వాయు మహా పురాణము

Table of Contents

2 - పృథువంశాను కీర్తనమ్

సూతుడనెను :

సముద్రాంత మైన యీ భూమి మేది నీయని ప్రసిద్దముగా వినబడినది. వస్తువును (ధనమును) ధరించుట చేత వసుధయని చెప్పబడెను. పూర్వము మధు కైటభుల మేదస్సుతో నంతటను ప్రవాహితమైన భూమి ధీమంతుడై రాజైన పృథువును జేరెను. కావున నీ సముద్రాంతమైన భూమి మేదినీయని ప్రసిద్ధి జెందినదై పుత్రత్వము నందినదై పృథివి యని పిలువబడినది. ఈ విధముగ పేరు గాంచినది, అట్లే విభజింపబడినదై వసుంధరయే రాజుచే శోభిల్లినది. అట్లే పంటలకు నిధానమైనదై పట్టణసమూహములు మాలగా గలదై, నాలుగు వర్ణములతో బ్రహ్మ క్షత్రవైశ్య శూద్రులతో నిండినదై బుద్ధిశాలియైన యా పృథువుచే రక్షింపబడినది.

ఆ వైన్యరాజు రాజులలో కెల్ల మంచి శ్రేష్ఠుడై యిట్టి ప్రభావము గల వాడయ్యెను. ప్రాణి సమూహముచే నంతట ఆతడు నమస్కరింప దగినవాడును, పూజింపదగిన వాడును అయ్యెను. బ్రహ్మయోనియే సనాతనుడైన పృథువే వేద వేదాంగముల సారము నెరింగిన మహాభాగులైన బ్రాహ్మణులచే నమస్కరింప దగినవాడు. మహాకీర్తిని పొందగోరిన మహాభాగులైన రాజుల చేత గూడ ఆదిరాజై ప్రతాపవంతుడై వైన్యుడైన పృథువే నమస్కరింప దగినవాడు. యుద్ధమున జయము గోరు యోధులచేత గూడ నరులకాదికర్తయైన పృథువే నమస్కరింపదగినవాడు. పృథురాజును కీర్తించి రణమునకేగిన యోధుడు భయంకర యుద్ధ గూడ జయమంది క్షేమముతో కీర్తిమంతుడై తరించును, వైశ్యవృత్తిలోనున్న వైశ్యులచేత గూడ తమకు వృత్తి (వ్యాపార జీవః నీచ్చు మహాకీర్తిమంతుడైన పృథువే నమస్కరింపదగినవాడు. వీరు (ఈ క్రిందివారు) వత్స విశేషములు (ప్రత్యేకమైన దూఁ పాలు పితుకువారును, సమస్త ములైన పాలు పితుకు పాత్రలును - క్రమముగా నాతో జెప్పబడినవి. మొదట వాయువును ద జేసి మహాత్ముడైన బ్రహ్మ పృథివి (యను ఆవు) నుండి భూతలమున బీజములను పితికెను. తరువాత స్వాయంభువ మన్వంతర స్వాయంభువ మనువును దూడగా జేసి గ్రీష్మునిచే భూమి పితుకబడినది పూర్వము స్వారోచిషమన్వంతరమున స్వారోచిష మన దూడగా జేసి బుద్ధిశాలియైన చైత్రవునిచే భూమి నుండి సస్యములు పితుకబడినవి, ఉత్తమ మన్వంతరమున ఉత్తమమను దూడగా జేసి బుద్ధిమంతుడై యుత్తముడైన దేవభుజునిచే భూమి నుండి సర్వసస్యములు పితుకబడినవి. పంచమమగు తె మన్వంతరమున తామసమనువును దూడగా జేసి మరల నీ భూమినుండియే బలబంధువుచే (సర్వసస్యములు) పితుకబడినవి చారిష్ణవదేవుని మన్వంతరమున చారిష్ణవుని వత్సమునుగాజేసి యీ భూమి పురాణునిచే పితుకబడినది. చాక్షుషమన్వంత రాగానే చాక్షుష మనువును దూడనుగా జేసి పురాణునిచే ఈ భూమి. పితుకబడినది. నేను పూర్వము చెప్పినట్లే వైవస్వత చాక్షుష మన్వంతరము గడచి వైవస్వతము రాగా వైన్యునిచే మరల నీ భూమీ పితుకబడినది. గడచిన మన్వంతరములలో పూర్వమీ భూమి ఈ దేవాదుల చేతను మనుష్యులచేతను భూతాదుల చేతను పైజెప్పిన వారిచే గూడ పితుకబడినది.

