

ఇత్థం రమాపతిమవాప్య పతిం స్త్రీయస్తా 

బ్రహ్మాదయోఽపి న విదుః పదవీం యదీయామ్

భోజుర్ముదాఽవిరతమేధితయ్యాఽనురాగ

హాసావలోకనవసంగమలాలసాద్యమ్

బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలగువారు లక్ష్మీపతియగు శ్రీకృష్ణ భగవానుని పొందే ఉపాయమును తెలియకున్నారు. కాని, ఆ యువతులు మాత్రము ఆయననీ విధముగా - భర్తగా పొందిరి. వారి ఆనందము నిరంతరముగా వర్ధిల్లుచుండెను. వారు ప్రేమతోడి నవ్వు, అనురాగపు చూపులు, కొత్త కలయికయందలి ఉత్కంఠ మొదలగు హావభావముల నాయన యెడల నేరపి.

ప్రత్యుద్గమాసనవరార్హణపాదశౌచ-

తాంబూలవిశ్రమణవీజనగంధమాల్యైః

కేశప్రసారశయనస్నపనోపహార్యై:

దా సీశతా అపి విభోర్విదధుస్స్మ దాస్యమ్  

ఆ శ్రీకృష్ణ భార్యల వద్ద వందలాది దాసీలు ఉండిరి. అయినా, ఆ ప్రభునకు ఎదు రేగుట, ఆసనమునిచ్చుట, త్రాగే నీరు మొదలగు శ్రేష్ఠమగు ఉపచారములను చేయుట, కాళ్లను కడుగుట, తాంబూలమునిచ్చుట, కాళ్లను నొక్కి శ్రమను తొలగించుట, వీచుట, గంధమునలదుట, పుష్పములనిచ్చుట, జుట్టు దువ్వుట, ప్రక్కనమర్చుట, స్నానమునకు వ్యవస్థ చేయుట, భోజనమును ఫలహారమును ఇచ్చుట మొదలగు పరిచర్యలతో సేవ చేసిరి.

తాసాం యా దశపుత్రాణాం కృష్ణ స్త్రీణాం పురోదితాః

అష్టా మహిష్యస్తత్పుత్రాన్ ప్రద్యుమ్నాదీన్ గృణామి తే

శ్రీకృష్ణుని భార్యలకు పదేసి పుత్రులు గలరు. ఆ భార్యలలో ఎనమండు గురు పట్టమహిషుల గురించి ఇదివరలో చెప్పడమైనది. వారి పుత్రులైన ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు మొదలగువారి గురించి నీకు చెప్పెదను.

చారుదేష్ణస్సుదేష్ణశ్చ చారుదేహశ్చ వీర్యవాన్

సుచారుశ్చారుగుప్తశ్చ భద్రచారుస్తథాపరః

చారుచంద్రో విచారుశ్చ చారుశ్చ దశమో హరేః  

ప్రద్యుమ్న ప్రముఖ జాతా రుక్మిణ్యాం నావమాః పితుః

శ్రీకృష్ణ భగవానునకు రుక్మిణియందు పెద్ద కొడుకు ప్రద్యుమ్నుడు, తరువాత పరాక్రమశాలురగు చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారు దేహుడు, సుచరుడు, చారుగుపుడు, భద్రాచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే పదిమంది కొడుకులు, తండ్రికి తీసిపోనివారు, కలిగిరి.

భానుస్సుభానుస్స్వర్భానుః ప్రభానుర్భానుమాంస్తథా చంద్రభానుర్బృహద్భానురతిభానుస్తథాఽష్టమః  

శ్రీభానుః ప్రతిభానుశ్చ సత్యభామాఽఽత్మజా దశ

భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతీభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే పది మంది సత్యభామ యొక్క పుత్రులు.

