వాయు మహా పురాణము
60 - మహాస్థానతీర్థవర్ణనం
ఋషులనిరి:- దుస్తరమైనయా మాటను విని ఋషులు సూతునితో ననిరి. ఓ మహామతీ! పూర్వము వేదములెట్లు విశాలములై వ్యాకులత నొందినవి? దానిని మాకు జెప్పుము అని యడిగిరి, సూతుడనెను స్వాయంభువ మన్వంతరమున ద్వాపర యుగము జరిగిపోగా బ్రహ్మ మనువుతో నిట్లనెను. ఓ మహామతీ! దానిని జెప్పెదను. యుగము జరిగిపోగా, ఓయీ! యుగదోషము చే జుట్టబడినవాడై వరుసగా ద్విజాతు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులందరు స్వల్పవీర్యులగుదురు. యుగవశమున కృతయుగము నుండి నశించుచు పదివేల భాగమున నిది (కలి) మిగిలినదై యల్పశిష్టముగా గనబడును వీర్యము, తేజము, బలము, మాటయును సర్వమును నశించును. వేదముల నుండి వేదములు (అధ్యయనముతో) వచ్చునట్లుగా జేయవలయును. వేదవినాశనముగారాదు-5. వేదనాశము గలిగిన యజ్ఞము నాశమందును. యజ్ఞము నశిపంగా దేవతల నాశము, దానివలన సర్వనాశము సంభవింపగలదు. మొదట వేదము చతుష్పాదము లక్ష సంఖ్య గలది. మరల నది పదిరెట్లధికమైనది. మొత్తము యజ్ఞము సమస్త వాంఛలను దీర్చునది
లోకహితమునందాసక్తి గల మను ప్రభువీ విధముగా నడుగబడి, యట్లే చెప్పెదనని నాలుగు పాదములు గల యొకే వేదమును నాలుగు విధములుగా విభజించెను-8. ఓయీ! బ్రహ్మయాజ్ఞవలన లోకహితమును గోరి ప్రస్తుతకాలముతో మీకు వేదకల్పనము జెప్పెదను. ఓ సత్తములారా! (ఓ మిక్కిలి జ్ఞానులారా) ప్రత్యక్షముగగాని పరోక్షముగాని దాని వినుడు 9,10. ఈ యుగమున పరమ తపస్వియైన పరాశర పుత్రుడు వ్యాసుడుగా జేయబడినవాడు. అతడు ద్వైపాయనుడని ప్రసిద్ధిజెందినవాడు. విష్ణువు యొక్కయంశమని చెప్పబడినాడు-11. బ్రహ్మచే ప్రేరేపింపబడినవాడై యాతడీయుగమున వేదమును విభజించటకు బూనుకొనెను. తరువాత నాతడు వేదకారణమున నలుగురును శిష్యులను గ్రహించెను–12. వారు జైమిని, సుమంతుడు, వైశంపాయనుడు నాల్గవాడు పైలుడు, ఐదవవాడు లోమహర్షణుడును-13. ఋగ్వేద శ్రావకునిగా ద్విజుడైన పైలుని స్వీకరించెను. యజుర్వేద ప్రవక్తగా వైశంపాయనుని స్వీకరించెను-14. సామవేదార్థ శ్రావకునిగా జైమినిని స్వీకరించెను. అట్లే యథర్వవేద శ్రావకునిగా ఋషిసత్తముడైన సుమంతుని స్వీకరించెను-15. భగవంతుడై యీశ్వరుడైన ప్రభువైన యా పారాశర్య వ్యాసుడు ఇతిహాస పురాణములకు చక్కని వక్తనుగా నన్ను (సూతుని) స్వీకరించేను-16. యజుర్వేదమొక్కటే నుండును. దానిని (వ్యాసుడు) నాలుగు విధములుగా విభజించెను. దానియందు చతుర్దోత్రము పుట్టెను. దానితో యజ్ఞమును కల్పించేను- 17. యజుస్సులతో ఆధ్వర్యమును, ఋక్కులతో హోత్రమును, సామములతో ఉద్గాత్రమును, అధర్వములతో బ్రహ్మత్వమును జేసెను. యజ్ఞమున నధర్వణ వేదముతో బ్రహ్మత్వమునుజేసెను-18. దాని నుండి ఋక్కునుద్ధరించి ఋగ్వేదమును కల్పించెను. దానిచేత యజ్ఞవాహమై జగద్దితమైన హోతృకము కల్పింపబడును-19. సామములతో సామవేదమును, దానితో నుద్దాత్రమును ప్రకాశింప జేసెను. అధర్వణవేదముతో రాజుయొక్క యన్ని కార్యములను జేయించెను-20. పురాణార్థ విశారదు(పండితు)డు ఆఖ్యానములతోను. ఉపాఖ్యానములతోను, గాథలచేతను, కులకర్మలచేతను పురాణ సంహితలను జేసెను-21. యజుర్వేదమున మిగిలినదానితో యజ్ఞమును గూర్చెను. ఆ విధముగా యజుర్వేదమున యజ్ఞమును గూర్చుచున్నవాడయ్యెనని శాస్త్ర నిర్ణయము.
పదములెత్తి తీసికొనుట వలన యజుస్సులు విషయములు ఆ కారణముచేత వేదసారమును దెలిసిన ఋత్విక్కులచేత నాతడు ఉద్దృత వీర్యుడయ్యెను. ఆతని చేత అశ్వమేధయాగము ప్రయోగింపబడెను. దానిచే నాతడు యోగ్యుడయ్యెను-23. పైలుడు ఋక్కులను గ్రహించి మరల వానిని రెండు విధములుగ విభజించెను. ఆ ప్రభువైన పైలుడు ఆ విధముగా రెండుగాజేసి సంయుగమున (పోరున) ఇద్దరు శిష్యులకిచ్చెను-24. ఒకదానిని ఇంద్రప్రమతికాని, రెండవ దానిని బాష్కలునకునునిచ్చేను. బ్రాహ్మణ విద్వాంస శ్రేష్ఠుడైన బాష్కలి (ఋగ్వేదమును) నాలుగు సంహితలుగా జేసి వానిని సేవాపరాయణులైహితులూ ఐన శిష్యులకు నేర్పించేను-25. బోధుని ప్రథమ శాఖను, అగ్నిమాఠరుని ద్వితీయ శాఖను, పారాశరుని తృతీయ శాఖను, యాజ్ఞవల్క్యుని నాలుగవ శాఖను జదీవించెను-26. బ్రాహ్మణ పండితోత్తముడైన యింద్ర ప్రమతీ మహాభాగ్యుడై కీర్తిమంతుడైన మార్కండేయుని నొక సంహితను జదివించెను-27. మహాయశస్వియైన యింద్రప్రమతి తన జ్యేష్ఠపుత్రుడైన సత్యశ్రవసుని జదివించెను. ద్విజుడైన సత్యశ్రవసుడు మరల సత్యహితుని జదివించెను-28. విభువైన సత్యహితుడు తన పుత్రుడైన సత్యతరుని జదివించెను. ఈ సత్యతరుడు సత్యశ్రీగలవాడు, మహాత్ముడు సత్యధర్మ పరాయణుడును-29. ఆ సత్యతరునకు మహాతేజస్వులైన ముగ్గురు శిష్యులు గలరు. వారు సత్యమైన సిరిగలవారు, విద్వాంసులు, శాస్త్ర గ్రహణమున తత్పరులును-30. వారిలో శాకల్యుడు మొదటివాడు. మరొకడు రథంతరుడు, తరువాతివాడు బాష్కలి. ఆ తరువాతివాడు భరద్వాజులు అను వీరు శాఖాప్రవర్తకులు-31. దేవమిత్రుడైన శాకల్యుడు జ్ఞానాహంకారముచే గర్వితుడు. ఆ బ్రాహ్మణుడు జనకుని యజ్ఞమున వినాశమును బొందెను.
