2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

Table of Contents

60 –  శ్రీకృష్ణుడు దేవతలకు తారమద్ధరించు విధానముచెప్పుట

నారద ఉవాచ- నారదమహర్షి నారాయణునీతోనిట్లు పలికెను-

వేదములు, వేదాంగములు అన్నియు తెలిసిన నారాయణుడా! నీవలన అనేక ఉపాఖ్యానములను వింటిని. ఇప్పుడు సమస్త సంపదల నొసగు పరమశివుడు కైలాసమునకు వెళ్ళిన బృహస్పతితో ఏమనెను? ఈ విషయమును సంపూర్ణముగా నాకు తెలుపుమని అడిగెను.

నారాయణ ఉవాచ- నారాయణుడు ఇట్లనెను-

బృహస్పతి బ్రహ్మదేవుని మాటలనమసరించి శీఘ్రముగా కైలాసపర్వతమునకు వెళ్ళి అచ్చట పిగ్గుతో తలవంచుకొని నమస్కరించి నిలబడెను. గురుసుతుడగు బృహస్పతి కనిపించగానే శంకరుడు దర్భాసనమునుండి లేచి బృహస్పతిని కౌగలించుకొని ఆశీర్వదించెను. తరువాత ఆతనిని తనతోపాటు ఆసనమున కూర్చుండబెట్టుకొని యోగక్షేమములు విచారించెను. అటుపిమ్మట శంకరుడు భయముతో, సిగ్గుతోనున్న బృహప్పతితో మధురముగా ఇట్లు మాట్లాడ దొడగెను.

శ్రీశంకర ఉవాచ- శంకరుడిట్లు పలికెను-

ఓ బృహస్పతీ! నీవెందులకిట్లున్నావు? మలినమైన శరీరముతో కన్నీళ్ళతో దుఃఖించుచున్నట్లున్నావు. నీ దుఃఖమునకు కారణమేమిటో చెప్పుము. నీ తపస్పున కేమైన అవాంతరమేర్పడినదా? లేక సంధ్యావందనమునకు ఇబ్బంది కలిగినదా? దురదృష్టము వలన నీవు శ్రీకృష్ణపరమాత్మను ధ్యానింపలేక పోవుచున్నావా? నీగురుభక్తికి గాని దైవభక్తికిగానీ ఆవాంతరము కలిగినదా? నీన్ను శరణుచెందిన ప్రపన్నుని రక్షింపలేక పోయితివా? నీ ఇంటికి వచ్చిన ఆతిథి నీవు. చక్కగా సత్కారము చేయలేదని వెనుదిరిగి పోయినాడా?

లేక నీ ఇంటిలోనున్న ఆనుచరవర్గమునకు భోజనము పెట్టలేక పోవుచున్నావా? మీ భార్యకాని పుత్రుడుకాని స్వతంత్రులై ఎదురుతిరిగి మాట్లాడుచున్నారా? లేక నీ శిష్యులుగానీ భృత్యులుగాని ఎదురుతిరిగివారా? లక్ష్మీదేవి నిన్ననుగ్రహించకుండ ఉన్నదా? నీ గురువు నీపై కోపపడినాడా? నీ అభీష్టదేవత కానీ బ్రాహ్మణులుకాని నీపై కోపగించినారా? నీబంధువులెవరైన పోయిరా? బలవంతుడైన వానీతో కయ్యమేమైనా జరిగినదా? నీ స్థానమును ఇతరులాక్రమించుకొనిరా? నీ బంధువుల ధనమును ఎవరైనను దోచుకొనీరా? పావులు దుష్టులైన వారు నిన్ను నిందించరా? నీకు మిక్కిలి ఇష్టమైన బంధువులు నిన్ను వదిలిపోయిరా?

లేక నీవే, ఏమైన వైరాగ్యమువలన లేక కోపమువలన నీ బంధువులను వదలుకొంటివా? నీవు పుణ్యతీర్థములలో స్నానము చేయలేదా? అచ్చట పుణ్యదినమున దానము చేయలేకపోతివా? లేక దుష్టులు నీ గురువును కాని బంధువులను కానీ నిందించరా?

మంచివారు తన గురువును ఇతరులు నిందించుచున్నచో దానీని మరణముకంటె ఎక్కువగా భావింతురు. చెడువంశములో పుట్టిన దుస్తులు వృథాగా ఇతరులను నిందింతురు, సత్పురుషులు ఎల్లప్పుడు పరప్రశంస సేయుదురు. అందువలననే వారు పుణ్యవంతులగుచున్నారు. వారి మనస్సులో సైతము సద్భావనయుండుమ.

మానవులు సాధారణముగా, పుత్రుని, కీర్తిని, సమృద్ధమగు నీటిని, మంచి పరాక్రమమును, ఐశ్వర్యమును, సంతానమును, భూమిని ధనమును, మంచిమాటలను, చక్కని స్వభావమును ఇష్టపడుదురు.

తమ మనస్సులో ఎట్టి భావన చేయుదురో మానవులకు అట్టి పనులే జరుగును. వారి పూర్వపుణ్యముననుసరించి ఈజన్మలో వారీ చిత్తముండును.

