వాయు మహా పురాణము
56 - పితృవర్ణనం
శాంశపాయనుడనెను:- ఓ సూతా! ఇలా పుత్రుడైన పురూరవుడను రాజు ప్రతి నెలలో నమావాస్యనెట్లు పొందెను? పితురులకెట్లు తర్పణము జేసెను?
సూతుడనెను:- ఓ శాంశపాయనా! ఆపురూరవుని ప్రభావమును జెప్పెదను అట్లే ఇలా పుత్రుడైన పురూరవునియొక్కయు ఆదిత్యునియొక్కయు సంయోగమును అట్లే పురూరవుని యొక్కయు మహాత్ముడైన సోముని (చంద్రుని) యొక్కయు యోగమును దెలిపెదను. నీటిసారమై యమృతమునుండి చంద్రుని యొక్కయు వృద్దులు, కృష్ణశుక్ల పక్షములు, పితృపక్ష నిర్ణయము. చంద్రుని నుండి యమృతములభించుట పితురుల తర్పణము. అట్లే కావ్యాన్ని నుండి (శుక్రాగ్ని నుండి) పొందిన సోమరసముగల పితరుల దర్శనము. ఇలా పుత్రుడైన పురూరవుడు పితృతర్పణము జేసిన విధము ఇదంతయు జెప్పెదను. వరుసగా ఆ పర్వములను గూడ జెప్పెదను. చంద్ర సూర్యులోకే నక్షత్రమున (తో) ఒక రాత్రి- ఒక మండలమునందు కలిసియున్నపుడు అమావాస్యలో నివసింతురు. అపుడా పురూరవుడు సూర్యచంద్రుల జూడబోవును. అపుడచట అభివాదనము జేసీ (నమస్కరించి) కాలమున పేక్షించినవాడై వేచియుండును. ఇలాపుత్రుడై విద్వాంసుడైన పురూరవుడు పితృదేవతలకై (యమృతమును పరిస్రవించుచు) క్షీణించుచున్న చంద్రుని నుండి (కృష్ణపక్షమున) యమృతము స్రవించుటవలన పితృమంతుడైన చంద్రునిని పురూరవుడు పగటిలోనున్నవాడై ప్రతిమాసమున నుపాసించును. రెండు లవములకాలము (లవమనగా కనరెప్పపాటు కాలములో నాఱవ వంతుకాలము) చంద్రకళలేని (కుహువు) అమావాస్యనంతయు ఆ చంద్రసూర్యులనిద్దరిని విచారించి యాతడు (పురూరవుడు) సినీవాలి (చంద్రకళతో గూడిన యమావాస్య) ప్రమాణముతో సినీవాలినుపాసించువాడయ్యెను. కుహువు విషయముననైతే అమావాస్యగామాత్రము చంద్రకళను దెలిసికొని (చంద్రకళలేని యమావాస్యనుగా దెలిసికొని) కుహువునే యుపాసించును. అపుడాతడు (పురూరవుడు) సూర్యునియందే (చంద్రసూర్యులను) ఏకకాలమున జూడదలచి బాగుగా జూచును చంద్రుని నుండి పదియైదు (శుక్లపక్ష దినముల) సుధామృత పరిసవములచే మాస తృప్తికొరకు సుధామృతమెందులకు (ఎక్కడినుండి) ప్రసవించును?. కృష్ణపక్షమున ఆ విధముగా (సూర్య) కిరణములచే పితుకబడుచున్న చంద్ర సుధామృతమును త్రాగి వెంటనే యా చంద్రసంబంధమైన మధువుచే (యాశుక్ల పక్షమునందు (కుజేయుటకు) ఆసక్తి గలుగును (కావున సుధామృతము ప్రసవించును. ఆ రాజశ్రేష్ఠుడు నిర్వాపణమునకై పైతృకవిధితో నీయబడిన సుధామృతముతో పితురులను తర్పణములతో సంతృప్తిపరచుచుండును. సోమసంబద్దులైన బర్హిషదులను (దర్భలపై గూర్చుండు వారిని) కావ్యాన్నిష్వాత్తులను గూడినట్లే తృప్తిపరచుచుండెను. అగ్నియని చెప్పబడిన ఋతువు సంవత్సరముగా సమ్మతమైనది. దానినుండి ఋతువులు జనించినవి. ఋతువులనుండి యార్తవములు బుట్టినవి. ఆర్తవములు