వాయు మహా పురాణము
29 - అగ్నివంశవర్ణనం
ఈ యభిమానియైన యగ్ని స్వాయంభువ మన్వంతరమున బ్రహ్మయొక్క మానసపుత్రుడు ఆతని నుండియే స్వాహ జనించినది-1. పావకుడు పవమానుడు, (ఈతడే పావమానుడు) శారుడనబడు శుచియు ఈ ముగ్గురు స్వాహాపుత్రులు 2. నిర్మథనమున వచ్చిన పవమానుడు శుచియైనవాడు ఆతడు శారుడనబడును. పావకములు వైద్యుతములు వానికి స్థానములు-3. పవమానాత్మజుడు కవ్యవాహనుడనబడును. పావకుని నుండి వచ్చిన వాడు సహరక్షుడు. శుచియొక్కసుతుడు హవ్యవాహుడు-4. అగ్ని దేవతలకు హవ్యమును మోయువాడు. పితరులకు కవ్యమును మోయువాడు, అసురులకు (హుతమును) మోయువాడు సహరక్షుడుమువ్వురికి మూడగ్నులు-5.
వీరియొక్క పుత్రపౌత్రులు ఇరువది నాలుగు మరియు తొమ్మిది వేరువేరుగా వారి నామములను జెప్పెదను-6. విద్యుత్సంబంధమైన లౌకికాగ్నిమైతే బ్రహ్మ యొక్క మొదటి (పుత్రుడు)వాడనబడెను. ఆతని పుత్రుడు బ్రహ్మాదనాన్ని భరతుడని ప్రసిద్దిజెందెను-7. ఆతని యగ్నిముఖము నీటియొక్క రసరూపమైన కావ్యమైన (శుక్రసంబంధమైన) తేజము పూర్వము జలసముద్రమునందు అమృతము అథర్వునిచే మథింపబడినది. ఆయథరుడు లౌకికాగ్ని దధ్యంచుడు ఆథర్వణుని కుమారుడు-8,9.
ఇక నిర్మంథుడని కవులచే తలపబడిన పవమానుడను నగ్నిని గార్హపత్యాగ్నినిగా దెలియవలెను. ఆ యగ్నినుండి యిద్దరు పుత్రులు మొదటి వాడు హవ్యవాహనుడనబడు ఆహవనీయాగ్ని ఈతడు శంష్యుడు (ప్రశంసింపదగినవాడు) రెండవవాడు యజ్ఞములో ప్రణీయమానుడు (కుండమునకు దీసికొనిపోబడువాడు) అగు శుక్రుడనునగ్నిగా జెప్పబడినాడు 10,11. అట్లే శంస్యుడను నగ్నికి సభ్యాన్ని ఆవసధ్యాగ్నియను నిరువురు పుత్రులు. బ్రాహ్మణులచే ఆహవనీయాగ్నియని యభిమానింపబడిన శంష్యుడను హవ్యవాహనాగ్ని పదునాఱు నదులను కామించెను–12.
అనదులివి కావేరి, కృష్ణవేణి, నర్మద, యమున, గోదావరి; వితస్త, చంద్రభాగ, ఇరావతి-13, విపాశ, కౌశికి, శతద్రు, సరయు, సీత, సరస్వతి, ప్రోదిని, పావని-14, ఈనదులను శంష్యుడను ఆహవనీయాగ్ని కామించేను. ఆయగ్ని యీ పదునారునదుల ధిషీల యందు (దిష్ణీలు, నదులలోనే యొక విశిష్టమైన గర్భస్థానము) వేఱువేఱుగా తనను విభజించియుంచెను. తరువాత ఆధిషీలలో అగ్ని జనించెను-15. ఆధిషీలు, వ్యభిచారిణులు, వారిలో బుట్టినవారు ధీష్ణులు (దిష్ణయః) (ఆ పేరవెలసినయగ్నులు) దిషీలలో బుట్టినందున నాయగ్నులు దిష్ణులనబడినవి-16. ఈ విధముగ నీనదీపుత్రులు ధిష్ణులలోనే బుట్టిరి. ఆయగ్నులలో (హోమ కుండములలో) విహరణీయములు (వెడల్పుగా పరుచదగినవి) ఉంచదగినవి (ఒకచోనుంచదగినవియు నేవో అవి యేమనబడునో సంగ్రహముగా జెప్పెదవినుడు-17.
