5 - శ్రీకృష్ణ జననోత్సవము

శ్రీశుక ఉవాచ

నందస్త్వాత్మజ ఉత్పన్నే జాతాహ్లదో మహామనాః

ఆహూయ విప్రాన్ వేదజ్ఞాన్ స్నాతశ్శుచీరలంకృతః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను -- నందునిది పెద్ద మనసు. పుత్రుడు పుట్టగానే ఆయనకు ఆహ్లాదము కలిగెను. ఆయన వేదవేత్త లైన బ్రాహ్మ ణులనాహ్వానించెను. తాను స్నానమాడి శుచియై అలంకరించుకొనెను.

వాచయిత్వా స్వస్త్యయనం జాతకర్మాత్మజస్య వై

కారయామాస విధివత్పతృదేవార్చనం తథా

ఆయన వేదవేత్తలచే స్వస్తివాచనమును చేయించి, పుత్రునకు జాత కర్మను, పితృదేవతలకు దేవతలకు యథావిధిగా అర్చనను చేయించెను.

ధేనూనాం నియుతే ప్రాదాద్విప్రేభ్యసమలంకృతే

తిలాద్రీన్ సప్త రత్నౌఘశాతకౌంభాంబరావృతాన్

ఆయన వేదవేత్తల కొరకు రెండు లక్షల ఆవులను చక్కగా అలంకరించి దానము చేసెను. మరియు, ఏడు తలల పర్వతము (పదీ కుంచములు) లను పైన రత్నముల గుట్టలను పోసి బంగరు రసము పూసిన వస్త్రములను కప్పి దానము చేసెను.

కాలేన స్నానశాచాభ్యాం సంస్కా రైస్తవ సెజ్యయా

శుధ్యంతి దానైస్సంతుష్ట్యా ద్రవ్యాణ్యాత్మా ఽఽత్మవిద్యయా

కాలముచే మట్టి ఉన్న నీరు, స్నానముచే దేహము, ఉతుకుటచే వస్త్రము, గర్భాధాసాది సంస్కారములచే గర్భము మొదలైనవి, తపస్సుచే ఇంద్రియములు, యాగముచే బ్రాహ్మణుడు, దానములచే ధనము, సంతోషముచే మనస్సు అనే ద్రవ్యములు శుద్ధములగును. జీవుడు ఆత్మవిద్యచే పరిశుద్ధుడగును.

సౌమంగల్యగిరో విప్రాస్సూతమాగధవందినః

గాయకాశ్చ జగుర్నేదుర్భేర్యో దుందుభ ముహుః

వేదవేత్తలు, పౌరాణికులు, మాగధులు (వంశమును కీర్తించువారు), వందులు (సందర్బమునకు తగ్గట్లుగా స్తుతించువారు), చక్కని మంగళవచనములను పలికిరి. పాటగాళ్లు కూడ పాడిరి. భేరీలు, దుందుభులు మ్రోగినవి.

వ్రజస్సంమృష్టసంసిక్తద్వారాజిరగృహాంతరః

చిత్రధ్వజపతాకాన్రాక్చైలపల్లవతోరణైః

నందవ్రజములోని జనులు ఇళ్ల ద్వారములను, వాకిళ్లను, మధ్యభాగములను అలికి పన్నీరు చల్లిరి. ఇళ్లను రంగురంగుల టెక్కెములతో, జెండాలతో అలంకరించి, పుష్పమాలలను వస్త్రములను చిగుళ్ల మాలలను తోరణములుగా కట్టిరి.

గావో వృషా వత్సతరా హరిద్రాత్రేలరూషితాః

విచిత్రధాతుబర్హస్రగ్వస్త్రకాంచనమాలినః

ఆవులకు, ఎద్దులకు, ఎదిగిన దూడలకు పసుపు కలిపిన నువ్వుల నూనె పూసిరి. రంగురంగుల రాతి రంగులు, నెమలి పింఛముల మాలలు, వస్త్రములు, బంగరు గొలుసులతో వాటిని అలంకరించిరి.

మహార్హవస్త్రాభరణకంచుకోష్ణీషభూషితాః

గోపాస్సమాయయూ రాజన్నానోపాయనపాణయః

ఓ రాజా! గోపాలకులు మిక్కిలి విలువైన వస్త్రములను, చొక్కాలను, తలపాగలను. దాల్చి, ఆభరణములతో అలంకరించుకొనిరి. వారు వేతులలో బహుమతులను పట్టుకొని విచ్చేసిరి.

