శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

14 - బ్రహ్మ స్తుతి

ఓ దేవా! కొనియాడదగినవాడవు నీవే. మేఘమువంటి దేహము గల నీవు మెరుపువంటి వస్త్రమును దాల్చీతివి. నీ ముఖము గురివింద గీంజల కర్ణాభరణములతో, చుట్టూ నెమలి పింఛములతో శోభిల్లుచున్నది. అడవి పువ్వుల మాలను వేసుకున్న నీవు చేతిలో అన్నపు ముద్దను, బెత్తమును, కొమ్ము బూరాను, పిల్లన గ్రోవిని పట్టుకున్నావు. నీ వక్షఃస్థలము పుట్టుమచ్చతో ప్రకాశించుచున్నది. గోపాలకుడగు నందుని పుత్రుడవైన నీ పొగము ముగుస గ చము గను

ఓ దేవా! భక్తుల ఇచ్ఛననుసరించి స్వేచ్ఛచే ప్రకటితమైన ఈ నీ ఆవతారము భౌతికము (ప్రాకృతము) కాదు. నన్ను అనుగ్రహించే ఈ నీ దేహముయొక్క మహిమనైననూ బ్రహ్మదేవుడనగు నేనైననూ, లేదా ఎవరైననూ, అంతర్ముఖమగు మనస్సుతోనైననూ తెలియజాలరు. సాక్షాత్తుగా అద్వయపరబ్రహ్మవగు నీయొక్క సచ్చిదానందానుభూతియొక్క మహిమ గురించి చెప్పునదేమున్నది?

ఓ దేవా! నీకు పరాజయము లేదు. ఐననూ, ఎవరైతే తమ స్థానమునందున్నవారై సత్పురుషులచే గానము చేయబడి తమ చెవిన పడిన నీ గాథను మనోవాక్కాయములతో సత్కరిస్తూ జీవించెదరో, వారు ఈ మూడు లోకములలో బహుశః నిన్ను కూడ జయించెదరు (పొందెదరు). వారు జ్ఞానమునందలి ప్రయాసను దూరముగా నుంచెదరు.

ఓ ప్రభూ! దొడ్డుగా ఉన్న ఊకలను దంచువారికి మిగిలేది క్లేశము మాత్రమే. అదే విధముగా శ్రేయస్సులను ప్రవాహముగా ఇచ్చే నీ భక్తిని విడిచి పెట్టి ఎవరైతే కేవల (భక్తి లేని, శుష్క) జ్ఞానముకొరకు కష్టపడెదరో, వారికి మిగిలేది క్లేశమే గాని, మరియొకటి కాదు.

ఓ అనంతా! నీవు స్వరూపమునుండి చ్యుతి లేనివాడవు. ఈ లోకములో పూర్వము అనేకయోగులు కూడ తమ కర్మలను నీయందు సమర్పించి తద్ద్వారా చిత్తశుద్ధిని పొందిరి. వారు నీ గాథలను శ్రవణము. చేసి భక్తితో నీకు దగ్గర ఐరి. ఆ భక్తితోనే వారు నీ సర్వోత్కృష్ణమగు తత్త్వమును తేలికగా తెలుసుకొని మోక్షమును పొందిరి.

ఓ అనంతా! ఐనప్పటికీ నిర్మలమగు అంతఃకరణము గలవారు విర్గుణుడవగు నీ మహిమను ఇంద్రియములు-మనస్సు మొదలగువాటిచే అఖండమే గాని తనకంటె భిన్న మైన ఘటాది రూపము విషయముగా గల జ్ఞానమువంటిది కాదు. మనోవికారము కాని ఆ జ్ఞానము స్వానుభవరూపమే గాని మరియొకటి కాదు.