శాంశపాయనుడనెను:- జ్ఞానగర్వితుడైన యా ముని యెట్లు వినాశమందెను? జనకుని యొక్క యశ్వమేధముతో వాదమెట్లు జరిగెను?-33. వాదమెందులకు జరిగెను? ఎవరితో జరిగెను? ఇదియంతయు ఉన్న యువుట్లు నీకు దెలిసినది. పూర్తిగా జెప్పుము. ఋషుల యీ మాటను వినిన తరువాత దానికి సమాధానము సూతుడు చెప్పెను.
జనకుని యొక్కయు యశ్వమేధ యాగమున గొప్ప పండిత సమావేశము జరిగెను. అచట అనేక విధములుగా వేలకొలది ఋషులు రాజర్షియైన జనకుని యజ్ఞమును జూడగోరి వచ్చిరి-35. వీరిలో బ్రాహ్మణ శ్రేష్టుడెవడు? ఈ విషయమున నిశ్చయము గలుగును? అని యనుకొని జనక మహారాజు మనసుతో నాలోచించెను-36. తరువాత వేయి గోవులను అధికమైన బంగారమును రత్నములను దాసులను గ్రామములను (వాని దాన పత్రములను) దెప్పించి యా మునులను గూర్చి జనకుడు పలికెను. ఓ బ్రాహ్మణోత్తములారా! సభలో శ్రేష్ఠభాగులైన మీయందరికిని శిరస్సుతో బ్రణమిల్లుచున్నాను మీలో మిక్కిలి శ్రేష్ఠుడైన వానికై యీ ధనమంతయు విద్యాధనముగా దీసికొనబడినది. అని యనెను-38 ఆ వేదారులైన మునులు జనకుని మాటను విని, మహాసారమైన ధనమును జూచి, ధనాతిశయ కారణమున దానిని బొందదలచినవారై వేదజ్జానమదముచే పొంగినవారై పరస్పరముగా నా ధనమునకై శ్రద్ధ వహించిరి-39. మనస్సుతో సాధనమును బొందినవారై ఈ ధనము నాదియనియు, మరొకడు ఈ ధనము నాదేయేనా కాదా? యనియు ఎందులకు సంశయింపబడుచున్నదో చెప్పుము. (నాదేయనుట నిశ్చయము) అనియు ధనదోషముతో అనేక విధములుగా వాదములు జేసిరి-40. అట్లే యచట విద్వాంసుడు, బ్రహ్మవాహుని (వేదముల బూర్తిగా జదివినవాని) పుత్రుడును, కవియు మహాతేజస్వియై బ్రహ్మవేత్తలలో నత్యుత్తముడైన బ్రహ్మయొక్క యంగమునుండి బుట్టి బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన యాజ్ఞవల్క్యుడు శిష్యునితో సుస్వరముగా నిట్లు పలికెను. ఓయి ఈ ధనమంతయు దీసికొని వెళ్ళుము. ఓ వత్సా! యింటికి దీసికొనివెళ్ళుము. ఈ ధనము నాదియే సంశయము లేదు. అన్ని వేదములలో నేను వక్తను. నాతో సముడు మరొకడెవ్వడు లేడు. దీనికిష్టపడని బ్రాహ్మణుడు వెంటనే యాలసింపక నన్ను వాదమునకు బిలుచుగాక. (అనియనెను)-41,42,43. అంత బ్రహ్మసముద్రము బ్రాహ్మణ మునులను సముద్రము) మహా ప్రళయములో వలె నల్లకల్లోలమయ్యెను. యాజ్ఞవల్క్యుడు నవ్వుచున్నవాని వలె నా మునులతో నిట్లనెను-44. ఓ విద్వాంసులారా! కోపింపకుడు. మీరు సత్యవాదులు. యుక్తాయుక్తమును దెలుసుకొనదలచుచున్నవారమై పరస్పరము వాదించుకొందము-45. అంతవారెదురకు జేరిరి. సూక్ష్మధర్శనము వలన గలిగిన శుభార్థములతో వారి వాదములు అనేక విధముల నడచినవి-46. లోకమునను వేదమునను, ఆధ్యాత్మమునను విద్యాస్థానములతో నలంకరింపబడినవియు, శపింపగల ఉత్తమ గుణములతో గూడినవియు, రాజసమూహములకు దూరమై నవియునైన యామహాత్ముల వాదములు ధనకారణముగా నచట జరిగినవి-47. ఋషులందఱు నొకవైపును యాజువల్క్యుడొక వైపునునైరి. ధీశాలియైన యాజ్ఞవల్క్యుడు ఆ మునులందరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రశ్న నడిగెను. వారు వానికి సమాధానమును జెప్పలేకపోయిరి-48. ఆ విధముగ మునులనందరిని జయించి బ్రహ్మరాశియు (జ్ఞానరాశియు) మహాతేజస్వియైన యాజ్ఞవల్క్యుడు వెంటనే వాదము జేయనున్న శాకల్యునిట్లునెను-49. ఓ శాకల్య! చెప్పదలచిన దానిని చెప్పుము. చింతించువానివలె నెందులకూరకున్నావు? గాలియూదిన తిత్తివలె స్తబ్దమైన యభిమానముతో నిండినవాడవు-50. ఈ విధముగ యాజ్ఞవల్క్యునితో తిరస్కరింపబడినవాడైన శాకల్యుడు కోపమువలన నెట్టని మోము కన్నులు గలవాడై మునుల సన్నిధిలో పురుషుడైన యా యాజ్ఞవల్కునితో నిట్లనెను-51. ఓ యాజ్ఞవల్క్య నీవు మమ్ములను గడ్డిపోచగా వదిలి యీ మునులను గూడ నట్లే వదిలి మహాసారమైన విద్యాధనమును నీయంతటనీవే గ్రహింపదలచితివి-52. శాకల్యునిచే నీ విధముగ జెప్పబడిన యాజ్ఞవల్క్యుడు చక్కగానిట్లు చెప్పెను. బ్రహ్మిష్ణు (జ్ఞాననిష్ణు)ల యొక్క బలము విద్యయొక్క తత్యార్థ దర్శనము అని తెలియుము-53. కామమర్థముతో సంబద్ధమైనది. కావున అర్థమును (ధనమును) కోరుకొనుచున్నాము. కామ ప్రశ్నయే ధనముగా గలవారు బ్రాహ్మణులు కావున కామ ప్రశ్నలనే చెప్పుచున్నాము-54. ఈ రాజర్షి యొక్క పందెముకూడ నిదియే. కావున నేనాచేధనము గొంపోబడినది. యాజ్ఞవల్క్యుని యీ మాటను విని కోపముతో గప్పబడినవాడై తరువాత,యాజ్ఞవల్క్యునితో కామ ప్రశ్నార్థముగల వాక్కుల బలికేను-55. ఇపుడు నాచే నుద్దేశింపబడిన కామప్రశ్నలను యథార్థముగా జెప్పుము అని తరువాత బ్రహ్మవేత్తలైన వారిరువురికి గొప్పవాదము జరిగెను-56. శాకల్యుడు యాజ్ఞవల్క్యుని తీక్షమైన వేయి ప్రశ్నలనడిగెను. అపుడు ఋషులు వినుచుండగా నన్ని ప్రశ్నలకు సమాధానము చెప్పెను-57. శాకల్యుడు వాద ప్రశ్నలు లేనివాడు గాగా యాజ్ఞవల్క్యుడాతనిని ఓ శాకల్యా నీవు నాయొక్క కామికమైన ప్రశ్నకు సమాధానము జెప్పుమనెను. ఈ వాదమునకు పందెము ప్రశ్నకు సమాధానము జేప్పనివాడు మరణము నొందవలెను-58. తరువాత ధీశాలియైన యాజ్ఞవల్క్యునిచే ప్రశ్న యడుగబడినది. శాకల్యుడు దానికి సమాధానము దెలియక వెంటనే మరణమునొందెను-59. ఈ విధముగ ప్రశ్న వ్యాఖ్యానముచే పీడింపబడినవాడై శాకల్యుడు మరణించెను. ఈవిధముగ ఋషులకును యాజ్ఞవల్క్యునకు ధనార్డులైన మునులతో గొప్పవాదము జరిగెను. ఓ మునీ! అందరిచేత నడుగబడిన నూర్లకొలది వేలకొలది ప్రశ్నలను వ్యాసారమును మహాజ్ఞానియు ఇంద్రియాదులను వశమందుంచుకొన్నవాడునైన యాజ్ఞవల్క్యుడు వ్యాఖ్యానించి, ధనమును దీసికొని, కీర్తిని వ్యాపింపజేసి స్వస్థుడై శిష్యునితో జుట్టబడి (కూడుకొని) గృహమునకు వెళ్ళెను.
