స్వాయంభువ మనువు కొడుకులు ప్రియవ్రతుడు, ఉత్తనపాదుడును మహావీరులు ధర్మజ్ఞులు. ఉత్థానపాదునికి సురుచియను ప్రియ భార్య యందు ఉత్తముడను మిక్కిలి యిష్టుడగు. కొడుకు గల్గెను. సునీత యను నాతని యగ్ర మహిషి యందు ధ్రువు డుదయించెను. అతని యందు దండ్రి కంత ప్రీతి లేదయ్యె. తండ్రి తొడ మీద కూర్చున్న తమ్ముని ఉత్తమునిం గని సురుచి చూచుచుండ తాను నక్కడ గూర్చుండ గుతూహల పడు ధ్రువునిం గని యుత్తాన పాదుడందుల కిష్ట పడడయ్యె. ప్రేమతో వచ్చి తండ్రి యొడిలో గూర్చుండ నుబలాట పడు సవతి కొడుకును జూచి యుయ్యోడి నున్న తన కొడుకుంగని సురుచి యిట్లనియె. వత్స! ఏల యూరక ముచ్చట పడెదవు? నా కడుపునం బుట్టక వేఱొక స్త్రీ గర్భమున బుట్టి పరమోత్తమ స్థానమందని దాని నవివేకివై కోరుచున్నావు. నిజమే నీవీయన కొడుకువే. అయిననేమి నాచే బది మాసములు మోయబడిన వాడవు గావు. సర్వ రాజన్యుల కాశ్రయమైన ఈ రాజాసనము నా కొడుకునకు మాత్రమే తగినది. ఏల వృథా క్లేశ పడెదవు? నా కొడుకట్లు ఈ గొప్ప కోరిక వ్యర్ధముగా నీకెందులకు? నీవు సునీతికి బుట్టితి వనునది నీకు యవగాహనలో లేదా?
అన నా సవతి తల్లి మాటలు విని దండ్రిని యా బాలుడు కినుకగొని తన తల్లి సౌధమునకు వెళ్ళెను. అల్లన బెదవులదర కోపము గొనియున్న యా పిల్ల వానింగని సునీతి యోడి లోనికి దిగిచి కొని నాయనా! ఎందులకు గోపము వచ్చినది? ఎవడు నిను జూచి యాదరింపడు? నీయెడ నపరాధము సేసి యెవ్వడు (నిన్నుగాదు) మీ తండ్రి నవమానించి నాడు? అన నా పాపడు సురుచి రాజు ముందు దన్నాడిన మాటలెల్ల నమ్మకు జెప్పెను. ఆ యమ్మ విని మనసు చెడి నిట్టూర్పు ఉచ్చి యూర్పులెగయ చూపుల సోంపు దఱుగు దీనురాలై సునీతి బిడ్డనితో నిట్లనియె.
అబ్బాయీ! సురుచి నిజము పల్కినది. నీవల్ప భాగ్యుడవే. పుణ్యవతులైన వారి బిడ్డడిట్లు సవతిచే నొవ్వ నాడబడునా? ఈ మున్ను నీ చేసిన ప్రయత్న మింకెన్నడునూ నీవు సేయవలదు. నీ మున్ను సేసినది యెవ్వడు హరింప గలడు. చేయనిది ఎవ్వడీయ గలడు? దాని మాటలం బొడమిన దుఃఖమిది నీవు లెక్క సేయ వలదు. రాజాసనము వెల్లగొడుగు పతాక గుఱ్ఱములు మేటి ఏనుగులు నను నీ యెల్ల నెవనికి పుణ్యములు గలవు, వాని కివి యుండును. బిడ్డా! నీవు శమింపుము. జన్మ జన్మాంతరమ్ముల పుణ్యములచే రాజు సురిచి యందు సురుచి యయ్యెను. పుణ్యములు లేని నా బోటి భార్యయని యనిపించు కొనుటకు మాత్రమే భార్య. పుణ్యముల పెంపున నింపుగుల్క నుత్తముడు దాని కొడుకుత్తముడే ఉత్తమ పుణ్యడు. నా కొడుకు వైయట్లే పుట్టియు నీవల్ప పుణ్యుడవు. నిక్కము. అయినను నీ వేడువం దగదు. తన కెంత గలదా పుణ్య ఫలమున సంతుష్టు డగును బుద్దిమంతుడు. సురుచి మాటచే నీకెక్కున దుఃఖము గలిగెనేని సర్వ ఫలప్రదమైన పుణ్య రాశి సంపాదనమునకు యత్నము సేయుము. మంచి శీలవంతుడవు గమ్ము. ధర్మాత్ము డవగుము. ప్రాణుల హితవు గోరుము. ఎల్లర యెడ మైత్రి పాటింపుము. నీరు పల్లమున కట్లు సంపదలు పాత్రుని దరిజేరును.
