మార్కండేయ మహా పురాణము

Table of Contents

44 - ప్రాకృత వికృత సర్గ వర్ణనము

భగవాన్! ప్రజాపతి, ప్రభువు, ఆదిస్రష్ట యగు బ్రహ్మ ఏ విధముగా ప్రజలను ఉత్పన్నము చేసెను? దానిని విస్తారముగా నాకు చెప్పుము.

హే బ్రాహ్మన్! జగత్కారణుడు భగవంతుడునగు బ్రహ్మ ఏ విధముగా స్థావర జంగమ మగు సంపూర్ణ జగత్తు యొక్క నిర్మాణము చేసెనో? అది మీతో చెప్పెదను. పాద్మ కల్పావసాన మందు సత్త్వోద్రిక్తుడగు బ్రహ్మ రాత్రి యగుటచే నిద్రించి లేచుట తోడనే సంపూర్ణ భువనమును సూన్యముగా చూచెను. ఆ సమయ మందు జగత్కారణుడు, అవ్యయుడు, బ్రహ్మ స్వరూపుడు నగు నారాయణుని యెడల ఈ శ్లోకము చెప్ప బడెను. జలమునకు నార అని పేరు. అందులో అతడు శయనించుటచే అతడు నారాయణుడు అను పేరుతొ కీర్తింప బడుచున్నాడు.

నారాయణుడు మేల్కాంచి పృథ్విని ఆ జలమందు యుండుట చూచి ఉద్దరించు కోరికచే పూర్వ కల్పమందు మత్స్య కూర్మాదులతో సమానముగా వరాహ రూపమును ధరించెను. సర్వగుడు, సర్వ సంభవుడు వేద యజ్ఞమయుడు, విభుడునగు నారాయణుడు వేదయగ్న మయమగు దివ్య వరాహ రూపముతో జలమందు ప్రవేశించెను. మరియు తిరిగి పాతాళము నుండి భూమిని ఉద్ధరించి నీటిపైన స్థాపించెను. తిరిగి జలలోక నివాసులగు మహర్షులతో జగత్పతి యగు ప్రభువు ఈ క్రింది విధముగా చింతించెను. ఈ భూమి జలమందు నౌకవలె ఊగు చున్నది. నీరు విస్తార మగుటచే భూమి ఆగుట లేదు.

ఆ తరువాత పృథ్విని సమానముగా చేసి మొదటగా పర్వతములను సృష్టించెను. ప్రథమ సృష్టిని సమ వర్తకుడగు అగ్ని కాల్చి వేసెను. పర్వతము లన్నియు ఆ అగ్ని యొక్క సంతాపముచే విశీర్ణ కళేబరములై సముద్ర మందు మునిగి పోయినవి. అప్పుడు అక్కడి జలము కూడా వాయువు వలన ఏకమై పోయెను. అందు వలన పర్వతములు ఏఏ ప్రదేశము లందు సంలగ్న మయ్యేనో, ఆయా స్థానము లందు కదలక స్థిరముగా నుండి పోయెను. అనంతరము సప్త ద్వీపముల రూప మందు భూమిని విభజించి, పూర్వము వలెనే భూలోకాది పదునాలుగు లోకములను విభజించెను. పూర్వ మందలి కల్పము వలెనే సృష్టి యొక్క ఆలోచన చేయుచు, అబుద్ధి పూర్వకముగా తమో మయుడై తమము, మోహము, మహా మోహము, తామిస్రము మరియు అంధ తామిస్రమను పేరు గల ఐదు అవిధ్యలను పుట్టించెను. ఈ విధముగా ఆలోచన చేయుటచే అప్రతిభోధ యుక్తమగు సృష్టి ఐదు విధాలుగా స్థితి కలిగి యున్నది.

అది సంవృతాత్మకము మరియు పర్వత స్వరూపము అయి తన వెలుపలి భాగ మందును, లోపలి భాగ మందును, అప్రకాశముగా నుండెను. ఆ సృష్టి పర్వత ప్రధాన మగుటచే ముఖ్య సర్గమను పేరుతో చెప్పబడెను. ఆయన ఈ అసాధారణ సృష్టిని చూచి తిరిగి రెండవ సృష్టిని కోరెను. అప్పుడు ఆయన ధ్యానము వలన తిర్యక్ శ్రోతములు ప్రవృత్త మయ్యెను. సృష్టి గురించి విచారించుచూ అలోచించుచూ ఉండగా ఆయన నుండి తిర్యక్ శ్రోతములు ప్రవహించుటచే ఇవి తిర్యక్ శ్రోతములు అని చెప్ప బడెను. దీని వలన అధికముగా తమో గుణము గల పశువులు మొదలగునవి తెలివి లేని వయ్యెను. అజ్ఞానమునే జ్ఞానముగా తలంచు వారు చెడు మార్గమందు నడచు వారైరి. వారు అహంకారులు అహంబావులు ఇరువది ఎనిమిది ప్రకారములుగా నుండిరి.

MISSING slంkas