అర్థమాసములనబడునవి. పితరులు సంవత్సరపుత్రులు. ఋతువు పితామహులైన మాసములు ఋతువే సంవత్సర పుత్రులు-15. ప్రపితామహులు దేవతలు. ఐదు సంవత్సరములు బ్రహ్మయొక్క కుమారులు సోమునకు బుట్టినవారు సౌమ్యులు. కవి కుమారులు కావ్యులు. ఉపహూతులు దేవతలనబడిరి. ఆజ్యవులు (నేయిద్రావువారు) కావ్యులనబడిరి. ఈ పితృజాతులందరును తృప్తిబొందుదురు. ఆ పితృజాతులు కావ్యులనియు బర్హిషదులనియు అగ్నిష్వాత్తులనియు మూడు విధములుగానున్నారు. యజ్వానులైన గృహస్థులు ఋతువయి నిశ్చయముగా బర్హిషదులగుదురు. యజ్వానులైన గృహస్థులు, అగ్నిష్వాత్తులు, అట్లే యార్తవులు, అష్టకాపతులు, కావ్యులును పంచాబ్దులు వారిని గూర్చి వినుడు.
వీటికి అగ్ని సంవత్సరము సూర్యుడు పరివత్సరము. సోముడు ఇద్వత్సరము. వాయువు అనువత్సరము అనబడినారు. యుగాత్మకములైన యైదు అబ్దములకు రుద్రుడు వత్సరము. వారు లేఖులు (దేవతలు) అగ్నులును దివాకీర్త్యులు (పగలు కీర్తింపదగినవారు) అనబడినారు. వీరు ప్రతిమాసమున నాకాశమునందు అమావాస్యగా అమృతము ద్రావుదురు. ఆ కారణముచేత పురూరవుడు తానున్నంతవరకు వారినమృతముచేత తృప్తిజెందజేయుచుండెను.
ప్రతి మాసమున సోముని (చంద్రుని) నుండి స్రవించుటవలన అది సోమపాయులైన పితరులకు సుధామృతమైనది . ఈ విధముగా సోమ సంబంధియైన యాయమృతమును సుధా, మధువును కృష్ణపక్షమున పదియైదు చంద్రకళలవలె వరుసగా చంద్రమునబుట్టి జలమయులైన ముప్పది ముగ్గురు దేవతలు ద్రాగుదురు. ఆ విధముగా నెలరోజులు సుధామృతమును ద్రావి చతుర్దశినాడు వెళ్లుదురు. ఈ విధముగా దేవతలచే ద్రాగబడుచు చంద్రుడు పదియైదవ భాగముననున్నవాడై యమావాస్యను జేరును. ఆ పితరులు సుషుమ్నయను సూర్యకిరణములచే తనివి జెందిన (నిండిన) సుధామృతమును యథా క్రమముగా అమావాస్యయందు (గా) ముప్పదియారు రెప్పపాట్ల కాలము ద్రావుదురు. తరువాత చంద్రుడు త్రాగబడి క్షీణింపగా ఈ సూర్యుడు సోమపాయులుగా (చంద్రుని ద్రాగు) పితరులకై సుషుమ్నమనునొక కిరణముచేత సుధను నింపి సంతృప్తిపరచెను. (చంద్ర) కళనిఃశేషముగా మరల చంద్రుని (సుధాకళలతో) నింపి సంతృప్తి పరచెను. దినక్రమమునుబట్టి ప్రతిభాగము సుషుమ్నమను సూర్యకిరణములతో నమృతకళలు నింపబడుచున్న చంద్రుని శుక్ల పక్షకళలు నింపబడుచున్నవి. ఆ కృష్ణపక్షకళలు క్షీణించుచున్నవి. ఈ విధముగా సూర్యుని వీర్య (బల)ముచే చంద్రుని శరీరము (సుధాకళలతో) నిండి సంతృప్తిజెందబడినదగును. కావున పూర్ణిమయందు తెల్లనివాడై నిండిన మండలము (బింబము) గలవాడై కనబడును. శుక్ల కృష్ణపక్షములలో చంద్రుని సంసిద్ది యీవిధముగా నుండును. అని యీ చంద్రుడు పితృమంతుడుగా (పితృదేవతలుగలవాడుగా) జెప్పబడినాడు. పదీయైదు సుధామృత పరిసవములచేత క్రమముగా జేరినవాడై ఇద్వత్సరముగ గూడ జెప్పబడినాడు.
