భాగవత మహా పురాణము
18 - శ్రీకృష్ణుడు ప్రలంబాసురుని ఉద్ధరించుట
శ్రీశుక ఉవాచ ।
అథ కృష్ణః పరివృతో జ్ఞాతిభిర్ముదితాత్మభిః ।
అనుగీయమానో న్యవిశద్వ్రజం గోకులమండితమ్ ॥
కార్చిచ్చునుండి రక్షించిన పిదప ఆనందముతో నిండిన బంధువులు చుట్టూ చేరి కీర్తిని గానము చేయుచుండగా, శ్రీకృష్ణుడు గోకులములో ప్రవేశించెను. ఆ గోకులమునకు గోవుల మందలే అలంకారము.
వ్రజే విక్రీడతో రేవం గోపాలచ్చద్మమాయయా।
గ్రీష్మో నామర్తురగవన్నాతిపేయాఞ్చరీరిణామ్ ॥
ఈ విధముగా మాయాశక్తిచే గోపాలకుల వేషముతో బలరామకృష్ణులిద్దరు గోకులమునందు క్రీడించుచుండిరి. ఇంతలో వేసవి కాలము వచ్చెను. ప్రాణులకు వేసవీ అంత ప్రియమైనది కాదు.
స చ బృందావనగుణైర్వసంత ఇవ లక్షితః ।
యత్రాస్తే భగవాన్ సాక్షాద్రామేణ సహ కేశవః ॥
ఆ వేసవియైతే బృందావనముయొక్క (చెట్లు మొదలైన) సహజ గుణములను బట్టి వసంతమువలే తోచెను. పైగా, ఆ బృందావనములో సాక్షాత్తుగా శ్రీహరి భగవానుడు బలరామునితో గూడి ఉన్నాడు గదా!
యత్ర నిర్ఘరనిర్హ్రాదనివృత్తస్వనఝిల్లికమ్ ।
శశ్వత్తచ్ఛీకరర్జీషద్రుమమండలమండితమ్ ॥
ఆ బృందావనములో వేసవియందు ఈ పురుగుల కఠోరధ్వనులను కొండ కాలువల గలగలలు కప్పివేయును. అన్నివేళలా ఆ కొండకాలువల తుంపరలచే నును పెక్కిన చెట్ల గుంపులతో ఆ స్థానము శోభిల్లెను.
సరిత్సరఃప్రస్రవణోర్మివాయునా కహ్లారకంజోత్పల రేణుహారిణా।
న విద్యతే యత్ర వనౌకసాం దవో నిదాఘవహ్న్యర్కభవోఽతిశాద్వలే॥
బృందావనము చెట్లతో, పచ్చిక బయళ్లతో పచ్చగా నుండును. అక్కడ సరస్సులలో ఉదయము సౌగంధికములు, మధ్యాహ్నము పద్మములు, రాత్రి కమలములు వికసించును. వాటి మీదనుండి వీచే గాలి వాటి పుప్పొడిని మోసుకువచ్చును. అచటి సరస్సులలో, నదులలో, కొండ కాలువలలోని తరంగములమీదనుండి వీచే గాలి వలన వనవాసీలకు తాపము లేదు. వేసవియందు కూడ ఎండ వేడికి చిచ్చు పుట్టి అడవిని దహించే ఘటనలు లేవు.
అగాధతోయహ్రదినీతటోర్మిభిః
ద్రవత్పురీష్యాః పులినైస్సమంతతః ।
న యత్ర చండాంశుకరా వీషోల్బణా
భువో రసం శాద్వలితం చ గృహ్ణతే ॥
ఆ బృందావనమునందు నదులలోని నీరు లోతుగా నుండెను. ఆ నదుల కెరటములు ఒడ్లను తాకి ఇసుకతిన్నెలతో సహా అంతటా తడి, బురద ఉండునట్లు చేయుటచే, నేల పై పచ్చగడ్డి విస్తారముగా పెరిగెను. కావుననే, వేసవి సూర్యుని కిరణములు విషమువలె చాల తీక్ష్ణముగనున్ననూ, నేలయందలి తడిని ఎండింపలేకపోయినవి.
