వాయు మహా పురాణము
5 - కశ్యపీయ ప్రజాసర్గమ్
ఋషులనిరి :
వైవస్వత మన్వంతరమున దేవతలయొక్కయు, దానవులయొక్కయు, దైత్యులయొక్కయు, అంతట జరిగిన యుత్పత్తిని జెప్పుము .
సూతుడనెను :
ఇపుడు ధర్మునియొక్క సృష్టిని జెప్పెదను. దానిని వినుడు. అరుంధతి, వసువు, యామి, లంబ, భానువు, మరుత్వ సంకల్ప, ముహూర్త, సాధ్య, విశ్వ - అను నీ పదుగురు ధర్ముని ధర్మపత్నులు. ప్రాచేతసుడైన దక్షుడు వీరిని ధర్మునకిచ్చె అందులో 'సాధ్య' పండ్రెండుగురు సాధ్యులను ధర్మునకు పుత్రులనుగా గనెను. ఈ సాధ్యులను వారు మహాభాగ్యవంతులు, జనించిన వారు, యజ్ఞములో భాగము గలవారు. వారిని దేవతలకంటే నుత్కృష్టులనీ దేవతలను దెలిసినవారు చెప్పిరి (4), బ్రహ్మముఖము నుండి సంతానపు కోరికతో సృజింపబడిన జయులను దేవతలు. ఇట మన్వంతరములలో వారందరు మంత్రశ (5). వారు దర్శుడును, పౌర్ణమాసుడును, బృహద్రథంతరుడును, చిత్త, విచిత్తి, ఆకూతి, కూతీ, (6), విజ్ఞాత, విజ్ఞాతుడు, : యజ్ఞుడు - అనువారని యనబడిరి. ఆ జయులయొక్క యీ నామములు ప్రసిద్ధములు (7). బ్రహ్మ శాపమున మరల స్వార మన్వంతరమున వారు పుట్టిరి. వారు జితులు. స్వారోచిషమన్వంతరమున వారు తుషితులు, మరల ఉత్తమ మన్వంతరము సత్యులు (8). తామస మన్వంతరమున హరులనువారు. రైవత మన్వంతరమున వారు వైకుంఠులు. చాక్షుష మన్వంత సాధ్యులనువారు. వారు దేవతలు. స్వేచ్ఛగా జనించినవారు .
ధర్మపుత్రులై మహాభాగులైన యా సాధ్యులు దేవతలు. పూర్వము చాక్షుష మన్వంతరమున వారలను అనుసరించి జని (10). స్వారోచిష మన్వంతరమున గడచిన మహౌజస్కులైన దేవతలు తుషితులను వారై చాక్షుష మన్వంతరమున పరస్పరము మ ఆ చాక్షుష మన్వంతరము కొద్దిగా మిగులగా తుషితులను దేవతలిట్లనిరి:- “మనము పరస్పరముగా మహాభాగులైన సాధ్యులను ప్ర (మరొక) మన్వంతరమున జనించెదము. అది మనకు శ్రేయము గలుగగలదు” (12). వారందరీవిధముగానని, మరల నా స్వా మనువు నుండి పుట్టిన పండ్రెండుగురు ధర్ములను ప్రవేశించి జనించిరి .
విద్వాంసుడైన యింద్రుడున్న చోట మరల నరనారాయణులు పుట్టిరి. వారు సత్యుడు, హరియును. వారు ప స్వారోచిషమన్వంతరమున తుషితులను దేవతలుగా నుండిరి (14). తుషితులు సాధ్యులైనపుడు వారి యీ నామములు చెప్పబడు - 'మనుడు, అనుమంత, ప్రాణుడు, నరుడు, వీర్యవంతుడైన యానుడు (15), చిత్త, హయుడు, నయుడు, హంసుడు, నారాయ ప్రభవుడు, విభువు - అని సాధ్యులు పండ్రెండుగురు జనించిరి (16). మొదట స్వాయంభువ మన్వంతరమున నీ నామములుండినవి. తరువాత స్వారోచిష మన్వంతరమున తుషితులైన వారి నామముల వినుడు (17). ద్రోణుడు, అపానుడు, ఉదానుడు, సమానుడు, వ్యానుడు, చక్షువు, శ్రోత్రము, ప్రాణము, స్పర్శ, బుద్ధి, మనస్సు ప్రాణాపానములును, ఉదానము, సమానము, వ్యానము - ఈనామములు పూర్వము ఇట తుషితులవిగా జెప్పబడినవి .