అమ్మా! నా యుపశమనమున కీవన్న యీ పలుకు ములుకులు పగుల వడిన నాయేడంద నిలువదు. సర్వజగమ్ముల కభిపూజ్యమైన మహోన్నత స్థానమే నెట్లు పొందుదునో యందుల కేను యత్నింతును. రాజునకు సురుచి ప్రియురాలు. ఆమె కడుపునా నీను బుట్ట నైతిని. అమ్మా! నీ కడుపునం బుట్టి పెరిగిన నా ప్రభావముం జూడుము. మా తమ్ముడుత్తముడు ఆమె గర్భమున మోపబడిన వాడు. వాడే తండ్రి యిచ్చిన రాజాసనము బొందు గాక! దేవీ! ఇంకొక డిచ్చిన స్థానమేను గోరను. నా తండ్రి గూడ పడయని యాస్థానముం గోరు చున్నాను.
అని పలికి జననియిలు వెడలి పురము వెడలి యా పురము వెలినున్న యుద్యానవనమున కేగెను. అక్కడ యంతమున్న వచ్చి కృష్టాజినములు పరచిన యాసనములం గూర్చున్న సప్తర్షులం దర్శించెను. ఆ రాచ బిడ్డ డయ్యందరకు బ్రణమిల్లి విన్యా వనతుడై చేతులు మొగిచి యిట్లు భాషించెను.
ఓ సత్తములారా! సునీతి యందు గల్గిన ఉత్థాన పాదుని కుమారుడనని నన్దెలియుడు. నిర్వేదపడి (దుఃఖము గొని) మీ సన్నిధి కీతెంచితిని. అనవిని ఋషులు, నాలుగైదేండ్లు యిడువాడవు. రాకుమార! నీకు దుఃఖము కల్గుటకు కారణ మించుకేని యెపుడేని కాన రాదు. నీకు జింతించ వలసిన దేకొంచెము లేదు. భూపతి తండ్రి యంతయు ధరించును భరించును. నీ కిష్ఠజన వియోగాదికము (బంధ వియోగము) కానము. నీ శరీరమందే వ్యాధి కన బడదు. నీకు నిర్వేదము కల్గుట కేవి నిమిత్తములు? ఏదేని గలదేని తెల్పుము. అన వారికా బాలుడు సుచియన్న మాటలు దెలిపెను. అది విని యమ్మును లందఱు యిట్లను కొనిరి. ఆహా! ఈ బాలునిలోని క్షాత్ర తేజమేమి వింతైనది? ఈ యక్షమ సవతి పలుకులకు నాకు సైపలేని తన మేమివింత? యీతని మనసు నుండి యా పలుకులు తొలగ కున్నవి. ఓ రాచబిడ్డ! ఈ దుఃఖముచే నీ విపుడేమి సేయ దలచితివి అది మాకు దెలుపు నిష్టమగునేని తెలుపుము. మఱియు మేము నీకేమి సహాయ్యము సేయనగు నదియు దెలుపుము. నీవేదో మాకు దెలుపు నెంచినట్లు కనిపించు చున్నావు.