ఈ విధముగనే యిచట భూత - భవిష్యత్మన్వంత రములలో దేలియ వలెను. ఈ మన్వంతరములో పృథువు యొక్క సంతానమును దేవతలను గూర్చి వినుడు. పృథువు నుండి అంతర్ధిపాలురు పరాక్రమ వంతులునైన యిరువురు పుత్రులు జనించిరి. అంతర్ధాను నుండి శిఖండిని హవిర్ధానుని గనెను, హవిర్ధాను నుండి షడాగ్నేయి యైన ధిషణ సుతులను గనెను. వారు ప్రాచీన బర్హి, శుక్రుడు, గయుడు, కృష్ణుడు, ప్రజాజీనులును, భగవంతుడైన ప్రాచీన బర్హి  గొప్ప ప్రజాపతి యయ్యెను. ఈతడు బలము చేతను, పాండిత్యము చేతను, తపము చేతను, వీర్యము (పరాక్రమము) చేతను భూమిలో అందరిని పాలించు ఒకే ఒక రాజుగానయ్యెను. అతని దర్భలు ప్రాచీనాగ్రములు (తూరుపు వైపు కొసలు గలవి). కావున నతడు ప్రాచీనబరియయ్యెను. ఆ ప్రభువు సముద్రతనయను భార్యగా జేసికొనెను. ఆమె మహాతమస్సు యొక్క పాతమున సవర్ణమైనది. తఱువాత సాముద్రి (సముద్రతనయ) యైన సవర్ణ ప్రజాపతి వలన పదుగురను ప్రాచీన బర్హిషులను గర్భము ధరించి కనెను. వారందరు ప్రచేతసులనువారు, ధనుర్వేద పారగులు. ఏకధర్మము నాచరించునట్టి వారు. సముద్ర జలమునబరుండినవారై పదివేల యేండ్లు మహాతపమును జేసిరి. ఆ ప్రచేతసులు తపము జేయుచుండగా, వృక్షములు రక్షణము లేని భూమిని జుట్టీ వైచినవి. అంత ప్రజాక్షయము జరిగినది. చాక్షుష మన్వంతరమీ విధముగ గొట్టబడగా, వాయువు వీచలేకపోయినది. ఆకాశము వృక్షములతో జుట్టబడినది. పదివేలయేండ్లు ప్రజలు కదలజాలకుండిరి. అది విని తపములతో గూడిన ప్రచేతసులందరు కోపించినవారై ముఖముల నుండి వాయువును అగ్నిని సృష్టించిరి. ఆ వాయువు పెకిలిపడిన వృక్షములనన్నింటిని శోషింప జేసేను. వాని నా భయంకరమైన యగ్ని దహించివైచెను. ఈ విధముగ వృక్షముల నాశము జరిగినది. తరువాత రాజైన సోముడు వృక్షనాశమును దెలిసి, అందులో కొన్ని మిగిలియుండగా, సమీపించి యీ ప్రచేతసులతో నిట్లనెను. లోకసంతాన కారణము వలన (లోకముల సంతానమునకు కారణమైనందున) వృక్షముల సమస్త ప్రయోజనమును జూచి ఓ రాజరూపులైన ప్రాచీన బర్హిషులారా! (అగ్ని స్వరూపులారా!) కోపమును వదలుడు. వృక్షములు భూమిలో (ప్రాణులను) జన్మింపజేయగలవు. ఓ అగ్ని - వాయువులారా! శమించుడు. రత్నము వంటిదై యుత్తమురాలైనది యీ వృక్షముల యొక్క కన్య. భవిష్యత్కాలమును దెలిసిన నేను (సోమరాజు) గోవులతో బెంచితిని. . ఈమె మారిషయను కన్య వృక్షములచేతనే నిర్మింపబడినది. సోమగర్భముతో వృద్ధిజెందిన యీ కన్య మీకు భార్యయగుగాక. మీ యొక్క సగము తేజము చేతను నాయొక్క సగము తేజము తోను ఈ మారిషయందు విద్వాంసుడైన దక్షుడను ప్రజాపతి జనించును. ఆ దక్షప్రజాపతి ఈ మిక్కిలి దగ్గమైన భూమిని మీ తేజముతో నిండిన అగ్నితో అగ్నిసముడై ప్రజలను వృద్ధి జెందింపగలడు. తరువాత సోముని మాట వలన నా ప్రచేతసులు కోపమునుపసంహరించి, వృక్షముల కొఱకై వాటి కన్యయైన మారిషయను కన్యను పత్నిగా గ్రహించిరి. తరువాత వారు మారిషయందు గర్భమును ధరింపజేసిరి. పదుగురైన ప్రచేతసుల వలన మారిషయందు సోమునియొక్క యంశచే వీర్యవంతుడును మహాతేజస్వియునైన దక్షుడను ప్రజాపతి జనించెను. దక్షుడు మొదట మానస సృష్టిగా కొందరిని సృష్టించి తరువాత మైథునముతో సృష్టించెను. దక్షుడు అచరులను (నడవలేనివారిని), చరులను (నడువగలవారిని), రెండు కాళ్లు గల మానవాదులను, నాలుగు కాళ్లు గల పశ్వాదులను, మనస్సుతో సృష్టించెను. తరువాత (వాని) స్త్రీలను సృష్టించెను. ఆ దక్షుడు యమధర్మరాజునకు పదిమంది స్త్రీలను, కాశ్యపునకు పదముగ్గురు స్త్రీలను, కాలమును నడుపుటలో సమర్థులైన యిరువది యేడుగురు స్త్రీలను చంద్రునకును ఇచ్చి తక్కిన నలుగురు స్త్రీలను అరిష్టనేమికిని ఇద్దరిని బాహుపుత్రునకును, ఇద్దరిని అంగిరసునకును, ఒక్కరితను కృశాశ్వు భార్యలుగా నిచ్చెను. వారి వల్ల గలిగిన సంతానమును వినుడు. ఇచట ఆఱవదియైన చాక్షుష మన్వంతరము క్షీణిఁ ఏడవదైన వైవస్వత మన్వంతరములోని యేడవ ప్రజాపతికి సంబంధించినది ప్రారంభమగును: ఆ దక్షకన్యలందు దే ఖగములు, గోవులు, నాగులు, దితిజులైన దైత్యులు, దనువునకు బుట్టిన దానవులు, గంధర్వులు, అప్సరసలును బుట్టిరి. ఇతర జాతులు గూడ బుట్టినవి. అప్పటినుండి యీ లోకమున సంతానము మైథునము వల్ల గలిగినదేయయ్యెను. పూర్వుల సృష్టి సంకల్పము వల్లను, దృష్టివల్లను, స్పర్శవల్లను కలుగుచుండెడిదని చెప్పబడినది.