వసువునకు వసువులు పుత్రులు. వారు సాధ్యులకు అనుజులు (తమ్ములు) అనబడిరి. ధరుడు, ధ్రువుడు, సోముడు, ఆపుడు, అనలుడు, అనిలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు - వీరు ఎనమండుగురు వస్తువులనబడిరి (20). ధరునకు హుతమైన హవ్యమును వహించుద్రవీణుడు పుత్రుడు - ధ్రువుని పుత్రుడు భవుడు పేరుతో కాలుడు లోకములను విశేషముగా శిక్షించి కాలనము సుఖము) జేయువాడు కాలుడు (21). సోమునకు భగవంతుడు వర్చస్వి, గ్రహముల మేలుకొలుపు బుధుడును పుత్రులు. వారు రోహిణీ యందు బుట్టినవారు లోకములలో బ్రసిద్ధులు (22). తరువాత ధారోర్మికలలు (ధార - ఊర్మి - కలలు) అను వారు మువ్వురును గూడ చంద్రునిడు వైతండ్యుడు, శముడు, శాంతుడు (23), స్కందుడు, సనత్కుమారుడు పాదతేజస్సుతో బుట్టిరి. అగ్నిపుత్రుడైన కుమారుడు శరస్తంబమున (రెల్లు గడ్డిపొదలో) బుట్టెను. అతని తరువాత అతని ననుసరించి పుట్టినవారు - శాఖుడు, విశాఖుడు, నైగమేయుడును (24). అనిలు (వాయువు) నకు భార్య శివ. వారికి మనోజవుడు, అవిజ్ఞాతగతి యను నిరువురు పుత్రులు. (25). ప్రత్యూషునకు ఋషి దేవలుడు - అను నిరువురు పుత్రులు. దేవలునకు సైతము ఇరువురు పుత్రులు క్షమ (ఓపిక) గలవారు, విద్వాంసులును (26). బృహస్పతి యొక్క యక్క బ్రహ్మచారిణి, యోగసిద్ధమైన వరస్త్రీ, అనాసక్తయై జగమంతయు దిరుగును (27). వసువులలో నెనిమిదవవాడైన ప్రభాసునియొక్క భార్యకు పుత్రుడు విశ్వకర్మ కలిగెను. ఆతడు శిల్పి బ్రహ్మ (28), సర్వ శిల్పములను నిర్మించువాడు. దేవతలను వర్ధిల్లజేయువాడు. సమస్త భూషణములను నిర్మించువాడును, ఇతరులచే నిర్మింపజేయువాడును (29). ఆతడు సమస్త దేవతలయొక్క విమానములను (మేడలను - ఆకాశయానములను - జలయానములను) నిర్మించును. ఆ శిల్పియొక్క శిల్పములను అనుసరించి మానవులు గూడ జీవింతురు .