ఇక, చెఱకును వెదురునకును గ్రంథులు (ముడులు) గల సర్వములు (కునుపులు) ఉండినట్లు, పర్వములను అట్లే పర్వసంధులను జెప్పెదను. అర్థమాసపర్వములు శుక్ల-కృష్ణ పక్షములుగా పెద్దలు తెలియుదురు. పూర్ణిమా. అమావాస్య అనునవి గ్రంథులు సంధులును అనబడును. అర్ధమాసములు పర్వములు. అవి తృతీయా తిథి మొదలుకొని (పూర్ణిమ అమావాస్యల వరకున్న భాగము) యుండును. సాయంకాలమునను ప్రతిపత్తిథియందును పర్వసంధులందు అగ్న్యాధానక్రియ చేయబడునుగాన ఆకాలము పౌర్ణమాసికము. వ్యతిపాతమున సూర్యుడుండగా యుగాంతరమున చంద్రునకు లేఖోర్థమగును. సూర్యుడు యుగాంతరోదితుడైనను చంద్రునకు లేఖోర్ధ్వమగును-35. వ్యతీపాతమున పూర్ణిమయందు చంద్రసూర్యులు పరస్పరము జూచుకొన్నపుడు ఆకాలము సీమాన్తమున వ్యతీపాతమేయగును. సూర్యుని జెప్పు కాలమానమును జూచీ సంఖ్యముందుకు బోవును. అది క్రియాకొలము. అది కాలమువలన వెంటనే విధింపబడును. పూర్ణ (శక్ల పక్షమున పూర్ణచంద్రుని రాత్రిసంధులలో పూర్ణిమ యుండును. పితరులు దేవతలతోబాటు ఆ పూర్ణిమను జూతురు. కావుననే మొదటి పూర్ణిమ అనుమతి యనబడినది. (చతుర్దశితో గూడిన పూర్ణిమయనుమతి) పూర్ణిమయందు చంద్రుడు మిక్కిలి ప్రకాశించును. చంద్రునియొక్క రంజనమువలన (కళలచే పూర్ణముగానుండే పూసినట్టుగా నుండి నందున కవులు ఈ సర్వ కళాసంపూర్ణుడైన చంద్రుడు గల పూర్ణిమ 'రాకా' యని తెలియుదురు. చంద్ర సూర్యులు గూడి యొకే నక్షత్రమందు ఒక పదియైదవ (పంచదశి)రాత్రియంతయు నున్నందున అది యమావాస్యయనబడినది-40. ఇక తరువాతి (శుక్ల) పక్షము యొక్క పూర్ణిమయందు (అన్ని) కళలతో చంద్రుడు వ్యక్తుడగును వ్యతీపాతమున పగటియందు పూర్ణమై యున్నప్పుడును అపరాష్ట్రమునందును చంద్రసూర్యులు పూర్ణాత్ములై పరస్పరము జూచుకొన్నప్పుడు పూర్ణిమ యగును. చంద్రసూర్యులు ఒకచోటజేరి పరస్పరముగా విచ్చిన్నమైన యాయమావాస్యను జూచినపుడు అది 'దర్శ' (సూర్యేందు సంగమము) మనబడును. పర్వసంధుల యమావాస్యలో రెండేసి లవముల (ముప్పదియాఱుకనురెప్పపాట్లు) కాలము రెండక్షరములుగా ‘కుహు’ (చంద్రకళలేని యమావాస్య)గా జెప్పబడినది. చంద్రుడులేని యమావాస్య (కుహువు) మధ్య సూర్యునితో గలిసియుండును.
