శ్రీ మద్భాగవతము - దశమ (10వ) స్కందము

Table of Contents

9 - శ్రీకృష్ణుని రోలుకు కట్టివేసే లీల

ఒకనాడు నందుని గృహిణియగు యశోద పెరుగును తానే చిలికెను. ఎందుకంటే, ఇంటిలోని పరిచారికలనమే ఇతరములగు పనులలో నియోగించెను.

ఆ బాలకృష్ణుని లీలలను ఈ గోకులములో కవులు పాటలుగా రచించిరి. యశోద పెరుగును చిలికే సమయములో వాటిని గుర్తు చేసుకుంటూ పాడెను.

యశోద నడుమునందు పట్టుచీరను బంగరు మొలనూలుతో కట్టి ధరించి పెరుగును చిలుకుచుండగా పుత్రునియందలి ప్రేమచే పాలను స్రవించే ఆమె పాలిండ్లు చలించేను. అందమైన కనుబొమలు గల ఆమె కవ్వపు త్రాడును లాగుతూ ఉంటే శ్రమ వలన భుజములయందలి కంకణములు, కుండలములు కూడ కదలుచుండెను. ఆమె ముఖముపై చెమట పొడసూపగా, జుట్టుముడినుండి జాజులు జారిపోవుచుండెను.

శ్రీకృష్ణుడు పాలను త్రాగగోరి ఆ తల్లి వద్దకు వచ్చి ప్రీతిని కలిగిస్తూ పెరుగును చిలుకుచున్న కవ్వమును పట్టుకొని, చిలుకుటను అడ్డుకొనెను.

బాలకృష్ణుడు యశోద ఒడిలో జేరి కూర్చుండగా, ఆమె ఆతని చిరునవ్వుతో కూడిన ముఖమును చూస్తూ ప్రేమతో స్రవించే పాలను లైవించేను. కాని, ఆతడింకనూ తృప్తి జెందలేదు. ఇంతలో పొయ్యి మీద పెట్టిన పాలు పొంగుచుండగా, ఆమె ఆతనిని విడిచి పెట్టి వెళ్లాను.

బాలకృష్ణుడు కోపము వచ్చి పళ్లతో ఎర్రగా ప్రకాశించే క్రింది పెదవిని గట్టిగా కొరికి బెల్లం మొత్తే రాతితో పెరుగు చిలికే కుండను పగులగొట్టెను. ఆతడు ఉత్తుత్తి కన్నీళ్లు గలవాడై లోపలికి వెళ్లి చాటుగా నిన్నటి వెన్నను తినుచుండెను.

గోపికయగు యశోద బాగా మరిగిన పాలను పొయ్యి దింపి మరల పెరుగు చిలికే చోటుకు వచ్చెను. అచట ఆమె పగిలిన పెరుగు కుండను చూచేమ. అది తన పుత్రుని పనియేనని గుర్తించి ఆమె నవ్వుకొనెను. పైగా, ఆతడు ఆమెకు ఆ చుట్టుప్రక్కల కావరాలేదు.

బాలకృష్ణుడు తిరగబడిన రోలుపై స్థిరముగా కూర్చుండి ఉట్టియందలి నిన్నటి వెన్నను యథేచ్చగా కోతికి తినిపించుచుండెను. కాని, తాను వెన్నను దొంగిలించినందు వలన ఆతని చూపులలో ఆశంక తొంగిచూచుచుండెను. యశోద ఆ విధముగా ఉన్న పుత్రుని చూచి నిశ్శబ్దముగా వెనుకకు వచ్చెను.  

బెత్తము పట్టుకొనియున్న ఆ గోపికను పరికించి చూచిన బాలకృష్ణుడు భయపడినవాడు వలె వేగముగా. ఆ రోలుపైనుండి క్రిందకు దిగి పారిపోయెను - యోగుల మనస్సు. ఆయనపై నిలుచుటకు యోగ్యమైనదియే. ఐననూ, తపస్సుచే ఏకాగ్రము చేయబడిన వారి మనస్సు ఆయనను చేరలేకపోవును (అనగా శ్రీహరి మనస్సునకు గోచరుడు కాడని యర్థము). అట్టి శ్రీహరి వెంట ఆమె పరుగెత్తెను.

తల్లి యశోద బాలకృష్ణుని వెంటబడి వెనుక వేగముగా పరుగెత్తాను. విశాలమైన కటిభాగము బరువుగా కదులుతుండగా, సన్నని నడుము గల ఆమె గమనము . మెల్లనగుచుండెను. విడిపోయిన జుట్టుముడినుండి పువ్వులు జారీ ముందుకు సాగుచున్న ఆమె వెనుక పడుచుండెను.