విశ్వకు బుట్టిన విశ్వేదేవులు పదుగురు ప్రసిద్ధులు. క్రతువు; దక్షుడు, శ్రవుడు, సత్యుడు, - కాలుడు, కాముడు, ధుని (31), కురువంతుడు, ప్రభవంతుడు, రోచహనుడు - అని వారు పదుగురు. ధర్మపుత్రులనబడు నీ శుభులు విశ్వయందు బుట్టిరి (32). మరుత్వతియందు మరుత్వంతులు బుట్టిరి. భానవులు భానువునకు బుట్టినవారనబడిరి. ముహూర్తులు ముహూర్తయందు బుట్టిరి. లంబ ఘోషుని గనెను (33). సంకల్పయందు విద్వాంసుడు సంకల్పుడు బుట్టెను. జామియందు పథత్రయమునాశ్రయించిన నాగవీథులు పుట్టిరి (34). సమస్తమైన పృథివీ విషయము. అరుంధతి యందు బుట్టెను. ఈ శాశ్వతమైన విద్వాంసమైన సృష్టి ధర్మునిదిగా జెప్పబడినది (35). ముహూర్తులును తిథులును పతులతో బాటు సువ్రతులు. వారిని పేర్లతో జెప్పెదను వినుడు (36). రాత్రి - పగళ్ళ యొక్క విభాగమును, సంగ్రహ నక్షత్రములను జెప్పెద వినుడు. ముహూర్తములు సర్వనక్షత్రములును అహోరాత్రములను దెలిసినవారు (పగటిలోను రాత్రిలోను ఉండునవి) (37). అన్నిటియందును తన (సం)గతి విశేషముచే ఋతువు (కాలము)ను గోరు రవి వలన అహోరాత్రకలలు ఆయువందలకు మించినవని యనబడినది (38). అందువలననే వేదవేత్తలు పర్వములందు తిథిని గోరుదురు. - అవిశేషములైన కాలములందు పితృదానమును బట్టి కలుపదగినది (39). రౌద్రము, సార్వము, మైత్రము, పిండ్యము, వాసవము, ఆప్యము, వైశ్వదేవము, బ్రాహ్మము, మధ్యాహ్నసంశ్రితము (40), ప్రాజాపత్యము, ఐంద్రము, ఇంద్రము, నిర్ఋతి, వారుణము - అనునవి పితృదేవతలలో నొకడైన అర్యముని యొక్క (సూర్యునియొక్క) దినమునాశ్రయించిన (పగటినాశ్రయించిన) భాగములు (41), ఇవి దినమునందలి ముహూర్తములు. సూర్యునిచే వినిర్మితములైనవి. శంకుచ్ఛాయా విశేషముతో (శంకువు యొక్క నీడలలోని భేదములను బట్టి) ప్రామాణికముగా తెలియదగినవి (42). అజులు, అహిర్భుధ్యులు, పూష - అహి - యమదేవతలు, ఆగ్నేయము, ప్రాజాపత్యము, బ్రహ్మము, సౌ ఆదిత్యము, బార్హస్పత్యము, వైష్ణవము, సావిత్రము, త్వాష్టము, వాయవ్యము - అని సంగ్రహము (44). క్రమముగా జెప్పబడిన ఏకరాత్రముహూర్త ములు. చంద్రుని గతిననుసరించి యుదయములు గలవి నాలికలు పాటికలును. ఇవి కాలావస్థలం ముహూర్తములు దేవతలనబడినవి (45). అన్ని గ్రహములకును మూడేస్థానములు చెప్పబడినవి. అవి క్రమముగా దక్షిణ - మధ్యములు (46). మధ్యన జారధవస్థానము, ఐరావతస్థానముత్తరము. వైశ్వానరస్థానము దక్షిణము - అని యిచట యఁ నిర్దిష్టమైనది (47). అశ్విని, కృత్తిక, యామ్య (భరణి) - నాగవీథియనబడినది. రోహిణి, మృగశీర్ష ఆర్ధ వీథియనబడినది. ఆశ్లేష, పునర్వసువు - ఐరావతీ వీధి యనబడినది. మూడు వీథులివి ఉత్తరమార్గమునందలివని చెప్పబడును (48), పూర ఉత్తర ఫల్గుని, ముఘ - అర్యమీ (వీథి) యనబడినది. హస్త, చిత్ర, స్వాతి - గోవీథియనబడినది (49). జ్యేష్ణా, విశాఖా, ఆ జారధవీ వీథియనబడినది. ఈ వీథులు