దేవమిత్రుడైన శాకల్యుడు మహాత్ముడు బ్రాహ్మణ పండితోత్తముడు పదవేత్తలలో నుత్తముడైన యా బుద్ధిమంతుడు, ఐదు సంహితలను జేసెను. ఆతని కైదుగురు శిష్యులుండిరి. ముద్గలుడు, గోలకుడు, ఖాతీయుడు, మత్యుడు ఐదవవాడు శైశిరేయుడును-64, శాకపూర్ణ రథోతరుడు మూడు సంహితల ను జెప్పెను. బ్రాహ్మణ పండితోత్తముడైన నిరుక్తుడు నాల్గవ సంహితను జెప్పెను-65. ఆతని శిష్యులు నలుగురు కేతవుడు, దాలకి, ధర్మశర్మ, దేవశర్మ వీరందరును వ్రతమును ధరించిన ద్విజులు-66. శాకల్యుడు మరణింపగనే వారందరు బ్రహ్మహత్యజేసిన వారైరి. అపుడు మిక్కిలి చింతను బొంది వారందరు బ్రహ్మ సమీపమునకు వెళ్ళిరి-67. బ్రహ్మ మనస్సుతోనే వారిని దెలిసికొని పవనపురమునకు బంపెను. మీరు వెంటనే పవనపురమునకు బొండు మీ పాపము వెంటనే నశించుననెను-68. అచట ద్వాదశారునకు నమస్కరించి, వాలుకేశ్వరునకు నమస్కరించి పదకొండు రుద్రులను, విశేషించి వాయుపుత్రుని గూడ నమస్కరించియు నాలుగు కుండములలో స్నానముచేసి బ్రహ్మహత్య నుండి తరించుడు అనేను-69. అంత అందరును మిక్కిలి వేగముగలవారై యా పవనపురమునకు వచ్చిరి. చెప్పినట్లు విధివిధానముగా స్నానము చేయబడినది. దేవతల దర్శనము గూడ చేయబడినది-70. ఉత్తరేశ్వరునకు నమస్కరించి బ్రాహ్మణుల యనుగ్రహమున వారందరును పాపముక్తులై సూర్యమండలము జేరిరి-71. అది మొదలు ఆ తీర్థము పాతకనాశన తీర్థమయినది. పూర్వము వాయువుచే నిర్మింపబడినదిన పవిత్రమైన వాయువు యొక్క పురము-72. అంజనాదేవి గర్భమున బుట్టిన హనుమంతుడైన పవన పుత్రుడు, సత్యపరాక్రముడునునైన మహాదేవ హనుమంతుడు పుట్టినపుడు బ్రహ్మ యోనియైన
యాజ్ఞవల్క్యునితో నీవు చదివినదంతయు మరల నాకిచ్చివేయుము అని యనెను-18. ఇట్లనగనే బ్రహ్మ విత్తముడైన యాజ్ఞవల్క్యుడు రక్తసిక్తములైన రూపముదాల్చిన యజుస్సులను వమనముజేసి గురువుకిచ్చెను-19. తరువాత నో ద్విజులారా! యాజ్ఞవల్క్యుడు ధ్యానయోగమున నిలచి సూర్యునారాధించెను. యాజ్ఞవల్క్యునినుండి వెలువడిన యజుర్వేదమంతయు నాకాశమునకు బోయి వేదాత్మకుడగు సూర్యుని జేరి నీలచినది-20. తరువాత పైకి సూర్యమండలమును జేరిన యజుస్సులనన్నింటిని సంతుష్టుడైన సూర్యుడు వేదమునకు విధానరూపుడైనట్టియు, ధీశాలియైనట్టియు, తన యశ్వరూపుడైనట్టి యాజ్ఞవల్క్యునకు నిచ్చెను-21. బ్రహ్మచేతగాని మరెవ్వరిచేతగాని అశ్వరూపుడగు యాజ్ఞవల్క్యునిచే నిచ్చిన యజుస్సుచే యధ్యయనము జేయబడును. అందువలన నవి వాజులు (గుఱ్ఱములు) అనబడినవి-22. బ్రహ్మహత్య యెవ్వరిచే చీర్ణమైనదో (చరింపబడినదో) వారు చరించుట వలన చరకులనబడినారు. వైశంపాయన శిష్యులైనట్టి వారు చరకులని చెప్పబడిరి.
అను వీరు చరకులని చెప్పబడిరి. వాజులైన వారిని గూర్చి వినుడు. వారు యాజ్ఞవల్క్యుని యొక్క శిష్యులు. వారు కణ్వవైధ్యలు, శాలులు-24, మధ్యందినుడు శాపేయి, విదిగ్దుడు ఆప్యుడు, ఉద్దలుడు, తామ్రాయణుడు, పాత్యుడు, గాలవుడు, శైశిరి, ఆటవి, పర్లి, వీరణీ పరాయణుడు అను వీరు పదియైదుగురు వాజులని చెప్పబడిరి. యజుస్సుల యొక్క వికల్పములు మొత్తము నూటయొక్కటి.