సాంబస్సుమిత్రః పురుజిచ్ఛతజిచ్చ సహస్రజిత్  

విజయశ్చిత్రకేతుశ్చ వసుమాన్ ద్రవిడః క్రతుః

జాంబవత్యాస్సుతా హ్యేతే సాంబాద్యాః పితృసమ్మతాః

జాంబవతి పెద్ద కొడుకు సాంబుడు. సుమిత్రుడు, పురుజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్ర కేతువు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే తొమ్మిదిమంది తరువాతి వారు. వీరియందు తండ్రికి ప్రేమ యెక్కువ.

వీరశ్చంద్ర్వోఽశ్వ సేనశ్చ చిత్రగుర్వేగవాన్ వృషః

ఆమశ్శంకుర్వసుశ్ర్శీమాన్ కుంతిర్నాగ్నజితేస్సుతాః

వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, ఆముడు, శంకుడు, వసువు, శోభాయుక్తుడగు కుంతి అనువారలు నగ్నజిన్మహారాజుయొక్క కుమార్తెయగు సత్యయొక్క పుత్రులు.

శ్రుతః కవిర్వృషో వీరస్సుబాహుర్బద్ర ఏకలః

శాంతిర్దర్శః పూర్ణమాసః కాలింద్యాస్సోమకోఽవరః

శ్రుతుడు, కవి, వృషుడు, సుబాహుడు, భద్రుడు, ఏకలుడు, శాంతి, దర్శుడు, పూర్ణమాసుడు, ఆఖరివాడగు సోమకుడు అనే వీరులు కాలిందియొక్క పుత్రులు.

ప్రఘోషో గాత్రవాన్ సింహో బలః ప్రబల ఊర్ధ్వగః

మాద్ర్యాః పుత్రా మహాశక్తిస్సహ ఓజోఽపరాజితః

ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనువారు మద్రరాజకుమారియగు లక్ష్మణయొక్క పుత్రులు.

వృకో హర్షోఽనిలో గృద్రో వర్ధనోఽన్నాద ఏవ చ

మహాశః పావనో వహ్నిర్మిత్రవిందాఽఽత్మజాః క్షుధిః

వృకుడు, హరుడు, అనిలుడు, గృధ్రుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనువారు మిత్రవిందయొక్క పుత్రులు.

సంగ్రామజిద్బృహత్సేనశ్శూరః ప్రహరణోఽరిజిత్

జయస్సుభద్రో భద్రాయా వామ ఆయుశ్చ సత్యకః

సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు భద్ర పుత్రులు.

దీప్తిమంస్తామ్రతప్తాద్యా రోహిణ్యాస్తనయా హరేః

ప్రద్యుమ్నాచ్చానిరుద్ధోఽభూద్రుక్మవత్యాం మహాబలః

పుత్ర్యాం తు రుక్మిణో రాజన్నామ్నా భోజకటే పురే

ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణ భగవానునకు పదునారు వేలమందిలో ఒకరగు రోహిణి వలన దీప్తిమంతుడు, తాత్రేతపుడు మొదలగు పుత్రులు కలిగిరి. ప్రద్యుమ్నునకు రుక్మీయొక్క కుమార్తెయగు రుక్మవతి అనే భార్యయందు భోజకటమని ప్రసిద్ధమైన నగరములో అనిరుద్ధుడు కలిగెను.

ఏతేషాం పుత్రపౌత్రాశ్చ బభూవుః కోటిశో నృప

మాతరః కృష్ణజాతానాం సహస్రాణి చ షోడశ

ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణునికి జన్మించిన సంతానమునకు తల్లుల సంఖ్య పదునారు వేలు మించెను. వీరి కొడుకులు, మనుమలు కోట్లాది ఉండిరి.

