వాయు మహా పురాణము

Table of Contents

4 -  సృష్టి ప్రకరణము

నైమిషారణ్య ములో నివసించే ఆ మహర్షులందరు సూతుని మాటలను విని, ఉత్కంఠతో నిండిన కన్నులు గలవారై, సూతునితో నిట్లనిరి నీవు పురాణములో సమర్థుడవు. వ్యాసుని నుండి సాక్షాత్తుగా ఆ జ్ఞానమును పొందినవాడవు. కావున నీవు ఈ లోకము యొక్క పూర్వ స్థితిని వర్ణింపుము ఏయే వంశములకు చెందిన మహాత్ములు ఎవరెవరు? అను విషయమును, పూర్వ ఋషుల సృష్టిని, ప్రజాపతి యొక్క విచిత్రమగు సృష్టిని తెలియగోరుచున్నాము. మహాత్ములు లోమహర్షణుడు అనేక పర్యాయములు వారిచే కోరబడిన వాడై పురాణమును విస్తరముగా, సరియగు క్రమములో చెప్పెను.

 లోమహర్షణుడిట్లు పలికెను:- మీరు దివ్యము, మధురము, పాపనాశనము అగు కథను కోరితిరి. నేను చిత్రము, అనేకార్థములు గలది, వేద సమ్మతమునగు పురాణమును చెప్పెదను-5. దీనిని ఎవరైతే తమ బుద్ధిలో నిత్యము ధారణ చేస్తారో; ఎవరైతే దీనిని మలర మరల వింటారో, ఎవరైతే మనోనిగ్రహముతో శుచిగా నుండి దీనిని పర్వదినములలో పుణ్యక్షేత్రముల యందు, దేవాలయముల యందు విప్రులకు, విశేషించి యతులకు వినిపించెదరో, అట్టి వారు దీర్ఘాయుర్దాయమును పొందెదరు మరియు, ఈ పురాణమును పఠించువారు ఈ లోకములో తమ వంశమును నిలిపి, స్వర్గలోకములో మహిమను గాంచెదరు. ఈ పురాణము చాల విశాలమైనది. దీనిని నేను ఉన్నది ఉన్నట్లుగా, వీన్నది విన్నట్లుగా కీర్తించేదను. శ్రద్దతో విని తెలియుడు. ఇది అందరికీ కీర్తిని పెంచి, ధన్యులను చేయును. శత్రువులను నశింపజేసి, ఆయుర్దాయమును పెంపొందించును. స్వర్గఫలము నిచ్చును.

శాశ్వతమగు కీర్తిగల పుణ్యాత్ములందరి చరితము దీనియందు వర్ణింపబడును. సృష్టి అవాంతర సృష్టి లేదా ప్రళయము, దేవాదుల వంశములు, మన్వంతరములు, రా? వంశములు అను అయిదు విషయములు పురాణములో వర్ణింపబడును. పావ నములగు వాటిలో కెల్లా పావనమైనది. వేదమునకు అనురూపమైనది యగు వాయు పురాణమును నియమము, శుచిగలవాడనై నేను ప్రవచించెదను. సృష్టి స్థితి ప్రళయములు, పరమాత్మ నిద్ర లేచుట అను అంశములు, మొదటి దగు ప్రక్రియాపాదములో వివరింపబడును. ఇదిగాక, ఉపోద్ఘాత, అనుషంగ, ఉపసంహార పాదములు కూడా గలవు-13. ధర్మ బోధకము, కీర్తిదాయకము, ఆయుర్వర్ధనము, సర్వపాపహరమునగు ఈ పురాణములోని నాలు పాదములను నేను సంగ్రహముగా చెప్పితిని.