గుణములకు అధిష్టాతవగు నీవు గుణాతీతుడవే అయినా, ఈ లోకముయొక్క హితము కొరకు అవతరించెదవు (గుణములు గలవాడవు అగుదువు). నిపుణులైన వ్యక్తులు చాల కాలము పని చేసి భూమియందలి రేణువులను, ఆకాశమునందలి మంచు కణములను, లేదా ద్యులోకమునందలి నక్షత్రాదులను లెక్కించవచ్చును. కాని, అట్టి నీ గుణములను లెక్కించే సామర్థ్యము ఎవరికి గలదు?(ఎవరికైననూ లేదు).

అందువలన ఎవడైతే ప్రతిక్షణము నీ కృప కొరకు ఎదురు చూస్తూ పూర్వకర్మార్జితమైన సుఖదుఃఖములను అనుభవిస్తూనే, మనోవాక్కాయములతో నీకు తనను సమర్పించుకొని జీవించునో, అట్టివాడు మోక్షఫలమునందు -- తండ్రి ఆస్తిలో కొడుకు వలే -- వాటా గలవాడగును.

ఓ ఈశ్వరా! నా దౌర్జన్యమును చూడుము. నీవు అనంతుడవు, సర్వకారణుడవు, మాయావులకు మాయావివి. పరమాత్మవగు అట్టి నీయందు నేను మాయను ప్రసరింపజేసి నా ప్రభావమును చూడగోరితిని. అగ్నిలో జ్వాల వలె నీయందు నేనెంత?(నీముందు నేనేమీ కాదు).

ఓ అచ్యుతా! నేను రజోగుణమునుండి పుట్టినవాడనగుటచే నీ మహిమ తెలియక నీకంటె వేరుగా నేను కూడ ప్రభుడననే ఆహంకారము కలిగి యుంటిని. అనాదియగు మాయతోడి సంబంధము వలన నా అంతః కరణమునందు గాఢమగు అజ్ఞానము కలిగి వివేకజ్ఞానమును కోల్పోతిని. నేను స్వయంభువుడనని గర్వించితిని. నీవు తప్ప నాకు నాథుడు లేడు. నేను దయ చూపదగినవాడను. కావున, నన్ను క్షమించుము.

ప్రకృతి, మహత్తత్త్వము (సమష్టి బుద్ధిశక్తి), సమష్టి అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, పృథివి అనువాటిచే చటునాగబడియునుడనునే సుటము నశించేది. వంగు ఏడు అడుగుల దేహము గల వేనెక్కడ? ఈ విధమైన లెక్కలేనన్ని పరమాణువులవంటి బ్రహ్మాండములు, కిటికీనుండి వచ్చే సూర్యకాంతిలోని ధూళికణములు వలే, నీ రోమకూపములయందు పరిభ్రమించుచుండును. అట్టి నీ మహిమ యెక్కడ? (చాల అంతరము గలదని భావము).

ఓ శ్రీహరీ! నీ స్వరూపము ఇంద్రియములకు గోచరమయ్యేది కాదు. గర్భమునందలి శిశువు పాదములతో తన్నుట తల్లి యెడల అపరాధమగునా? (కాదు). ఉంది లేదు అనే శబ్దములచే వ్యవహరించ బడేది కొంచెమైనా నీ ఉదరమునకు లోపల లేనిది గలదా? (లేదు).

ప్రళయమునందు సముద్రములన్నీ ఏకమై ముల్లోకములు విలీనమైనవి. అప్పుడు ఆ జలములలో నారాయణుని నాభి. సలి పద్మపు తూడునుండి స్వయంభువుడగు బ్రహ్మదేవుడు ప్రకటమయ్యేనని శ్రుతులు చెప్పుచున్నవి. ఆ మాట అసత్యము కాదు. ఇది నిశ్చయము. ఓ ఈశ్వరా! నేను నీనుండి ప్రకటమైనవాడను కానా? (తప్పక అగుదును).

