విష్ణు మహా పురాణము

Table of Contents

4 - నాల్గవ అధ్యాయము

 

కల్పాది యందు నారాయణు డనబడు బ్రహ్మ సర్వ భూతముల నెట్లు సృజించెను? తెల్పుమన మైత్రేయునకు పరాశరు లిట్లనిరి.

 

 

జరిగిన కల్పము చివర రాత్రి నిదుర నుండి లేచి సత్త్వగుణోద్రిక్తుడై లోకమును శూన్యముగా గనెను. నారాయణుని గూర్చి ఈ క్రింది శ్లోకము మహర్షులు దహరింతురు. ఆపః = నీరు, నారములన బడినవి. అవి నరుడు గన్నవి. ఆ నారాయణునకవి మొదట ఆయనము = గమ్య స్థానమయినవి. అనగా నుదకముల యందాయన తొలుత విశ్రమించె నన్నమాట. నారాః + ఆయనం యస్యసః నారాయణః అను నిర్వచనముం బట్టి ఈ శబ్ద మేర్పడినది. ప్రళయ మందేకార్ణవ మైన తఱి నీటి లోపల నున్నట్లు ఊహించి ఈ భూమిని మీది కెత్త వలెనని ప్రజాపతి కోరెను. అపుడు మనువు కల్పాదులందు వలె తాను మత్స్య కూర్మాద్యనేక శరీరములు దాల్చెను. అట్లే వేదము యజ్ఞ స్వరూపముగా గల వరాహ రూపమును ధరించెను. అపుడు స్థిరము సర్వము పరమునైన యాత్మ తానై జనలోక మందున్న సనకాది సిద్దులు స్తుతించు చుండ దనకు నాదారమయిన యా పరమాత్మ ధరణిం దాల్చి నీటం బ్రవేశించెను. అతనిం జూచి పృథివి పాతాళమునకు వచ్చిన యా వారాహ మూర్తి కెఱిగి భక్తిచే వినమ్రయై యిట్లు స్తుతించెను.