ఈ పాదములను నేను మరల క్రమములో విస్తారముగా నుడివెదను. పూర్ణ స్వరూపుడగు ఈశ్వరుని, జగత్ర్పథముడగు హిరణ్య గర్బుని, జగత్తును సంహరించు శివుని, ప్రాణి రూపముగా ప్రకటితమయ్యే పరమాత్మను, జగత్సృష్టికి మూలము, స్వయంభువునగు బ్రహ్మగారికి నమస్కరించెదను. మహత్తు (సమష్టి బుద్ది) ఆదియందు, పరమాణు విశేషములు అంతము నందు కల్గినట్టియు, వివిధ రూపములు, లక్షణములు కలిగినట్టియు, పరమాత్మచే అధిష్ఠింపబడి యున్న సాటిలేని ప్రాణి సృష్టిని సంశయ నివారణ యగునట్లు ప్రవచించెదను. జగత్కారణము అవ్యక్తము అది నిత్యము కారణము అదియే. కార్యము అదియే. తత్వవేత్తలు దానిని ప్రధాన మనియు, ప్రకృతి అనియు వ్యవహరించెదరు. మరియు దాని యందు రుచి, వాసన, రంగు, శబ్దము, స్పర్శలు లేవు. దానికి పుట్టుక, నాశము లేవు. అది నిత్యము, స్థిరము, సనాతనము (త్రికాలా బాధితము) అగు ఈ ప్రధానము తనకు తాను ఆశ్రయముగా కలిగియుండును. ఇదియే జగత్కారణము ఈ ప్రధానము కూటస్థ (నిర్వికార) పరబ్రహ్మ యొక్క స్వరూపమ.

ఆద్యంతములు లేనిది, పుట్టుక లేనిది, ఇంద్రియ గోచరము కానిది (సూక్ష్మము), త్రిగుణాత్మకమునగు అవ్యక్తమే సర్వప్రాణుల దేహములుగా పరిణమించినది అవ్యక్తము బ్రహ్మ కంటే ముందు ఉండెను. అప్పుడది ఇప్పటి వలె ఇంద్రియగోచరము కాని సూక్ష్మావస్థలో నుండెడిది. అప్పుడు ఈ జగత్తు అంతా తమోగుణరూపముగా అవ్యక్తముచే వ్యాప్తమై యుండెను. సృష్టి కాలమునందు ఆ ప్రధానము (అవ్యక్తము) క్షేత్రజ్ఞుని (పురుషుని) చే అధిష్ఠితమై, త్రిగుణముల సామ్యావస్థా రూపములో నుండెను. తమోగుణము ప్రముఖముగా నుండెడిది కాద. ప్రధానము గుణముల సామ్యావస్థ నుండి వైదొలగుటచే, మహత్తు పుట్టెను. అవ్యక్త పరిణామమగు ఆ మహత్తు సూక్ష్మ రూపములో నుండెను. మహత్తు నందు సత్య గుణము అధికముగా నుండుటచే, అది ప్రకాశరూపమై యుండెను. సమష్టి బుద్ధి యగు మహత్తు నుండి వ్యష్టి బుద్ధి జనించెను.

 క్షేత్రజ్ఞుని (పురుషుని) చే అధిష్ఠింపబడిన ఆ సమష్టి లింగదేహము (మహత్తు) పుట్టెను. జగత్తులోని పదార్థముల సృష్టికి మూలమైన ధర్మము మొదలగు వాటి రూపములు దాని యందు నిహితమై యుండెను. సృష్టించాలనే కోరికచే ప్రేరితమైన మహత్తు సృష్టిని చేయును. మనస్సు, మహాన్, మతి, బ్రహ్మ, పురము, బుద్ధి, ఖ్యాతి, ఈశ్వరుడు, ప్రజ్ఞ, చితి, స్మృతి, సంవిత్, విపురసు అను పేర్లతో విద్వాంసులు దానిని వ్యవహరింతురు. సర్వవ్యాపకమగు మహత్తు సర్వప్రాణుల విస్తారమగు కర్మ ఫలమును, తెలుసుకొనగలిగే సూక్ష్మమగు బుద్దిగలది గనుక, దానికి మనస్సు అని పేరు వచ్చినది. మహత్తు తత్త్యములు (సాంఖ్య పరిగణిత పదార్థములు) అన్నింటిలో ముందుగా పుట్టెను. మరియు అది మిగిలిన తత్యములన్నింటి కంటే పరిమాణములో పెద్దది. అందువలన దానికి మహాన్ అని పేరు వచ్చెను.