వనం కుసుమితం శ్రీమన్నదచ్చిత్రమృగద్విజమ్ ।
గాయన్మయూరభ్రమరం కూజత్కోకిలసారసమ్ ॥
ఆడవి పువ్వులతో నిండి గొప్పగా శోభిల్లెను. రంగు రంగుల మృగములు, పక్షులు ధ్వనులను చేయుచుండెను. నెమళ్లు, తుమ్మెదలు గానము చేయుచుండెను. కోకిలలు, బెగ్గురు పక్షులు కూయుచుండెను.
క్రీడిష్యమాణస్తత్కృష్ణో భగవాన్ బలసంయుతః ।
వేణుం విరణయన్ గోపైర్గోధనైస్సంవృత్వోఽవిశత్ ॥
శ్రీకృష్ణ భగవానుడు బలరామునితో కూడి పిల్లన గ్రోవి పైములను పలికిస్తూ, ఆ అడవిలో విహారము కొరకై ప్రవేశించేను. ఆయన చుట్టూ గోపాలకులు, మంచి ఆవుల మందలు ఉండెను.
ప్రవాలబర్హస్తబకస్రగ్దాతుకృతభూషణాః ।
రామకృష్ణాదయో గోపా ననృతుర్యుయుధుర్జగుః ॥
బలరాముడు, శ్రీకృష్ణుడు, సుదాముడు మొదలగు గోపాలకులు చిగుళ్లను, నెమలి యీకలను, పూల గుత్తులను, పూల మాలలను, రాతి రంగులను, బంగరు నగలను అలంకరించుకొనిరి. వారు పాటలు పాడుతూ, నాట్యమాడిరి. ఒకప్పుడు కుసీలను పటిరి.
కృష్ణస్య నృత్యతః కేచిజ్జగుః కేచదవాదయన్ ।
వేణుపాణితలైశ్శృంగైః ప్రశశంసురథాపరే ॥
శ్రీకృష్ణుడు నాట్యం చేస్తూ ఉంటే, కొందరు పాడగా, మరికొందరు వాద్యములను వాయించిరి. ఇంకొందరు పిల్లన గ్రోవిని కొమ్ము బూరాలను ఊది, చప్పట్లు కొట్టి ప్రోత్సహించిరి.
గోపజాతిప్రతీచ్చన్నౌ దేవా గోపాలరూపిణః ।
ఈడిరే కృష్ణ రామౌ చ నటా ఇవ నటం నృప ॥
ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణ బలరాములు గోపజాతిలో జన్మించిన శ్రీహరి-ఆది శేషులే. గోపాలకుల రూపములోనున్న దేవతలు వారిద్దరిని, ఒక నటుని ఇతరనటులు వలె, కొనియాడిరి.
భామణైల్లంఘనైః క్షే పైరాస్ఫోటనవికర్ష ణైః ।
చిక్రీడతుర్నియుద్ధేన కాకపక్షధరౌ క్వచిత్ ॥
బలరామకృష్ణుల కేశములు వక్రములై చెవుల వరకు వ్రేలాడు చుండెను. వారు ఒకప్పుడు ఒకరి చేతులు మరియొకరు పట్టుకొని గిర గిర తిరిగెదరు; గోతులపై గెంతెదరు; రాళ్లను విసి రెదరు; ఒకరినొకరు చరుపులు చరచెదరు; త్రాడును రెండు వైపులా లాగెదరు. మరియొకప్పుడు వారు బాహుయుద్ధమును చేసిరి.
క్వచిన్నృత్యత్సు చాన్యేషు గాయకౌ వాదకౌ స్వయమ్ ।
శశంసతుర్మహారాజ సాధు సాధ్వితి వాదినౌ ॥
ఓ పరీక్షిన్మహారాజా! ఒకప్పుడు ఇతర బాలకులు కూడ నాట్యము చేయుచుండగా బలరామకృష్ణులిద్దరు తాము స్వయముగా పాట పాడి వాద్యములను వాయించెడివారు; బాగు బాగు అంటూ కొనియాడెడివారు.