ఋషులనిరి :

పూర్వము దేవతల యొక్కయు, దానవుల యొక్కయు, దేవర్షుల యొక్కయు, నీయొక్కయు మహాత్ముడైన, దక్షుడైన దక్షుని యొ సంభవము (పుట్టుక) చెప్పబడినది. ప్రాణము నుండి దక్ష ప్రజాప్రజాపతి పుట్టుక యని నీ చేత చివరకు చెప్పబడినది. మహాతపసి అతడు మరల ప్రచేతస పుత్రత్వము నెట్లు పొందెను? ఇది మా సందేహము. ఓ సూతా! ఈ విషయమున వివరించి చెప్పదగు ఆ పుత్రిపుత్రుడైన సోముడు మామయెట్లయ్యెను? 

సూతుడనెను :

ఓ మంచి పండితోత్తములారా! ప్రాణుల యందు ఉత్పత్తియు, వాని నిరోధమును, (మరణమును) నిత్యము జరుగుచుండ ఈ విషయమున ఋషులును విద్యావంతులైన నరులును మోహము జెందరు. దక్షాదులైన ద్విజులు వీరందరును ప్రతియుగ బుట్టుదురు. మరల గిట్టుదురు. విద్వాంసు లావిషయమున మోహము జెందరు, ఓ ద్విజోత్తములారా! పూర్వము వారిలో చిన్నల భేదము లేదు. ఇచట గొప్ప తపస్సు ప్రభావమును కారణముగా నుండెను. చాక్షుష మన్వంతరము యొక్క యీ చ? సృష్టిని దెలిసినవానికి ప్రజలకును ఆయువు తనయంతము దాటును. అతడు స్వర్గలోకమున గొప్పవాడై పూజింపబడును. మన్వంతరము యొక్క యీ సృష్టి సంగ్రహముగా జెప్పబడినది. ఈ విధముగా గడచిన మన్వంతరాత్మకములైన విసర్గలు (విసృష్టులు) ఆఱు - స్వాయంభువ మన్వంతరము మొదలు చాక్షుష మన్వంతరము వఱకు వరుసగా సంక్షేపముగా జెప్పబడినవి. ఓ బ్రాహ్మణ పండితోత్తములారా! నా ప్రజ్ఞననుసరించి యీ సృష్టులు చెప్పబడినవి. వైవస్వతమన్వంతరసృష్టితో వాని విస్తరము తెలియదగును. వివస్వతుని యొక్క సృష్టులన్నియు అనంతములు అతిరిక్తములు గానివియు (వేరుగా నుండనివియు) నైనవి. అసూయ లేక వీనిని పఠించువాడు ఆరోగ్యాయుః ప్రమాణమును బట్టి ధర్మార్థ కామములతో ఈ గుణములనే పొందును. ఇక ఇప్పటివాడైన గొప్పవాడైన వైవస్వతుని యొక్క సర్గమును (సృష్టిని) సంగ్రహముగను విస్తారముగను జెప్పెదను. నా నుండి వినుడు. 

ఇది శ్రీ వాయు మహాపురాణమున పృథువంశాను కీర్తనమను ద్వితీయాధ్యాయము సమాప్తము.