శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

10 - శ్రీకృష్ణుడు అర్జున వృక్షముల జంటను పడగొట్టి గంధర్వులకు శాపవిముక్తిని కలిగించుట

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను - ఓ పూజవీయా! వీరిద్దరి శాపమునకు గల కారణమును చెప్పుడు. దేవర్షియగు వారదువకు కోపము వచ్చేటంతటి అధికముగా అందించబడే ఏ పనిని వారు చేసిరి?

శ్రీశుక మహర్షి ఇట్లు చెప్పెను --- కుబేరుని పుత్రులిద్దరు రుద్రుని అనుచరులైరి. దానితో వారు మిక్కిలి గర్వించి అతిశయమగు హర్షము గలవారై సుందరమగు కైలాసపర్వతమునందలి ఉద్యానవనమునందు పాటలు పాడుచున్న యువతులతో గూడి విహరించిరి. వారచట మందాకినీ నదీ వద్ద పువ్వులతో నిండిన ఉద్యానమునందు అన్నరసముతో చేసిన మద్యమును త్రావిరి. వారి కన్నులు మత్తుతో తిరుగాడుచుండెను.

వారిద్దరు పద్మముల గుంపులతో ప్రకాశించే గంగ లోపల యువతులతో బాటు ప్రవేశించి, ఏనుగుల జంట ఆడు యేనుగులతో క్రీడించునట్లుగా, క్రీడించిరి.

కురవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! అనుకోకుండా (ఈశ్వరేచ్చచే) పూజనీయుడగు దేవర్షి నారదుడు అక్కడకు వచ్చి వారిద్దరిని చూచి, వారు మత్తులో ఉన్నారని గమనించెను.

ఆయనను చూచి వస్త్రములు లేని ఆ అప్సరసలు సిగ్గు పడిరి. ఆయన శపించునేమోననే శంక గలవారై వారు వెంటనే వస్త్రములను ధరించిరి. కాని, వస్త్రములు లేని ఆ యక్షులిద్దరు వస్త్రములను ధరించనే లేదు.

ఆ ఇద్దరు యక్షకుమారులు ధనగర్వముతో గ్రుడ్డివారై మద్యముతో మత్తెక్కి ఉండిరి. వారిని అనుగ్రహించాలనే ఉద్దేశ్యముతో నారదుడు వారికి, శాపమునీయబోతూ ఇట్లనెను.

నారద మహర్షి ఇట్లు పలికెన - ఇంద్రియభోగములమ పేవించువావి బుద్దిని భ్రష్టు పట్టించేది ధనగర్వము మాత్రమే మంచి వంశములో పుట్టేవనే గర్వము గాని, విద్యాగర్వము మొదలైనవి గానీ, లేదా రజోగుణకార్యములైన కామవలు మొదలైనవి గాని, ధవగర్వము చే పేటంతటి హాని చేయలేవు. యువతి, జూదము, మద్యములు ఆ ధనగర్వములో భాగములై యుండుము.

ధనగర్వము గలవారికి దయ ఉండదు. వారి దేహేంద్రియాదులు వారి వశములో నుండవు. వంచే స్వభావము గల ఈ దేహము ముసలిదనము గావి, మరణము గాని లేనిదని వారు భావించెదరు. అట్టివారు తినుటకై పశువులను చంపెదరు.

వరదేవుడు (రాజు), భూదేవుడు (బ్రాహ్మణుడు) అని పిలువబడే ఈ దేహమే మరణించిన పిదప (పాతిపెట్టినచో క్రిముల రూపముమ, (వదిలిపెట్టి వశుపక్ష్యాదులు భక్షించిన వివరించబడే పదార్దముయొక్క రూపమును (తగులబెట్టినచో బూడిద రూపముమ పొందుము. దీని కొరకై ప్రాణులకు ద్రోహమున చేయువాడు తనకు ఏది హిత తెలిసినవాడేవా?  కాదు. ఎందుకంటే ప్రాణులమ హింసించుట వలన లభించేది వరకము.