మూడు మధ్యమ మార్గమునందలివని చెప్పబడును (50), మూల, పూర్వాషాఢ, ఉత్త అజవీథియనబడినది. శ్రవణం, ధనిష్ఠ, శతభిషక్ - మార్గీవీథియనబడినది (51). పూర్వాభాద్రపద, ఉత్తరాభాద్రపద, రేవతి - వైః యనబడినది. ఆ మూడు వీథులు దక్షిణ మార్గమునందలివని బుధులచే జెప్పబడినవి (52), దక్షుడు తన ఇరువది డే కన్యలను సోమునకు (చంద్రునకు) ఇచ్చేను. నక్షత్ర నామములు గల యా కన్యలు జ్యోతిస్సు (చంద్రుని) కొలకేయని చే వారియొక్క సంతానములు గూడ అమితమైన తేజస్సుతో ప్రకాశించినవి (53). మిగిలిన కన్యకలనైతే కశ్యపుడు స్వీక మహాభాగ్యవతులైన యాపదునలుగురు కన్యకలందరును లోకమాతలైరి (54). అదితి, దితి, దనువు, కొలా, అరిష్ట, సురసా వినత, తామ, క్రోధవశ, ఇర, కద్రువ, ముని, ధర్మజ్ఞ అను వారు వీరు. వారియొక్క సంతానమును వినుడు (55). చారిష్ణు మన్వ గడచిపోగా, యే పండ్రెండుగురు పురోగములై వైకుంఠులనువారుండిరో వారు చాక్షుష మన్వంతరమున సాత్ర్యులుగానైరి (56). నీవైవస్వత మన్వంతరము రాగా అదితిచే నారాధింపబడిన యవ్వారు పరస్పరము ఒకచోట గలిసికొని పరస్పరముగా నిట్లనుకొని “ఈ వైవస్వత మన్వంతరమున, యోగము వలన సగము చిత్తముతో ఈ మహాభాగ్యవతియైన యదితినే ప్రవేశించేదము (58 ప్రవేశించి యీమెకు పుత్రులమమగుదము. దాన మనకు శ్రేయస్సు రాగలదు. అదితి నుండి ప్రసవించిన మనకు ఆదిత్యత్వం కలుగగలదు (59). ఈ విధముగా బలికి వారందరు చాక్షుష మన్వంతరమున మరల మారీచుడైన కశ్యపుని వలన (అదితికి) పండ్రి ఆదిత్యులుగ పుట్టిరి (60), శతక్రతువును, విష్ణువును, మరల వైవస్వతమన్వంతరమున నరనారాయణులుగా దేవతలుగా బుల్స్ సూర్యునకు ఉదయాస్తమయములు రెండున్నట్లు, ఆ దేవతలకు గూడ చావుపుట్టుకలున్నవని చెప్పబడినది. బ్రహ్మకును, విష్ణుః మహాత్ముడైన భవునకును అవి కలవనబడినది (62). ఏ కారణమున శబ్దాది లక్షణమైన శ్రేషానుశ్రవికమున (సురలు) సవ ఆకారణముననే ఎనిమిది రూపములైన అణిమాదులందు (సిద్ధులందు) సమర్ధులై యా దేవతలు పుట్టిరి (63) - అని యీ విషయమ ఐహిక విషయములందలి రాగము సంభూతికి (జన్మకు) కారణమనబడినది. బ్రహ్మశాపముచే బుట్టిన జయులు స్వాం మన్వంతరమున జితులైరి (64). స్వారోచిష మన్వంతరమున తుషితులైరి. ఉత్తమమన్వంతరమున సత్యులైరి. తామసమన్వం హరులైరి. చారిష్ణవ మన్వంతరమున నో దేవతలైరి. చాక్షుష మన్వంతరమున వైకుంఠులైరి. ఇప్పటి మన్వంతరము (వైవస్వ మరల సాధ్యులును ఆదిత్యులునైరి (65), ధాత, అర్యముడు, మిత్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు, ఇంద్రుడు, వివస్వ పూష, పదవవాడు పర్జన్యుడు అనబడెను (66). తరువాత త్వష్ట, అజఘన్యుడు (నీచుడుగానివాడు) అజఘన్యజుడు ( బుట్టినవాడునైన విష్ణువు అని యీ పండ్రెండుగురు ఆదిత్యులు కశ్యపునకు సుతులనబడినారు (67). సురభి కశ్యపుని వలన పద రుద్రులను గనెను. మహాదేవు(శివు)ని యనుగ్రహమున