బాలకృష్ణుడు తప్పు చేసి పైగా బిగ్గరగా ఏడ్చుచుండెను. ఆతడు తన చేతితో కళ్లను నలుపుచుండగా కాటుక మసి ముఖమంతా వ్యాపించుచుండెను. భయముతో వ్యాకులమైన కన్నులతో పైకి చూస్తున్న ఆతనిని యశోద చెయ్యి పట్టుకొని భయ పెడుతూ కొట్టబోయేను.

యశోదకు పిల్లవావియందు వాత్సల్యమే గాని, ఆతని శక్తి గురించి ఆమెకు తెలియదు. పిల్లవాడు భయపడినాడని గుర్తించిన ఆమె బెత్తమును పారవేసి, పిల్లవావివి కట్టివేయుటకు సంకల్పించెను.

పరమాత్మయందు బయటలోపల అవే - లేడాలు గాని, ఆది-అంతములు గావి లేవు. పరమాత్మ జగత్తుకంటే ముందు, వెనుక (ప్రళయమువందు) కూడ ఉండును. జగత్తు లోపల ఉండే పరమాత్మ జగత్తువకు అతీతుడై యుండుమ. వాస్తవములో పరమాత్మయే జగద్రూపముగా ఉన్నాడు.

ఇంద్రియములకు గోచరము కావివాడు, నామరూపములకు అతీతుడు ఆగు పరమాత్మ మానవరూపములో అవతరించెను. అట్టి బాలకృష్ణుని గోపికయగు ఆ యశోద తవ పుత్రుడవి తలపోసి, మామూలు పిల్లవానివి వలె, త్రాటితో రోలువకు కట్టివేసెను. 

తప్పు చేపీవ తన పుత్రుని గోపికయగు యశోద కట్టుచుండగా, ఆ త్రాడు రెండు అంగుళములు తక్కువ ఆయెను. ఆమె దానికి మరియొక త్రాడుమ జత చేపేమ.

ఆ త్రాడు కూడ రెండు అంగుళములు తక్కువగా ఉండేమ. అప్పుడామె మరియొక త్రాడును కూడ జత చేయగా, అది కూడ రెండు అంగుళములు తక్కువయే ఉండెమ. ఈ తీరున ఎన్ని త్రాళ్లేమ కట్టివా, రెండు అంగుళములు తక్కువయే ఉండెను.

ఈ విధముగా యశోద తన యింటిలోని త్రాళ్లను జత చేయుచునే యుండెను. ఆమెను చూచి గోపికలు ముసి ముసి నవ్వులు నవ్వుచుండిరి. వారితో బాటు ఆమె కూడ నవ్వుతూ, చాల ఆశ్చర్యమును పొందెను.

తన తల్లియగు యశోద ఒళ్లంతా చెమటలు పట్టి, జుట్టుముడినుండి పూల మాల జారిపోయెను. ఆమె అలసటను చూచిన శ్రీకృష్ణుడు దయతో తనను తానే బంధించుకొనెను.

ఓ పరీక్షిన్మహారాజా! లోకపాలకులతో సహా ఈ జగత్తు శ్రీహరి వశములోమమది. ఆ శ్రీహరి అవకారములు తీకుసుడు. పంతంత్రుడే ఐననూ, నిశ్చయముగా భక్తపరతంత్రుడు అనే విషయమును ఈ వృత్తాంతము చూపుచున్నది.

మోక్ష ప్రదాతయగు శ్రీహరినుండి గోపికయగు యశోద ఏ అను గ్రహమునైతే పొందెనో, అట్టి ఈ అనుగ్రహమును బ్రహ్మదేవుడు, శివుడు, ఆయన శరీరమునాశ్రయించే లక్ష్మీదేవి అనే ముగ్గురు కూడ పొందలేదు.

యశోదాతనయుడగు ఈ శ్రీకృష్ణ భగవానుడు ఈ లోకములో ఏ విధముగానైతే తానే అయి ఉన్న ఆత్మజ్ఞానులకు మరియు భక్తి గలవారలకు తేలికగా లభించునో, ఆ విధముగా దేహాభిమానము గలవారలకు లభించడు.

తల్లి ఇంటి పనులలో మునిగియుండెను. సర్వసమర్థుడగు శ్రీకృష్ణునకైతే రెండు మద్ది చెట్లు కనబడెను. అవి పూర్వజన్మలో కుబేరుని పుత్రులగు ఇద్దరు యక్షులు.

నలకూబరుడు, మణిగ్రీవుడు అనే ఇద్దరు యక్షులు సంపద గలవారు. గర్వించియున్న వారిద్దరిని నారదుడు చెట్లు కమ్మని శపించగా వారట్లే ఐరి.

శ్రీమద్బాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్ధములో శ్రీకృష్ణుని రోలుకు కట్టివేసే లీలను వర్ణించే  తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).