గోపాశ్చాకర్ణ్య ముదితా యశోదాయాస్సుతోద్భవమ్

ఆత్మానం భూషయంచక్రుర్వస్త్రాకల్పాంజనాదిభిః

గోపికలు కూడ యశోదకు కొడుకు పుట్టినాడని విని ఆనందించిరి. పొరు కొత్త వస్త్రములను దాల్చి కాటుక దిద్దుకొని నగలు పెట్టుకొని వందనాదులతో తమను తాము అలంకరించుకొనిరి.

నవకుంకుమకింజల్కముఖపంకజభూతయః

బలిభిస్త్వరితం జగ్ముః పృథుశ్రోణ్యశ్చలత్కుచాః

అతిశయించిన సౌందర్యము గల గోపికలు. తమ పద్మములవంటి ముఖములపై అలంకరించుకున్న కొత్త కుంకుమ పుప్పొడి శోభను కలిగి యుండెను. వారు బహుమతులతో తొందరగా యశోద యింటికి వెళ్లిరి.

గోప్యస్సుమృష్ణమణికుండలనిషకంఠ్యః

చిత్రాంబరాః పథి శిఖాచ్యుతమాల్యవర్షాః

నందాలయం సవలయా ప్రజతీర్వరేజుః 

వ్యాలోలకుండలపయోధరహారశోభాః

గోపికలు స్వచ్చమైన మణుల కుండలములను, మెడలయందు మణుల పదకములను ధరించిరి. వారు రంగు రంగుల కోకలను దాల్చి నందుని ఇంటికి వెళ్తూ ఉంటే వారి జుట్టుముడులనుండి జారిన మాలల వర్షములు మార్గముపై పడుచుండెను. అధికముగా కదలాడే కుండలములతో, వక్షోజములయందలి హాగములతో, కంకణములతో వారు విశేషముగా ప్రకాశించిరి.

తా ఆశీషః ప్రయుంజానాశ్చిరం పాహీతీ బాలకే

హరిద్రాచూర్ణ తైలాద్భిస్సించంత్యో జనముజ్జగుః

ఆ గోపికలు, ఓ ఈశ్వరా! చాలకాలము ఈ పిల్లవానిని రక్షించుము, ని ఆశీస్సులను పలుకుచుండిరి. వారు పసుపు పొడి, నూనె కలిపిన టీని జనము పై చల్లుతూ బిగ్గరగా పాటలను పాడిరి.

అపోద్యంత విచిత్రాణీ వాదీత్రాణి మహోత్సవే

కృష్ణ విశ్వేశ్వరేఽనంతే నందస్య వ్రజమాగతే

జగన్నియామకుడు, కాలాతీతుడు అగు శ్రీహరి నల్లనివాడై నంద గోకులమువతరించగా పెద్ద ఉత్సవము జరిగెను. వారు రంగు ioగుల పొద్యములను వ్రాయించిరి.

గోపాః పరస్పరం హృష్టా దధిక్షీరఘృతాంబుభిః

ఆసించంతో విలింపంతో నవనీతైశ్చ చిక్షిపుః

హర్షితులైన గోపాలకులు ఒకరి పైనొకరు పొలను, నేతిని, నీళ్లను చల్లి, న్నలను పూసీ, పెరుగును విసరుకొనిరి.

నందో మహామనా స్తేభ్యో వాసోఽలంకారగోధనమ్

సూతమాగధవందిభ్యో యేఽన్యే విద్యోపజీవినః  

పెద్ద మనసు గల నందుడు ఆ గోపీగోపాలకులకు, పౌరాణికులకు, వంశమును కీర్తించువారలకు, స్తుతిపాఠకులకు, ఇంకా ఇతరులెవరైతే సంగీతాది విద్యలే బ్రదుకు దెరువుగా గలవారో వారికి, వస్త్రములను, ఆభరణములను, గోవులను, ధనమును ఇచ్చెను.

 తైస్తైఃకామైరదీనాత్మా యథోచితమపూజయత్

విష్ణోరారాధనార్థాయ స్వపుత్రస్యోదయాయ చ

దైన్యమునేరుగని మనస్సు గల నందుడు శ్రీహరిని ఆరాధించుట అనే ప్రయోజనము మరియు తన పుత్రుని అభివృద్ధి సిద్దించుటకై, జనులకు వారి యోగ్యతకు తగ్గట్లుగా వివిధములగు భోగ్యములనిచ్చి పూజించెను.