రాజోవాచ

కథం రుక్మ్యరిపుత్రాయ ప్రాదాద్దుహితరం యుధి

కృష్ణేన పరిభూతస్తం హంతుం రంధ్రం ప్రతీక్షతే

ఏతదాఖ్యాహి మే విద్వన్ ద్విషోర్వైవాహికం మిథః

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- జ్ఞానివగు ఓ మహర్షీ! రుక్మి యుద్దములో శ్రీకృష్ణునిచే పరాభవించబడి, ఆయనను హతమార్చుటకు అవకాశమునకై ఎదురు చూచుచుండెను. అట్టివాడు కుమార్తెను శత్రువు పుత్రునికిచ్చి వివాహమునెట్లు చేసెను? శత్రువులైన శ్రీకృష్ణరుక్మిల మధ్యలో పరస్పరము వివాహసంబంధము ఎట్లు కలిగెనో చెప్పడు.

అనాగతమతీతం చ వర్తమానమతీంద్రియమ్

విప్రకృష్టం వ్యవహితం సమ్యక్ పశ్యంతి యోగినః

జ్ఞానులు భూతభవిష్యద్వర్తమానములను, ఇంద్రియములకు అతీతమైనవాటిని, దూరమునందున్న వాటిని, కప్పివేయబడినవాటిని కూడ సాక్షాత్తుగా దర్శించేదరు.

శ్రీశుక ఉవాచ

వృతస్స్వయంవరే సాక్షాధనంగోంఽగయుతస్తయా

రాజ్ఞస్సమేతాన్నిర్జిత్య జహారైకరణో యుధి

శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- దేహము లేని మన్మథుడు దేహము పొంది సాక్షాత్తుగా ప్రద్యుమ్నుడైనాడు. రుక్మవతి ఆయనను స్వయంవర ములో వరించెను. ఆయన ఒక్కడు రథము మాత్రమే గలవాడై, స్వయం వరమునకు వచ్చిన రాజులను జయించి, ఆమెను దోడ్కొని వెళ్లాను.

యద్యప్యనుస్మరన్ వైరం రుక్మీ కృష్ణావమానితః

వ్యతరద్భాగినేయాయ సుతాం కుర్వన్ స్వసుః ప్రియమ్

ఒకప్పుడు శ్రీకృష్ణుడు తనకు చేసిన అవమానము రుక్మికి గుర్తు ఉండెను. అయినా, ఆతడు చెల్లెలు రుక్మిణికి ప్రీతిని కలిగించుటకై ఆమె కొడుకగు ప్రద్యుమ్నునకు తన కుమార్తెనిచ్చి వివాహము చేసెను.

రుక్మిణ్యాస్తనయాం రాజన్ కృతవర్మసుతో బలీ

ఉపయేమే విశాలాక్షీం కన్యాం చారుమతీం కిల

ఓ పరీక్షిన్మహారాజా! రుక్మిణికి చారుమతి అనే నిడివి కన్నుల కుమార్తె ఉండెను. ఆ కన్యను కృతవర్మ పుత్రుడగు బలి వివాహమాడెను.

దౌహిత్రాయానిరుద్ధాయ పౌత్రీం రుక్మ్యదదాద్ధరేః

రోచనాం బద్ధవైరోఽపి స్వసుః ప్రియచికీర్షయా

జానన్నధర్మం తద్యౌనం స్నేహపాశానుబంధనః

ఆసక్తి అనే పాశమునకు బద్దుడైన రుక్మి చెల్లెలు రుక్మిణికి ప్రీతిని కలిగించగోరెను. అట్టి వివాహము అధర్మము (ఒక వైపు ద్వేషము, రెండో వైపు పెళ్లి అని తెలిసి కూడా ఆతడు శ్రీకృష్ణ భగవానుని (రుక్మిణియొక్క) కొడుకు కొడుకగు అనిరుద్ధుని కొరకు తన పుత్రుని కుమార్తెయగు రోచననిచ్చి వివాహము చేసెను.