క్వచిద్బిల్వైః క్వచిత్కుం భైః క్వ చామలకముష్టిభిః ।
అస్పృశ్యనేత్రబంధాద్యైః క్వచిన్మృగఖ గేహయా ॥
వారు ఒకప్పుడు మారేడు పళ్లను, మరియొకప్పుడు గుగ్గిలపు పళ్లను, ఇంకో సమయములో ఉసిరిక పళ్లను గుప్పిళ్లతో విసురుతూ ఆడెడివారు. ఒకడు పరుగెత్తి ఇతరులను ముట్టుట, కళ్లకు గంతలు కట్టి ముట్టుట, కుంటుతూ ముట్టుట వంటి ఆటలను ఆడెడివారు. ఒకప్పుడు పశువుల చేష్టలను, మరియొకప్పుడు పక్షుల చేష్టలను అనుకరించి ఆడెడివారు.
క్వచిచ్చ దర్దురప్లావైర్వివిధైరుపహాసకైః ।
కదాచిత్స్పందోలికయా కర్హిచిన్నృప చేష్టయా ॥
వారు ఒకప్పుడు కప్ప గెంతుల ఆటను ఆడెడివారు. మరియొకప్పుడు పలు రకముల చేష్టలతో ఇతరులను నవ్వించెడివారు. ఒకప్పుడు చెట్టుకు త్రాడు కట్టి ఊయలలూగెడివారు. మరియొకప్పుడు రాజును అనుకరించే ఆటను ఆడెడివారు.
ఏవం తౌ లోకసిద్దాభిః క్రీడాభిశ్చేరతుర్వనే ।
నద్యద్రిద్రోణికుంజేషు కాననేషు సరస్సు చ ॥
వారీ విధముగా లోకప్రసిద్ధములైన ఆటలను ఆడుతూ బృందావనములోని నదీతీరములు, కొండలు, లోయలు, తీగల డొంకలు, అడవులు, సరస్సులు అనువాటియందు సంచరించిరి. .
పశూంశ్చారయతోర్గో పైస్తద్వనే రామకృష్ణ యోః ।
గోపరూపీ ప్రలంబోఽగాదసురస్తజ్జహీర్షయా ॥
బలరామకృష్ణులు గోపాలకులతో కూడి ఆ బృందావనమునందు పశువులను - మేపుచుండిరి. వారిద్దరిని ఎత్తుకు పోవాలనే కోరికతో ప్రలంబుడనే రాక్షసుడు గోపాలకుని రూపముతో అచటకు వెళ్లాను.
తం విద్వానపి దాశార్హో భగవాన్ సర్వదర్శనః ।
అన్వమోదత తత్సఖ్యం వధం తస్య విచింతయన్ ॥
దశార్హ వంశములో జన్మించిన సర్వజ్ఞుడగు శ్రీకృష్ణ భగవానునకు ఆ రాక్షసుని గురించి తెలియును. అయిననూ, ఆయన వానిని వధించే ఉపాయమును గురించి ఆలోచిస్తూ, వానితోడి జట్టును అనుమోదించెను.
తత్రోపాహూయ గోపాలాన్ కృష్ణః ప్రాహ విహారవిత్ ।
హే గోపా విహరిష్యామో ద్వంద్వీభూయ యథాయథమ్ ॥
శ్రీకృష్ణుడు క్రీడలలో దిట్ట. ఆయన అప్పుడు గోపాలకులను పిలిచి ఇట్లు చెప్పెను -- ఓ గోపాలకులారా! మనము ఎవరికి తగ్గ వారితో వారు రెండు జట్లుగా జత కట్టి ఆడుకొనేదము.
తత్ర చక్రుః పరివృడౌ గోపా రామజనార్ధనౌ ।
కృష్ణసంఘట్టినః కేచిదాసన్ రామస్య చాపరే ॥
అప్పుడా గోపాలకులు బలరామకృష్ణులనే నాయకులుగా చేసుకొనిరి. కొందరు శ్రీకృష్ణుని జట్టువారు కాగా, మిగిలిన వారు బలరాముని జట్టు.
