వాయు మహా పురాణము
44 - భువనవిన్యాసో
సూతుడనెను:- భద్రాశ్వుల నిజమైన స్వభావమిది వర్ణింపబడినది. ఇక కేతుమాలుల స్వభావమును విస్తరముగా వినుడు-1. పశ్చిమ పుదైన నిషధాచల శ్రేష్ఠము యొక్క పశ్చిమముగా సర్వదిక్కుల యందు చెప్పబడిన-2, యేడు కులాచలముల యొక్కయు, నదుల యొక్కయు, విశేషించి జనపదముల యొక్కయు విస్తరమును మీరు వినదగియున్నారు-3. విశాలము, కంబలము, కృష్ణము, జయంతము, హరిపర్వతము, అశోకము, వర్ధమానము అనునీ యేడు కుల పర్వతములు. వాని సంతానమై బహు విస్తారములైన యితర పర్వతమలు నూర్లకొలది వియు వేలకొలదీ వియునై కోటి కోటి శతములని తెలియవలెను-5. వానితో గలిసిన జనపదములు నానా జాతులతో వ్యాకులములు నానా ప్రకారములునై యనేక రాజులచే పరిపాలింపబడినవి-6.
అవి భూమిలో వాని వాని పేర్లతో విక్రమించినవై వివిధములుగా జెప్పబడినవి. అవి జనపదములు నెలకొన్నవై కీర్తనములతో నలంకరింపబడినవి-7.
వాటికి సమానమైన పేరుగల రాష్ట్రము లనేకములు అవి గిరుల మధ్యలో సమస్థానములలోను విషమ (ఎగుడు దిగుడు) స్థానములలోను ప్రవేశించినవి-8. ఇచట పురమున నివసించు పౌరులు గోవులు మనుష్యులు పావురములు. వాని ముఖములు గలవారు. భ్రమరులు యూధులు మాహేయాచలకూటకులు (మాహేయా చల శిఖరముననుండువారు) కూట కంబలమౌషీయులు (కూటముగ నుండువారు గొంగళ్ళు ధరించువారు ఎలుకలతో నుండువారు), సముద్రాంతరకులు (సముద్రాంతర్భాగమున నుండువారు)-9,10. కరంభవులు, కుచులు, శ్వేతులు, శుభులైన సువర్ణకంకణములు గలవారు శ్వేతాంగులు, కృష్ణపాదులు, విహులు, కపిలకర్షకులు-11, అత్యాకరాల గోజ్వాలులు, హీనాదులు, వనపాతకులు, మహిషులు, కుముదాభులు, కరవాటులు, సహనత్కచులు-12, శుకవాసులు, మహావాసులు, వనాసులు, గజభూమికులు-13, కుబేరులు (మిడి గ్రుడ్లు గలవారు) ధూమజులు, జంగులు, వంగులు, రాజీవులు కోకిలలు, వాచాంగులు, మహాంగులు, మధౌరేయులు, సురేచకులు-14, పిత్తలులు, కాచులు, శ్రవణులు, మత్తకాసినోలు, గోదావులు, బకులులు, వాగులు వంగకులు, మోదకులు, కలులు-15, అను వీరు కేతుమాలదేశమున నుండువారు పై పేరులలో భోగికార్థములతో వారి స్వభావములు తెలియవచ్చును). ఆ పై మహాభాగులు (గొప్ప యదృష్టవంతులు) మొదటిదియు, మంచి ప్రాకారముగలదియు, పుణ్యజలము గలదియు, మహా సర్పజములతో సేవింపబడినదియు నైన మహానదిని (జలములను) ద్రావుదురు-16, కంబలా తామసీ, శ్యామా, సుమేధా, వకులా, భీమా, ప్రభంజనా, కాంచీ, పుణ్యమైన కుశావతి-18, దక్ష శాకవతీ, పుణ్యోదీయను మహానదీ చంద్రావతీ, సుమూలా, ఋషభాయను నదీ శ్రేష్ఠము-19, సముద్రమాలా, చంపావతీ, ఏకాక్షా, పుష్కలా, వాహాసువర్ణ నందినీ-20, కాళిందీ, పుణ్యజలములు గల మహానదియైన భారతీ, శీతల జలములుగల పాతికా, బ్రాహ్మీ, మహానదియైన విశాలా-21, ఓవరీ, కుంభకారీ, నదీశ్రేష్ఠమైన రుషా, మహిషీ మానుషీ, దండానదనదీ-22, ఈ పైజెప్పిన నదులను (జలములను) ఇతరములైన యుత్తమ నదులను (జలములను కేతుమాలదేశవాసులు ద్రావుదురు ఆ దేశముననున్న ఉత్తమనదులనేకములు. అవి దేవరులచేతను సిద్దులచేతను సంచరింపబడినవి. పుణ్యజలములు గలవి. పాపముల బోగొట్టునవి. ఈ విధముగా కేతుమాల ద్వీపము అనేక పదములచే మిక్కిలి బలిసినది. గొప్పనదులచే నలంకరింప బడినది. అనేక రత్న సమూహములచే నలంకరింపబడినది. నిండైనది. నిత్యము సంతుష్టమైనది. మంగళమైనది-23, 24. ధనములచే ధాన్యములచే తక్కిన పదార్థములచేతను మిక్కిలి సమృద్ధమైనది. జనావాసములచేతను సంనిష్టమై మిక్కిలి గొప్పగా సమృద్ధమైనది. మహానదుల విభూషితమైనది-25.
ఇది శ్రీ వాయుప్రోక్తే మహాపురాణమున భువన విన్యాసమను నలుబదినాల్గవ యధ్యాయము - 44.