మహత్తు పురుషునికి లభించే భోగము యొక్క పరిమాణమును, వివిధ పురుషుల భోగములలోని విభాగమును నిరూపించును. కావున అది మతి అనబడును. ఈ మహత్తు గొప్ప పరిమాణము గలది. మరియు సృష్టి కాలములో దాని నుండి మహా శబ్దము వెలువడును. అంతే గాక, మహత్తు, సర్వప్రాణుల రూపములో విస్తారము చెందును. కావున, అది 'బ్రహ్మ' యనబడును మహత్తు తన అనుగ్రహములను ప్రాణుల దేహములపై ప్రసరింపజేసి, ఆ పాంచ భౌతికశరీరములను వ్యాపించి యుండును గనుక, దానికి పురము (పూరించునది) అని పేరు వచ్చినది. పురుషుడు ఈ మహత్తు నందు తనకు ఇష్టానిష్టములగు పదార్థములనన్నిటినీ దర్శించును. పురుషునకు అట్టి బోధను కలిగించును గనుక, మహత్తునకు బుద్దిఅను పేరు గలదు. పురుషుని భోగము జ్ఞానరూపమున నుండును. పురుషునికి వివేకము, భోగము కూడా మహత్తు నుండి సంప్రాప్తమగును. కావున, మహత్తునకు ‘ఖ్యాతి' అను పేరు గలదు. మరియు, మహత్తు అనేక నామములచే, గుణములచే కీర్తింపబడును. ఆ కారణము చేత కూడా, దానికి ఖ్యాతి' యను పేరు వచ్చేను.

మహత్తు వలననే పరమాత్మ సర్వజ్ఞుడైనాడు. మహత్తు నుండి యే గ్రహములు పుట్టినవి. కావున, దానికి ప్రజ్ఞ' అని పేరు. పురుషుడు ఆచరించే యజ్ఞాది కర్మలకు ఫలములైన భోగములను, మహత్తు పురుషునకు సంక్రమింప జేయును. మరియు పురుషునకు జ్ఞానప్రకాశము నిచ్చును. కావున, మహత్తునకు 'చితి' యని పేరు వచ్చినది. పురుషుడు భూత, వర్తమాన, భవిష్యత్కార్యములనన్నిటిని స్మరించగలుటలో మహత్తు హేతు భూతమైనది. కాన, ఇది . స్మృతి యనబడును. పురుషుడు పొందే సర్వ జ్ఞానమునకు మూలము మహత్తు. కాన, దానికి మాహాత్మ్యము అని పేరు. పురుషుడు జ్ఞానము నంతనూ మహత్తునందు పొందుటచే, దానికి 'సంవిత్' అని పేరు వచ్చినది. సర్వము దాని యందున్నది. అది సర్వమునందున్నది. ఈ కారణము చేత గూడా పండితులు మహత్తును 'సంవిత్' అని పిలుతురు. మహత్తు జ్ఞానరూపము. భగవానుడు జ్ఞానమునకు సన్నిధిలో నుండును. మహత్తు స్త్రీ పురుష ద్వంద్వ రూపములో విపులమగు

జగద్రూపముగా విస్తరించుటచే, పండితులు దానిని విపుర(ల)ము అని వర్ణింతురు.

ఈ సర్వ జగత్తును శాసించు పరమాత్మ సర్వవ్యాపకుడు గనుక, బ్రహ్మయని నిర్దేశింప బడును. ఉనికి ఆయన స్వరూపము గనుక, ఆయన భవుడనబడును క్షేత్రము (దేహము), క్షేత్రజ్ఞుడు (పురుషుడు) అను వాటి సత్యము నెరింగినచో, బ్రహ్మ మొక్కటియే సర్వముగా భాసించుచున్నదని స్పష్టమగును. కావున, ఆ పరమాత్మకు 'కః' (ఒక్కటే) అని పేరు. దేహమనే నగరము నందు నివసించును గాన, పరమాత్మకు పురుషుడని పేరు. పరమాత్మకు పుట్టుక లేదు; పరమాత్మ సనాతనుడు; కావున, ఆయనకు స్వయంభువు అని పేరు. ఈ తీరున, సర్వోత్కృష్టము, సర్వాదియగు ఈశ్వరతత్యము, తత్యజ్ఞులగు ఋషులచే అనేక పదములతో పిలువబడును. (అట్టి ఈశ్వరునిచే అధిష్ఠింపబడిన) మహత్తు సృష్టించ వలెననే కోరికతో ప్రేరితమై, వివిధ రకములుగా సృష్టిని చేసెను.

