మూడవ ప్రతి సంచరమును (లయమును) చెప్పితివి. బ్రహ్మ మందు లయమగుట యను ఆత్యంతిక ముక్తి యిది. సర్గము వంశము మన్వంతరములు వంశాను చరితమను పురాణముల యొక్క యైదు లక్షణములును నీకు దేల్పితిని. మైత్రేయా! ఈ విష్ణు పురాణము సర్వ పాపహరము. సర్వ శాస్త్రముల కంటే పైది. నాల్గు పురుషార్థములును దెల్పునది. ఇంకేమి వచింప వలెనో యడుగుము.
భగవంతుడా! భక్తితో తమ వలన వినదగిన దంతయు విన్నాను. సందేహములు వాసినవి. మనస్సు పరిశుద్దమైనది. ఉత్పత్తి స్థితి లయములు నాకవగతము లయినవి. సృష్టి, స్థితి, పరిపాలన హేతువులగు బ్రహ్మదక్షాది రాశి, విష్ణు మన్వాది రాశి, రుద్ర కాలాంతకాది రాశి అను త్రివిధ రాసులు. విష్ణు శక్తి, క్షేత్రజ్ఞ శక్తి, అవిద్యా కర్మ శక్తి యను త్రివిధ శక్తులు బ్రహ్మ భావన కర్మ భావన ఉభయ భావన యను భావభావనాత్రయము మీ యనుగ్రహముచే పూర్తిగ దేలిసినవి. నీ యనుగ్రహముచే తెలియదగినది తెలిసినది. వర్ణాశ్రమ ధర్మములు తెలిపినవి. కృతార్థుడ నైతిని. ప్రవృత్త నివృత్త కర్మలు తెలిసినవి. ఈ జగత్ అంతయు విష్ణువు కంటే వేరు కాదు. ఇది ప్రవచింపుమని శ్రమ పెట్టితిని. క్షమించుము. మహానుభావులకు పుత్రునికి శిష్యునికిని భేదము ఉండదు.
ఈ విష్ణు పురాణము వేద తుల్యము. ఇది వినిన పాపరాశి నశించును. పురాణ పంచ లక్షణములు నీ కిందు వర్ణించితిని. ఇందు దేవ దైత్య గంధర్వాదులు చరిత్రలన్నియు తెలుపబడినవి. ఆత్మ దర్శనము సేసిన మునులు చాతుర్వర్ణ్యము మహానుభావుల కథలు పుణ్య క్షేత్ర తీర్థములు వర్ణితములు. వేద శాస్త్ర విషయములు తెలుప బడినవి. విష్ణువును గూర్చి వినిపించితివి. అగ్ని లోహములనట్లీ పురాణము కలికల్మషములను హరించి మనస్సును శుద్ధి సేయును. పిపీలికాది బ్రహ్మ పర్యంతమయిన బ్రహ్మాండ మంతయు నెవ్వని స్వరూపమో యా విష్ణు భగవానుడిందు సంకీర్తంప బడెను. అశ్వమేధ, అవభృథ స్నానము సేసిన ఫలము ప్రయాగ పుష్కరము కురుక్షేత్రము మొదలగు వాని యందు స్నానదానాదులు సేసిన కలుగు ఫల మీ పురాణ శ్రవణముచే సిద్ధించును. యమున యందు జ్యేష్ఠ శుక్ల ద్వాదశి నాడు స్నానము సేసి, మథుర యందు హరిం దర్శించిన పుణ్యము దీనిచే గల్గును. జ్యేష్ఠ బహుళ ద్వాదశి నాడుపవసించి యమునా జలముల స్నానము సేసి పితరుల నర్చించిన పుణ్యమీ పురాణ పఠన శ్రవణాదుల గల్గును. మథురానాథు నయ్యెడ సేవించిన పుణ్యము నిది యిచ్చును. ఇది దుస్స్వప్న నివారకము. మంగళముల కెల్ల మంగళము. పుత్రులను సంపదల నిచ్చును. బ్రహ్మ ఋభునకు అతడు ప్రియవ్రతునకు అతడు భాగురికి ఆయన స్తంబ మిత్రునకు నాతడు దదీచికి ఆయన సారస్వతునికి యతడు భృగునకు ఆయన పురుకుత్సునికి నతడు నర్మదకు నర్మద ధృతరాష్ట్రునికి, నాగునికి, ఆపూరణునకు ఆ యిద్దరు నాగేంద్రుడైన వాసుకికి, వాసుకి వత్సునికి, అతడు అశ్వతరునకు, అతడు కంబళునకు, అతడెలా పుత్రునుకి నుపదేశించెను.
వేదశిరుడను ఋషి పాతాళమున కేగి యిది వినెను. అతడు ప్రమతికి అతడు జాతుకర్ణునికి, మరి పుణ్యు లెందరికో వినిపించెను. పులస్త్య మహర్షి వరముచే నాకిది జ్ఞప్తికి వచ్చినది. నేను నీకు యథాతదముగా దెల్పితిని. నీవు దీనిం గలియుగము తుదిని శినీకునకు ఉపదేశింప గలవు. ఇది పరమ గుహ్యము కలి పాపహరము. భక్తితో విన్న యతడు సర్వపాప విముక్తుడగును. సర్వ తీర్థ స్నాన ఫలము సర్వ దేవతా స్తుతి ఫలము దీనిచే గల్గును. కపిల గోదాన ఫలమిది చేకూర్చును.
Summary of chapter 8 of the Vishnu Mahā Purāṇa is as follows:
The formal conclusion of the entire Viṣṇu Mahā Purāṇa. The five lakṣaṇas (defining characteristics) of a Purāṇa are enumerated: sarga (creation), vaṃśa (dynastic lineage), manvantara (cosmic time cycles), vaṃśānucarita (royal biographies), and pratisaṃcara (dissolution) — and all five have been taught in this Purāṇa in full. The Phalaśruti declares that hearing this Purāṇa is equal to the Vedas, removes all pāpa, grants all four puruṣārthas, and ultimately confers Viṣṇu-sāyujya. The complete transmission lineage is given: Brahma → Ṛbhu → Priyavrata → Bhāguri → Stamba Mitra → Dadīci → Sārasvata → Bhṛgu → Purukutsa → Narmadā (the river goddess) → Dhṛtarāṣṭra (the Nāga king) → Āpūraṇa → Vāsuki → Vatsa → Aśvatara → Kambala → Eelaputra. Parāśara himself received the Purāṇa from Pulastya by grace. He will teach it to Maitreya, who will transmit it to Śinī at the end of Kali Yuga. The Purāṇa ends with two mangala-ślokas in praise of Viṣṇu as the one without modification, the sole Puruṣottama, the Akhilātmaka — the lord of all jñāna and all śrī.