సకలప్రాణులకు ఆత్మవగు నీవు నారాయణుడవు (నార-అయన, అనగా జీవులకు అధిష్టానము) కావా? అగుదువు. సకలప్రాణులకు ప్రవర్తకుడవగు నీవు నారాయణుడవే (నార-అయన, అనగా జీవులను ప్రవర్తిల్ల జేయువాడు). సకల ప్రాణులలోని బుద్దిసాక్షి వగు నీవు నారాయణుడవు (నార-అయన, జీవులలో తెలుసుకొనువాడు). నరునినుండి అనగా పరమాత్మనుండి పుట్టినవి నారములు, అనగా జలములు. అవి ఆశ్రయముగా గల నారాయణుడు కూడ నీ అంశయే. అట్టి అంశరూపముగా ప్రకటమగుట కూడ నీ లీలయే గాని పరమార్థము కాదు.

ఓ భగవానుడా! జగత్తునకు ఆశ్రయమైన ఆ నీ దేహము నీటియందున్నచో, నేను ప్రకటమైన వెంటనే ఏల చూడలేకపోతిని? మరల (తపస్సును చేసి) తరువాత మాత్రమే నేను హృదయమునందు ఆ రూపమును బాగుగా చూచుటకు కారణమేమి? అదే రూపము మరల వెనువెంటనే నాకు కనబడకపోవుటకు కారణమేమి?

మాయను పోగొట్టే ఓ శ్రీహరీ! ఈ అవతారమునందే నీవు బయట ప్రత్యక్షముగా కనబడే ఈ ప్రపంచమునంతనూ తల్లికి ఉదరము లోపల చూపి, ఈ జగత్తు నీ మాయయేనని నిశ్చయముగా ప్రకటించితివి.

నీతో సహా ఈ సకలజగత్తు ఏ విధముగానైతే నీ ఉదరమునందు ప్రకాశించుచున్నదో అదే విధముగా ఆ సర్వము ఈ బయట కూడ ప్రకాశించుచున్నది. ఇదంతా నీయందు మాయాశక్తి లేకుండానే ఘటిల్లునా యేమి? (ఘటిల్లదు).

ఈ జగత్తు మాయచే కల్పితమనియు, నీవే దాని అధిష్ఠానమనియు నీవీ నాడు నాకు నిరూపించ లేదా? (నిరూపించితివి). మొట్టమొదట (నేను చూసినప్పుడు) నీవు ఒక్కడివే ఉంటివి. తరువాత గోకులమునందలి మిత్రులు, దూడలు, వారి బెత్తములు మొదలైనవన్నీ నీవే అయితివి. అప్పుడు చతుర్భుజరూపములు అదే సంఖ్యలో నీవే అయితివి. నాతో సహా సృష్టిలోని తత్త్వములన్నీ ఆ రూపములను ఉపాసించుచున్నవి.

తరువాత అదే సంఖ్యలో బ్రహ్మాండములు నీవే అయితివి. కావున, పరిచ్ఛేదములు లేనిది, రెండవది లేనిది అగు పరబ్రహ్మయే మిగిలినది.

నీ స్వరూపమును తెలియనివారలకు నీవు నీచే (స్వతంత్రుడవై మాయాశక్తిని విస్తరింపజేసి, అనాత్మయగు ప్రకృతియందు తాదాత్మ్యమును పొందిన పరిచ్చిన్నజీవుడు వలె భాసించెదవు. జగత్తును సృష్టించే సమయమునందు నీవే బ్రహ్మనగు నేను వలే, పాలించే సమయములో విష్ణువు అగు నీవు వలే, ప్రళయమునందు ముక్కంటియగు రుద్రుడు వలె నీవే భాసించుచున్నావు.

సర్వసమర్థుడవగు ఓ ఈశ్వరా! ఈ జగత్తును పాలించేది నీవే. నీవు దుష్టుల పొగరును అణచివేసి సత్పురుషులను రక్షించుటకై దేవత (వామనుడు) గా, మహర్షి (పరశురాముడు) గా , మానవుడు (శ్రీరాముడు) గా, పశువై కూడ (వరాహము), ఆఖరికి జలజంతువు (చేప) గానైననూ అవతరించెదవు. కాని, నీకు వాస్తవముగా పుట్టుక లేదు.