మహత్తు నందు సంకల్పము, అధ్యవసాయము (నిశ్చయము) అను రెండు వృత్తులు గలవు. జగత్తులో పదార్థ తత్యములకు కారణమైన పదార్థ ధర్మములు, రూపములు మహత్తునందు గలవు. అది సత్యము, రజస్సు, తమస్సు అను మూడు గుణములను కలిగి యుండును. ఆ త్రిగుణాత్మకమగు మహత్తు నందు రజోగుణము అతిశయించి, అహంకారము పుట్టెను. ఈ సృష్టి మహత్తుచే వ్యాప్తమై యున్నది. భూతములకు ఆదియగు మహత్తు యొక్క వికారమే అహంకారము. దాని యందు తమే గుణము అతిశయించి భూతతన్మాత్రలు (భూత సూక్ష్మములు) పుట్టినవి. ఈ భూతతన్మాతలు భూతాదియగు అహంకారము యొక్క తామస వికారములు. తరువాత శబ్దము గుణముగా కలిగిన, అవకాశాత్మకమగు ఆకాశము అహంకారము నుండి జన్మించెను.

భూతాదియగు అహంకారము శబ్ద గుణకమగు ఆకాశమును వ్యాపించెను. అపుడు శబ్దతన్మాత్ర స్పర్శతన్మాతన సృజించెను. భూతాది ఇట్లు వికృతిని పొంది శబ్దతన్మాత ఆయెను. ఆకాశము నుండి స్పర్శ గుణము కలిగిన, క్రియాశక ప్రధానుడగు వాయువు జన్మించెను. శబ్దతన్మాత్ర స్పర్శతన్మాత యందు వ్యాపించెను. రసము గుణముగా గల జలములు. వాటి యందు రూపతన్మాత్రలు వ్యాపించెను. రసాత్మకమగు జలములు వికారమును పొంది గంధ తన్మాత్రన సృష్టించినవి. జలముల నుండి పుట్టిన ఘన రూపమగు పృథివికి గుణము గంథమని చెప్పబడినది. జల గుణమగ రసతన్మాత్ర గంధతన్మాత యందు వ్యాపించెను. ఇట్లు ఆయాతన్మాత్రలు వికారమును పొంది, ఆయా గుణములు గల పంచభూతములు పుట్టెను. ఆయా గుణములు ఆయా భూతములకు అసాధారణములగుటచే తన్మాత్రలనబడును 

ఈ తన్మాతల యందు శాంత (సుఖానుభవము), ఘోర (దుఃఖానుభవము), మూఢ (అజ్ఞానానుభవము) అన విశేష లక్షణములు లేకపోవుటచే, వాటికి అవిశేషములని పేరు వచ్చెను. ఈ విధముగా భూతములు, భూత తన్మాత్రల తామసాహంకారము నుండి ఉద్భవించినవి. సత్య గుణము అతిశయించిన సాత్వికాహంకారము నుండి , ఏకకాలమునంద అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు కర్మేంద్రియములు పుట్టినవి. పురుషునకు ఇంద్రియములు కార్యసాధకములగ చుండును. జ్ఞానేంద్రియములు, పదకొండవది యగు మనస్సు (ప్రకాశరూపములగుటచే) “దేవ' అనబడును. ఈ విధముగా వికార రూపమగు ఈ జగత్తు ఆవిర్భవించినది. ఇంద్రియములు రాజసాహంకారము నుండియు, తదధిష్టాన దేవతల సాత్యిక అహంకారము నుండియు పుట్టినవి అని కూడా చెప్పవచ్చును.