రోహిణీ చ మహాభాగా నందగోపాభినందితా

వ్యచరద్దీవ్యవసస్స్క్రక్కంఠాభరణభూషితా

రోహిణి భాగ్యము గొప్పది. ఆమెను (ఆమె పుత్రుని) నందుడు, గోపాలకులు అభినందించిరి. ఆమె దివ్యమైన వస్త్రమును, దాల్చి, మాలలను ముడిచి, కంఠాభరణమునలంకరించుకొని ఇటునటు తిరిగెను.

తత ఆరభ్య నందస్య ప్రజస్సర్వసమృద్ధిమాన్

హరేర్నివాసాత్మగు రమాఽఽక్రీడమభూన్నృప

ఓ రాజా! ఆ నాటినుండి నందుని గోకులము సకలసంపదలకు నెలవై తనదైన సౌందర్యాది గుణములతో విలసిల్లెను. శ్రీహరి నివసించుటచే ఆ పల్లె లక్ష్మీదేవికి విహారస్థానమాయెను. 

గోపాన్ గోకులరక్షాయాం నిరూప్య మథురాం గతః

నందః కంసస్య వార్షిక్యం కరం దాతుం కురూద్వహ

కురవంశశ్రేష్ఠుడవగు ఓ రాజా! నందుడు గోకులమును రక్షిస్తూ ఉండుడని గోపాలకులకు ఆదేశములనిచ్చి, కంసునకు ప్రతి సంవత్సరము కట్టవలసిన పన్నును కట్టుటకై మథురానగరమునకు వెళ్లెను.

వసుదేవ ఉపశ్రుత్య భ్రాతరం నందమాగతమ్

జ్ఞాత్వా దత్తకరం రాజ్ఞే యయౌ తదవమోచనమ్  

వసుదేవుడు సోదరుడగు నందుడు వచ్చినాడని వినెను. ఆయన కంసరాజునకు పన్ను కట్టినాడని కూడ తెలిసెను. అప్పుడాయన నందుడు బళ్లను విప్పుకుని నివసించిన డేరాకు వెళ్లెను.

తం దృష్ట్వా సహసోత్థాయ దేహః ప్రాణమివాగతమ్ 

ప్రీతః ప్రియతమం దోర్భ్యాం సస్వజే ప్రేమవిహ్వలః

నందునకు వసుదేవుడు మిక్కిలి ప్రియమైనవాడు. ప్రాణము తిరిగి రాగా దేహము నిలబడునట్లుగా, ఆయన వసుదేవుని చూచి ప్రేమతో వ్యాకులుడై వెంటనే లేచి నిలబడెను. నందుడాయనను రెండు చేతులతో కౌగిలించెను.

పూజితస్సుఖమాసీనః పృష్ట్వాఽనామయమాదృతః

ప్రసక్తధీస్వాత్మజయోరిదమాహ విశాం పతే

ఓ నృపతీ! నందుడు వసుదేవునీ సాదరముగా సత్కరించెను. ఆయన ఖముగా కూర్చుండి క్షేమసమాచారమునడీగేను. ఆయన మనస్సు తన ద్దరు పుత్రుల పైననే లగ్నమై యుండెను. ఆయన నందునితో నిట్లనెను.

దీష్ట్యా భ్రాతః ప్రవయస ఇదానీమప్రజస్య తే

ప్రజాఽఽశాయా నివృత్తస్య ప్రజా యత్సమపద్యత

ఓ సోదరా! నీది పెద్ద వయస్సు. నీకు సంతానము లేకుండెను. తానము కలుగననే ఆశయైననూ నీనుండి తొలగిపోయేను. అట్టి నీకు ప్పుడు సంతానము కలిగెననేది యేది గలదో, అదీ మంగళము.

దిష్ట్యా సంసారచక్రేఽస్మిన్వర్తమానః పునర్భవః

ఉపలబ్ధో భవానద్య దుర్లభం ప్రియదర్శనమ్

ఈ సంసారమండలము (సమాజజీవితము) నందుండే నీవు మరల ట్రినోవా యన్నట్లు ఈనాడు (కారాగారములో మగ్గిన) నా కంట బడితివి. దీ మంగళము. ప్రియమిత్రుని చూచుట దుర్లభము.