ఋతువు ప్రవాహణము అగ్నీధ్రము తక్కిన ధిషీలు ధైట్ల నామకములు) ఈయగ్నులు సుత్యసంబంధమైన దినమున సవనక్రమముననుసరించి వానివాని స్థానములలో విధింపబడును-18. ఇక చూపరావియు, చెప్పరానివియునైన యగ్నుల క్రమమును వినుడు. సమ్రాట్ అనునగ్ని మొదటిది. ఉత్తరవేదికి సంబంధించిన కృశానువు అనునగ్ని రెండవది 19. సమ్రాడగ్నిని ఎనమండుగురు బ్రాహ్మణులు సమిపముననుండి యుపాసింతురు. దానిక్రింద పర్షత్ అను వేరొక రెండవయగ్ని యిట గన్పడును-20. దానిని 'నభస్' అనియందురు. అది సాగుగ భావింపబడును. బ్రహ్మజ్యోతి వసువనునది. అది బ్రహ్మస్థానమున నుండునని చెప్పబడును. హవ్యనూ: అనునది మొదట సృష్టింపబడినది. అది శామిత్ర మున (యాగమున) భావించ బడును. తరువాత విశ్వము యొక్కయుగ్ని సముద్ర ము అది బ్రహ్మస్థానముననుండునని చెప్పబడును-21,22, ఋతుధామమన్నది జ్యోతిర్వంతమైన యగ్ని అది మౌదుంబరియందు (మేడియందు లేక రాగియందు) ఉండునని చెప్పబడును. బ్రహ్మజ్యోతి యైనది వసువునునగి అది బ్రహ్మస్థానమున నుండునని చెప్పబడును-23.
అజైకపాద్ అనున్న యుపాసింపదగినది. అది శాలాముఖములోనుండును. ఉద్దేశింపదగనిదైనను అహిర్బుధ్య మనబడును. ఆయన్ని గృహపతియనబడినది-24. ఈయన్ని యగ్నులును శంస్యముయొక్క సుతులే అవి బ్రాహ్మణులచే నుపాసింపదగినవిగా జెప్పబడినవి. ఆ తరువాత విహరణీయము లైన (పరువదగిన) యగ్నులను, వాని యెనమండుగురు సుతులను జెప్పుదును-25. క్రతుప్రవాహణము, ఆగ్నీధ్రము అచ్చటనుండు తక్కిన ధిష్ఠులను నగ్నులును సుత్యాదినపుటగ్నిలో సవనక్రమమున వానివాని స్థానములలో విహరింప(పరువ) బడును-26.
ఆ తరువాత హవ్యవాహనుడనబడు అగ్ని పౌత్రేయాగ్ని ప్రచేతసుడనబడు అగ్ని శాస్త్ర్యాన్ని మొదటిది. సత్యమనునగ్ని రెండవదిగా జెప్పబడినది-27. అట్లే విశ్వదేవమనునగ్ని బ్రహ్మస్థానమున నుండునని చెప్పబడినది. అవక్షురచ్చావకమనునగ్ని భూస్థానమున నుండునని భావింపబడును-28. సవీర్యమైన ఉశీరాగ్ని (వట్టి శేళ్ళయగ్ని) నైష్ఠీయముగా సంభావింపబడును. ఎనిమిదవదియైన వ్యరత్తియనునగ్ని మార్జారీయమనబడినది-29. సౌమ్యముచేత గాని (సోమసంబంధమైన దానిచేతగాని) వేరొకదానిచేతగాని విహరింప(పరువ) దగిన యగ్నులేవి కలవో, ఆ రెంటిలోని పావకుడనునగ్ని నీటికి గర్భమనబడినది-30. ఆ యగ్నిని ఆవబృథమని తెలియవలెను. అది చక్కగా జేరినీటిలో హోమము జేయబడును. ఆతని సుతుడు హచ్చయుడనునగ్ని (హృదయమున బండుకొనువాడైననగ్ని) అతడు మానవుల జఠరములోనుండి నాడు-31. జఠరాగ్నికి మన్యుమంతుడను విద్వాంసుడైన యగ్ని సుతుడు అనబడినాడు. అన్యోన్యముగా పైకీ విజృంభించిన యా యగ్ని భూతములకు (ప్రాణులకు) మహాప్రభువు-32, ఆ మన్యుమంతుడను నగ్నికి పుత్రుడు ఘోరుడైన (భయంకరుడైన) సంవర్తకుడనబడినాడు. వాడు నీటిని త్రాగుచు ఆడగుఱ్ఱపు ముఖము గలవాడై సముద్రమున నివసించును-33. సముద్రవాసియైన సంవర్తకాగ్నియొక్క పుత్రుడు సహరక్షుడనబడును. సహరక్షాగ్నిసుతుడు కాముడు అనునగి అతడు మనుష్యల యిండ్లను దహించును-34. కాముడను నగ్నికి సుతుడు క్రవ్యాదుడనున్న ప్రవ్యాదుడను నగ్ని మరణించిన పురుషులను దినును. ఈ యగ్నులన్నియు నీ విధముగా పాతకమును నగ్ని యొక్క పుత్రులుగా జెప్పబడిరి-35,
