మార్కండేయ మహా పురాణము

Table of Contents

64 - స్వారోచిష మన్వంతర కథ సమాప్తి

 

అనంతరము భగవానుడు, ద్యుతిమానుడు లేక స్వారోచిషుడు అను పేరు గల ప్రజాపతిని మనువు చేసెను. అతని మన్వంతరమును వినుము. ఓ క్రౌష్టుకీ! ఆ స్వారోచిష మన్వంతర మందు ఏ దేవతలు, మునులు, మరియు మను పుత్రులు, భూపాల గణాలు ఉండిరో, వారిని గురించి వర్ణించెదను. అదంతయు నా వలన నీవు వినుము. ఓ ద్విజుడా! ఆ స్వారోచిష మన్వంతర మందు దేవా గణాలు, పారావతులు యుతుషితులు అను పేర్లతో మరియు ఇంద్రుడు విపశ్చితుడను పేరుతో విఖ్యాతి పొంది ఊర్జస్తంబ, ప్రాణ, దత్త అలి, ఋషభ, నిశ్చర, అర్వ వీరులు అను పేర్లతో విఖ్యాతి చెందిన సప్తర్షులు ఉండిరి. మహాత్ముడగు స్వారోచిష మనువునకు చైత్ర, కింపురుషాది మహా వీర్యవంతులగు ఏడుగురు పుత్రులు భూపాలకులుగా నుండిరి.

ఎప్పటి వరకు అతని మన్వంతరము ఉండెనో, అప్పటి వరకు అతని వంశ మందలి రాజు లందరు భూమిని అనుభవించిరి. మన్వంతరము లందు స్వారోచిష మన్వంతరము రెండవది. ఈ స్వరోచి చరిత్ర మరియు స్వారోచిష మనువు జన్మమును శ్రద్ధాసక్తులతో వినిన మానవులు పాపముల నుండి విముక్తు లగుదురు.