ఓ భగవానుడా! నీవు అనంతుడవు, ప్రకృతికి అతీతమైన ఆత్మవు నీవే. యోగమాయ నీ అధీనములో నుండును. నీవు యోగమాయను విస్తరింప జేసి క్రీడించెదవు. ముల్లోకములలో నీ లీలలు ఎక్కడ, ఏ విధముగా, ఎప్పుడు, ఎన్ని ప్రకటమగునో ఎవడు తెలియగల్గును? (తెలియలేరు).

కావున, ఈ జగత్తు అంతా వాస్తవముగా లేకున్ననూ కల వలె ఉన్నట్లు భాసించుచున్నది. దీనియందు అనేకములగు దుఃఖములు పరంపరగా కలుగుచుండును. దీనియందలి సత్తాస్పూర్తులు ఈశ్వరప్రతిఫలనముచే కలిగినవే గాని, జగత్తునకు స్వంతములు కావు. ఇట్టి జగత్తు మాయాశక్తి వలన అనంతజ్ఞానానందస్వరూపుడవగు నీయందు కానవచ్చుచున్నది. అవినాశియగు నీవు మాత్రమే సత్యము కాగా, ఆజ్ఞానము వలన ఈ జగత్తు సత్యమా యన్నట్లు తోచుచున్నది.

సర్వవ్యాపకుడవగు నీవు దేహాదులయందు ఆత్మరూపముగా తెలియబడేదవు. ఆద్యంతములు లేని నీవు పరిచ్చేదములు లేని సత్ (ఉనికి), స్వయంప్రకాశచైతన్యము, కాలపరిచ్చిన్నము కాని ఆనందము స్వరూపముగా గలవాడవు. కాలాతీతుడవు, అవినాశివి అగు నీవు సర్వజగత్తునకు కారణమవు. నీయందు వికారములు గాని, కర్తత్వభోక్తృత్వాదులు గాని లేవు. దేశవస్తుకాలపరిచ్చేదములు లేని నీవు మాయాశక్తి అనే ఉపాధినుండి విముక్తుడవు.

నీవీ విధముగా సకలప్రాణులలో ఆత్మరూపుడవై ఉన్నావు. ఎవరైతే గురువనే సూర్యునినుండి వేదాంతజ్ఞానమనే దివ్యనేత్రమును సంపాదించి నిన్ను తమ ఆత్మరూపునిగా దర్శించెదరో, వారు సంసారమనే మిథ్యాసముద్రమును తరించినట్లు అగుదురు (అనగా బంధము మిథ్యయే, మోక్షము మిథ్యయే).

మానవుడు తన స్వరూపమును యథాతథముగా తెలియకపోవుట చేతనే, త్రాడునందు పాము పడగ కనబడినట్లుగా, ఈ ప్రపంచమంతయు ఉన్నట్లు భాసించును. మానవుడు జ్ఞానమును పొందినచో, త్రాడునందు పాము లేకుండా పోయినట్లు, జగత్తు మరల ఆత్మయందే విలీనమగును.

సంసారబంధము, మోక్షము అనే రెండు ప్రసిద్ధము. కాని, ఇవి అజ్ఞానముచే కలిగిన (అజ్ఞానముయొక్క) నామములు మాత్రమే. ఆత్మ నిత్యజ్ఞానస్వరూపము, రెండవది లేనిది, ప్రకృతికీ అతీతము. విచారముచే ఆత్మతత్త్వమునరయగా, సూర్యునియందు రాత్రింబగళ్లు లేనట్లే, ఈ బంధ మోక్షములు బాధించ శక్యము కాని సచ్చిత్తత్త్వమగు ఆత్మకంటె వేరుగా లేనే లేవు.

