మహాజ్యేష్ఠి పర్వము నందు పురుషోత్తమ క్షేత్రము సేవింప దగినది. శ్రీకృష్ణుని బలరాముని సుభద్రను ఆనాడు దర్శించుట వలన ప్రయాగ మొదలైన పుణ్య క్షేత్రములను సేవించిన పుణ్యము ద్వాదశ క్షేత్ర యాత్రా ఫలము లభించును. గోదావరి మొదలైన పుణ్య నదులు సేవించిన ఫలము కూడ సిద్ధించును. భూమి యందు గల సర్వ దేవాలయ ములను, నదీ సాగర పర్వత తీర్థములను సేవించి స్నాన దానాదులు చేసిన పుణ్యము కృష్ణ దర్శనము చేత లభించును. అంతేగాక విష్ణు లోకము కూడ లభించి అచ్చట పుణ్యానుభవ మయిన తరువాత కర్మభూమి యందు జనించి చతుర్వేదా ధ్యయనము జేసి వేదోక్తాచార ధర్మ నిరతుడై కృష్ణ భక్తుడై విష్ణుభక్తి యోగము నంది మానవుడు మోక్షము పొందును.
Summary of chapter 64 of the Brahma Purāṇa is as follows:
Twelve specific sacred pilgrimages within and around the Puruṣottama kṣetra are enumerated, each with its prescribed route, ritual procedures, and specific spiritual fruits. The cumulative merit of completing all twelve is described as conferring everything from worldly prosperity to final liberation. The chapter systematizes the pilgrimage experience at the kṣetra as a practical guide for devoted pilgrims.