దేహము అన్నము పెట్టేవావి పొత్తా? లేక తండ్రిదా? లేక తల్లిదా? లేక తాతదా? లేక (సమ్న వసూలు చేస్తే) బలశాలియగు రాజుదా? లేక జీతభత్యమురివిచ్చువాడిదా? లేక (మరణించిన పిదప కాల్చే ఆగ్నిదా? (కాల్చకపోతేతివే) కుక్కదా?

ప్రకృతినుండి పుట్టి ప్రకృతిలో కలిసిపోయే ఈ దేహము ఈ విధముగా ఇంతమందికి చేందియున్నది. మూర్ఖుడు తప్ప వివేకి ఎవడు దీనియందు నేను అనే అభిమానము గలవాడై దీని కొరకై జంతువులను చంపును? (చంపడు).

ధనగర్వముతో గ్రుడ్డిదైన దుష్ణునకు పేదరికము గొప్ప అంజనము (చూపునిచ్చే మందు). పేదవాడు మాత్రమే ప్రాణులను తనతో సమానముగా చూచును.

ముల్లు గ్రుచుకున్నవానికి నొప్పి గురించి, దాని వలన దేహములో కలిగే వికారములను గురించి తెలియును. అట్టివాడు ప్రాణులతో సమభావమును పొంది, తనకు కలిగిన నొప్పి ఇతరప్రాణులకు కలుగరాదని కోరుకొనును. కాని, ఏనాడూ ముల్లు గ్రుచ్చుకోనివాడు ఆ విధముగా ఇతరప్రాణుల గురించి తలపోయడు.

ఈ లోకములో బీదవానియందు అహంకారము, గర్వము ఉండవు. అన్ని రకముల గర్వములు ఆతనినుండి దూరమగును. ఆతనికి అనుకోకుండా.(ఈశ్వరేచ్చచే) కష్టము వచ్చును. అది వానికి గొప్ప తపస్సు అగుట నిశ్చితము.

ప్రతిదినము. ఆకలితో కృశించిన దేహము గలవాడై ఆహారమును కోరే బీదవానికి దేహాన్ని బట్టి ఇంద్రియములు కూడ దుర్బలములగును. అట్టివాడు హింసను చేయడు.

పాధువులు అందరినీ సమముగా చూచెదరు. ఐనమా, వారితో సమాగమము బీదవారికి మాత్రమే కలుగుమ. వజ్రమలతోడి సమాగమము వలన ఆతడు అన్నాదులయందలి తృష్ణమ విడవాడుమ. దాని వలన వాచి అంతఃకరణము శీఘ్రమే విశేషముగా శుద్ధమగుమ.

సజ్జనులు చిత్తములో సమత్వము కలిగి మోక్ష ప్రదాతయగు శ్రీహరి పాదములమ శరణు వేడెదరు. వారికి ధనగర్వముతో దుష్టభోగములమ పేవించే దుష్టులలో పని యేమి? వారిని ఉపేక్షించుటయే మేలు.

కావున, నేను వీరిద్దరికి అజ్ఞానము వలన కలిగిన గర్వమును పోగొట్టెదను. దేహేంద్రియములకు వశులైయున్న వీరిద్దరు అన్నరసమునుండి తయారు చేసిన మద్యముతో మత్తెక్కి ఉన్నారు. స్త్రీలంపటులగు వీరు ధనగర్వముతో వివేకజ్ఞానమును కోల్పోయినారు.

వీరిద్దరు లోకపాలకుడగు కుబేరుని పుత్రులై కూడ అజ్ఞానముతో నిండి ఉన్నారు. వీరియందున్న గర్వము మిక్కిలి చెడ్డది. వీరికి తమ ఒంటిపై బట్టలు లేవనే సంగతి కూడ తెలియకున్నది. కావున, వీరికి చెట్లు జన్మ తగినది. నా అనుగ్రహముచే వీరు మరల ఇట్లు (గర్విష్ణులు) కాకుందురు. పైగా, వీరికి పూర్వస్మృతి ఉండును. ఆ జన్మలో కూడ నా అనుగ్రహము వలన వీరికి వసుదేవపుత్రుడగు శ్రీకృష్ణుని సన్నిధి దొరుకును. వంద దివ్యసంవత్సరములు గడచిన పిదప వీరు మరల దేవత్వమును పొందెదరు. వీరికి భక్తి కూడ కలుగును.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఇట్లు పలికి దేవర్షి నారదుడు నారా యణాశ్రమమునకు వెళ్లాను. నలకూబర మణిగ్రీవులు జంట మద్ది చెట్లు ఐరి.