అజ్ఞానులగు జనులు ఆత్మరూపుడవగు నిన్ను ఇతరునిగను, ఆత్మకాని దేహాదులను ఆత్మగను తలచి, ఆత్మరూపుడవగు నిన్నైతే తమకంటే బయట వెదుకుచుందురు. అయ్యో! వారి అజ్ఞానము ఎంత బలీయమో!

ఓ అనంతా! పుట్టి గిట్టే దేహము మధ్యలో ఇంద్రియములు మొదలగు అనాత్మను అపవాదము చేసి వివేకులు నిన్ను ఆత్మరూపునిగా అన్వేషించి తెలియుదురు. త్రాడునందు పాము లేకున్ననూ, దానిని నిషేధించకుండా వివేకులైనా అక్కడే ఉన్న త్రాడును తెలియగల్గుదురా? (తెలియజాలరు).

ఓ దేవా! ఆత్మానాత్మవివేకముచే నిన్ను తెలియుదురనేది యథార్థమే. అయిననూ, పద్మములవంటి నీ పాదముల జంటయొక్క అనుగ్రహలేశము చేనైననూ కృతార్థుడు కానివాడు ఆత్మరూపుడగు భగవానుని మహిమను యథాతథముగా తెలియలేడనేది నిశ్చయము. నీ అనుగ్రహము లేనివాడు చాల కాలము ఒంటరియై ఆత్మవిచారము చేసిననూ నిన్ను తెలియలేడు.

ఓ ప్రభూ! అందువలన (నీ భక్తి లేనిదే ముక్తి లేదు గనుక), ఈ జన్మలో గాని, లేదా మరియొక పశువు మొదలైన జన్మలోనైనా, నాకు నీ చిగురువంటి పొదమును నిష్ఠతో సేవించే మహాభాగ్యము కలుగు గాక! నేను నీ భక్తులలో ఎవడో ఒక అనామకుడనైనా పరవా లేదు.

ఓ ప్రభూ! గోకులమునందలి ఆవులు, తల్లులు మిక్కిలి ధన్యులు. ఆహా! ఎందుకంటే, ఈనాటికీ కూడా యజ్ఞములు నీకు కలిగించలేని తృప్తిని వారు నీకు కలిగించిరి. నీవు దూడల రూపములో అమృతము వంటి ఆవుల పాలను, గోపబాలకుల రూపములో తల్లుల పాలను అతిశయించిన ఆనందముతో త్రాగితివి.

ఆహా ఏమి భాగ్యము! నందుడనే గోపాలకుని గోకులమునందు నివసించువారలకు, ఆహా! ఏమి భాగ్యము! సర్వాతిశాయి ఆనందమే స్వరూపముగా గల కాలాతీతమైన పూర్ణపరబ్రహ్మ వారికి మిత్రుడైనాడు.

ఓ అచ్యుతా! ఈ గోకులవాసులయొక్క మహాభాగ్యమునైతే అట్లుండనిమ్ము, ఆహా! రుద్రుడు (అహంకారము), బ్రహ్మదేవుడు (బుద్ధి), చంద్రుడు (మనస్సు), దిగ్గేవతలు (వినికిడి), వాయువు (స్పర్శ), సూర్యుడు (చూపు), వరుణుడు (రసనేంద్రియము), అశ్వినీ దేవతలు (ఘ్రాణము), అగ్ని (వాక్కు), ఇంద్రుడు (చేతులు), ఉపేంద్రుడు (పాదములు) అనే మేము పదకొండు ఇంద్రియాధిష్ఠానదేవతలము మహాభాగ్యవంతులము. ఎందుకంటే, ఈ గోకులవాసుల ఇంద్రియములనే పాత్రలతో నీ పాదపద్మముల తేనె అనే అమృతరసమును పలుమార్లు పానము చేయుచున్నాము.