ఆచేరుర్వివిధాః క్రీడా వాహ్యవాహకలక్షణాః ।
యత్రారోహంతి జేతారో వహంతి చ పరాజితాః ॥
మో సేవాడు, మోయబడువాడు అనే రూపములోనుండే పలు రకముల ఆటలను వారు ఆడిరి. ఆ ఆటలలో నెగ్గినవానిని భుజముపై నెక్కించుకోని ఓడినవాడు మోయును.
వహంతో వాహ్యమానాశ్చ చారయంతశ్చ గోధనమ్ ।
భాండీరకం నామ వటం జగ్ముః కృష్ణ పురోగమాః ॥
మోస్తున్నవారు, మోయబడుచున్నవారు కూడ పశుసంపదను మేపే పనిని చేస్తూనే, భాండీరకమని ప్రసిద్ధి గాంచిన మర్రి చెట్టు వద్దకు వెళ్లిరి. వారికి ముందు శ్రీకృష్ణుడు ఉండెను.
రామసంఘట్టినో యర్హి శ్రీరామవృషభాదయః ।
క్రీడాయాం జయిస్తాంస్తానూహుః కృష్ణోదయో నృప ॥
ఓ పరీక్షిన్మహారాజా! బలరాముని జట్టు నెగెను. అప్పుడు శ్రీరాముడు, వృషభుడు మొదలగువారిని శ్రీకృష్ణుని జట్టులోనివారు ఒకరిని ఒకరు చొప్పున మోసిరి.
ఉవాహ కృష్ణో భగవాన్ శ్రీరామానం పరాజితః ।
వృషభం భద్ర సేనస్తు ప్రలంబో రోహిణీసుతమ్॥
ఆటలో ఓడిన శ్రీకృష్ణ భగవానుడు శ్రీదాముని, భద్ర సేనుడు వృషభుని, ప్రలంబాసురుడు రోహిణి పుత్రుడగు బలరాముని మోసిరి.
ఆవిషహ్యం మన్యమానః కృష్ణం దానవపుంగవః ।
వహన్ ద్రుతతరం ప్రాగాదవరోహణతః పరమ్ ॥
రాక్షసశ్రేష్ఠుడగు ప్రలంబుడు శ్రీకృష్ణుని మోయుట సాధ్యము కాదని తలచి ఆయన పక్షములో చేరి బలరాముని మో సెను. ఆతడు అందరికంటే వేగముగా మోస్తూ, దింప వలసిన మర్రి కంటే ముందుకు వెళ్లిపోయెను.
తముద్వహన్తరణిధరేంద్రగౌరవం మహాసురో విగతరయో నిజం వపుః।
స ఆస్థితః పురటపరిచ్చదో బభౌ తడిద్ద్యుమానుడుపతివాడివాంబుదః॥
ఆ పెద్ద రాక్షసుడు బంగరు ఆభరణములతో మెరుపు వలె ప్రకాశించుచుండెను. బలరాముడు పర్వతము వలె బరువుగా నుండుటచే పొని వేగము తగ్గిపోయెను. వాడు తన రాక్షసరూపమును దాల్చెను. అప్పుడాతడు నక్షత్రరాజగు చంద్రుని మోస్తూ మెరుపులతో ప్రకాశించే మేఘము వలె నొప్పారెను.
నిరీక్ష్య తద్వపురలమంబరే చరత్
ప్రదీప్తదృగ్ర్బుకుటితటోగ్రదంష్ట్రకమ్ ।
జ్వలచ్ఛిఖం కటకకిరీటకుండల
త్విషాఽద్భుతం హలధర ఈషదత్రసత్ ॥
మండే కన్నులు మరియు మండే కేశములు గల ఆ రాక్షసుని దేహము ఆకాశములో వేగముగా కదులుచుండెను. వాని భయంకరమగు కోరలు కనుబొమల పైన తగులుచుండెను. కడియములు, కిరీటము, కుండలములతో అబ్బురమును గోల్పే వాని ఆ దేహమును పరికించి చూచి నాగలియే ఆయుధముగా గల బలరాముడు కొంచెము భయపడెను.