చంద్రుడు రాత్రి సగముతోగూడిన పగటితో సూర్యునిబొంది, వెంటనే సూర్యునితో విముక్తిని బొంది ప్రాతఃకాలోత్సవము గలవారగుదురు. వారిసంగమము రెండు కాలములు. రవి మధ్యాహ్నమున బడును. శుక్లపక్షము యొక్క ప్రతిపత్తు (తిథి) సూర్యమండలమునుండి మొదటి విడిపడుచున్న మండలముల మధ్యనున్న చంద్రుడు అగును. అప్పుడది సూర్యేందు సంగమరూపమైన దర్శ (అమావాస్య) యొక్క కాలము. వషత్రియయు అగుచున్నవి. దీనిని ఋతువు యొక్క ముఖము (ప్రారంభము) గా దెలియవలెను. అది యీ పర్వదినము యొక్క అమావాస్యా రూపమైనది-46. క్షీణచంద్రుడు గల బహుల పక్షమున పగటి పర్వమునందు అమావాస్యను గ్రహింతురు. కావుననే సూర్యుడు పగలే యమావాస్యను గ్రహించును. ఇందువలననే దేవతలచేత నమావాస్యను గూర్చి పగలే గ్రహింపబడుచున్నది. ఆకళలయొక్క స్థితి బహుమానింపదగినది. అజడాత్మకులైన పండితులచే తిథులయొక్క నామధేయములు గూడ జేయబడినవి. సూర్యచంద్రులిద్దరు పరస్పరము జూచుకొందురు. తరువాత క్రమముగా చంద్రుడు సూర్యమండలము నుండి బయల్వెడలును-49. చంద్రుడు రాత్రింబవళ్లు ద్విలవముతో చంద్రుని సూర్యుని స్పృశించును. ఆకాలము దర్శ(అమావాస్య) యొక్క యాహుతికాలము వషత్రియయును, కోకిల కూతకు సమానమైన కాలముతో గుర్తింపబడినందున యమావాస్య కుహు అనబడినది. సినీవాలే ప్రమాణముతో చంద్రుడు క్షీణశేషుడుగా నుండి యమావాస్యలో సూర్యుని బ్రవేశించుటచే సినీవాలి యనబడినది. పర్వము యొక్క పర్వకాలము వషత్రియయు సమానులు. చంద్రసూర్యవ్యతీ పాతములు రెండును పూర్ణిమలనబడినవి-53. ప్రతి పత్సంచదశులలో ద్విమాత్రికలము పర్వకాలము. కుహుసినీవాలుల సముద్రము రెండు లవములు గలది. అరాగ్ని మండలమైన సోమునందు పర్వకాలము కలాశ్రయమైనది. ఈ విధముగా రాత్రియొక్క పర్వసంధులలో శుక్లపక్షము. దీనిలో చంద్రుడు సంపూర్ణమండలుడై రాహువుచే గ్రహింపబడును (గ్రహణమేర్పడును). శుక్ల పక్షపు పదియైదవ దీనమున దివస క్రమున పదియైదు కళలచే చంద్రుడు సంపూర్ణకళామతుడుగా జేయబడును గాన పూర్ణిమయనబడినది. కావున పదియైదవ కళ చంద్రుని యందుండును. పదియాఱవ కళయుండును. కావుననే పంచదశి (అమావాస్యయందు చంద్రునకు మహాక్షయము గలుగును. ఈ విధముగా పితృదేవతలు సోమ (చంద్రు)ని ద్రావుతారు. సోముని వృద్ధిజెందించువారును. కావున ఆ పితృదేవతలే ఋతువులును ఋతువులకు సంబంధించినవారును (ఈ విధముగా) ఆ దేవతలు భావింతురు.