తపము చేత 'సతి' కలుగనున్నది (68). అంగారకుడు, సర్పుడు, ని సదసస్పతి, అజుడై యేకపాదుడైన అహిర్భుధ్యుడు, ఊర్ధ్వకేతువు, జ్వరుడు (69), భువనుడు, ఈశ్వరుడు, మృత్యువు, ప్రసి కపాలి - అను నీ త్రిభువనేశ్వరులైన పదునొకండు రుద్రులను సురభి (ఆ) మహాతపముతో జనింపజేసెను (70). తరువాత వేరుగా నిద్దరు కూతులను గనెను. వారు రుద్రకాంతిగల రోహిణియు, యశస్వినియైన గాంధారియును (71). రోహిణియందు ప్ర నలుగురు కన్యలు గలిగిరి. వారు - సురూప, హంసకీల, భద్ర, కామదుమయును, కామదుఘ సురూప పుతీద్వయమును గని హంసకీల నృపుని గనెను. భద్ర ఋషులను గనెను. మహాభాగ్యవంతులై ప్రసిద్ధులైన గంధర్వులు వెజియొక్క పుత్రులు (73). పైకి నిక్కబొడుచుకొన్న చెవులు గల ఉచ్చైశ్రవములు (గుఱ్ఱములు) పుట్టినవి. అవి మనోవేగము గలవి, ఆకాశమున చరిఁ తెల్లనివి, శ్యేనములు (డేగ వలె నెగురునవి), పిశంగములు (కపిల వర్ణము గలవి), సారంగములు (చిత్రవర్ణము గలవి), హరితార్జు (పసుపు తెలుపు వర్ణము గలవి)యును. రుద్రుని వల్లనే వెలుపలికి వచ్చినయవి గంధర్వయోనులైన గుఱ్ఱములు (74). మరల సురభినుండి శ్రీమంతము (శోభావంతము), చంద్రకాంతి వంటి చక్కనీ కొంతీ గలది, పూలదండలు గలది, మూపురము గలది, కాంతి గలది, సముద్రము నుండి బుట్టినదియునైన వృషభము పుట్టినది. అది సురభి యనుమతితో నిచ్చిన మహేశ్వరుని ధ్వజము (75). ఇవ్వీరు కశ్యపసుతులైన రుద్రాదిత్యులుగా జెప్పబడిరి. అట్లే ధర్మపుత్రులు సాధ్యులు విశ్వులు వస్తువులు అనబడిరి (76). ఇట అరిష్టనేమి పత్నుల సంతానములు పదునాలు. బహుపుత్రుడై విద్వాంసుడైన విద్యుత్తునకు నలుగురు సుతులనబడినారు. ప్రత్యంగిరసునకు బుట్టినవారు శ్రేష్టలైన ఋక్కులు బ్రహ్మర్షి సత్కృతములు (77). దేవర్షియైన కృశాశ్వునకు (పుత్రులు) దేవప్రహరణులనబడిరి. వీరు యుగ సహస్రము చివర మరల బుట్టుదురు (78). అన్ని దేవగణములు విప్రములు (బ్రాహ్మణజాతివి). ముప్పదిమూడు స్వేచ్ఛగా జనించినవారు. ఈ దేవతలకు గూడ హద్దుతో గూడిన జననముండుననబడినది (79). ఈ లోకమున సూర్యునకుదయాస్తమయములు రెండుండునట్లే ఈ దేవసమూహములు గూడ ప్రతియుగమున బుట్టుదురు.
ఋషులనిరి :
సాధ్యులు, వస్తువులు, విశ్వేదేవతలు, రుద్రాదిత్యులును మంచివంశముతోను, ప్రభావములతోను, వారి పనులతోను ప్రసీదులు (81). బ్రహ్మయొక్కయు, విష్ణువుయొక్కయు, మహాత్ముడైన శివునియొక్కయు అంతరమును (భేదమును) తెలియగోరుచున్నాము. వారిలో నెవ్వడు ఎవ్వనికంటే గొప్పవాడు? (82) ఎవ్వడు ఎవ్వనికంటే సమర్థుడు? ఎవ్వడు ఎవ్వనియందు ప్రతిష్ఠితుడు? వారిలో నెవ్వడు మిక్కిలి శ్రేష్ఠుడు? మధ్యముడు ఎవ్వడు? కనిష్ఠుడెవ్వడు? (83) వారిలో ప్రధానమైనవాడెవడు? అప్రధానుడెవడు? కర్మలచేతను, మంచివంశము చేతను, ప్రభావముచేతను గొప్పవాడెవడు? నీవున్నది యున్నట్లు తెలిసినవాడవు. ఇదంతయు మాకు జెప్పుము .