తఱువాత జైమిని తన పుత్రుని సుమంతుని జదివించేను. ప్రభువైన సుమంతుడు గూడ పుత్రుడైన సుత్వానుని జదివించేను-27. సుకర్ముడు సైతము సహస్రుని వేగముగా జదివించి సుకర్మ సూర్యవర్చస్వియైన సహస్రునకు సంహితలను జెప్పెను-28. ఇంద్రుడు అనధ్యాయదినములలో జదువుచున్న వారిని జంపెను. తరువాత సుకర్ముడు శిష్యుల కారణముగా ప్రాయోపవేశము (నిరాహారదీక్ష) జేసెను-29. తరువాత ఇంద్రుడు కోపించిన సుకర్ముని జూచి యాతనికి “నీకు మహవీర్యవంతులు, అగ్నితేజస్కులునైన శిష్యులు గలుగనున్నారు-30. వీరు మహా ప్రజ్ఞాశాలురునైన యీ యిద్దరును చక్కగా జదువువారు. వీరిరువురు దేవతలు, మహాభాగులు. ఓ బ్రాహ్మణోత్తమా! కోపింపకుము-31. ఈ విధముగా నింద్రుడు సుకర్మునకు జెప్పి యా సుకర్మను శాంతక్రోధునిగా జూచి యచటనే యంతర్థానమందెను-32. ద్విజులారా! ఆ సుకర్ముని శిష్యుడు బుద్ధిశాలియైన పౌష్యంజియయ్యెను. కుశిక వంశజుడైన హిరణ్యనాభుడు అను రాజు రెండవ శిష్యుడయ్యెను-33. పౌష్యంజి వేయిన్నర (ఏబది) సంహితలను (శిష్యులకు) జదివించెను. దానిచేత పౌష్యంజి శిష్యులు అన్యోదీచ్య (ఇతరులైన యుత్తర దిక్కువారు) సామాన్యులై శుభులై-34, వీర్యవంతుడైన కౌశిక్య హిరణ్యనాభుడు ఐదువందల (నూటయైదు) సంహితలను జదివించేను. హిరణ్యనాభుని శిష్యులు ప్రాచ్య సామగులుగా చెప్పబడినారు. లోకాక్షి, కుథుమి, కుశలి, లాంగలి యను నలుగురు పౌష్యంజీ శిష్యులు. వారి భేధములను వినుడు-36. రాణాయనీయుడు ఆదడు తండి పుత్రుడు, వానికంటే వేరైన వాడు మూలచారి మంచి విద్వాంసుడు. సతి పుత్రుడు, సహసాత్యని పుత్రుడు వీరి లోకాక్షియొక్క భేదములుగా దెలిసికొనుడు-37. కుడుమీ యొక్క పుత్రులు ముగ్గురు. ఔరసుడైన రసపాసరుడు, భాగవిత్త, తేజస్వీ అను విధముగా కామములు మూడు విధములుగా జెప్పబడినారు. శాంద్యుర్యుడు, శృంగిపుత్రుడు (శౌర్జుడు) వీరిద్దరును చక్కగా వ్రతమాచరించినవారు. రాణాయనీయుడు, సౌమిత్రియు సామవేద పండితులు-39. మహాతపస్వియైన శృంగిపుత్రుడు మూడు సంహితలను జెప్పెను. బ్రాహ్మణోత్తములారా! చైలుడు, ప్రాచీన యోగుడు, సురాలుడును సంహితలను జెప్పిరి-40. పారాశర్యుడైన కౌథుముడు ఆజు సంహితలను జెప్పెను. ఆ సురాయణుడు, వైశ్యాఖ్యుడును వేదవృద్దులందాసక్తి గలవారు 41. ప్రాచీన యోగ పుత్రుడును బుద్ధిమంతుడునైనవాడు పతంజలి. కౌధుముని యా భేదములు సారాశర్యుని యొక్క యాలు (భేదములు)గా జెప్పబడినవి. లాంగలియు శాలిహోత్రుడును చెరియొక యాలు సంహితలను జెప్పిరి-42. భాలుకి, కామహాని, జైమిని, లోమగాయి, కుండుడు, కోహలుడు, ఈ యాజుగురును లాంగలులని చెప్పబడిరి. ఈ లాంగలులైన శిష్యులు సంహితలను ప్రసాదించిరి-43.. ఆ తరువాత హిరణ్యనాభునకు శిష్యుడై, మానవశ్రేష్ఠుడై రాజకుమారుడు ఇరువది. నాలుగు సంహితలను జేసెను. ఆ సంహితలు శిష్యులకు జెప్పెను. ఆ శిష్యులను వినుడు-44. వారు రాడుడు, మహవీర్యుడు, రోదవహడు వాహనుడును. తాలకుడు, పాండవకుడు, కాలికుడు, రాజికుడు గౌతముడు అజబస్తుడు, తజువాత సోమరాజు వచ్చెను-45. పృష్టఘ్నుడు, పరీకృష్ణుడు, ఉలూఖలకుడు, యవీయసుడు, వైశాలుడు, అంగుళీయుడు, కౌశికుడు, 46 సాలిమంజరి సత్యుడు, కాపీయుడు, కానీకుడు ధర్మాత్ముడైన పారాశరుడు అని క్రాంతులైనవారు సామగులు- 47. సామగులందరిలో శ్రేష్ఠులిద్దరని చెప్పబడిరి. వారు పౌష్యంజియు కృతయును వీరు సంహితల వికల్పకులు-48. ఓ బ్రాహ్మణులారా! సుమంతుడు అధర్వములను రెండు విధములుగా జేసి కబంధునకిచ్చెను. ఆతడుగూడ యథా క్రమముగా మొత్తము దెలిసికొనెను-49. కబంధుడు రెండుగాజేసి యొకదానిని పభ్యునకిచ్చెను. రెండవదానిని వేదస్పర్శునకిచ్చేను. ఆతడు దానిని నాలుగు విధములుగ జేసెను-50. వేదస్పర్శునకు దృఢవ్రతలైన నలుగురు శిష్యులు బ్రహ్మబలుడైన మోదుడు, పిప్పలాదుడు, ధర్మజ్ఞుడైన శాక్వాయనియు నాలుగవవాడు తనుడు అనబడెను-51. పథ్యులయొక్క యుత్తమ భేదమును మరల మూడు విధములని తెలిసికొనుము. జాజలి, కుముదాది, మూడవవాడు శౌనకుడనబడెను-52. శౌనకుడు సంహితను రెండుగాజేసి యొకదానిని బ్రభువునకిచ్చెను. ధీమంతుడైన శౌనకుడు రెండవదానిని సైంధవాయనుడను పేరు గలవానీకిచ్చెను-53, సైంధవుడు ముంజకేశునకిచ్చెను. ఆ సంహిత మరల రెండుగా భిన్నమయ్యెను. నక్షత్ర కల్పము, వైతానము, మూడవది సంహితావిధి, నాలుగవది యంగిరసంకల్పము, ఐదవది శాంతికల్పము-56. ఆధర్వణము శ్రేష్ఠము. ఇవి సంహితల యొక్క వికల్పనములు. ఓ ఋషి సత్తములారా! ఆలుగాజేసి నాచేతగూడ పురాణము చెప్పబడినది.
