విష్ణు మహా పురాణము

Table of Contents

15 - ఋభుముని నిదాఘమునికి అద్వైత ప్రవచనము చేయుట

 

ఇలా తాను (భరతుడు) పలుక మౌనిమూని లోలోన నాలోచించుచున్న రాజుం గూర్చి, బ్రాహ్మణుడు అద్వైత విషయ మయిన కథనిలా వచించెను.

 

 

ఓ నృపశ్రేష్ఠ! మున్ను జ్ఞానోదయము సేయుచు నిదాఘునికి వర్ణించిన కథను వినుము. చతుర్మఖ బ్రహ్మ సుతుడు ఋభువను నాతడు సహజముగనే తత్త్వజ్ఞానియై యుండెను. ఆతనికి పులస్త్య కుమారుడు నిదాఘుడను వాడు శిష్యుడయ్యెను. అమితానందముతో నతనికి ఋభవ శేష విజ్ఞానము నొసంగెను. జ్ఞానము వడసిన యీ శిష్యుని యద్వైత వాసన యేపాటిదో ఋభువు పర్యాలోచించెను. దేవికా నదీ తీరమందు సర్వ సమృద్దము సర్వ సుందరము నైన పురము ‘వీర నగరమ’ ను పేర పులస్త్యునిచే నిర్మింప బడినది. రామ్యోద్యాన పరిసర మయిన యా పట్టణమంద నిదాఘుడను పేరివాడు యోగాజ్ఞాని ఋభువు శిష్యుడు వసించు చుండె. వేయి దివ్య సంవత్సరములు గడువగా నాతనిం జూడ ఋభుండట కేగెను. వైశ్వదేవ మయిన తర్వాత ద్వారమున గొని యాతని యింత ప్రవేశింప జేయబడెను. నిదాఘ ముని కాలుసేతులు గడిగి యాసనమందు కూర్చుండిన ఋభుని సాదరముగ, మా యింట భోజనము సేయుడని పలికెను.

 

 

ఓ విప్రోత్తమా! భుజింప దగినది మీ యింట నేమున్నది తెల్పుము. నీరసాన్నములు యెడ నా కెప్పుడును ప్రీతిలేదు.

 

 

పేలపిండి యావకము (యావ వికారము) వాత్యము = కందమూలాదికము అప్పములు మా యింట కలవు. ఇందేది నీకు రుచించు నది స్వేచ్చగా భుజింపుము.

 

 

ఓ ద్విజ! ఇవన్నియు పనికిమాలిన యన్నములు. సంయావము = పారుపత్తులు, పాయసము = పరమాన్నము, ద్రప్సము = పెరుగు, పాణితములు = బెల్లపు భక్ష్యములు బెట్టుము.

 

 

ఓ గృహిణీ! మంచి యాహారము నా యింట నే కొంచమేని భక్ష్యోపస్కరణమైన రుచి కరమైన దేదేని ఈయన కాహారము సమకూర్చును. అన నా యిల్లాలు ఆ ద్విజునకు భర్త మాట యందున్న గౌరవముతో వడ్డించెను. ఆ యన్నమును మనసార భుజించుచున్న యమ్మహామునింగని వినయ వినతుడై నిలిచి

 

 

 

 

 

 

ఈ విధముగా నిదాఘునికి ఋభుడు తత్త్వోపదేశము సేయ నా పరమార్థ వచనము లాలించ మహానుభావుడు నిదాఘు డిట్లనెను.