ఇలా తాను (భరతుడు) పలుక మౌనిమూని లోలోన నాలోచించుచున్న రాజుం గూర్చి, బ్రాహ్మణుడు అద్వైత విషయ మయిన కథనిలా వచించెను.
ఓ నృపశ్రేష్ఠ! మున్ను జ్ఞానోదయము సేయుచు నిదాఘునికి వర్ణించిన కథను వినుము. చతుర్మఖ బ్రహ్మ సుతుడు ఋభువను నాతడు సహజముగనే తత్త్వజ్ఞానియై యుండెను. ఆతనికి పులస్త్య కుమారుడు నిదాఘుడను వాడు శిష్యుడయ్యెను. అమితానందముతో నతనికి ఋభవ శేష విజ్ఞానము నొసంగెను. జ్ఞానము వడసిన యీ శిష్యుని యద్వైత వాసన యేపాటిదో ఋభువు పర్యాలోచించెను. దేవికా నదీ తీరమందు సర్వ సమృద్దము సర్వ సుందరము నైన పురము ‘వీర నగరమ’ ను పేర పులస్త్యునిచే నిర్మింప బడినది. రామ్యోద్యాన పరిసర మయిన యా పట్టణమంద నిదాఘుడను పేరివాడు యోగాజ్ఞాని ఋభువు శిష్యుడు వసించు చుండె. వేయి దివ్య సంవత్సరములు గడువగా నాతనిం జూడ ఋభుండట కేగెను. వైశ్వదేవ మయిన తర్వాత ద్వారమున గొని యాతని యింత ప్రవేశింప జేయబడెను. నిదాఘ ముని కాలుసేతులు గడిగి యాసనమందు కూర్చుండిన ఋభుని సాదరముగ, మా యింట భోజనము సేయుడని పలికెను.
ఓ విప్రోత్తమా! భుజింప దగినది మీ యింట నేమున్నది తెల్పుము. నీరసాన్నములు యెడ నా కెప్పుడును ప్రీతిలేదు.
పేలపిండి యావకము (యావ వికారము) వాత్యము = కందమూలాదికము అప్పములు మా యింట కలవు. ఇందేది నీకు రుచించు నది స్వేచ్చగా భుజింపుము.
ఓ ద్విజ! ఇవన్నియు పనికిమాలిన యన్నములు. సంయావము = పారుపత్తులు, పాయసము = పరమాన్నము, ద్రప్సము = పెరుగు, పాణితములు = బెల్లపు భక్ష్యములు బెట్టుము.
ఓ గృహిణీ! మంచి యాహారము నా యింట నే కొంచమేని భక్ష్యోపస్కరణమైన రుచి కరమైన దేదేని ఈయన కాహారము సమకూర్చును. అన నా యిల్లాలు ఆ ద్విజునకు భర్త మాట యందున్న గౌరవముతో వడ్డించెను. ఆ యన్నమును మనసార భుజించుచున్న యమ్మహామునింగని వినయ వినతుడై నిలిచి
ఈ విధముగా నిదాఘునికి ఋభుడు తత్త్వోపదేశము సేయ నా పరమార్థ వచనము లాలించ మహానుభావుడు నిదాఘు డిట్లనెను.
Summary of chapter 15 of the Vishnu Mahā Purāṇa is as follows:
As a further philosophical illustration, Jaḍabharata narrates the story of Ṛbhu Muni and Nidāgha. Ṛbhu, son of the four-faced Brahmā, was naturally a tattva-jñānī from birth. Nidāgha, son of Pulastya, became his disciple and received complete jñāna. Ṛbhu wished to verify whether advaita-vāsanā had taken root in Nidāgha. He visited Nidāgha at Vīranagara — a beautiful city on the Devikā river built by Pulastya — after one thousand divine years. Nidāgha received him with complete hospitality and served him respectfully. Ṛbhu gave further tattva-upadeśa, with the philosophical import that the distinction between gross and subtle food is like the distinction between the cosmic and individual ātman — ultimately both are one.