ఆ తరువాత సౌర్యాగ్నినుండి అసురులచే నావరింపబడిన గంధర్వులచే అరణియందు మథింపబడిన యగ్ని యగ్నియని చక్కగా ప్రజ్వలింపజేయబడును-36. పశుయాగమున ప్రణీయమానమగు (తీసికొనిరాబడు) అగ్ని భగవంతుడైన ఆయువనున్న ఆయువనున్నయొక్క పుత్రుడు మహిమాన్ అనువాడు వాడు పేరుతో 'శావాన్' అనుసుతుడు-37. పాకయజ్ఞములయందభిమానియైన యగ్ని సవనుడనబడును. సవనుడనునగ్నియొక్క పుత్రుడు మహాయశుడైన ఆద్బుతుడు 38. అద్భుతాగ్ని యొక్క పుత్రుడు వివిచి ఆతడు గొప్పవాడుగా జెప్పబడెను. అతడు ప్రాయశ్చిత్తమున (అగ్ని యందు ఎల్లప్పుడు భముల యొక్కహోమము చేయబడిన హవిస్సును భుజించును-39. వివిచియనునగ్నికి సుతుడు అర్కుడను నగ్ని అరాగ్నికి సుతులు వీరు-అనీకవానుడు, వాసృజవానుడు, రక్షోహుడు, పితృకృత్ అట్లే సురభి, వసురత్నాదులలో ప్రవేశించియున్న రుక్మవానుడు అనువారు-40. శుచియనునగ్నికీది సంతానము అగ్నులైతే పదునాలుగు ఇవి యన్నియు యజ్ఞములలో తీసికొనిరాబడు అగ్నులుగా జెప్పబడినవి-41.
ఆదిసృష్టిలో యామములతో(జాములతో) బాటు సురోత్తములచే గడచిన యగ్నులు స్వాయంభువ మన్వన్తరమున ముందు అవి యభిమానులను నగ్నులు ఇవి యిచట చేతనా చేతనులలో విహరణీయములై (పరువదగినవై) యగ్నులు. లోకమున ఆయగ్నులుముందు స్థానాభిమానులుగానుండినవి-42,43, మనువుయొక్క ప్రథమ మన్వన్తరమైన పూర్వమన్వన్తరము పుణ్యులై మహాత్ములైన దేవతలతో బాటు శుక్లములైన జాములతో సుతులతో గడచిపోగా, కామ్యములు, నైమిత్తికములు, అజస్రములు (మాటిమాటికీ చేయబడునవి) అయిన కర్మలందు(యజ్ఞములందు) ఇవి యుండినవి 44. అని యివి నాచే జెప్పబడిన స్థానములు గలవియును అగును. భూతభవిష్యత్కాలములందలి యన్నిమన్వన్తరములలో గూడ అగ్నుల లక్షణము వాని చేతనే (పైయగ్నులచేతనే) ప్రకటముగా చక్కగా చెప్పబడినదీ-45. ఈ యగ్నులన్నియు. తపస్వినులు అట్లే ఇవి యన్నియు అవబృథములు, అవియన్నియు ప్రజాపతులు, జ్యోతిష్మన్తములునుగా తలపబడినవి 46. స్వారోచిషము మొదలగు యేడు మన్వంతరములలో సావర్ణ్యములు తెలియదగినవి. సమస్తమన్వన్తరములలోను అచటనుండుదేవతలతో బాటు ఈయగ్నులు నానా రూపములైన ప్రయోజనములతోనుండును-47. అనాగతులైన దేవతలతోబాటు అనాగతాగ్నులుండును-48. అని అగ్నుల వినయము (యజ్ఞకుండమునకు ధీసికొనివచ్చుట) ఉన్నదియున్నట్లుగా నాచే చెప్పబడినది. తరువాత విస్తరముగను ఆనుపూర్వీతోను పితరులకు సంబంధించినది చెప్పబడును-49.
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున అగ్నివంశవర్ణనమను నిరువది తొమ్మిదవ యధ్యాయము.