చెవులు, చర్మము, కన్నులు, నాలుక మరియు ముక్కు అను అయిదు జ్ఞానేంద్రియములు మనస్సుతో గూడి శబ్దాది విషయములను గ్రహించును. పాదములు, పాయువు, ఉపస్థ, హస్తములు మరియు వాక్కు అనునవి అయిదు కర్మేంద్రియములు కలిసి వెరసి పది అయినవి. అవి క్రమముగా గమనము, విసర్జనము, ఆనందము, చేతి పని మరియు మాటలాడుట అను క్రియలను నిర్వర్తించును ఆకాశములోని శబ్దతన్మాత స్పర్శమాత్రలో ప్రవేశించుటచే, వాయువునకు శబ్దము, స్పర్శ అను రెండు గుణములు కలిగెను. అటులనే, శబ్దస్పర్శలు రెండు రూపమును ప్రవేశించుటచే, అగ్నికి శబ్ద, స్పర్శ, రూపములనే మూడు గుణములు కలిగెను.

శబ్ద స్పర్శ రూపములు రసతన్మాతను ఆవేశించుటచే, రసాత్మకములగు జలముల యందు నాలు గుణములు గలవు . ఈ నాలు గుణములు గంధమాత్ర యందు సమావేశమై పృథివి యందున్నవి. అందువలన స్థూలభూతములలో పృథివి యందు ఐదు గుణములు గలవు. ఈ పంచ భూతములలో శాంత, ఘోర, మూఢములను గుణములు ఉండుటచే వాటికి విశేషములు అని పేరు. ఈ భూతములు ఒక దానితో మరియొకటి కలిసి, ఒకదానికి మరియొకటి ధారకములగుచున్నవి. లోకాలోక పర్వతముతో సహా ఈ సర్వము భూమియందంతర్భాగములై యున్నవి.

పంచభూతములలో ప్రతి భూతమునకు ప్రత్యేకముగా తనదైన విశేషము (అసాధారణ గుణము) ఉండును. ఆయా విశేషములు ఇంద్రియములకు గోచరమగును. ఆకాశము నుండి పృధివి వరకు క్రమముగా ముందు వాటి గుణములు తరువాతి వాటికి సంక్రమించును. కాని, ఒక విశిష్ట భూతము తన అసాధారణ గుణము చేతనే గుర్తింపబడును." కొందరు శుచియగు వాయువును పొంది, అవివేకముచే గంధము వాయుగుణమని పొరబడుదురు. వాస్తవంలో, పృథివీ గుణమగు గంధము వాయువునకు పృథివీ సంపర్కము వలన కలిగినది. ఈ ఏడింటిలో ప్రతి ఒక్క తత్యము గొప్పదీయే 69. కాని, అవి విడివిడిగా ఇతర తత్త్యములతో కలియకుండగా ప్రజలను, ఇతర ప్రాణులను సృష్టింపలేకపోయినవి. ఈ గొప్ప తత్యములు ఒక దానితో మరియొకటి దగ్గరగా వచ్చినవి. మరియు, పురుషునిచే అధిష్ఠింపబడినవై, మహత్తు మొదలుకొని విశేషముల (పంచ భూతముల అసాధారణ గుణములు) వరకు గల ఈ తత్త్యములు అవ్యక్తము (ప్రకృతి) యొక్క అనుగ్రహముచే అండమును సృష్టించును.