ఈ భూలోకములో గోకులములో అడవిలోనైనా ఏదో ఒక జన్మ యేది గలదో అదియే మహాభాగ్యము. ఎందుకంటే, ఎవరో ఒక గోపాలకుని పాదధూళితో నాకు అభిషేకము అగును. ఆ గోపాలకులకైతే జీవితమంతా మోక్ష ప్రదాత, శ్రీహరీ భగవానుడు అగు నీవు మాత్రమే. శ్రుతులు ఈ నాటికి కూడా నీ పాదముల ధూళిని అన్వేషిస్తూనే ఉన్నవి సుమా!

ఓ దేవా! ఇంతేగాక, ఈ గోకులవాసులకు నీవు ఏమి ఫలమునిచ్చెదవా అని ఆలోచించి మా బుద్ధి వ్యామోహమును పొందినది. మాకు ఏ దేశకాలములలోవేవమా నీకంటే మరింక పలము. మిగిడి తోచలేదు. ఓ దేవా! పూతన సజ్జనుల వేషమును వేసుకున్నంత మాత్రాన కులముతో సహా నిన్నే పొందినది. ఈ గోకులవాసుల కైతే ఇల్లు, సంపద, మిత్రులు, ప్రియమైన వ్యక్తి, ప్రియమైన వస్తువు, దేహము, సంతానము, ప్రాణములు, అంతఃకరణము అన్నీ నీ కొరకే.

ఓ శ్రీకృష్ణా! ఎంతవరకైతే జనులు నీవారు కారో, అంతవరకు మాత్రమే రాగద్వేషములు పరమార్ధమును అపహరించే చోరులు, ఇల్లు కారాగారము, మోహము కాలి సంకెల యగును.(అనగా నీ భక్తులకు ఇవి యేవీ బంధ హేతువులు కావని యర్థము).

ఓ ప్రభూ! నీవు ప్రపంచమునకు అతీతుడవే. అయిననూ, భూలోకమునందు శరణాగతులైన జనుల ఆనందముల సమూహమును విస్తరింప జేయుటకై నీవు ప్రపంచమును అనుకరించుచున్నావు.

ఓ ప్రభూ! నిన్ను తెలియువారే తెలియుదురు గాక! పలు మాటలతో పని యేమి? నీ వైభవము నా మనోవాక్కాయములకు గోచరము కాదు.

ఓ శ్రీకృష్ణా! నాకు అనుమతినిమ్ము. సర్వసాక్షివగు నీకు సర్వము దెలియును. నీవే జగత్తులకు రక్షకుడవు. (నాది అనుకున్న ఈ జగత్తును నేను నీకు సమర్పించుచున్నాను.

ఓ శ్రీకృష్ణ భగవానుడా! నీవు వృష్టివంశమనే పద్మమును వికసింపజేసిన సూర్యుడవు, భూమి, దేవతలు, వేదవేత్తలు, పశువులు అనే సముద్రమును వర్ధిల్లజేసిన చంద్రుడవు, ధర్మమువలె కనబడే అధర్మమనే రాత్రి చీకటిని పోగొట్టే సూర్యుడవు. నీవు భూలోకమునందలి రాక్షసులను సంహరించెదవు. సూర్యునితో సహా అందరు నిన్ను పూజించెదరు. నీకు కల్పాంతము వరకు నేను నమస్కరించుచున్నాను.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- జగత్తును సృష్టించిన బ్రహ్మదేవుడు అనంతుడగు శ్రీకృష్ణుని ఈ విధముగా అభిముఖముగా స్తుతించి, మూడు సార్లు ప్రదక్షిణము చేసి, రెండు పాదములకు నమస్కరించి, తాను ఇష్టపడే తన లోకమును చేరెను.

తరువాత శ్రీకృష్ణ భగహనుడు స్వయంభువుడగు బ్రహ్మదేవుని వద్ద సెలవు తీసుకొనెను. సంవత్సరము క్రితంలో వలెనే దూడలు ఎదురుగా నిలిచి యుండెను. వాటిని తీసుకొని ఆయన తాను భోజనము చేసిన ఇసుక తిన్నె వద్దకు రాగా, అచట సంవత్సరం క్రితంలో వలెనే ఆయన మిత్రులు ఉండిరి.