సూతుడనెను :
రాజసికి బ్రహ్మయొక్క యంశతో మరీచియైన కశ్యపుడు పుట్టెను. తామసికి ఆ బ్రహ్మయొక్క యంశతో కాలాత్ముడైన పుట్టేనని చెప్పబడినది. సాత్త్వికికి పుషాంశతో యజ్ఞమున నపుడు విష్ణువు కలిగెను (121). మూడు కాలములలో నీత బ్రహ్మయంశమున బుట్టినవి. ఈతడు కాలుడైన రుద్రుడే ప్రజలను సంహరించును (122). కల్పాంతము రాగా సప్తరశి కిరణములు గల) సూర్యుడు ప్రళయాదిత్యుడై యపుడు ముల్లోకములను దహించును (123). నామరూపముల మార్పు జరి. విష్ణువు ప్రజలననుగ్రహించును, పాలించును. ఆయా అవస్థలో (దశలో) ఆయా యుత్పత్తికి కారణమగను (124). సత్త్వగుణో యే బ్రహ్మయొక్క పౌరుషీ తనువు కలదో! దాని యంశతోనీట మొదటి స్వాయంభువ మన్వంతరమున ఆకూతియందు మనసు విభువై దేవుడైన యాతడు (విష్ణువు) పుట్టెను. తరువాత మరల ఆ దేవుడే స్వారోచిష మన్వంతరము రాగా తుషితయందు బు తుషితులతో బాటు గతించెను (126). ఉత్తమ మన్వంతరమున ఆతడు తుషితుడని తెలియుదురు. వశవర్తులతో బుట్టి వశః హరి మరల సత్యయందు (127) సత్యుడై సత్యులయిన సురోత్తముతోబాటు పుట్టెను. తామస మన్వంతరము రాగనే మరల భార్యయందు హరులతో బాటు హరియే పుట్టేనట (128). చారిష్ణవ మన్వంతరమున గూడ మరల ఆతడు హరిదేవుడు. ఈతడు వైకుంఠయందు ఆ భూతరజసులతో బాటు జన్మించెను. చాక్షుష మన్వంతరము రాగనే ఆ వైకుంఠుడే మరల దేవుడు (129). ధర్ముడైన నారాయణుడు సాధ్యుడు సాధ్యులైన సురలతోబాటు పుట్టెను. వైవస్వతమన్వంతరము రాగా ఆ నారాయణుడైతే సాధ్యుడు (దేవజాతివాడు) (130). మారీచుడైన కశ్యపుని వలన అదితియందు విష్ణువు జన్మించెను. ఆవరించు పాదవిక్షేపము గలుగునట్లుగా విష్ణువు తన మూడడుగులతో ఈ లోకములను జయించెను. తరువాత ఆ ప్రభువు (విష్ణువు) వానిని ఇంద్రునకును దేవతలకును ఇచ్చెను - అను నీ యాతని తనువులు గతించిన యేడు మన్వంతరములలో గడచినవి. ఆ తనువుల చేత అప్పటి ప్రజలు రక్షింపబడిరి (132). అందువలననే ఈ లోకమున బుట్టుచున్న వామనునిచేత ఈ సర్వము ప్రవేశింపబడినది. అందువలననే ప్రవేశార్థకమైన ‘విశ్’ ధాతువుతో నేర్పడిన విష్ణు శబ్దముతో బిలువబడెను (133). అను వీరందరు బ్రహ్మకు సంబంధినవారే. మహాత్ముడైన వామనునకు ఏకత్వము, పృథక్యము (వేరుతనము) విశిష్టత్వమును జెప్పబడినవి (134).