నీటినుండి బుడగ పుట్టిన తీరున విశేషముల నుండి పెద్ద అండము ఒకటి క్షణ కాలములో పుట్టి మహాజలరా యందు ఉండెను. ఈ విధముగా సృష్ట్యాదిలో ప్రకృతి నుండి అండము ఉద్భవించగా, పరబ్రహ్మయని పేరుగాంచి క్షేత్రజ్ఞునకు జగత్కర్తృత్వము సిద్ధించెను. క్షేత్రజ్జునకు పురుషుడనియు పేరు గలదు. సృష్ట్యాదిలో సర్వ జీవులను సృష్టించి ప్రథమ జీవుడగు బ్రహ్మగారు మున్ముందుగా జన్మించెను పర బ్రహ్మమని పిలువబడే క్షేత్రజ్ఞుడు ముందుగా నాల ముఖములు గల హిరణ్య గర్భుని రూపములో ప్రకటమయ్యెను. ప్రాణులు సృష్ట్యాది యందు ఇంద్రియములతో కూ సృజింపబడుదురు. వారు (ఆత్యంతిక, మరియు ప్రాకృతిక) ప్రళయములో దేహములను విడిచి పెట్టుదురు. నూత సృష్టియందు, తన్మధ్యకాలము నందు కూడ వారు మరల దేహములను పొందెదరు.

గొప్ప ప్రమాణముగల ఆ అండమునకు బంగరు మేరు పర్వతము పిండముగా నుండెను. సముద్రములే గర్బములో నీరు ఆయెను. పర్వతములు ఎముకలాయెను. ఈ ఏడు లోకములు ఆ అండమునందు అంతర్భాగములై ఉండెను ఏడు ద్వీపములతో, ఏడు సముద్రములతో మహోన్నతమగు పర్వతములతో, మరియు వేలాది నదులతో కూడిన ఈ భూమి, ఈ లోకములు, ఈ బ్రహ్మాండము సర్వము ఆ అండములోపల నుండెను. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములు గ్రహములు, వాయువు, లోకాలోక పర్వతము, ఇతరము సర్వము ఆ అండములోపల ఇమిడి యుండెను .

ఆ అండము చుట్టూ (దానికంటే) పదిరెట్లు నీరు, నీటి చుట్టు పదిరెట్లు అగ్ని ఆవరించి యుండెను. తేజస్సు చుట్టూ పది రెట్లు వాయువు, వాయువు చుట్టూ పదిరెట్లు ఆకాశము ఆవరించి యుండెను. ఆకాశము అహంకారము చేత, అహంకారము మహత్తు చేత, మహత్తు అవ్యక్తము చేత ఆవరింపబడి యుండెను. ఇట్లు ఆ అండము ఏడు ప్రకృతి వికారములచే ఆవరించబడి యుండెను. ఇట్లు ఆ ఎనిమిది (అండముతో సహా) ప్రకృతి వికారములు ఒక దానిని మరియొకటి ఆవరించి యుండెను.

ఇవి స్థితి కాలము నందు ఈ తీరున ఉండి, ప్రళయములో ఒక దానిని మరియొకటిగా కబళించి వేయును. ఇట్లు ఇవి ఒక దాని నుండి మరియొకటి పుట్టి, ఒక దానిని మరియొకటి ధరించియున్నవి. ప్రకృతి వికారములగు ఈ తత్త్య ములు ఈ విధముగా ఒక దానిపై మరియొకటి క్రమముగా ఆధారపడియున్నవి. అవ్యక్తము (ప్రకృతి) నకు క్షేత్రము అనియు, బ్రహ్మకు క్షేత్రజ్ఞుడనియు పేరు. ఈ విధముగా క్షేత్రజ్ఞునిచే అధిష్ఠింపబడిన జగత్సృష్టి పూర్వము సంకల్పము యొక్క సంబంధము లేకుండగనే మెరుపువలె సంభవించేను. ఈ హిరణ్యగర్భుని జన్మయొక్క తత్యము నెరింగిన మానవుడు ఆయుర్దాయమును, కీర్తిని, సంతానమును పొంది, ధన్యుడగును. మోక్షకాముడగు మానవుడు కూడా ఈ పురాణమును నిత్యము వినుట వలన, అంతః కరణ శుద్ధిగలవాడై, సుఖమును, క్షేమమును, పరమగతిని కూడా పొందును.

శ్రీవాయు మహాపురాణములో సృష్టి ప్రకరణము అను నాల్గవ అధ్యాయము ముగిసెను.