ఓ పరీక్షిన్మహారాజా! గోపబాలకులు శ్రీకృష్ణుని మాయచే మోహితులైరి. తమ ప్రాణములకు ప్రభువగు శ్రీకృష్ణుడు లేకుండా ఒక ఏడాది గడచిననూ, వారి కాలమును క్షణములో సగముగనే తలపోసిరి.

ఈ లోకములో మాయచే మోహితమైన బుద్ధి గలవారలు దేనిని దేనిని విస్మరించకుందురు?(సర్వమును విస్మరించెదరు). మాయచే మోహితమైన సకలజగత్తు మరల మరల తన ఆత్మనే విస్మరించినది.

పైగా ఆ మిత్రులు శ్రీకృష్ణునితో ఇట్లు పలికిరి --- చాల వేగముగా వచ్చితివే! ఒక్క ముద్దనైనా తింటివి కాదు (మేమింకా ఒక్క ముద్దనైననూ తినలేదు). ఇటు రమ్ము. బాగుగా భుజించుము.

తరువాత ఇంద్రియాంతర్యామియగు శ్రీకృష్ణుడు నవ్వుతూ గోపబాలకులతో బాటుగా భోజనము చేసి, వారికి కొండ చిలువ యొక్క చర్మమును చూపిస్తూ, అడవినుండి గోకులమునకు తిరిగి వచ్చెను.

శ్రీకృష్ణుడు నెమలి పింఛములను, పువ్వులను, తొమ్మిది రకముల రాతి రంగులను దాల్చుటచే ఆయన అవయవములు రంగు రంగులుగా నుండెను. ఆయన పిల్లన గ్రోవిని, కొమ్ము బూరాను బిగ్గరగా వాయిస్తూ ఆ ధ్వనిచే వర్ధిల్లిన ఉత్సవముతో సంపన్నుడై యుండెను. ఆయన అనుచరులు ఆయన పవిత్రమగు కీర్తిని గానము చేయుచుండిరి. ఆయన మాడలను పేర్లు పెట్టి పిలుస్తూ గోకులములో ప్రవేశించగానే, ఆయన దర్శనము గోపికల నేత్రములకు ఉత్సవమాయెను.

ఈనాడు యశోదానందుల పుత్రుడగు శ్రీకృష్ణుడు పెద్ద పామును చంపి, దానినుండి మమ్ములను కూడ కాపాడినాడని గోపబాలకులు గోకులములో చెప్పిరి.

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --. ఓ మహర్షీ! తమకు పుట్టిన పిల్లలయందు కూడ ఇదివరలో ఎట్టి ప్రేమ లేదో, ఇంతటి ప్రేమ ఇతరుల పిల్లవాడైన శ్రీకృష్ణునిపై ఎట్లు కలిగినది? చెప్పడు.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! సకలప్రాణులకు తమ ఆత్మయే ప్రియమైనది. సంతానము, ధనము, అధికారము మొదలైన ఇతరములు ఆ ఆత్మకు ప్రియములగుటచే మాత్రమే ప్రియములగుచున్నవి. ఇది నిశ్చయము.

ఓ పరీక్షిన్మహారాజా! కావున, దేహధారులకు తమ తమ ఆత్మయందు ఎట్టి ప్రేమ ఉండునో, అట్టి ప్రేమ మమకారమునకు ఆలంబనమైన సంతానము, ధనము, ఇల్లు, ఆస్తి మొదలగువాటియందు ఉండదు.

ఓ పరీక్షిన్మహారాజా! దేహమే ఆత్మ అని వాదించే వ్యక్తులకు కూడ దేహము ఎంత అధికముగా ప్రీతిపాత్రమో, దేహముననుసరించి వచ్చిన ధనధాన్యాదులయందైతే అంత ప్రీతి ఉండదు గదా!