తస్మిన్నభ్యుదయే రాజన్ రుక్మిణీ రామ కేశవౌ

పురం భోజకటం జగ్ముస్సాంబప్రద్యుమ్నకాదయః

ఓ పరీక్షిన్మహారాజా! ఆ మంగళకార్యము నిమిత్తముగా రుక్మిణి, బలరాముడు, శ్రీకృష్ణ భగవానుడు, సాంబుడు, ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు మొదలగువారు భోజకటనగరమునకు వెళ్లిరి.

తస్మిన్నివృత్త ఉద్వాహే కాలింగప్రముఖా నృపాః

దృప్తాస్తే రుక్మిణం ప్రోచుర్బలమక్షైర్వినిర్జయ

ఆ వివాహము సమాప్తమయ్యెను. అప్పుడు గర్వించియున్న కలింగదేశాధిపతి మొదలగు రాజులు రుక్మితో, బలరాముని జూదములో జయించుము, అని ప్రోత్సహించిరి.

అనక్షజ్ఞో హ్యయం రాజన్నపి తద్వ్యసనం మహత్

ఇత్యుక్తో బలమాహూయ తేనాక్షై రుక్మ్యదీవ్యత

ఓ పరీక్షిన్మహారాజా! ఈ బలరాముడు జూదము తెలిసినవాడు కానే కాదు. కాని, ఆ వ్యసనము బలమైనది. ఈ విధముగా రాజులచే ప్రోత్సహించబడిన రుక్మి ఆయనను పిలిచి పాచికలతో జూదమాడెను.

శతం సహస్రమయుతం రామస్తత్రాదదే పణమ్

తం తు రుక్మ్యజయత్తత్ర కాలింగః ప్రాహసద్బలమ్

దంతాన్ సందర్శయన్ను చ్చైర్నామృష్యత్తద్దలాయుధః

ఆ జూదములో బలరాముడు వరుసగా వంద, వెయ్యి, పదివేల వరహాలను పందెము కాసేను. కాని రుక్మి ఆ పందెములను నెగ్గెను. అప్పుడు కలింగదేశరాజు విరగబడి నవ్వుతూ నాగలి ఆయుధముగా గల బలరాముని పరిహసించగా, ఆయనకు కోపము వచ్చెను.

తతో లక్షం రుక్మ్యగృహ్ణాద్ గ్లహం తత్రాజయద్బలః

జితవానహమిత్యాహ రుక్మీ కైతవమాశ్రితః

తరువాత రుక్మి లక్ష వరహాలను పందెము కాయగా, బలరాముడా పందెమును నెగెను. కాని, రుక్మి మోసము చేసి తానే నెగ్గితినని చెప్పెను.

మన్యునా క్షుభితశ్ర్శీమాన్ సముద్ర ఇవ పర్వణి

జాత్యాఽరుణాక్షోఽతిరుషా న్యర్బుదం గ్లహమాదదే

సహజముగా ఎర్రని కన్నులు గల శోభాయుక్తుడగు బలరాముడు కోపముచే, పర్వదినమునాడు సముద్రము వోలె, కల్లోలితుడాయెను. ఆయన అధికమగు కోపముతో పది కోట్ల వరహాలను పందెము ఉంచెను.

తం చాపి జితవాన్ రామో ధర్మేణ చ్చలమాశ్రితః

రుక్మీ జీతం మయాఽత్రేమే వదంతు ప్రాశ్నీకా ఇతి

బలరాముడు ఆ పందెమును కూడ న్యాయముగా జయించెను. కాని, మోసము చేయుచున్న రుక్మి - ఈ పందెములో కూడ నేనే నెగ్గితిని; ఈ ప్రక్కనున్న సాక్షులు సాక్ష్యమును చెప్పెదరు గాక!-అని పలికెను.

తదాఽబ్రవీన్నభోవాణీ బలేనైవ జితో గ్లహః

ధర్మతో వచనేనైవ రుక్మీ వదతి వై మృషా

అప్పడాకాశవాణి ఇట్లు పలికెను -- ధర్మముగా బలరాముడే పందెము గెలిచినాడు. కాని రుక్మి నిశ్చయముగా అసత్యమును చెప్పుచున్నాడు.