నారదుడు భగవంతుని భక్తులలో అగ్రేసరుడు. ఆయన మాటను సత్యము చేయుటకై శ్రీహరి మెల్లగా ఎక్కడనైతే జంట మద్ది చెట్లు గలవో, అచటకు వెళ్లాను.

నాకు దేవర్షి నారదుడు మిక్కిలి ప్రియమైనవాడు. కావున, ఆయన ఈ కుబేరపుత్రులనిద్దరిని గురించి ఏమి చెప్పెనో, దానిని నేను అటులనే చేసెదను (అని భగవానుడు తలచెను).

ఇట్లు తలపోసి శ్రీకృష్ణుడైతే కలిసి పుట్టిన మద్ది చెట్ల మధ్యలోకి వెళ్లాను. ఆయన అట్లు ప్రవేశించినంత మాత్రాన రోలు అడ్డు పడినది.

బాలకృష్ణుడు ఉదరము చుట్టూ ఉన్న త్రాటితో తన వెనుకనే వచ్చుచున్న ఆ రోలును వేగముగా లాగగా, ఆ రెండు చెట్లు వ్రేళ్ల బంధముతో సహా పెకిలించబడినవై (పెద్ద) భయమును గొల్పే చప్పుడు చేస్తూ మొదలంటా నేల గూలినవి. పరమేశ్వరుడగు శ్రీకృష్ణుని విక్రమ ముచే వాటి కాండము, కొమ్మలు, ఆకులు కూడ అధికముగా అల్లల్లాడినవి.

అప్పుడు ఆ రెండు చెట్లయందు ఆగ్ని వలె గొప్ప కాంతితో దిక్కులను ప్రకాశింపజేసే ఇద్దరు సిద్ధపురుషులు ప్రకటమైరి. వారు రజోగుణము (గర్వము) తొలగిన యక్షకుమారులే. వారు సకలలోకప్రభుడగు శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చి తల వంచి నమస్కరించి దోసిలి యొగ్గి ఇట్లు పలికిరి.

ఓ శ్రీకృష్ణా! శ్రీకృష్ణా! నీవు మహాయోగివి. నీవు సర్వకారణమగు పురుషోత్తముడవు. స్థూలము (పృథివ్యాదులు) మరియు సూక్ష్మము (గంధాదులు) అగు ఈ జగత్తు నీ రూపమేనని వేదవేత్తలు తెలియుదురు.

సకలప్రాణుల దేహము-ఇంద్రియములు-అంతఃకరణము-ప్రాణములకు ప్రభుడవు నీవే. సర్వమును శాసించే కాలము నీవే. వినాశము లేని శ్రీహరి భగవానుడవు నీవే.

సత్త్వరజస్తమోగుణాత్మకము, సూక్ష్మము అగు. ప్రకృతి నీవు. ఆ ప్రకృతినుండి ఆవిర్భవించిన మహత్తత్త్వము నీవే. ఆ ప్రకృతికి అధిష్టానమైన పూర్ణసాక్షి చైతన్యము నీవే. సకల క్షేత్రములయందలి

ప్రకృతియొక్క గుణముల కార్యములైన బుద్ధి మొదలగు వికారములు దృశ్యములు. వాటికి నీవు గోచరుడవు కావు. ఈ సంసారమునందు గుణకార్యములగు దేహాదులయందు ఆత్మభావముచే కప్పివేయబడిన వివేకము గల ఏ జీవుడు అనాది స్వయంసిద్దుడవగు నిన్ను తెలియగల్గును? (ఎవ్వడైననూ తెలియలేడు),

వసుదేవ పుత్రుడవగు నీవే సృష్టికర్తవగు భగవానుడవు. నీ వలన ప్రకాశించే సత్త్వాది గుణములు నీ యథార్థస్వరూపమును కప్పివేయును. అట్టి పరబ్రహ్మవగు నీ కొరకు నమస్కారము.