కొంత వివేకము గలవారికి దేహమునందు నేను అని కాక, నాది అనే అభిమానము ఉండును. వారికైననూ దేహము ఆత్మవలె ప్రియము కాదు. ఎందుకంటే, ఈ దేహము శిథిలమైనా జీవించాలనే ఆశ బలముగా నుండును.(ఆ ఆశకు ఆస్పదము శిథిలమైన దేహము గాక, దేహవిలక్షణమైన ఆత్మయేనని భావము).

కావున, సకలప్రాణులకు కూడ ఆత్మయే అత్యంతము ప్రియము. కదిలే పుత్రాదులు, కదలని గృహాదులతో కూడిన ఈ జగత్తు ఆ ఆత్మ కొరకు మాత్రమే ప్రియమగుచున్నది.

ఈ శ్రీకృష్ణుడు సకలప్రాణుల ఆత్మయని నీవు దెలియుము. ఈయన జగత్తునకు హితము కొరకే మాయాశక్తిచే దేహధారివలె కన్పట్టుచున్నాడు.

శ్రీకృష్ణుని పరమార్థస్వరూపము తెలిసినవారలకు ఈ జగత్తులో కదిలేవి, కదలనివి సర్వము భగవానుని రూపమే. భగవానునికంటె వేరుగా కొంచెమైననూ ఏదీ ఈ లోకములో లేదు.

పదార్థములన్నింటికీ కారణమొకటి (ప్రకృతి) స్థిరముగా నుండును. అదియే ఆ వస్తువు యొక్క పరమార్థము. ఆ కారణమునకు కూడ శ్రీకృష్ణ భగవానుడు కారణము. ఆ శ్రీకృష్ణుడు కాని వస్తువును దేనినైననూ చూపించుడు (అట్టిది ఏదీ లేదని భావము).

మురుడనే రాక్షసుని సంహరించిన శ్రీకృష్ణుని కీర్తి పవిత్రమైనది. మహాత్ములు ఆశ్రయించే ఆయనయొక్క చిగురుటాకువంటి పాదమునెవరైతే గట్టిగా పట్టుకొనెదరో, వారు సముద్రమువంటి సంసారమును దూడ గిట్ల గాడిని దాటినంత తేలికగా తరించేదరు. వారికి సర్వాతి యయు మోక్ష స్థానము లభించును. ఆపదలకు నిలయమగు సంసారo మరల వారికి కలుగదు.

శ్రీకృష్ణ భగవానుడు తన ఐదవ యేట చేసిన లీలను ఆయనకు ఆరవ ఏడు వచ్చినప్పుడు అంతటా కీర్తించిరి. ఈ లీల విషయములో నీవు నన్ను అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమునంతనూ నేను నీకు చెప్పితిని.

మురాసురుని సంహరించిన శ్రీకృష్ణ భగవానుడు మిత్రులతో కూడి చేసిన లీలలను, అఘాసుర సంహారమును, పచ్చిక బయలునందు భుజించుటను, దూడల రూపముగా పచ్చికను తినుటను; ఇంద్రియగోచరమయ్యే జడజగత్తుకంటే విలక్షణమైన చైతన్యస్వరూపుడై యుండుటను, స్వయంభువుడగు బ్రహ్మదేవుడు చేసిన గొప్ప స్తోత్రమును వినే మరియు కీర్తించే మానవుడు నాలుగు పురుషార్థములను పొందును.

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే పూర్వార్దే చతుర్దశోఽధ్యాయః ॥

ఈ విధముగా దాగుడు మూతలు, ఇసుకలో సేతువును కట్టుట, కోతి కొమ్మచ్చి, గోటీలు మొదలగు ఐదేళ్ల వయస్సులో ఆడే ఆటలతో బలరామకృష్ణులు గోకులములో ఆ వయస్సును గడిపి వేసిరి.

శ్రీమద్బాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్దములో బ్రహ్మస్తుతిని వర్ణించే పదునాల్గవ అధ్యాయము ముగిసినది.