ఈ లోకములో నేదేవతలు దేవతాంశతో జన్మింతురో వారికి ఆ దేవతలు బుద్ధిచేతను, శ్రుతము చేతను, బలము చేతను వారియనుగ్రహమున సమానులై జన్మింతురు (135). ఏయే ప్రాణి విభూతి (మహైశ్వర్యము) గలదియు, సిరిగలదియు దృఢమైనదియునగునో ఆ ప్రాణియంతయు విష్ణువు యొక్క తేజోంశముచేతనే పుట్టినదని తెలియుడు (136). ఆతడు (విష్ణువు) ఈ విధముగా కొద్దియంశతో బుట్టునని కొందరు మానవులు తలంతురు. మరికొందరు ఈతనిని అన్యోన్యాంశతో బుట్టినవానిగా జెప్పుదురు (137). ఈ విధముగా వివాదపడుచునే వారిని జూచి యిట్లందురు - మనస్సుకును చిత్తమునకును భేదము లేనందున వారికి అనుగ్రహము గలుగును. దాన వారు క్షేత్రజ్ఞులగుదురు (138). ఒక్కడే యీశ్వరుడు ప్రభుశక్తిచే బహువిధములుగా నగును. అట్లు బహువిధములుగా నయ్యు సౌతడొక్కడేయగును (139). ఆ దేవతల భేదము వలన తేజము నుండి యన్ని మన్వంతరములలోను స్థావరజంగమరూపులైన జన్మింతురు. వారు సృష్ట్యాదిలోనొక్కమారు పుట్టినవారై ప్రశంసతో నిలుతురు (140). కల్పాంతమువచ్చిన ప్రతిమారును రుద్రుడాద్ర సంహరించును. యోగమాయచే నితరులను మోహింపజేయుచు ఈశ్వరులు పుట్టుదురు (141). ఆ యీశ్వరులు ఐశ్వర్యముతో జరి అనీశ్వరులై మోహింపజేయుదురు. కావున దోషప్రచారములలో యుక్తాయుక్తములుండవు (142). భూతమును గురించి చెడుగా జీవ దుష్టులు. భూతమును భావించువారు మధ్యస్థులు. భూతమును చెడుగా జెప్పువారు శక్తులు. ఇవి ప్రవాదులకు (ఎక్కువగా జెప్ప మూడు వేదములు (143). దృఢమయినందువల్లను, పూర్వమైనందునను (ప్రాచీనమైనందునను) శ్రుతమైనందునను (వినబడినండి లౌకిక ప్రదమైనందునను ఈ సోలుగు కారణముల చేత మానవుడు ఒకదానిని ఉన్నదున్నట్లు తెలిసికొనలేడు (144). పూర్వము యర్ధమున నుంచబడినవియు, కాలాంతరమున నున్నవియు, యథార్థముగా తెలియవు. దాని వలన ఉన్న మరియొక్క య గూడ ద్వేషము వలన దెలియడు (145). ధర్మములకు ద్రవ్యభూతుడను, వానిలోగుణభూతుడును, కర్మలకును మనస కర్తయైనవాడును, ఉత్త మవంశముతో గొప్పవాడైనవాడును శ్రుతమును దెలిసిన యీ నాలుగు కారణములచేత బాగుగా కీర్తింపబ (146). అశక్తుడై కోపించినవాడు దేవతలను విభాగపూర్వకముగా దెలియును. ఈ విషయమున యోగేశ్వరుని గూర్చి యీ శ్లోకం జెప్పుదురు (147). యోగబలమును బొంది తన ప్రతిరూపములను ఇతరులకు వేలప్రతిరూపములుగా జేసి వాటి అన్నింటిక ప్రవర్తింపవలెను. విషయములను (రూపరసగంధ స్పర్శల సుఖములను) పొందవలెను. అట్లే ఉగ్రమైన తపము జేయుచు సూర్య గుణములను వలె సంరింపవలెను (148).
ఇది శ్రీవాయుమహాపురాణమున కాశ్యపీయ ప్రజాసర్గమను నైదవ యధ్యాయము సమాప్తము.
