బ్రహ్మ మహా పురాణము
46 - పురుషోత్తమ క్షేత్ర వర్ణనమ్
ఆ మీదికథను, అ క్షేత్ర రాజమున కేగి ఇంద్రద్యుమ్న ప్రభుడేమి చేసెను? తెలుపు మని మును లడిగిరి.
మునులార వినుండు. ఇంద్రద్యుమ్న మహా రాజట కేగి చక్కని ప్రదేశములను, వింధ్య పాదము నుండి వెడలెడు పుణ్య నదులను దర్శించెను, సర్వపాప హారిణి గంగ కీడైనది దక్షిణ సముద్రమున సంగమించు నదియగు “స్విత్రోవల” అను నది యట గలదు. దాని కిరు వైపుల తీరము లందు సస్య శ్యామలములు మనోహరములు నగు గ్రామములు నగరములు కనిపించును. అందలి ప్రజలు చక్కని వలువలు నగలునుం దాల్చి పుష్టియుం దుష్టియు గొని యుందురు. చతుర్వర్ణముల వారు స్వధర్మ నిరతులై శుభ లక్షణులై కనిపింతురు. నిరంతర తాంబూల చర్వణము నిరంతర పుష్పమాలా ధారణము వారి ప్రత్యేక శుభ చిహ్నము. విప్రులు వేద పూర్ణ ముఖులు షడంగవిదులు. పదక్రమల జటాఘన పాఠులు. నిత్యాగ్ని హోత్రులు ఉపాసకులు సర్వ శాస్త్రార్థ సమర్థులు బూరి దక్షిణ లొసంగిన దీక్షితులు సోమయాజులు చయనులు. రాజ వీథులందు నలు దారులు కలిసిన చోట మండపము లందు వనము లందు ద్యాన వనము లందు సభ లందు మేడ లందు దేవాలయము లందు నెటవిన్నను ఇతిహాస పురాణ ప్రవచనము సాంగ వేదా ధ్యయనము కావ్యశాస్త్ర గోష్ఠులు నిపించును. ఆ దేశ మందలి సుందరులు చక్కని రూపము యౌవన ముంగొని ఉత్తమ స్త్రీ సాముద్రిక లక్షణ లక్షితలై శరత్కాల చంద్ర బింబాన నలై దివ్య వస్త్రముల దాల్చి బంగారు కంకణములం ధరించి కద గర్భమున కిడగు బంగరు చాయయు ఎఱ్ఱ దామర పూల పుప్పొడి తేనయగు నరుణారుణ వర్ణమును గల మేనులతో నాకర్ణాంత నేత్రములతో చక్కని నెమ్మోములతో నల్పెక్కిన వేనలితో దొండ పండున కీడగు పెదవులతో హావభావ విలాసములతో, కొందఱు తామర రేకుల కెనయగు నయన శోభ గలవారు కొందరు నల్లగలువ రేకుల కీడగు కాటుక కండ్ల యందము గల వారునై యుంగరాల్దిరిగిన ముంగురులతో మెఱపట్లు మెఱయు పలు వరుస గల్గి పీనోన్నత స్తన భారమున సువర్ణ మణిమయ కంఠ హారములు సుమ మాలలుం దూగ మణిమయ కుండల కాంతులు చెక్కుటద్దముల మిఱుమిట్లు గొన సాక్షాద్దేవ సుందరు లోయన దర్శన మిత్తురు. వీణావేణు మృదంగ వాద్యములు జతసేసి భక్తి భరితము లైన చక్కని పాటల నాటలం బరమాత్మను పరవశింప జేయుదురు. రాత్రి యనక పవలనక నచట శంఖ దుందుభి నిర్ఘోషముని పించును. కామోన్మత్త మైన అవ్విలాసినుల నృత్య లాసము గాన మాధుర్యమును ననీ దృశము. భిక్షువులు వైఖానసులు స్నాతకులు బ్రహ్మచారులు సిద్ధులు వీరువారన నేల మంత్ర సిద్ధులు రస సిద్ధులు ఘటికా పాదుకా సిద్ధులు నచట స్వామి పరివారమై సేవింతురు. ఇట్టి దివ్య క్షేత్రమును దర్శించి యారాజు నిజముగ నిదియే మానస క్షేత్రము. ఇది పురుషోత్తమము. తెలిసి నది నాకిది తెలిసిన దని యప్పొంగి మఱ్ఱి నీడకేగి ఇంద్ర నీలమణి మయమగు నీ నీలమేఘ శరీరుని మూర్తింగని ఆ కల్యాణ మూర్తి నాకు గోచరింప యత్న మొనర్తు గాక యని జన్నము లొనర్చుదును. తపము లాచరింతును. హోమములు సేయుదును. ధ్యానింతును. ఉపవసించి యర్చనలు నొనరింతు గాక యని అనన్య మనస్కుడై విష్ణ్వాలయ నిర్మాణము గావింతును గాక యని నిశ్చయించెను.
Summary of chapter 46 of the Brahma Mahā Purana is as follows:
This chapter contains supplementary verses and Indradyumna's extended prayer (stotra) to Vāsudeva prior to the installation of the idol. Indradyumna worships Bhagavān through the Pañcarātra rites, composing hymns to Vāsudeva, Saṃkarṣaṇa, Pradyumna, and Aniruddha. His prayer emphasizes the theological unity behind the many divine forms, declaring that all names and forms ultimately resolve into the one supreme Puruṣa.