నైకత్ర ప్రియ సంహిసస్సుహృదాం చిత్రకర్మణామ్

ఓ ఘన వ్యూహమానానాం ప్లవానాం ప్రోతసో యథా

ఓ మిత్రమా! నదీప్రవాహముచే కొట్టుకుపోబడే కట్టెలకు కలిసి ఉండుట సంభవము కాదు. అదే విధముగా, నానావిధములైన కర్మలు గల మిత్రులకు కూడ ఒకే చోట ప్రేమతో కలిసి ఉండుట ఘటిల్లదు.

కచ్చితశవ్యం నిరుజం భూర్యంబుతృణవీరుధమ్

బృహద్వనం తదధునా యత్రాస్సే త్వం సుహృద్వృతః

ఎక్కడనైతే నీవు మిత్రులతో గూడి నివసించుచున్నావో, ఆ పెద్ద అడవి ఇప్పుడు పశువులకు హితకరముగా ఉన్నదా? పశువులకు, జనులకు రోగములు లేవు గదా? నీరు, గడ్డి, తీగలు సమృద్ధిగా ఉన్నాయా?

భ్రాతర్మమ సుతః కశ్చిన్మాత్రా సహ భవద్వ్రజే

తాతం భవంతం మన్వానో భవద్భ్యాముపలాలితః

ఓ సోదరా! నా కొడుకు తల్లితో గూడి నీ గోకులమునందున్నాడు. ఆతడు నిన్ను తండ్రినిగా భావించుచున్నాడా? నీవు, యశోద ఆ బాలకుని లాలించుచున్నారా?

పుంసస్త్రివర్గో విహితస్సుహృదో హ్యనుభావితః

న తేషు క్లిశ్యమానేషు త్రివర్గోఽర్థాయ కల్పతే

బంధువులనుద్దేశించి సంపాదించబడిన ధర్మార్థకామములనే త్రివర్గము త్రమే మనిషికి యుక్తము, శాస్త్రవిహితము. భార్యాపుత్రాదీబంధువులు పడుచుండగా, వ్యక్తి సంపాదించిన ధర్మాదులు సుఖమునీయలేవు.

నంద ఉవాచ

అహో తే దేవకీపుత్రాః కం సేన బహవో హతాః

ఏకాఽవశిష్టాఽకవరజా కన్యా సౌఽపి దివం గతా

నందుడు. ఇట్లు పలికెను – అయ్యో! నీకు దేవకికి పుట్టిన మేకపుత్రులను కంసుడు తన పొట్టన పెట్టుకొనెను. అందరికంటే చిన్నదైన క్క అమ్మాయి కూడ స్వర్గమును చేరినది.

నూనం హ్యదృష్టనిష్ఠోయమదృష్ణపరమో జనః

అదృష్టమాత్మనస్తత్త్వం యో వేద న స ముహ్యతి

ఈ మానవుని స్థితి నిశ్చయముగా ప్రారబ్ధకర్మయందు మాత్రమే గలదు గదా! మానవుని నియమించేది ప్రారబ్దమే. తనకు సుఖదుఃఖాది హేతువు ప్రారబ్ధకర్మయేనని తెలియువాడు సుఖదుఃఖాదులయందు వ్యామోహమును పొందడు.

వసుదేవ ఉవాచ

కరో వై వార్షికో దత్తో రాజ్ఞే దృష్టా వయం చ వః

నేహ స్థేయం బహుతిథం సంత్యుత్పాతాశ్చ గోకులే

వసుదేవుడిట్లు పలికెను --- రాజునకు ప్రతి ఏడాది కట్టే పన్నును కట్టితివి. నన్ను కూడ చూచితివి. ఇచట చాల రోజులు ఉండవద్దు. గోకులమునందు అపశకునములు కలుగుచున్నవి.

శ్రీశుక ఉవాచ

ఇతి నందోదయో గోపాః ప్రోక్తాస్తే శౌరిణా యయుః

అనోభిరనడుద్యు క్రైస్తమనుజ్ఞాప్య గోకులమ్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే పూర్వార్థే పంచమోఽధ్యాయః

శుక మహర్షి ఇట్లు పలికెను. --- శూరపుత్రుడగు వసుదేవుడు ఈ విధముగా చెప్పగా, నందుడు మొదలుగా గల ఆ గోపాలకులు ఆయన సెలవు తీసుకొని, ఎద్దులు పూన్చిన బళ్లపై గోకులమునకు వెళ్లిరి.

శ్రీమద్బాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్ధములో శ్రీకృష్ణ జననోత్సవమును వర్ణించే ఐదవ అధ్యాయము ముగిసినది (5).