నేనేదేని యొక యదార్ధము గోరుట లేదు. ఓ విప్రోత్తములారా! ఈ మున్నింకొక డనుభవింపని (మఱొకనిచే భుక్తము గాని) యాస్తానమే నొక్కటే గోరుచున్నాను.
గోవిందు నారాదింపని నరులా స్థానము నందలేరు. కావున నీవయ్యచ్యుత నారాదింపుము.
పరులకెల్ల పరుడైన జనార్ధనుడేని యెడ సంతుష్టు డగును. అతడా నాయక్షయ స్థానమందును. ఇది నిక్కము.
ఆ ఉన్నత స్థానమీవు కోరుదునేని ఏయచ్యుతుని యందీ సర్వమున్నదో యా గోవిందు నారాధింపుము.
పరబ్రహ్మ వస్తువు పరందామము ఆ పరబ్రహ్మ వస్తువు హరి కావున శ్రీహరి నారాధించిన వాడు దుర్లభమైన ముక్తి నందును.
యజ్ఞము యజ్ఞ పురుషుడు పరమ పురుషుడు నగు జనార్దనుండు తుష్టుడైన నందరానిది లేదు.
ఇంద్రుడెవ్వనిని ఆరాధించి ఇంద్ర ప్రస్తాన మందెనో యా యగ్నపతిని విష్ణువును సువ్రతివై యారాధింపుము.
వత్సా! విష్ణువు నారాధింతువేని ముల్లోకములలో మనసు నందే దేదికోరుదు వాయుత్త మోత్తమ స్థానమును బొందగలవు అనిరి.
వినతుడైన నాకు దాము విష్ణువు నారాధింపుమని సెలవిచ్చితిరి. అయన సంతుష్టు డగుట కేనేమి జరుప వలయునో యాయన యారాధన మెట్లు సేయ వలెను. ప్రసాద సుముఖులై ఓ మహర్షులారా! నా కానతిండన
రాజకుమారా! విష్ణు నారాధన మెట్లు సేయవలేనో వినుము. మనసును వెలి వస్తువు లన్నింటిని మరలించి యా జగన్నివాసుని యందు కదలకుండ నిలుప వలెను. ఇట్లేకాగ్ర మనస్కుడై విష్ణు మాయమైన మనస్సుతో “హిరణ్య గర్భ పురుష ప్రధానావ్యక్త రూపిణే, ఓం నమో వాసుదేవాయ శుద్ధ జ్ఞాన స్వభావినే” అని జపింప వలయును. హరిణ్య గర్భుడు పురుషుడు ప్రధాన అవ్యక్తము ననబడు స్వరూపము గలవానికి శుద్ధ జ్ఞానము స్వభావమైన వానికి వాసుదేవునికి నమస్కారము. అని యీ మంత్రము యొక్క భావము స్వాయంభువ మనువు మీ పితామహుడు భగవంతుడు (షడైశ్వర్య సంపన్ను డన్నమాట) మున్నిదే జపించేను. దానికి జనార్దనుండు సంతుష్టుడయ్యె. త్రిలోక దుర్లభమైన యాయన కోరిన సమృద్ది నాతనికా పరమేశ్వరు డొసంగెను. అట్లే నీవును దీనినేవేళ జపించి గోవిందుని సంతోష పరుపుము.
Summary of chapter 11 of the Vishnu Mahā Purāṇa is as follows:
In the forest Dhruva meets seven ṛṣis who instruct him in the mantra "Oṃ namo Vāsudevāya" and the proper method of tapas. He proceeds to the banks of the Yamunā and undertakes progressively severe austerities — first eating fruit and leaves monthly, then surviving on water every three months, then on air, finally standing on one foot motionless. His tapas becomes so intense that it disturbs the entire cosmos.