వాయు మహా పురాణము
16 - శౌచాచారలక్షణం
వాయువు పలికెను:- ఆపైన శౌచాచారము యొక్క లక్షణమును చెప్పబోవుచున్నాను. దానినాచరించి శుద్దాత్ముడై మరణించిన తరువాత స్వర్గమునే పొందగలడు-1. జలమును గోరువాడు మునులయొక్క శౌచములకు (పవిత్రతలకు) ఉత్తమ స్థానమగును. వాడు శౌచముల విషయములలో అప్రమత్తుడుగానుండవలె. అట్టి ముని నాశమును బొందడు-2. మానావమానములను నీరెండే విష-అమృతములని యందురు. అందులో అవమానము విషము మానము అమృతమనబడినది 3. వానిలోనప్రమత్తుడైన ముని నాశమును బొందడు. గురువు యొక్క ప్రియమై హితమైన కార్యమునకు బూనుకొన్నవాడు సంవత్సరము నుండి గురువును సేవింపవలె-4. అతడు అహింసా సత్య అస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహరూపములైన యమములోను, శౌచ సంతోష-తపస్-స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన రూపములైన నియములలోను ఎల్లప్పుడు అప్రమత్తుడై యుండవలెను. గురువు దగ్గర ఉత్తమ జ్ఞానమును రాబట్టవలెను. (సంపాదించవలెను) ఆ తరువాత గురువుచే అనుజ్ఞాతుడై అనుమతిని పొందినవాడై ధర్మమునకు విరోధముగాకుండగా ఈ భూమినందతయు తిరుగవలెను.-5.
కన్నులు చూచి యిది పవిత్రమైనదియని చెప్పిన మార్గముననే పోవలె. వస్త్రముతో వడియ బోసిన పవిత్రమైన నీటినే త్రాగవలె. అబద్ధమేమాత్రము లేక సత్యముచే పవిత్రమైన మాటనే పలుకవలె. ఇది ధర్మానుశాసనము-6. యోగము దెలిసినవాడు ఎక్కడనైనను శ్రద్ధ యజ్ఞములతో ఆతిథ్యమును స్వీకరింపరాదు. ఈ విధముగా నాచరించినచో యోగి అహింసకుడగును. విచారము-7. పొగలేని యగ్నియున్నచోట, బొగులు లేనిచోట, భక్తజనమున్న చోట నంతటను బుద్దినుంతుడైన యోగి చలింపవలేను. కాని ప్రతి నిత్యముముగా పై చోటులలో చరింపరాదు-8. సజ్జనుల ధర్మమును నిందింపక, జనులు తననవమానింపని విధమున, అట్లే తిరస్కరింపని విధమునను యుక్తుడైన యోగి) భిక్షాటనము జేయవలెను-9. యోగి వేద విహితాచారము గల గృహస్థుల యిండ్లలో భిక్షాచరణము జేయవలె. ఇది యోగ శ్రేష్ఠమైన పరమోత్కృష్టమైన వృత్తియని యుపదేశింపబడినది-10. ఆ పైన మృదు స్వభావము గలవారు, వైదికాచారములందు శ్రద్ధగలవారు, ఇంద్రియ నిగ్రహము గలవారు (కామ క్రోధాలకు వశముగానివారు) వేదశాస్త్రాధ్యయన సంపన్నులు, మహాత్ములునైన గృహస్థుల యిండ్లలో యోగియైన బ్రాహ్మణుడు భిక్షాచరణము జేయవలెను-11. ఆపైన దుష్టులుగాని పతితులు (భ్రష్టులు) గాని కానట్టి వారి యిండ్లలో భిక్షాచరణము మిక్కిలి నీచవృత్తియనబడి-12. యవాగువులు (జవ్వలు), మజ్జిగ, పాలు, అలసందలు, ఫలములు కంద మూలములు, వండనివి, తెలకపిండి వీనిని భిక్షలో పొందవలెను-13. నాచే ఈ పై జెప్పినవి యోగులకు సిద్దులకు వృద్దిజేయునట్టి యాహారములు అది సిద్ధించినచో భిక్షాచరణము శ్రేష్ఠమైనది-14.
దర్భ చివరి భాగముతో నీటి బిందువును నెల నెలకు త్రాగినవాడు, న్యాయముగా భిక్షనాచరించు వాడు పూర్వము జెప్పిన దానికంటే విశిష్టుడు-15. సమస్తయోగులకును చాంద్రాయణ వ్రతము శ్రేష్ఠమనబడినది. ఒకటి, రెండు, మూడు నాలుగు గాని యథాశక్తిగా (చాంద్రాయణ వ్రతమును) జేయవలెను-16. దొంగతనము జేయకుండుట, బ్రహ్మచర్యము, లోభము లేకుండుట, త్యాగము, ఇవి భిక్షువులకు వ్రతములు, అహింస, పరమార్థమును కోరుట, కోపములేకుండుట, గురు సేవ, శౌచము, తేలికయాహారము (అల్పాహారము) దీసికొనుట. నిత్యము స్వవేదాధ్యయనము ఇయ్యవి నియమములని చెప్పబడినవి.
మనుష్యుడు బీజము జన్మ కారణమయినవాడు, త్రిగుణములు శరీరమైనవాడు, కర్మలచే బద్ధుడును అగును. అడవిలో ఏనుగునకువలె మనుష్యులకు సైతము కర్మబంధము విధింపబడును-19. అంకుశముచేత ఏనుగు తన స్వాతంత్ర్యము నుండి నివారింపబడి మావటివానికి వశమైనవాడు చెప్పిపనులెల్ల జేయును. అట్లే మనుష్యుడు గూడ కర్మబద్దుడై స్వాతంత్ర్యము తొలగి వెంటనే ప్రాపంచిక కర్మజేయుచుండును. కావున శుద్దమైన జ్ఞానముచే దహింపబడిన జన్మకారణ బీజము గలవాడై, పాపములు లేనివాడై, బంధములన్నియు వదలినవాడై, శాంతుడైన యీ మనుషుడు ముక్తుడనబడును-20.
వేదములచే స్తుతింపదగినవి సమస్త యజ్ఞ క్రియలు, యజ్ఞమునందు జ్ఞానులు జపించినది మిక్కిలి శ్రేష్ఠము.జ్ఞానము వలన సంగరాగములు లేని ధ్యానము గలుగును. అది లభించినచో శాశ్వతుడు లభించును-21. దమము, శమము, అకల్మషత్వము, సత్యము, కల్మషములేమి, మౌనము, అఖిల ప్రాణులయందు కౌటిల్యము లేమి వీనిని జ్ఞానముచే విశుద్ధమైన సత్యము (బలము) గలవారు అతీన్షియ జ్ఞానమునుగాను ఆర్జవమునుగాను జెప్పుదురు-22. సమాహితుడు, బ్రహ్మపరుడు, ప్రమాదము జెందనివాడు. శుచి, ఆత్మయందే రతుడైనవాడు, ఇంద్రియముల జయించినవాడు ఈ యోగమును పొందుదురు. అనిందుతులును మలినము లేనివారునైన మునులు గూడ నీ యోగమును పొందుదురు.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున శౌచాచారలక్షణమనునది పదునారవ యధ్యాయము.
