బ్రహ్మ మహా పురాణము
200 - ప్రద్యుమ్నాఖ్యానమ్
శంబరునిచే బ్రద్యుమ్నుడెట్లు హరింప బడెను. ప్రద్యుమ్నుడా శంబరుని సంహరించిన విధమేమి? తెలుపుడు అని విన్న వించిరి.
ప్రద్యుమ్నుడు పుట్టిన యాఱవ నాడు కాల శంబరుడు. తన కీతడు హంతకుడని తలచియా శిశువును పురిటింట నుండి కొంపోయి మొసళ్లచే భయంకరమైన సముద్రమున విసరి వేసెను. ఆ పడిన శిశువు నొక చేప పట్టు కొనెను. దాని జఠరాగ్నికి గురి యయ్యు నా బాలుడు చావలేదు. జాలరులు వలవేయ నితర చేపలతో బాటు పట్టు వడి శంబరునికి సమర్పింప బడియె. వాని భార్య మాయావతి యనునది వాని గృహ యజమాను రాలా చేపను వంటవాని కీయ వాడది చీల్చి యా చేప కడుపున మున్ను దగ్ధుడైన మన్మథుడను వృక్షము యొక్క మొదటి మొలకను, పరమ సుందరు డగు శిశువుం జూచెను. ఎవడు నీవు? చేప కడుపున కెట్లు వచ్చెను! అని వెడుక పడుచున్న శంబరుని భార్యంగని నారదుడు
ఈ శిశువు సర్వ సృష్టి సంహారములు సేయ గల శంబరునిచే పురిటింట నుండి హరింప బడిన వాడు. కృష్ణుని కుమారుడు సముద్రమున విసర బడి చేప మ్రింగగా నీకు దక్కినాడు. ఇది మానవ రత్నము. శ్రద్ధగ కాపాడు మని తెల్పెను.
ఆమె యట్లే యా బాలుని సౌందర్యా తిశయమునకు మోహపడి యనురక్తితో బెంచెను.
ఆ బాలుడు నిండు యౌవనము గనియామె వానికి తన మాయ నంతను చెప్పెను. వాని యందు హృదయము చూపులు నిలిపి ప్రవర్తించుండ ప్రద్యుమ్నుడు,
మాతృ భావము విడిచి మరొక తీరున నాయెడల నీవేల ప్రవర్తించున్నా వని యడిగెను.
ఆమెయు నీవు నాకు కుమారుడవు కావు. విష్ణు కుమారుడ వైన నిన్ను కాల శంబరుడు హరించి సముద్రమున విసరగా నొక చేప కడుపు నుండి నాకు లభించితివి. నిన్ను గన్న తల్లి నీకొఱ కిప్పుడును నేడ్చు చున్నది.
అది విని కోపము గని మనసు వికలమై ప్రద్యుమ్నుడు శంబరుని యుధ్ధమునకు బిలిచెను. మరియు వాని సైన్యమెల్ల గూల్చి ఏడు రకముల మాయలను దాటి ఎనిమిదవ విధమైన మాయను ప్రయోగించి యా శంబరాసురుని జంపెను. ఆ మాయావతితో నెగిరి తండ్రి పురమునకు వచ్చెను. అంతఃపుర మందు వ్రాలి మాయావతితో గూడి యున్న యాతనిని జూచి కృష్ణ పత్నులు సంతోషించిరి. రుక్మిణియును ప్రీతితో నతనిపై చూపు నిలువ నిట్లనియె.
ఏ ధన్యురాలి తనయుడో యీతడు నవ యౌవన మందున్నాడు. నా కుమారుడు ప్రద్యుమ్నుడే కనుక జీవించి యుండిన ఈ వయసులో నుండెడి వాడు. నాయనా! నీచేత సొంపు గన్న యా కన్నతల్లి యదృష్ట వంతురాలు. అది గాక నీ ప్రేమ నీ శరీరము నీ యాకారము సరిగా నన్ను పోలి యున్నది. స్పష్టముగ నీవు హరి కుమారుడవే అగుదువు అనేను.
ఇంతలో కృష్ణునితో గూడ నారదుడేతెంచి అంతఃపు రాంగనల కెల్ల మిన్న యైన రుక్మిణీ దేవిని చూచి హర్షముతో.
కల్యాణీ! మున్ను పురిటింట నుండి హరించిన యా శంబరాసురుని చంపి వచ్చిన యీతడు నీ బిడ్డడే. ఈ మాయావతి పతివ్రత. ఆ నీ కుమారుని భార్య. శంబరుని భార్య కాదు. దానికి కారణ మిదిగో వినుము. మన్మథుడు పోయిన తరువాత నాతని పునర్జన్మ కోరుచు మాయా రూపమున వివాహాది భోగము లందు శంబరుని ఈమె తబ్బిబ్బు సేసెను. మన్మథుని పత్నియే యీమె. ఆ దైత్యునికి మాయా రూపమును జూపినది. నీ కుమారుడు మన్మథుడు తిరిగి యవతరించి నాడు. ఆతని ప్రాణ ప్రియ రతియే యీమె. శంకింపకుము. ఈ పరమ కల్యాణి నీ కోడలు.
అన రుక్మిణీ కృష్ణులు ఆనంద భరితు లైరి. ద్వారకా నగర మెల్ల బాగు బాగని హర్షించినది. చిర కాలము క్రిందట బోయిన కుమారునితో కూడు కొనిన రుక్మిణిని చూచి ద్వారకా నగర జనమెల్ల విస్మయము జెందెను.
Summary of chapter 93 of the Brahma Mahā Purana is as follows:
The demon Naraka (Bhauma), who has conquered the three worlds and imprisoned sixteen thousand royal daughters, is confronted by Kṛṣṇa at Indra's behest. Satyabhāmā accompanies Kṛṣṇa into battle; Kṛṣṇa kills Naraka with his Sudarśana discus. The earrings of Aditi and the white umbrella of Indra are restored; the imprisoned princesses — unable to return to their families — are married by Kṛṣṇa as an act of protection and honor.