1 - గరుడ పురాణము - ఆచార కాండము
131 - దూర్వాష్టమి, శ్రీకృష్ణాష్టమి
భాద్రపద శుద్ధ అష్టమినాడు దూర్వాష్టమి వ్రతాన్ని చేయాలి. దూర్వ యనగా గరిక. ఆ రోజు ఉపవాసం చేసి గౌరీ, గణేశ, శివ ప్రతిరూపాలను గరికెతోనూ ఆపై ఫల పుష్పాదులతోనూ పూజించాలి. ప్రతి పూజాద్రవ్యాన్నీ శంభవేనమః, శివాయనమః అంటూ శివునిపై వేయాలి. దూర్వను కూడా ఇలా ప్రార్థించాలి.
త్వందూర్వేఽమృతజన్మాసీ వందితా చ సురాసురైః ।
సౌభాగ్యం సంతతిం కృత్వా సర్వకార్య కరీభవ ॥
యథాశాఖా ప్రశాఖాభిర్విస్తు తాసి మహీతలే ।
తథా మమాపి సంతానం దేహి త్వమజరామరే ॥
ఈ దూర్వాష్టమీ వ్రతాన్ని చేసిన వారికీ సర్వస్వ ప్రదానాన్ని దేవతలు చేస్తారు. ఈ వ్రతం చేసి అగ్ని పక్వం కాని భోజనం చేసేవారు బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తు లౌతారు.
శ్రీకృష్ణాష్టమి భాద్రపద కృష్ణ అష్టమి నాడు జరపబడుతుంది. ఆ రోజు అర్థరాత్రి రోహిణీనక్షత్రంలో ఆ యుగపురుషునిగా భగవానుడైన శ్రీహరి పుడమిపై నవతరించాడు. సప్తమితో కలిసిన ఈ అష్టమి కూడా ప్రతయోగ్యమే. ఈనాడు కృష్ణుని పూజించిన వారికి మూడు జన్మల పాపాలు నశిస్తాయి. ముందుగా
ఓం యోగాయ యోగపతయే యోగేశ్వరాయ ।
యోగ సంభవాయ గోవిందాయ నమోనమః ॥
అనే మంత్రంతో యోగేశ్వరుడూ యోగీశ్వరుడూనైన శ్రీకృష్ణుని ధ్యానించి ఈ క్రింది మంత్రంతో ఆయన ప్రతిమకు స్నానం చేయించాలి.
ఓం యజ్ఞాయ యజ్ఞేశ్వరాయ యజ్ఞపతయే
యజ్ఞ సంభవాయ గోవిందాయ నమో నమః ।
అనంతరం ఈ మంత్రంతో ఆయనను పూజించాలి.
ఓం విశ్వాయ విశ్వేశ్వరాయ విశ్వపతయే
విశ్వ సంభవాయ గోవిందాయ నమో నమః ।
పిమ్మట ఈ మంత్రంతో స్వామిని శయనింపజేయాలి.
ఓం సర్వాయ సర్వేశ్వరాయ సర్వపతయే
సర్వసంభవాయ గోవిందాయ నమోనమః ।
ఒక స్థండిలం (వేది) పై చంద్రునీ, రోహినీ శ్రీకృష్ణభగవానునీ ఉంచి పూజించాలి. పుష్ప, జల, చందనయుక్త జలాన్ని ఒక శంఖంలో తీసి పట్టుకొని మోకాళ్ళపై కూర్చుని క్రింది మంత్రాన్ని చదువుతూ చంద్రుని కర్ఘ్యమివ్వాలి.
క్షీరోదార్ణవ సంభూత అత్రినేత్ర సముద్భవ ।
గృహాణార్ఘ్యం శశాంకేశ రోహిణ్యా సహితో మమ ॥ (ఆచార - 131/8, 9)
తరువాత మహాలక్ష్మికీ, వసుదేవునికీ, నందబలరామ యశోదలకూ అర్ఘ్యమివ్వాలి. అనంతరం శ్రీకృష్ణ పరమాత్మను ఇలా ప్రార్థించాలి.
అనంతం వామనం శౌరిం వైకుంఠం పురుషోత్తమం ॥
వాసుదేవం హృషీకేశం మాధవం మధుసూదనం ।
వరాహంపుండరీకాక్షం నృసింహం దైత్య సూదనం ॥
దామోదరం పద్మనాభం కేశవం గరుడధ్వజం ।
గోవింద మచ్యుతం దేవమునంతమప రాజితం ॥
అధోక్షజం జగద్బీజం సర్గస్థిత్యంత కారణం ।
అనాది నిధనం విష్ణుం త్రిలోకేశంత్రివిక్రమం ॥
నారాయణం చతుర్బాహుం శంఖ చక్ర గదాధరం ।
పీతాంబర ధరం దివ్యం వనమాలావిభూషితం ॥
శ్రీ వత్సాంకం జగద్ధామం శ్రీ పతిం శ్రీధరం హరిం ।
యేదేవం దేవకీ దేవీ వసుదేవాదజీ జనత్ ॥
భౌమస్య బ్రాహ్మణో గుప్త్యై తస్మై బ్రహ్మాత్మనే నమః । (ఆచార - 131/10 - 16)
ఈ ప్రకారంగా శ్రీకృష్ణభగవానుని అనేక నామ సంకీర్తన చేసి మరల సద్గతికై ఇలా ప్రార్థించాలి.
త్రాహిమాం దేవ దేవేశ హరే సంసార సాగరాత్ ।
త్రాహి మాం సర్వపాపఘ్న దుఃఖశోకార్లవాత్ ప్రభో ॥
దేవకీ నందన శ్రీశ హరే సంసార సాగరాత్ ।
దుర్వృత్తాం స్రాయసే విష్ణో యే స్మరంతి సకృత్సకృత్ ॥
సోఽహం దేవాతి దుర్వృత్త స్త్రాహి మాం శోక సాగరాత్ ।
పుష్కరాక్ష నిమగ్నోఽ హం మహత్యజ్ఞాన సాగరే ॥
త్రాహి మాం దేవ దేవేశ త్వామృతేఽన్యో న రక్షితా ।
స్వ జన్మవాసుదేవాయ గో బ్రాహ్మణ హితాయ చ ॥
జగద్దితాయ కృష్ణాయ గోవిందాయనమో నమః ।
శాంతి రస్తు శివంచాస్తు ధన విఖ్యాతి రాజ్య భాక్ ॥ (ఆచార - 131/17 - ఽ1)
ఈ ప్రార్థనలో వేడుకొన్నవన్నీ అనగా, అశాంతినుండి రక్షణ, దురాచారం నుండి వీడుదల, అజ్ఞాన నాశనం, శాంతి, శుభం, ధనం, వీఖ్యాతి, అధికారం ఇవన్నీ ఈ వ్రతం చేసినవారికీ లభిస్తాయి.