ఆత్రేయుడు, సుమతి, ధీమంతుడు, కాశ్యపుడు, అకృతవ్రణుడు, భారద్వాజుడు, అగ్నివర్ణుడు, వసిష్ఠుడు, మిత్రయుడు, సావర్ణి, సోమదత్తి, సుశర్మ శాంశపాయనుడు-56, హేబ్రహ్మన్! వీరు నా శిష్యులు, పురాణములలో దృఢవ్రతులు, మూడు సంహితలు మువ్వురిచే మరల మూడుగాచేయబడినవి-57. కాశ్యపుడు సంహితాకర్త. సావర్ణి శాంశపాయనుడును (సంహితాకర్తలు). సౌమికా, అనునది నాలుగవ సంహిత. ఆ యిది పూర్వసంహిత-58. ఆ సంహితలన్నియు నాలుగు పాదములు గలవి. అన్నియు నొకే అర్థమును జెప్పునవి. పాఠాంతరమున వేదశాఖలవలే వేరుగానైనవి. అన్ని సంహితలును శాంశపాయనిక సంహితను విడిచి నాలుగువేలు-59. లోమహర్షణికులు మూలములైనవారు. అటు తరువాత వారు కాశ్యపికులు, మూడవవారు సావర్ణికులు యజుర్వాక్యార్థ పండితులు ఇతరులు ప్రేరణార్థముతో నలంకరింపబడిన శాంశపాయనులు. వీరి ఋక్కులు ఎనిమిదివేల యాజువందలు-61. ఇవియు, మజీపదియైదును మరివందయును వాలఖిల్యులు సమాన పైషలుగలవారై ససావర్ణులుగా జెప్పబడిరి-62. సామవేదగాయకులు ఎనిమిది వేల పదునాలుగు సామములు ఆరణ్యకముగా హోమముతోబాటు గానము జేయుదురు-63. వ్యాసుడు వికల్పించిన ప్రకారము యజుస్సుల యొక్కయు, బ్రాహ్మణుల యొక్కయు పండ్రెండు వేలే కలవు. ఛందము ఆధ్వర్యవమనబడినది-64. అది సంగ్రామ్యారణ్యకమగును. అట్లే సమంత్ర కరణము గూడనగును. దీనికి తరువాతి కథలకు పూర్వములు అను విశేషణముండును-65. సమంత్రమైన గ్రామ్యారణ్యము ఋగ్రాహ్మణము యనబడినది. అట్లే హరిద్రవీయుల యొక్కయు, తైత్తిరీయుల యొక్కయు ఖిలములైనవియు ఉపఖిలములైనవియును పరక్షుద్రములనబడినవి.
వాజసనేయ వేదమున ఒక వేయి తొమ్మిది వందలు ఋగ్గణము. లెక్కింపబడినది. బ్రాహ్మణము మాత్రము నాలుగింతలు. ఎనిమిది వేల యెనిమిది వందల యెనుబది యధికమైనది పాదము. ఇది ఋక్కుల యొక్కయు యజుస్సుల యొక్కయు ప్రమాణము. అది శుక్ల యజుస్సుతోను అఖిలయాజ్ఞవల్క్యముతోను గూడినది.
అట్లే చరణ విద్యలయొక్క ప్రమాణము (అయిన) సంహితను వినుము. ఆఱువేల ఋక్కులు చెప్పబడినవి. మఱియు పదినాలు గూడ చెప్పబడినవి. ఈ ఋక్కులకింతయే యధికము. యజుస్సును ఇష్టము వచ్చినట్లు చెప్పదలచును-69. పదునొకండు వేలు మణి పదియైదు పదివేల ఋక్కులు మూడు వందల యెనుబదియు 70 ఒక వేయి మంత్రములు ప్రమాణముగా జెప్పబడినవి. భృగుల విస్తారమంతయు ఇతరమైన యాధర్వికము చాలయున్నది-71. ఐదువేల ఋక్కులు ఐదువేలు అధర్వములు అని నిశ్చయము. ఇరువదిని విడిచి వేయి మరొక్కటియని ఋషులు తెలియవలెను-72. ఇది అంగిరసునిచే చెప్పబడినది. ఇది వారి యారణ్యకము అని యీ విధముగ (ఋక్కులు) లెక్కింపబడినవి. అట్లే శాఖాభేదములు గూడ జెప్పబడినవి-73. శాఖలయొక్క కర్తలును, వారి భేదములలో కారణములను సమస్త మన్వంతరములలో గూడ నిట్లేయుండును. శాఖాభేదములు గూడ సమానమని చెప్పబడినవి.
ప్రాజాపత్యమైన శ్రుతి నిత్యమైనది. ఇవి దాని వికల్పము (భేదము)లనబడినవి. దేవతలయొక్క నిత్య భావము వలన మరల మరల మంత్రోత్పత్తి జరిగినది-75. మన్వంతరముల యొక్కయు, సురలయొక్కయు నామ నిశ్చయము జేయబడుచున్నది. ద్వాపరయుగములందు వినబడిన వేదములకు మరల భేదములు చెప్పబడినవి.
ఈ విధముగ భగవద్రూపుడైన ఋషి శ్రేష్ఠుడు వేదమును ఇతర శిష్యులకు నిచ్చి మరల తపము జేయుటకు వెళ్ళెను. ఆతని శిష్యుల ప్రశిష్యుల చేత నీ శాఖాభేదములు ప్రవర్తింపజేయబడినవి-77. శిక్షాదులైనయాయి అంగములు (వేదాంగములు) నాలుగువేదములు, మీమాంస, న్యాయము, ధర్మశాస్త్రము, పురాణము ఇవి చతుర్దశ (14) విద్యలు-78. ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము అను నీ మూడును, నాలుగవది యర్థ శాస్త్రము ఇవి యష్టాదశ (18) విద్యలు-79. మొదటివారు బ్రహ్మర్షులని యెఱుగవలెను. వారి నుండి దేవర్షులు వారి నుండి. రాజర్షులు, వారి నుండి మూడు ఋషి ప్రకృతులును వచ్చిరి. అని తీక్షవ్రతులైన మునులచే తెలియదగినది-80. కశ్యపగోత్రములందును, వసిష్ఠ గోత్రములందును, భృగు, అంగీరస గోత్రములందును ఈ యైదు గోత్రములందు బ్రహ్మవాదులు జన్మింతురు. బ్రహ్మను బొందుదురు గావున బ్రహ్మరులనబడినారు-81. ధర్మునకును, పులస్త్యునకును, క్రతువునకును, పలహునకును, ప్రత్యూషునకును, ప్రభాసునకును, కశ్యపునకును-82, సుతులు దేవర్షులు పేరులతో వారిని వినుడు. ధర్మపుత్రులైన దేవర్షులు నరనారాయణులిరువురు-83. క్రతువు యొక్క పుత్రులు వాలఖిల్యులు. పులహునకు పుత్రుడు కర్దముడు. పులస్త్యునకు పుత్రుడు, కుబేరుడు, ప్రత్యూషునకు పుత్రుడు అచలుడు-84. కశ్యపుని పుత్రులు పర్వతుడును నారదుడును నిరువురు. వీరు దేవతలను బొందుదురు గాన దేవర్పులనబడినారు-85. మానవ వంశమునను, వైషయ వంశమునను. ఐలవంశమునను బుట్టి రాజులు ఐలులనియు, ఇక్ష్వాకులనియు నాభాగులనియు వారు రాజర్షులు-86. రంజింపచేయుట వలన ప్రజలు రాజులను బొందుదురు గావున రాజర్షులనబడినారు. బ్రహ్మలోకమున సుప్రతిష్ఠితులైన వారందరిని రాజర్షులుగా నొప్పుదురు. ఇంద్రలోకమున సుప్రతిష్టితులైన వారినందరిని రాజర్షులుగా నొప్పుదురు-87,88. వంశముతోను, తపస్సుతోను మంత్రోచ్చారణములతోను బ్రహ్మర్షులుగా జెప్పబడినారు. దివ్యులైన రాజర్షులు దేవర్షులు.
