విష్ణు మహా పురాణము

10 - భృగుసర్గాది సృష్టి వర్ణనము

మహర్షీ! నేనడిగిన దెల్ల యానతి నిచ్చివి. భృగునుండి జరిగిన సృష్టిక్రమము సెలవిమ్మన

భృగువునకు ఖ్యాతి యందు లక్ష్మి యుదయించి విష్ణువునకు భార్యయయ్యె. అట్లే ధాత విధాత యను పుత్రులు ఖ్యాతి యందు భృగువున కుదయించిరి. మేరువు కూతుండ్రు, ఆయతి ధాతకు, నియతి విధాతకు భార్యలయిరి. వారికి ప్రాణుడు మృకండుడు నను కొడుకులు కల్గిరి. మృకండునికి మార్కండేయుడు గల్గెను. మరీచి భార్య సంభూతి పౌరమానుడను కొడుకుం గనెను. ఆ మహాత్మునికి విరజుడు, పర్వతుడును కల్గిరి. అంగిరసుని భార్య స్మృతి సినీవాలి, కుహువు రాక అనుమతి యను కన్యలం గనెను. అత్రి వలన ననసూయ, సోముని దుర్వాసునుని దత్తాత్రేయ యోగిని గనెను. పులస్త్యుని యిల్లాలు ప్రీతి యందు పులహ ప్రజాపతికి విక్షమ యను భార్యయందు కర్దముడు, చార్వరీ వంతుడు, సాహిష్ణువు నను ముగ్గురు కొడుకులు పుట్టిరి.

క్రతువను ముని భార్య సంతతి వాలఖిల్యులను నరువదివేల మంది యూర్ద్వ రేతస్కులై కుమారులం గాంచెను. వారు బొటన వ్రేలి కణుపంత యాకారము గలవారు. మధ్యందిన సూర్య ప్రభావంతులు వసిష్ఠునికి ఊర్జ యందేడుగురు మహర్షులు. బ్రహ్మ యొక్క పెద్దకొడుకు యీ అగ్న్యభిమాని దేవత వలన స్వాహాదేవి మహౌజ స్సంపన్నులయిన ముగ్గరు సుతులం గనెను. ఆ యిర్వురు బ్రహ్మవాది యోగినులును మంచిజ్ఞాన సంపత్తి గలవారు. సర్వ శుభ లక్షణలు. ఇది దక్ష కన్యాకాల సంతతి. దీనిని శ్రద్ధతో స్మరించిన వాడు సంతానహీనుడు గాడు.