విష్ణు మహా పురాణము

Table of Contents

28 - రుక్మి వధ

 

 

శ్రీ రుక్మిణీదేవి కన్న సంతానము చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుషేణుడు, చారుగుప్తుడు, భద్రబాహువు, చారువిందుడు, చారువిందుడు, సుబాహువు, చారువునను పుత్రులు చారుమతి యను కన్యయును. కృష్ణునికి మఱియు నేడుగురు పత్నులుండిరి. ఆ సప్త మహిషులు కాళింది, మిత్రవింద, నాగ్నజితి, జాంబవతి, కామ రూపిణి యగు రోహిణి, మద్రరాజ సుతయగు సుశీల, సత్రాజిత్తు కూతురు సత్యభామ లక్ష్మణ. వీరు గాక పదునారు వేల మంది భామలుండిరి. ప్రద్యుమ్నుడు రుక్మి కూతురు నొండొరులను స్వయంవర మందు వరించు కొనిరి. వారికి మహాబలశాలి యుద్ద మందెవ్వరికి నిరోధింప వశము గాని వాడు వీర్య సముద్రుడు నగు ననిరుద్దుడు ఉదయించెను. రుక్మిపౌత్రి నాతని కిమ్మని శ్రీకృష్ణుడు కోరెను. రుక్మి కృష్ణునెడ స్పర్ధగొన్నను తన దౌహిత్రునకు భౌత్రినిచ్చెను. ఆమె పెండ్లిలో కృష్ణునితో గూడ బలరామాది యాదవులు మరియుం గల రాజు లందరితో రుక్మి యొక్క నగర మగు భోజ కటమునకు తరలి వచ్చిరి. వివాహ మహోత్సవమైన తరువాత కళింగ రాజు మొదలయిన వారు రుక్మింగని బలరాముడు పాచికలాడు టెఱుగడు. జూదమున నతని మనమేల గెలువ రాదనిరి.

 

 

బలమదమున రుక్మియట్లే కానిండని సభలో బలరామునితో ద్యూతక్రీడ నారంభించెను. ఒక్క వేయి నిష్కము లొడ్డి బలరాముడు రుక్మిచే నోడిపోయెను. రెండవ పందెమందు నట్లే యంతమొత్తము గోల్పోయెను. ఆ వీర బలరాముడు బదివేల నిష్కముల పందెము కాసెను. దానిని ద్యూత విశారదుడు రుక్మి గెల్చుకొనెను. అది కని కళింగ రాజు నోరు తెరచి విరగబడి పెద్ద ధ్వని యగునట్లు పండ్లు బయలు వడ నవ్వెను. అప్పుడు రుక్మియు మదోద్దతుడై “ఇతడు ధ్యూతము నెఱుంగని వాడు. నేను వీనిం గెలిచితిని. అక్ష క్రీడలో లేనిపోని గర్వముకొని అక్ష క్రీడా కోవిదుల మని మనల నెఱుంగడయ్యె” అనెను. కళింగ రాజు పండ్లి గిలించుటయు రుక్మి ప్రేలుటయుం గని హలాయుధుం డీసుగొని కోటి నిష్కములను మరల పందెము సరచెను. రుక్మి పాచికం బట్టి విసరెను. బలదేవుడు ఆ పందెముం గెలిచి కొనెను. గెలిచితి ననియుం బలికెను. రుక్మి నేను గెలిచితినని పలికెను. అబద్దమాడకుము. నీవు పందెము పెట్టితివి. నిజమే కాని దానిని నేనా మోదించ లేదు. ఇట్టి యెడ గెల్పు నీదగు నంటివేని నాదెందులకు గాదు? అని రుక్మిం వివాదమునకు దిగెను. అంతట నంతరిక్షము నందాకాశావాణి గంభీర నాదమున మహానుభావుడగు బలదేవుని కోపముం బెమ్పొందించుచు “ధర్మముగా బలరాముడే గెలిచెను. రుక్మియన్న మాట యబద్ధము. అంగీకారపు మాటను పలుక కుండగూడ నని క్రియతో జరుగు చుండును అనెను.”

 

 

అవ్వల బలరాముడు లేచి కోపముచే గన్ను లెఱ్ఱవడ పాచికంగొని రుక్మినిం గొట్టెను. ఎగిరెగిరి పడుతున్న కాలింగరాజుం గూడ పట్టుకొని వాడు మున్నెవ్వాన నవ్వెనా దంతములు బగుల నడిచెను. మఱియు పెద్దదగు నా సభా స్తంభమును స్వర్ణ మాయముం జేసుకొని యా పక్షమునకు జెందిన రాజుల నందరందాన గోపాన నడిచెను. బలరాముడు కుపితుడు కాగా సభయంతయు గగ్గోలై రాజమండల మెల్ల నదరి పారిపోబోయెను. మధుసూదనుడు బలుని చేనట్లు రుక్మిని హతుడగుట గని మైత్రేయా రుక్మిణీ బలరాములకు జడిసి యించుకేని పలుక డయ్యెను. అవ్వాల హరి పెండ్లియై నిరుద్దుడై యున్న యనిరుద్దుని యాదవ మండలమును జేకొని ద్వారకా పురికి వచ్చెను.