దేవర్షుల యొక్కయు లక్షణమును జెప్పెదను. భూత- భవిష్యత్ వర్తమాన కాలముల జ్ఞానము, సత్యము బలుకుట అట్లే స్వయముగా జ్ఞానులైన వారును. తపస్సుచే జ్ఞానులైన ప్రసిద్ధులైనవారును, గర్భమునందుండగనే జ్ఞాన ప్రేరణగలవారును, 91 మంత్రముల బలుకువారును, ఈశ్వర భావమువలన సర్వము దెలసిపోవువారును, అను వీరు దేవర్షులు బ్రహ్మర్షులు రాజర్షులు అగుదురు.
ఈ భావములను అధ్యయనముజేయు వారు ఋషులని యొప్పుదురు. వీరేడుగురు. ఏడుగుణములచే సప్తర్షులనబడినారు-93. వీరు దీర్ఘాయుషులు, మంత్రకర్తలు, ఈశ్వరులు, దివ్యచక్షువులు గలవారు, జ్ఞానులు, ప్రత్యక్షమైన ధర్మము గలవారు. గోత్ర ప్రవర్తకులు-94. షట్కర్మలయందాసక్తి గలవారు (యజన-యాజన-అధ్యయన -అధ్యాపన - దాన - ప్రతిగ్రహములు) షట్కర్మలు. నిత్యమును బ్రకాశించువారు, గృహస్థులు, సమానములై కనబడని కర్మ హేతువులచే వీరు వ్యవహరించుచుందురు-95. స్వయంకృతములై మైథునాది గ్రామ్యములుగాని యానందములతో వర్తింతురు. వారు కుటుంబము గలవారు. బుద్ధిమంతులు. బాహ్యములోను అంతరములోను నివసించువారు-96. వీరు కృతయుగాదులన్నింటిలోను మరల మరల మొదట వర్ణాశ్రమ వ్యవస్థానమును జేయుదురు-97. త్రేతాయుగము రాగా మరల సప్తర్పులిచటనంతటను ఈ బ్రాహ్మణాది వర్ణములను బ్రహ్మచర్యాది ఆశ్రమములను ప్రైవర్తింపజేయుదురు. వారి యొక్క వంశమునందే మరల మరల వీరులు బుట్టుదురు-98. పుత్రుడు గలుగుచుండగా తండ్రియు, తండ్రియుండగా తన పుత్రుడును ఈ విధముగా నొక్కచోజేరి (వంశపారంపర్యము) ఎడతెగకుండగా యుగాంతము వరకును ఈ సప్తర్షులు ప్రవర్తింపజేయుదురు. గృహమేధులకు ఎనుబది యేనియొది వేలు చెప్పబడినవి-99. సూర్యునకు దక్షిణమున నున్న వారు పితృయాణమును సమాశ్రయింతురు. భార్యతో సహ అగ్ని హోత్రముజేయువారై (పితృదేవతలై) సంతానహేతువుల నబడినారు 100. గృహమేధుల సంఖ్యలతో లెక్కింపబడినవారై శ్మశానముల నాశ్రయించినవారు ఎనుబది యెనిమిది వేలు ఉత్తరాయణము నందుంచబడును-101. స్వర్గమును బొందిన యూర్ణ రేతస్కులైన ఋషులు మంత్ర బ్రాహ్మణకర్తలై యుగాంతమున జన్మింతురు.
ఈ విధముగ ద్వాపరయుగమున కల్పములయొక్కయు భాష్యవిద్యలయొక్కయు శాస్త్రకారుని యొక్కయు నాశనము జరుగగా ఆ ఋషులు మరల మరల పరిభ్రమించుచుందురు-103. రాబోవు ద్వాపరమున ద్రోణి ద్వైపాయను (వ్యాసు) డగును. గడచిన ద్వాపరమున చక్కని గొప్ప తపస్సుగల వేదవ్యాసుడు వ్యాసుడగును-104. భవిష్యత్కాలములందు శాఖాప్రణయాని (శాఖలను చేర్చుట) కాగలదు. దానికొజకు ఆవేదము తపస్సు చేతను నాశము లేని బ్రహ్మ పొందబడినది-105. తపస్సుచే కర్మపొందబడినది. కర్మచేత కీర్తిపొందబడినది. కీర్తిచేత సత్యమును బొందును. సత్యముచేత అవ్యయుడు (నాశము లేనివాడు) పొందబడును-106. అవ్యయము వలన నమృతమును, అమృతమువలన సమస్తమును బొందును. ఇది ధ్రువమైన (స్థిరము) ఏకాక్షరము స్వాత్మయందే నిలచియున్నది. అది బృహత్తైనందునను (విశాలమైనందునను) బృంహణమైనందునను (విజృంభించిన వ్యాపించునదగుట చేతను) బ్రహ్మయనబడుచున్నది.
మరలనది ప్రణవమునందు (ఓంకారమునందు) ఉండినదై భూర్భువస్వ అనువ్యాహృతుల రూపమున నుండును. ఋగ్యజుస్సామాథర్వరూపియైన బ్రహ్మకు నమస్కారము-108. జగత్తు యొక్క ప్రళయ ఉత్పత్తులందు కారణమని గుర్తింపబడినదియు మహత్తుకంటే పరమమైనదియు రహస్యమైనదియు నైన యా సుబ్రహ్మకు నమస్కారము-109. అగాధమై యపరమై యక్షయ్యును, జగత్తును సంమోహింపజేయుటకు నిలయమైన వాడును ప్రకాశప్రవృత్తులతో పురుషార్థముల ప్రయోజనమునము గలవాడునైన యాసుబ్రహ్మకు నమస్కారము-110. దేహవిలక్షణమైన యాత్మజ్ఞానముగలవారికి ఒకయునికి రూపమైన ప్రాప్తి స్థానము, ఆత్మకు సంగమునిచ్చునదియు అవ్యక్తమైనదియు, యమృతమైనదియు శాశ్వతమైనది ప్రకృతి బ్రహ్మ-111, అది ప్రధానము, ఆత్మయోని, గుహ్యము, సత్యము అనిపిలువబడును. అట్లే విభాగములేనిది, శుక్రస్వరూపము, అక్షరము, బహువాచకమును (అనేకమును చెప్పునది) నైన యాపరబ్రహ్మకు నిత్యము నమస్కారములు జేయుదును-112. పనిచేయబడగా క్రియయుండదు. చేయనప్పుడు గూడ క్రియయుండదు. (చేయని క్రియయుండదు). క్రియభూత కాలమైనప్పుడు వర్తమానమున క్రియయుండదు. అట్లే క్రియ భవిష్యమైనప్పుడు గూడ వర్తమానమున నుండదు. ఒక్కమారే యంతము జేయబడినది. కావున నది భూతకాల దృష్టితో కృతము భవిష్యత్కాల దృష్టితో అకృతమును అగుచున్నది-113. వినదగినది (భవిష్యత్)గాని, వినబడినది (భూతము)గాని యట్లే సాధువుగాని, తెలియగినదిగాని, మననము జేయదగినదిగాని, తాకదగినదిగాని, భుజింపదగినదిగాని, చూడదగినదిగాని, వినదగినదిగాని తెలియదగినదిగాని యేదైనయుండినచో-114, ఆ బ్రహ్మరుల జ్ఞానము. చూపబడినది. చూపబడిన యాజ్ఞానమును మరలనెవ్వడు వెదకును? భగవంతుడైన వాడే పుం - స్త్రీ వస్తురూపమైన (యన్నింటిని అందరిని) చెప్పెను-115. ఒకచే నొకపని చేయబడినపుడు దానిని వాడభిమానించును. ఒకనిచే పూర్వము చేయబడినది మరొకనిచే భావింపబడును-116. ఒకానొకచోట ఒకనిచే ఒక వాజ్మయము రచింపబడినపుడు పూర్వ మది యాతని చేత చేయబడియుండినదై యాకర్తకు సంబంధించినదిగానే ప్రకాశించును-117. విరక్తమును, యవిరక్తమును, జ్ఞానాజ్ఞానములును, ప్రియాప్రియములును, ధర్మాధర్మములును, సుఖదుఃఖములును, మృత్యువు అమృతమును, పైన అడ్డము, క్రిందయును ఆతని కోసం బంధించిన యదష్టమే కారణముగా గలది.
