విష్ణు మహా పురాణము

16 - దుష్యంతోద్భవము

యదు వంశమును సంగ్రహముగ తెల్పితిని. దుర్వసు వంశమిక వినుము. దుర్వసుని కొడుకు వహ్ని. వాని కుమారుడు భార్ధుడు, అతనికి భానువు! అతనికి త్రయీసానువు అతనికి కరందముడు. అతనికి మరుత్తుడు. మరుత్తునికి సంతానము లేదు. అందుచే పూరువంశ్యుని (పౌరవుని) దుష్యంతుని స్వీకరించెను. యయాతి శాపముచే యదు వంశము పౌరవ వంశము నాశ్రయించెను.