నీవు అధర్మము వలన గలుగు గతులను గూర్చి తెల్పితివి. ధర్మ గతులం గూర్చి విన గోరెదము. ఏ పనిచేసి యశుభ గతిని పొందు దేనిచే శుభగతి నందునో యానతిమ్మన వ్యాసుడిట్లనియె.
పాపపు పనుల ధర్మపరుడై విపరీత మనస్సుతో జేసిన వాడు నరక మందును పొరబడి యధర్మము సేసి పశ్చాత్తాప బడి మనస్సును కుదుట బెట్టు కొన్నవాడు పాపము ననుభవింపడు. ఎంతెంత వరకు వాని మనస్సు దుష్కర్మమును గర్హించునో అంతంత వరకు వాని యుపాధి (శరీరము) యా ధర్మము నుండి నిడివడును. చేసిన తప్పును ధర్మ వాదులగు విప్రులకు దెల్పి నయెడల అధర్మము వలన జేసిన యపరాధము నుండి వేగముగ ముక్తు డగును. మానవుడు తాను జేసిన తప్పిదమును మనసు సమాధాన పరచుకొని నలుగురలో వెల్లడించు కొన్నకొలది యతుడు దాని నుండి విడివడును. పాము కుబునమును విడిచి నట్లు పూర్వ మనుభవించిన పాప ఫలముల నుండి విమోచన మందును. మన స్సమాధితో విప్రునికి వివిధ దానములు సేసిన యతడు సుగతి నందును. మానవుడు పాప మాచరించియు తత్పల మనుభవింప కుండుటకు జేయ వలసిన దానములను దెల్పెద వినుండు.
అన్ని దానముల కంటే నన్నదానము మిన్న. ధర్మపేక్ష కలవాడు వక్రము గాని బుద్దితో సర్వాన్న దానము సేయ నగును. మనుజులకు ప్రాణ మన్నము గదా! అన్నము వలననే జీవుడు పుట్టును. లోకము అన్నము నందు బ్రతిష్టితము లయి యున్నవి. (బ్రతుకంతయు నన్నము మీద నాధార పడి యున్న దన్నమాట!) అందు వలన నన్నము ప్రశంసార్హ మగును. దేవర్షి పితృ మానవు లన్నమునే మెచ్చు కొందురు. అన్న దానముచే స్వర్గ మందును. ఎంత లభించు నంత యున్నము ద్విజులకు బెట్ట వలెను. నిండు మనసుతో వేదాధ్యయన సంపన్ను లగు బ్రాహ్మణు లకన్న దానము నీయ వలెను. ఒక్క మారైన బదిమంది బ్రాహ్మణు లెవ్వడు వెట్టిన యన్న మారగింతురో మనస్పూర్తిగా నట్లేట్టిన వాడు పశు పక్ష్యాది జన్మము లెత్తడు. పదివేల మంది బ్రాహ్మణులకు అన్న సంతర్పము గావించి నాతడు మున్ను పాపరహితుడై చేసిన యధర్మము నుండి విముక్తి నందును. వేదములు సదివి భిక్షాటనము సేసికొని తెచ్చిన యన్నమును వేదవేత్త యగు విప్రునికి బెట్టిన వాడిహ లోకమున సుఖాభి వృద్ధి నందును. క్షత్రియుడు బ్రాహ్మణ ద్రవ్యమునకు హాని సేయక న్యాయ బరిపాలన సేయుచు సుసమాహితమున సుఖాభివృద్ధి నందును. క్షత్రియుడు బ్రాహ్మణ ద్రవ్యమునకు హాని సేయక న్యాయ బరిపాలన సేయుచు సుసమాహిత మనస్కుడై వేద విదులయిన ద్విజులకు బలాత్కారముగ లభించిన యన్నమును దానము నేసిన యెడల నీతడు ధర్మాత్ముడై రాజనముచే జేసిన దుష్కర్మ నెడబాపు కొనును. కృషి (వ్యవసాయము) సేసి వైశ్యు డార్జించు కొన్న ద్రవ్యమారవ వంతుగ బది శుద్దమైన దానిని ద్విజులకు దానము సేసి పాప విముక్తు డగును. శూద్రులు ద్విజాతులకు అన్నదానము సేసి పాప విముక్తు డగును. ప్రాణము లిక పోవునన్న సమయమున శూద్రుడు కర్కశుడై (కఠినుడై) సంపాదించిన అన్నమును కన్న కొడుకుచే గూడ బెట్టించి యన్నము విప్రులకు బెట్టిన వాడు దుర్గమును (కడువరాని కష్టముల) దాటును. న్యాయార్జిత మైన యన్నమును ఆనందముతో వేద వృద్దు లయిన విప్రులకు విందు సేసిన వాడు పాపముం బాయును. అన్నము లోకమందు ఊర్జస్కరము. కావున దానిని బెట్టిన వాడు ఊర్జస్వి యగును. సత్పురుషు లేగిన దారి నేగిన వాడు సర్వ పాప విముక్తు డగును. దాన ధర్మ మెఱింగిన వారేర్పరచిన దారిం బుద్ధిమంతు లేగుదురు. అందులో గూడ అన్నదాత లుత్తములు. వారి వలననే సనాతన ధర్మము నిలుచును. అందు వలన నన్నదానము న్యాయము దప్ప కుండ జేయ వలసినది. ఏ గృహస్థు ముందు ప్రాణాహుతులు సేసి యన్న మారగించునో ఎవ్వడన్న దానముచే రోజును (అవంభ్యమును = గొడ్డు వూనిదానిగ) సార్థకమైన దానిం గావించునో నిత్యము వేద విదులను ధర్మ వేత్తలను ఇతిహాస పురాణ విదులను నూరు మందిని విందారగింప జేయునో యతడు ఘోర నరకము పాలు గాడు. సంసారము నంబడడు. చని పోయిన నతడు సర్వ కామ్య సాఫల్య మంది సుఖ మందును. ఇట్లు సత్కర్మ నమన్వితుడై యే బాధలు లేకుండా నానంద పడును. చక్కని వాడు కీర్తిశాలి ధనవంతుడునై మరుజన్మ మందును. మీకిట్లన్న దాన మహాఫల మంతయు దెలిపితిని. సర్వ ధర్మములకు దానములకును మూల మిదియే.
Summary of chapter 111 of the Brahma Purāṇa is as follows:
The complete ritual procedure for performing Śrāddha is described step by step: the selection of auspicious times (new moon, pitṛ-tithis), the qualification and invitation of brāhmaṇas, the preparation of food, the specific mantras and ritual actions (tarpana, piṇḍa-dāna), and the prescribed behavior during the rite. The chapter functions as a detailed ritual manual for this foundational ancestral ceremony.