దేవతలను ఋషులను లెక్కించుటలో నిష్ణాతులైన బ్రాహ్మణులచేత ఆ సంఖ్యలు నిండు ముప్పది కోట్లుగా లెక్కింపబడినవి-138. అట్లే తక్కినవి లేక్కలో అటువది యేడు లక్షల యిరువదివేలు. ఈ కాలము అధికములను విడిచి లెక్కింపబడినది-139. ఈ మన్వంతరసంఖ్య మానుషగణనలో జెప్పబడినది. దివ్యవత్సరముతో మనువు యొక్క యంతరమును జెప్పెదను-140. దివ్యసంఖ్యలో నెనిమిది వందలు అని చెప్పబడినది. అట్లే తక్కినవి యేబది. రెండువేలధికములని చెప్పబడినది-141. ఈ కాలము నాలుగింతలైనచో అది ఆభూత సంప్లవము. (భూతముల ప్రళయము). అది నిండుగా వేయి యుగములగును. అది బ్రహ్మకొక దీనమనబడినది-142. అధిభూత సంప్లవమున సూర్యకిరణములతో నన్నిభూతములు కాలిపోయినవై బ్రహ్మను ముందడుకొని దేవ-ఋషి-దానవులతోబాటు,దేవశ్రేష్ఠుడు దేవదేవుడునైన మహేశ్వరునిలో బ్రవేశించును. ఆతడు (మహేశ్వరుడు) కల్పాదులలో మరల మరల సర్వభూతములను సృష్టించువాడు. అని యిది దేవర్పులతోబాటు మనువుయొక్క స్థితికాలము-144. సర్వమన్వంతరముల త్రిసంధిని వినుడు. ఈ విషయమున నాలో యుగమను పేరుతో బూర్వమే చెప్పబడినది-145. కృతవ్రేతాదులతోగూడినది చతుర్యుగమనబడినది. అది యిరువది యొక్క మారులు తిరుగుతు వచ్చినది. సాధికము ప్రభువైన భగవంతుడు (దీనిని) మనువుయొక్క యధికారముగా జెప్పెను 146. ఈ విధముగ భూత- భవిష్యత్తులైన మన్వంతరముల లక్షణము, వర్తమానముతో జెప్పబడినది-147. అని యిది స్వాయంభువమనువు యొక్క సృష్టి చెప్పబడినది. దానియొక్కయు వేరొకదానియొక్కయు త్రిసంధిని జెప్పెదను-148. మన్వంతరము యథాపూర్వముగనే ఋషులతోను దేవతలతోను గూడ అవశ్యంభావి (తప్పనిసరిగా జరుగు) అర్థము (విషయము)తో సంబద్ధమై నివర్తించును-149. ఈ మన్వంతరమున పూర్వము త్రైలోక్యమున కీశ్వరులైన సప్తర్షులు, దేవతలు, పితరులు, మనువులును మన్వంతరకాలము సంపూర్ణముగాగానే సాధకులును క్షీణాధికారులై యాత్మయొక్క ప్రతిరూపమును దెలిసినవారై వారందరు మహర్లోకమునకు ఉన్ముఖులై గమనమునకు బూనుకొందురు-151. తజువాత నా మన్వంతరమున ప్రక్షీణులైన యాదేవతలు స్థితికాలము సంపూర్ణముగా ఒక కృతయుగము (వరకు) ఉందురు-152. మన్వంతరేశ్వరులు న్నంతవరకు దేవతలు, పితరులు, ఋషులు మనువును పుట్టుచుందురు. పుట్టబోవుచుందురును-153. మన్వంతరము సంపూర్ణమైనప్పుడు మడొక కలియుగము వచ్చినచో (చీవర కలియుగమేర్పడినచో) అప్పుడు కలితో మిగిలియున్న (కలిశేషించియున్న) యుగములో (చివరి కలియుగములో) కృతయుగ (లక్షణ)ము సంపన్నమగును-154. బుధులు కృతయుగము యొక్క సంతానమును కలి పూర్వకముగా (కలియుగము తనకు పూర్వయుగమైనట్లుగా జెప్పుదురు. అట్లే మన్వంతరముల చివరలలో (కలియున్నదై రానున్న మన్వంతరములకు ఆదియగును (కల్యాదియగును)-155. పూర్వమన్వంతరము క్షీణించి మరొక మన్వంతరము రాగా పూర్వమన్వంతరపు చివరి కలియుగమున మిగిలియున్న సప్తర్షులు, మునులు మన్వంతర సమాప్తి కాలమును జూచుచున్నవారై మరొక మన్వంతరమునకై ప్రతీక్షించుచు తపస్సులో నుండి క్షీణింతురు. మరొక మన్వంతర ప్రారంభమున మన్వంతర వ్యవస్థ కొఱకును అంతట సంతతి కొఱకును పూర్వము వలెనే (పూర్వయుగములో వలెనే) సృష్టిలో ప్రైవర్తింతురు. వృష్టి సృష్టి ప్రవర్తింపగా 156, 157, 158 జంటలు సృష్టింపబడగా, ఓషధులు బుట్టగా, అచ్చటచట ప్రజలు వారి గృహములు నెలకొనగా 159 జీవనోపాయము లేర్పడగా, ఋషులు భావించిన సద్ధర్మములు ప్రవర్తిల్లినవి. అంతకుముందు లోకము నిరానందమైపోయినది. స్థావరజంగమములు నష్టమైనవి- 160. గ్రామ నగరములులేవు. వర్ణాశ్రమములు వదిలివేయబడినవి. ఇట్టి పూర్వమన్వంతరము శేషించినపుడు (చివరనున్నపుడు) ఉన్నటువంటి ధార్మికులు, సప్తర్పులు, మనువును సంతానార్థముగా నెలకొనియుండిరి-161. సంతానమునకై మిక్కిలి సాధ్యమైన తపము నాచరించు వారందరికిని మరణములందు ఇటనంతటను 162 దేవాసురులు, పితృగణములు, మునులు, మనువులు, అట్లే సర్పములు, భూతములు, పిశాచములు, గంధర్వులు యక్షులు, రాక్షసులును బుట్టుదురు-163. తరువాత వారికి మిగిలిన -శిష్టులు శిష్టాచారములను జెప్పుదురు. మన్వంతరము యొక్క ప్రారంభమున సప్తర్పులు మన్వంతరముయొక్క ప్రారంభమున సప్తర్షులు, మనువును కర్మల నారంభింతురు. మనుష్యులు దేవతలతోబాటు కర్మలు చేయుదురు-164. మన్వంతరాదిలో ముందే త్రేతాయుగ ప్రారంభమున మొదట దేవతలు, తరువాత మనుష్యులును అన్ని విధముల ధర్మములును ఉండినవి 165. బ్రహ్మచర్యము (వేదాధ్యయనము)చే ఋషుల ఋణము దీర్చుచుండిరి. సంతానముతో పితరుల ఋణమును దీర్చుచుండిరి. యాగముతో దేవతల ఋణమును దీర్చుచుండిరి-166 పూర్వము స్వర్గము కొరకు ప్రముఖులైన దేవతలలోను మనుష్యులలోను ముందు దేవతలును తరువాత మనుష్యులును ధర్మముతోనే యంతట నుండిరి-168. మన్వంతరము తీరిపోగా వారు అంతటను స్థానములను వదిలి, మంత్రములతో గూడ ఆరోగ్యవంతమైన యూర్థ్వలోకమైన మహర్లోకమునకు బోవుదురు-169. వికారములు పోయినవారై వారు మానస సిద్దియందున్నవారై, ముందును ఎదిరి చూచుచున్నవారై తమ యింద్రియములను తమను వశమునందుంచుకొన్నవారై వారు భూత ప్రళయము వరకు ఉంటున్నారు.