అథాగతస్మృతిరభయో రిపుం బలో
విహాయస్వాఽర్థమివ హరంతమాత్మనః ।
రుషాఽహనచ్ఛిరసి దృఢేన ముష్ఠినా
సురాధిపో గిరిమివ వజ్రరంహసా ॥
తరువాత బలరామునకు స్మృతి వచ్చి భయము దూరమయ్యెను. ఆయనను ప్రలంబాసురుడు ఆకాశమార్గము గుండా తన సొత్తా యన్నట్లు కొనిపోవుచుండెను. ఆయన కోపముతో ఆ శత్రువును, దేవేంద్రుడు పర్వతమును వలె, వజ్రపు వేగము గల గట్టి పీడికిలితో తలపై కొట్టెను.
స ఆహతస్సపది విశీర్ణమస్తకో ముఖాద్వమన్రుధిరమపస్మృతోఽసురః ।
మహారవం వ్యసురపతత్సమీరయంగిరిర్యథా మఘవత ఆయుధాహతః॥
బలరాముడు కొట్టిన దెబ్బకు ఆ రాక్షసుడు నోటినుండి రక్తమును గ్రక్కెను. వాని తల ప్రక్కలై స్పృహ తప్పెను. వెంటనే వాని ప్రాణములు పోయెను. ఇంద్రుని వజ్రముచే కొట్టబడిన పర్వతము వలె వాడు పెద్ద శబ్దమును చేస్తూ నేల గూలెను.
దృష్ట్వా ప్రలంబం నిహతం బలేన బలశాలినా ।
గోపాస్సువిస్మితా ఆసన్ సాధు సాధ్వితి వాదినః ॥
బలశాలియగు బలరాముడు వధించిన ప్రలంబుని చూచి గోపాలకులు చాల ఆశ్చర్యమును పొందిరి. వారు బాగు, బాగు అని పలికిరి.
ఆశీషోఽభిగృణంతస్తం ప్రశశంసుస్తదర్హణమ్ ।
ప్రేత్యాగతమివాలింగ్య ప్రేమవిహ్వలచేతసః ॥
మరణించి వచ్చినాడా యన్నట్లున్న ఆ బలరాముని గోపాలకులు ఆశీర్వదిస్తూ కౌగిలించుకొనిరి. వారాయనను ప్రేమతో వ్యాకులమైన మనస్సులతో ప్రశంసించిరి. వారి పొగడ్తలకు ఆయన అర్హుడు.
పాపే ప్రలంబే నిహతే దేవాః పరమనిర్వృతాః ।
అభ్యవర్షన్ బలం మాల్యైశ్శశంసుస్సాధు సాధ్వితి ॥
ఇతి శ్రీమద్బాగవతే మహాపురాణే దశమస్కంధే
పూర్వార్థే అష్టాదశోఽధ్యాయః ॥
పాపియగు ప్రలంబాసురుని బలరాముడు సంహరించగా, దేవతలకు గొప్ప. సుఖము అనుభవమునకు వచ్చెను. వారాయన పై పూల వానను కురిపించి, బాగు బాగు అని కొనియాడిరి.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్ధములో బలరాముడు ప్రలంబాసురుని ఉద్దరించుటను వర్ణించే పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది (18).
Summary of chapter 18 of the Bhāgavata Mahā Purana is as follows:
During the summer season in Vṛndāvana, which felt like spring due to Kṛshṇa's presence, the cowherd boys engaged in games of wrestling and racing. The demon Pralambāsura arrived disguised as an innocent cowherd boy, planning to abduct Kṛshṇa and Balarāma. The boys divided into two teams led by Kṛshṇa and Balarāma, agreeing that the losers would carry the winners on their shoulders. When Balarāma's team won, Pralambāsura took Balarāma onto his back and sprinted far away from the field. Expanding his body into a colossal, dark, fiery form adorned with golden ornaments, the demon attempted to carry Balarāma away. Realizing the demon's intent, Balarāma struck Pralambāsura's head with His powerful fist, crushing his skull and killing him instantly.