బ్రహ్మ మహా పురాణము
43 – అవంతీ వర్ణనమ్ (అవంతి = ఉజ్జయిని)
విప్రులారా! మున్ను గృత యుగము నందు “ఇద్రద్యమ్నుడు” అను రాజుండెను. అతడింద్ర తుల్య పరాక్రముడు. సత్యవాది శుచి సమర్థుడు సర్వశాస్త్ర విశారదుడు. రూప వంతుడు నుభగుడు శూరుడు దాత భోక్త ప్రియభాషి. యజ్వ బ్రహ్మజ్ఞాని సత్య ప్రతిజ్ఞుడు ధనుర్వేద మందు వేద మందు శాస్త్రము నందు నిపుణుడు స్త్రీ పురుషులకు పున్నమ చందురు నట్లానంద కరుడు. ప్రతాపమున సూర్యుడట్లు తేరిపార జూడ నలవికాని వాడు. శత్రు కూటమునకు భయంకరుడు విష్ణు భక్తుడు. సత్త్వశాలి, జిత క్రోథుడు జితేంద్రియుడు. యోగ శాస్త్ర సాంఖ్య (జ్ఞాన) శాస్త్రముల నధ్యయనము సేసిన వాడు, మోక్షేచ్ఛ గలవాడు, ధర్మ నిష్ఠుడు. ఇట్లు సర్వ లక్షణ నిధియైన యారాజు భూమిని పాలించు చుండ నతనికి హరి నారాధింప వలెనను నిశ్చయము గల్గినది.
దేవేశ్వరు జనార్ధను నెట్లా రాధింప గలను! ఏ క్షేత్రము తీర్థము నదీ తీరము ఆశ్రమము నిందుల కనువయి నది! అని తలచి పృథివి నెల్ల మనసుచే పరికించి అన్ని తీర్థ క్షేత్రపుర సముదాయము నెల్ల వదలి పురుషోత్తమ క్షేత్రమం దాలయమున కేగెను. అతనిని బలము (సేన) వాహనములు వెంబడించి నవి. అక్కడ భూరి దక్షిణ లొసంగి యథావిధిగ అశ్వ మేధము సేసెను. స్వామికి మహోన్నత ప్రాసాదము గట్టించి అందు సంకర్షణుని (బల రాముని) కృష్ణుని సుభద్రను ప్రతిష్ఠించి పంచతీర్థము లేర్పరచి స్నానదాన తపో హోమాదు లాచరించి దేవతా దర్శనము చేసి భక్తితో ప్రతి దినము హరి నారాధించి యా స్వామి యను గ్రహముచే మోక్షముల బొందెను. మార్కండేయుని కృష్ణుని బలరామునిం దర్శించి యింద్రద్యుమ్న సాగరమున స్నానము సేసి మోక్షమును దప్పక మానవుడు పొందును.
ఇంద్రద్యుమ్న ప్రభువు మున్నా ముక్తి క్షేత్రమున కెందులకు వెళ్ళెను. వెళ్ళి యా స్వామిని అశ్వమేధము సేసి యెట్లా రాధించెను? త్రిలోక ప్రఖ్యాతమైన యా లయము నక్కడ యెట్లు నిర్మించెను? సుభద్రా బలరామ కృష్ణుల మూర్తులనెట్లు నిర్మించెను? ఆ క్షేత్ర రక్షణమెట్లు సేసెను? ఆలయ మందు కృష్ణాదుల ప్రతిష్ఠ యెట్లు జరిగెను? ఇదంతయు జరిగినది జరిగినట్లు విపులముగ నానతిమ్ము నీవాగమృత మానిన కొలది మాకింకను నది గ్రోలవలయు నని పించు చున్నది. విన వలెనని మిక్కిలి కుతూహల మగుచున్నది.
ఇట్లు మునులడుగ బ్రహ్మ బాగు బాగు! పురాతన కథ నడిగితిరి. ఇది సర్వ పాపహరము. భుక్తి ముక్తిదము. శుభకరము. కృతయుగ మందు జరిగిన చరిత్ర యిదె చెప్పు చున్నాను. శ్రద్ధగా నింద్రియముల నదుపున నుంచి కొని వినుండు.
మాలవ దేశము నందు అవంతి యను నగర మున్నది. అది భూ మండలమను ఋషభమునకు మూపురమా యన్నట్లు తలమనిక మైయుండెను.
(ఇట 25 శ్లోకము నుండి 64వ శ్లోకముదాక నగర వర్ణనము. క్రిందటి యధ్యాయము విరజ క్షేత్ర వర్ణన సందర్భమున నిట్లే వర్ణన మున్నది. కావుని నిక్కడ సది పునరుక్తముగ తాత్పర్యము వ్రాయలేదు.)
అక్కడి త్రిపుర వైరి (శివుడు) ’మహాకాలుడు’ అనుపేర వెలసి యున్నాడు. ఆయన సర్వాభీష్ట ప్రదాత. అటు పాప హరమైన శివ కుండమున స్నానము సేసి దేవర్షి పితృ తర్పణాదులు సేసి శివా లాయము కేగి ప్రదక్షిణము సేసి ధ్యానా వాహనాద్యు పచారముల స్వామి నర్చించిన నరుడు అశ్వమేధ యాగ ఫలము నందును. దివ్య విమానములో శివ లోకమున కేగును. అట దివ్య రూపాంబరా భరణాదులతో గూడి మహా భోగముల ననుభవించి యిక్కడికి వచ్చి బ్రాహ్మణుడై జనించి నాల్గు వేదములు సర్వ శాస్త్రములు నేర్చి పాశుపత యోగముల బొంది ముక్తి నందును. అక్కడ శిప్రాయను నది గలదు. అట స్నాన తర్పణాదులు సేసిన యతడు విమానమున స్వర్గ మేగును. అక్కడనే విష్ణువు గోవింద స్వామి యనుపేర నున్నాడు. ఆయనను సేవించిన నిరువది యొక్క తరములు తరించును. ఈ మున్ను జెప్పిన ఫలము లన్నియు నట గల్గును. తిరిగి యీ లోకమునకు వచ్చి వైష్ణవ యోగమున ముక్తి నందును. అక్కడనే విక్రమ స్వామియను పేరనున్న విష్ణువు నారాధించిన మగవాడు గాని యాడుది గాని మున్ను జెప్పిన ఫల మందుదురు. అక్కడ నింద్రాది దేవతలు మాతృకలు గలరు. వారును కోరిన కోర్కె లిత్తురు. వారిని సేవించిన స్వర్గము లభించును. అవంతి యను నా నగరమును రాజ సింహుడను రాజు పాలించెను. అందులో పదునెన్మిది పురములు (మహాపుర భాగములు) కలవు. అవి సువిస్తీర్ణ రాజ మార్గములు. విధ్యా వంతులట నందఱును. వేద ఘోషచే నది ప్రతిధ్వనించు చుండును. అట ఇతిహాస శాస్త్ర పురాణాది ప్రసంగములు నిత్యము వినబడును. దీనికి మునువు పరిపాలకుడు ఇంద్రద్యుమ్నుడు.
Summary of chapter 43 of the Brahma Mahā Purana is as follows:
Indradyumna seeks to understand the history of the Puruṣottama kṣetra and how the Lord came to reside there. Sages and divine messengers narrate the ancient events — how Viṣṇu originally chose this coastal site, how certain cosmic events led to the establishment of the divine presence, and why this kṣetra is worshipped by all beings including Devas, Siddhas, and Pitṛs.