తరువాత ఆ యుగములు గడచిపోగా, వానిలోని యా వారందరును గడచిపోగా, త్రైల్యోక్యమున నంతటను ఆ దేవస్థానములు శూన్యములు గాగా, స్వర్గవాసులైన దేవతలు ఇతరులును ఇచటనే (భూలోకమునను) యున్నారు-171. తరువాత వారు తపస్సుతో గూడినవారై సత్యముతోను, బ్రహ్మచర్యముతోను, వేదముతోను గూడినవారై యా స్థానములను పూరింతురు-172. పూర్వులైన సప్తర్షులకును, మనువునకును, పితరులతోబాటు దేవతలకును భూతకాలము చేతను భవిష్యత్కాలము చేతను నిటనిధనములు (మరణములు) గలుగును-173. మన్వంతర క్షయమువలన వారికీట మరణము గలుగును. ఈ విధముగ పూర్వము ననుసరించి వానియొక్క స్థితి స్థిరమైనది కాదు. ఇది యన్ని మన్వంతరములలోను భూత ప్రళయమువరకు ఉండును-174. ఈ విధముగా స్వాయంభువమనువు చేత భూత భవిష్యత్కాలములోని మన్వంతరముల ప్రతి సంధాన (కలయిక) లక్షణము చెప్పబడినది-175. మన్వంతరములు గడచిపోవగనే భవిష్య మన్వంతరములకు సాధనము (రప్పించు సాధనము) భూత ప్రళయమువరకు పూర్తిగా విచ్చిన్నమయి యుండును-176. మన్వంతరముల పరివర్తనములు (మార్పులు) ఏకాంతముగా (రహస్యముగ) మహర్గతములగును (మహాలోకమున నుండును). మహస్సు (మహాలోకమును) జననము (జనోలోకమును). జనము (జనోలోకము) తపస్సును (తపోలోకమును) అది సత్యమున (సత్య లోకమున నేకాంతముగ జేరియుండును. (ఏడులోకములు పూర్వపూర్వములు ఉత్తరోత్తర లోకములలో నేకాంతముగ నుండును-177. వానిని (లోకములను) భావించువారు వానినచటజూచుటచేతను, నాసాత్వముచేత జూడబడిన జ్ఞానము మన్వాది సృష్టి ప్రతిసర్గ కాలమున వికారము ప్రాప్తింపగా నవి (ఆలోకములు) యపుడు సత్య(లోక)ము నందుండును 178. పరాంతకాలమున మన్వంతర పరివర్తనములు సత్య (లోక)మును వదిలివేయును. తరువాత అభియోగము వలన విషమ ప్రమాణుడైన నారాయణదేవునిలోనే ప్రవేశించును-179. విధి స్వభావము వలన మన్వంతర పరివర్తనములు చాలకాలమునకు బ్రవర్తిల్లగా జీవలోకము క్షయ- అభివృద్దులతో తిరుగుచు క్షణకాలము ఆనందముగా నుండును-180. అనునివి ఋషులచే స్తుతింపబడిన ధర్మాత్ములై దివ్యదృష్టి గల మనువులయొక్క సమాధానములు వాయుదేవునిచే విస్తార సంగ్రహములుగా రచింపబడిన యీ సమాధానములు దివ్యతేజస్సుతో జూడదగినవి-181. అవి యన్నియు యుగములు రాజర్షులతోను దేవర్చులతోను గూడినవి. బ్రహ్మర్పులతోను, దేవతలతోను ఉరగులతోను గూడినవి. ఇంద్రుని చేతను, సప్తర్షులచేతను, పితృదేవతల చేతను రాజులచేతను కూడినవి. చక్కని పరివర్తనములు గలవి-182. ఇది (వాయు పురాణము) గొప్పనైన వంశము, కులము, కాంతియు గలవారును, గొప్పనైన మేధాశక్తితో వృద్ధిచెందినవారును, కీర్తి-కాంత్-ఖ్యాతులతో గూడిన వారునునైన యీశ్వరుల (ప్రభువుల) యొక్కయు ప్రవచనము పుణ్యమైనది గదా!-183. ఇది (వాయు పురాణము) స్వర్గమునిచ్చునది. పవిత్రమైనది, పుత్రులనిచ్చునది. మిక్కిలి రహస్యమైనది. (పరబ్రహ్మమే రహస్యములుగా గలది). మహా పర్వములలో జపించదగినది శ్రేష్ఠమైనది. దుఃస్వప్న శాంతికమైనది. పరమాయుష్యమిచ్చునది-184. రాజులు, దేవర్షులు, మనువు ప్రధానముగా గలిగి ప్రసిద్ధమైన బ్రహ్మయొక్క పుణ్య ప్రసూతిని (సృష్టిని) ఈ వాయు పురాణమున చెప్పినది. దీని ప్రవచన వ్రతమునకై నాయొక్క సిద్ధిరూపమైన చక్కని మహేశ్వరతత్యమును ఓ మునులారా! మీరు పొందుడు-185. అని యీ విధముగ ఆనుపూర్వితో విస్తరముగ స్వాయంభువ మన్వంతరము చెప్పబడినది. ఇంకను నేనేమి చెప్పవలెను?
ఇది శ్రీవాయుప్రోక్తే మహాపురాణమున ప్రజాపతి వంశానుకీర్తనమను నలువదియొకటవ యధ్యాయము.
ఇది శ్రీమద్వాయుపురాణమున పూర్వార్థము సమాప్తము.