నీవు చూపే ఆయా పరాక్రమములతో సమానమైనది గాని, అంతకంటే గొప్పది గాని లేదు. అట్టి పరాక్రమములు సామాన్యప్రాణులయందు సంభవము కావు. కానైతే, నీవు శరీరము లేనివాడవు. ఏ శరీరములయందైతే అట్టి పరాక్రమములు ప్రకటమగునో, అవి నీ అవతారములని తెలియవచ్చును.

పురుషార్థములకు ప్రభుడవగు అట్టి నీవు ఇప్పుడు సకలప్రాణుల అభ్యుదయము కొరకు, మోక్షము కొరకు కూడ అవతరించినావు. ఇది అంశముల ప్రాదుర్భావము గల నీ పూర్ణరూపము.

ఓ శ్రీకృష్ణా! సర్వోత్తమమైన కల్యాణసాధనములు, సర్వోత్తమమైన కల్యాణమగు మోక్షము కూడ నీ రూపములే. వసుదేవపుత్రుడవగు నీవు శాంతుడవు. యాదవుల ప్రభువగు నీకు అనేక నమస్కారములు.

ఓ అనంతా! మేమిద్దరము నీ అనుచరుడగు నారదుని కింకరులము. మాకు అనుమతినిమ్ము. భగవానుడవగు నీ దర్శనము మాకు నారదమహర్షి అనుగ్రహము వలన కలిగినది.

మా వాగింద్రియము నీ గుణములను వర్ణించుటయందు, చెవులు గాథను వినుటయందు, చేతులు పూజాది కర్మలయందు, మనస్సు నీ పాదములను స్మరించుటయందు, శిరస్సు నీ నివాసస్థానమైన జగత్తునకు ప్రణమిల్లుటయందు, చూపు నీ రూపములే ఐన సత్పురుషులను దర్శించుటయందు సార్థకమగుగాక!

శ్రీశుక మహర్షి ఇట్లు పలికేను --- ఆ ఇద్దరు యక్షులు గోకులప్రభుడగు శ్రీకృష్ణభగవానుని ఈ విధముగా చక్కగా కీర్తించిరి. ఆయన ఇంకనూ త్రాటితో రోటికి కట్టబడియుండెను. ఆయన నవ్వుతూ వారిద్దరితో నిట్లనెను.

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- మీరిద్దరు ధనగర్వముతో వివేకమును కోల్పోయినప్పుడు దయాహృదయుడగు నారదమహర్షి తన వాక్కులతో మీ ఇద్దరిని దేవత్వమునుండి కూలద్రోసి అనుగ్రహమునే చేసినాడు. ఈ విషయము నాకు ముందే తెలియును.

సూర్యప్రకాశము రాగానే కళ్లకు చీకట్లు దూరమగును. అదే విధముగా ద్వంద్వములను సమత్వదృష్టితో స్వీకరించే సత్పురుషులను దర్శించుట వలన మానవునకు సంసారబంధము దూరమగును. సత్పురుషుల మనస్సు పూర్తిగా నా పైనే నిలిచియుండును.

ఓ నలకూబరా! కావున (సాధుదర్శనము బంధనివృత్తికి హేతువు గనుక), మీరిద్దరు మీ గృహమునకు వెళ్లుడు. నన్నే సర్వాతీశాయియగు గమ్యముగా సేవించుడు. నాయందు అతిశయించిన (నిష్కామమైన) ప్రేమ గలవానికి పునర్జన్మ లేదు. మీకు అపేక్షితమైన అట్టి ప్రేమ మీకు కలిగినది.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- రోటికి కట్టివేయబడి ఉన్న బాలకృష్ణుడు ఇట్లు పలుకగా, వారిద్దరు ఆయనకు ప్రదక్షిణము చేసి పలుమార్లు నమస్కారములను కూడ చేసి ఉత్తరదిక్కు వైపు వెళ్లిరి.

శ్రీమద్భాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్ధములో శ్రీకృష్ణుడు అర్జున వృక్షముల జంటను పడగొట్టి గంధర్వులకు శాపవిముక్తిని కలిగించుటను వర్ణించే పదవ అధ్యాయము ముగిసినది.