తామనాదృత్య వైదర్భో దుష్టరాజన్యచోదితః

సంకర్షణం పరిహసన్ బభాషే కాలచోదితః

దుష్టులగు రాజులచే ప్రేరితుడైన విదర్భరాజకుమారుడు రుక్మి ఆ మాటను నిరాకరించెను. ఆతడు మృత్యువుచే ప్రేరితుడై బలరాముని పరిహసిస్తూ ఇట్లు పలికెను.

నైవాక్షకోవిదా యూయం గోపాలా వనగోచరాః

అక్షైర్దీవ్యంతి రాజానో బాణైశ్చ న భవాదృశాః

అడవులలో తిరుగుతూ పశువులను కాచుకునే మీకు జూదములో నేర్పు లేదు. పాచికలతో మరియు బాణములతో క్రీడించేది రాజులు గాని, మీవంటివారు కాదు.

రుక్మిణైవమధిక్షిప్తో రాజభిశ్చోపహాసితః

క్రుద్ధః పరిఘముద్యమ్య జఘ్నే తం నృమ్ణసంసది

రుక్మి ఈ విధముగా తిట్టుటచే మరియు రాజులు పరిహసించుటచే కోపించిన బలరాముడు ఇనుపగుదియను పైకెత్తి వానిని సంహరించెను.

కలింగరాజం తరసా గృహీత్వా దశమే పదే

దంతానపాతయత్క్రుద్ధో యోఽహసద్వివృతైర్ద్విజైః  

కలింగరాజు పళ్లను బయట పెట్టి నవ్వుతూ పరిహసించెను గదా! ఆతడు పారిపోవుచుండగా కోపించియున్న బలరాముడు పది అడుగులలోనే వానిని పట్టుకొని పళ్లను ఊడగొట్టెను.

అన్యే నిర్బిన్నబాహూరుశిరసో రుధిరోక్షితాః

రాజానో దుద్రువుర్భీతా బలేన పరిఘార్ధితాః

బలరాముడు ఇనుపగుదియతో మిగిలిన రాజుల చేతులను, తోడలను, తలలను విరుగకొట్టి పీడించెను. వారు రక్తము స్రవించుచుండగా భయపడి పారిపోయిరి.

నిహతే రుక్మిణి శ్యాలే నాబ్రవీత్సాధ్వసాధు వా

రుక్మిణీబలయో రాజన్ స్నేహభంగభయాద్ధరిః

ఓ పరీక్షిన్మహారాజా! బలరాముడు తన బావమరదియగు రుక్మిని సంహరించగా, శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణియొక్క ప్రేమకు భంగము కలుగునేమోననే భయముతో బాగున్నది అని గాని, బలరాముని ప్రేమకు భంగము కలుగుననే భయముతో బాగులేదు అని గాని చెప్పలేదు.

తతోఽనిరుద్దం సహ సూర్యయా వరం

రథం సమారోప్య యయుః కుశస్థలీమ్

రామాదయో భోజకటాద్దశార్హః

సిద్ధాభిలార్థా మధుసూదనాశ్రయాః

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే ఉత్తరార్ధే ఏకషష్టితమోఽధ్యాయః

బలరాముడు, సాంబుడు మొదలుగా గల యాదవులకు శ్రీకృష్ణ భగవానుడే ఆశ్రయము. వారికి సకలప్రయోజనములు సిద్ధించినవి. వారప్పుడు పెళ్లికొడుకు అగు అనిరుద్ధుని . పెళ్లికూతురుతో సహా రథమెక్కించి, భోజకటమునుండి ద్వారకానగరమునకు వెళ్లిరి.

శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధములో అనిరుద్ధుని వివాహమును, రుక్మి సంహారమును వర్ణించే అరువది ఒకటవ అధ్యాయము ముగిసినది (61).