మార్కండేయ మహా పురాణము

Table of Contents

90 - సురధ వైశ్యులకు వర ప్రధానము

ఓ రాజా! మీకు నేను ఈ ఉత్తమమగు దేవీ మహాత్మ్యమును చెప్పితిని. ఎవరు ఈ జగత్తును ధరించి యున్నదో, ఆమె ప్రభావము ఈ విధముగా ఉన్నది. ఆ భగవతీ విష్ణు మాయయే తత్త్వ జ్ఞానమును ఇచ్చు చున్నది. ఆమెయే నిన్ను, ఈ వైశ్యుణ్ణి మరియు అన్యాన్య వివేక పురుషులను కూడా మోహితులను చేయు చున్నది. మరియు ఆమె ద్వారానే భవిష్యత్ ప్రాణులు మొహితులగుదురు. ఓ మహారాజా! ఆ భగవతియగు మహేశ్వరినే శరణు వేడుము. ఆమెను ఆరాధించుట చేతనే ఆమె మనుష్యులకు భోగములు స్వర్గములు మరియు ముక్తిని ప్రసాదించు చున్నది.

ఓ మహా మునీ! అతిశయమగు మమత మరియు రాజ్యము హరించి పోవుటచే అత్యంత దుఃఖితుడగు ఆ నరాధిపుడు సురథుడు ఋషి యొక్క ఈ వచనములు విని కఠోర వ్రత సంపన్నుడగు ఆ ఋషి మహాభాగునకు నమస్కరించి వెంటనే తపస్సు కొరకు పోయెను. మరియు ఆ వైశ్యుడు కూడా ఇదే విధముగా తపస్సు చేయుటకు పోయెను.

ఆ రాజు మరియు వైశ్యుడు నది ఒడ్డున స్థితులై భగవతి యొక్క ధర్మనార్థము ఉత్క్రృష్టమగు దేవీ సూక్తమును జపించుచు తపస్సు నందు నిమగ్నులైరి. వైశ్యుడు మరియు రాజు ఆ నది ఒడ్డున మృత్తికతో దేవీ విగ్రహమును చేసి పుష్ప, ధూప, హోమ తర్పనాదులచే ఆమెను పూజించిరి. వారు నియమితాహారములతో ఆమె యందు మనస్సు లగ్నము చేసి సావధానులై తమ తమ దేహముల నుండి రక్తము తీసి బలి ఇచ్చిరి. ఈ విధముగా ఇంద్రియ నిగ్రహులై మూడు సంవత్సరములు ఆరాధించుటచే జగద్ధాత్రి యగు చండిక సంతుష్టురాలై వారికి ప్రత్యక్షమయి ఇట్లు పలికెను.

సురధ వైశ్యులారా! మీరు దేనిని అర్థించితిరో, దానిని పొందుదురు గాక మీ తపస్సునకు సంతుష్టురాలనై మీ కోరికను ఇచ్చు చున్నాను.

అనంతరము రాజు మరుసటి జన్మ మందు అఖండిత రాజ్యమును మరియు ఈ జన్మము నందు బలప్రకాశ పూర్వకముగా శత్రువులను వధించి తన రాజ్యమును తిరిగి పొంద వలెనని వారము అడిగెను. మరియు దుఃఖిత చిత్తుడు, బుద్ధిమంతుడు అగు ఆ వైశ్యుడు కూడా “ఇది నాది” మరియు “ఇది నేను” అనునట్టి ఈ విధమగు మోహమును నాశనము జ్ఞానము నడిగెను.

ఓ రాజా! నీవు కొద్ది దినములలోనే శత్రు కులములను నిర్మూలనము చేసి నీ రాజ్యమును పొందుదువు. ఆ తరువాత తిరిగి నీకు రాజ్యము నుండి భ్రష్టుడవగుట జరుగదు. మృతి పొందిన పిమ్మట సూర్య భగవానుని కుమారుడవై జన్మించి భూమి యందు సావర్ణియను పేరుతో ప్రసిద్ధుడవగు మనువు అగుదువు గాక. ఓ వైశ్య వ్రేష్టా! నీవు కూడా నా నుండి ఏ వరమును నీ సిద్ధి కొరకు ప్రార్థించితివో, దానిని నీకు ఇచ్చు చున్నాను. నీకు జ్ఞానము కలుగును గాక.

దేవి వారికి ఈ విధముగా కోరిన వరముల నిచ్చి అంతర్థాన మయ్యెను. అంతర్థాన మగుటకు మునుపే వారిద్దరూ ఆమెను భక్తి పూర్వకముగా స్తుతించిరి. ఈ విధముగా క్షత్రియ శ్రేష్టుడగు సురథుడు దేవి నుండి వరములను పొంది సూర్య దేవునికి ఉద్భవించి భూమి యందు సావర్ణి యను పేరు గల మనువుగా ప్రసిద్ధి చెందును.