ఇక మాసశ్రాద్దమును భుజించు వారైన పితరులను గూర్చియు, వారి గతిని గూర్చియు, బలమునుగూర్చియు, శ్రాద్ధమార్గమును (విధిని) గూర్చియు జెప్పెదను. మరణించిన వారి పోకయును, మరల రాకయును, ప్రసిద్ధమైన తపస్సుతో గూడ తెలియనలవి కాదు. మాంసముతో నేర్పడిన కన్నుతో దెలియ సాధ్యమగునా?. ఈ పితరులను శ్రాద్ధ దేవులనుగా దేలియవలెను. పితరులు లౌకికులుగా జెప్పబడినారు. దేవతలు సౌమ్యులు యాగము జేయువారు యోనినుండి జనించని యందరును. ఆ దేవతలు పితరులు. దేవతలందు పితరులను భావింతురు. మనుష్యులు పితరులను వారికంటే వేరైనవారును లౌకికులనబడిరి-62. పితయు, పితామహుడును, ప్రపితామహుడును. సోమునితో యాగము జేయువారును సోమవంతులనబడినారు. యజ్వానులనబడినవారు బర్హిషదులనబడినారు. వారీ కర్మలందు బూనినవారై దేహము బుట్టినప్పటినుండి సంతుష్టి జెందుదురు. వారిలో హోమము జేయువారును యాగము జేయింపదగినవారిని యాగము జేయించువారును అగ్నిష్వాత్తులనబడినారు. వీరు ఆశ్రమధర్మముననుసరించి ప్రస్థానమునందున్నవారు.వీరుచివరకు శ్రాద్ధకర్మతో నశింపరు. బ్రహ్మచర్యము చేతను, తపస్సు చేతను, యజ్ఞముచేతను, సంతానముచేతను, శ్రద్ధచేతను, విద్యచేతను, దానముచేతను-ఏడు విధములుగా దేహ పతనమగునందాక కర్మలలో బూనియుందురు. పితరులతోబాటు సూక్ష్మకులై, సోమపాయకులైన స్వర్గమును బొందినవారై దేవతలతో స్వర్గమున సంతసింతురు, పితృమంతుని (తండ్రిగలవానిని) ఉపాసింతురు. (శ్రాద్ద) క్రియగల సంతానవంతులకు ప్రశంసయే సిద్దమనబడినది. వారి కులమువారి చేతను, బంధువులచేతను వారికి నివాసముగా నీయబడినయన్నముగూడ ప్రశంసింపబడినది. సోమ లౌకికులు ఒక నెల శ్రాద్ధమును భుజించువారై తృప్తిని బొందుదురు. వీరు మనుష్యులైన పితరులు. వారు మాసశ్రాద్ధభుజులు. వారికంటే వేరైనవారు తక్కిన కర్మయోనులలో సంకీర్ణులైనవారును, ఆశ్రమధర్మములనుండి భ్రష్ఠులైనవారును, స్వధా స్వాహలులేనివారును భిన్నదేహులును దురాత్ములును యమునింటిలో ప్రేతులైనవారును, యాతనాస్థానమును (తీవ్రవేదనాస్థానమును) జేరి తాము జేసిన కర్మలకు దుఃఖింతురు. దీర్ఘాయుష్యము గలవారును, మిక్కిలి యెండి క్షీణించినవారును, వర్ణము మారినవారును, వస్త్రములు లేనివారును ఆకలిదప్పులను కొన్నవారునునై ఇటునటు పరుగెత్తుదురు. ఆ తరువాత, నదులు, సరస్సులు, చెఱువులు, బావి-వీనిలో నీటిని గోరువారగుదురు. వణుకుచున్న వారై యితరులయన్నములను పొందగోరుదురు. రాకపోకలుగల యాస్థానములలో వండబడుదురు. శాల్మలి (ముండ్లబూరుగు) చెట్టునందు వైతరణి (నరకమునందలి నిప్పులయేటి) యందు, కుంభీపాకములందును, కరంభవాలుక పేలపు పిండివంటివేడి యిసుక) యందును, అసిపత్రవనము (కత్తియా కులవనము) నందును, శిలలను పిండి చేయుటయందును, వారి వారి పాపకర్మలననుసరించి పడవేయబడుదురు. అచట వారికి స్వర్గభిన్నమైన నరకమునందువలె దుఃఖస్థానములుండును. అవి లోకాన్తరముననున్న వారియొక్క వివిధములైన నామ, గోత్రములను బట్టి యుండును. ప్రేతస్థానములలో నధిష్టించిన వారై భూమిపై యపసవ్యదర్భలందు మూడు పిండములిడి పతితులను తృప్తిబొందజేయుదురు. యాతనా (తీవ్రవేదనా) స్థానమును బొంద లేక యేడు విధములుగా సృజింపబడినవారు భూతము (ప్రాణు)లలో పశువులు మొదలుకొని స్థానములవరకున్న వారియందును, వారి కర్మలందును. అనేకరూపములైన జాతులందును, తిర్యగ్యోనిజాతులందును, యే యాహారములవారౌదురో, ఇచట ఆయా యోనులందు ఆయా చోటునందు ఆయా యాహారమును శ్రాద్ధ దాత చేకూర్చును. బంధువున్నచోట సకాలమున న్యాయముగా వచ్చిన పాత్రను, శాస్త్రీయముగా సమర్పింపబడిన యన్నమును ఇచ్చిన దిచ్చినట్లుగా బొందును. ఆవుల మందలో కనబడకుండగా దిరుగుచున్న తల్లియావును పిల్లదూడ తెలిసికొనునట్లు మంత్రము, శ్రాద్ధమున నీయబడిన పదార్థములను కర్తకిష్టులుగా సంకల్పించిన పితరులను జేర్చును.
ఈ విధముగా శ్రాద్దము, శ్రాద్దములో నీయబడినదియు మంత్రముతో నే లోపము లేక సంపూర్ణమగును- అని సనత్కుమారుడు తన దివ్య దృష్టితో జూచి చెప్పెను. సనత్కుమారుడు ప్రేతలయొక్క గమనాగమనముల దెలిసినవాడు, శ్రాద్ధము ప్రాప్తించిన వాని గమనాగమనములను దెలిసినవాడు. వారు (పితరులు) బహ్వీకులనియు, ఊష్మపులనియు, దివాకీర్త్యులనియు అనబడినారు. వారికి పగలు శుక్లపక్షము వారు పడుకొనుటకు రాత్రి శుక్ల పక్ష పక్షము. ఈ విధముగా పితరులు దేవతలు, దేవతలు పితరులు, ఋతార్తవులైన యనేకులు అన్యోన్యముగా పితరులనబడినారు. వీరు పితృదేవతలు శ్రాద్ధకర్మతో వారు సంతుష్టిజెందినపుడు మనుష్యులైన పితరులు సంతుష్టిజెందుదురు. అని యీ విధముగా పితరులు చెప్పబడినారు. సోమపాయులైన పితరులయొక్క పితృమతత్వము ఇదియే. నిశ్చయము పురాణమున నిశ్చయమైనది. అని యీ విధముగా పితృసోముల యొక్కయు ఇలా పుత్రుని యొక్కయు సమాగమము, సుధామృతప్రాప్తియు, పితరుల సంతృప్తి పరచుటయు-, పూర్లిమామావాస్యల కాలమును, పితరులస్థానమును, మీ కొరకు సంగ్రహముగా జెప్పబడినవి. ఇది సనాతనమైన సృష్టి. ఈ మొత్తము యొక్క ఈ విశ్వరూపత్వం యొక్క చోటనుండినదిగా జెప్పబడినది. దీనిని లెక్కించుట సాధ్యముగాదు. ఐశ్వర్యమును గోరినవాడు దీని విషయమై శ్రద్ధ వహింపవలెను-90. అనునీ స్వాయంభువ సృష్టి యిచట నాచేత విస్తరముతోను ఆను పూర్వితోను దాటబడినది. మణి నేనేమి వర్ణింపవలెను?.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున పితృవర్ణనమను నేబదియాఱవ యధ్యాయము.