మహాదేవుడిట్లు బృహస్పతితో ననగా బృహస్పతి పరమశివునీలో ఈవిధముగా మాటలాడసాగెను.

బృహస్పతిరువాచ- బృహస్పతి ఇట్లనెను-

ఓ మహేశ్వర! నా వృత్తాంతము చెప్పదగనిదైనను చెప్పెదను.

జీవులు కర్మవలన అనేక జన్మలనొందుచున్నారు. ప్రతిజన్మలోను వారు తాము చేసిన కర్మఫలముననుభవించుచున్నారు. కర్మఫలమనుభవింపనిదే కర్మ ఈ భారతభూమీపై నశింపదు. సుఖము, దుఃఖము, భయము, శోకమనునవి మానవులకు తాము చేసిన కర్మవలన ఈ భారతభూమిపై ఏర్పడుచున్నవని కొందరనగా మరికొందరు వారివారి అదృష్టమువలన సుఖదుఃఖాదులు కలుగుచున్నవందురు. దీనికి కర్మ, అదృష్టము, స్వభావము అను మూడు కారణములగుచున్నవి.

మానవుడు స్వయముగా కర్మకు కారణమగుచుద్నాడు. ఆ కర్మ అదృష్టమునకు కారణమగుచున్నది. జీవులు తాము పూర్వజన్మలో చేసికొన్న కర్మవలన స్వభావము పొందుచున్నారు. సుఖము, దు:ఖము, భయము, శోకమనునవి తన ఆత్మనుండి పుట్టుచున్నవి.

సగుణుడైన జీవుడు తాను చేసిన కర్మలనెల్లప్పుడు అనుభవించుచుండును. నిర్గుణుడు ప్రకృతికంటే శ్రేష్ఠుడైన పరమాత్మ  సర్వసాక్షిగానుండును.

ఆ పరమాత్మయే సమస్తజీవులచే సేవింపదగినవాడు. అందరకు అన్ని ఫలితముల నొసగువాడు. ఆ పరమాత్మయే అదృష్టమును, స్వభావమును, కర్మను సృష్టించుచున్నాడు. ఆ కర్మవలననే మానవులకు సిగ్గ, ప్రశంస, సంతోషము కలుగుచున్నవి.

ఐనను నేను సిగిపడుటకు గల కారణమును నీకెలిగింతును.

బృహస్పతి ఈవిధముగానని విషయమంతయు నెరిగించగా విని శివుడు సిగ్గుతో తలవంచుకొనెను. అతనికి వెంటనే కోపము కలిగెను. దానివలన అతని చేతినుండి అక్షమాల జారిపడెను. అతని శరీరము కంపించెను, కండ్లు ఎట్టబడినవి. ఆ పరమేశ్వరుడు లోక సంహరము చేయు రుద్రునకు ఆధిపతియు, లోకములను రక్షించు విష్ణుమూర్తికి స్నేహితుడు, లోకములను సృజించు బ్రహ్మదేవునిచే స్తుతింపబడువాడు. ఆతడు పరమాత్మ, నిర్గుణ స్వరూపుడు, ప్రకృతికి ఆధిపతి, శివునకు ఆత్మస్వరూపుడగు శ్రీకృష్ణపరమాత్మకు మాన్యుడు. ఆట్టి పరమశివుడు కోపముచే గొంతు నాలుక ఎండిపోగా బృహస్పతితో ఇట్లనెను.

శివ ఉవాచ- పరమశివుడిట్లనెను-

సాధువులు, సత్పురుషులు, అగు వైష్ణవులకు ఎల్లప్పుడు మేలు జరుగును. అట్లే సత్పురుషులు కాని అవైష్ణవులకు ఎల్లప్పుడు కీడు జరుగును. వైష్ణవులగువారిని కష్టపెట్టువారికి ఎల్లప్పుడు విఘ్నములు కలుగును. శ్రీకృష్ణుడు వారిని బ్రతుకనీయడు. వైష్ణవులు కానివారీ హృదయము ఎల్లప్పుడు ఆపరిశుద్ధముగా నుండును.

శ్రీకృష్ణుని మంత్రమును స్మరించినచో మనస్సు నిర్మలమగును. అతని హృదయగ్రంథి విడిపోగా సంశయములన్నియు పటాపంచలగును. శ్రీకృష్ణమంత్రమును ఉపాసించినచో ఆతని కర్మఫలము నశించును. శ్రీకృష్ణభక్తుల మనస్సు చాల నిర్మలముగానుండును.

అందువలననే తన భార్యను చంద్రుడెత్తుకొని పోయినను అతనిని గురువు శపింపలేదు. శ్రేష్ఠుడు, కోపములేనివాడు ధార్మికుడగు గురువు తన శాపమువలన నూరుమందినైనను చంపగలడు. కాని గురువగు బృహస్పతి తనకు ఆపకారము చేసిన చంద్రుని శపింపలేదు. నాకు సోదరునీవంటివాడు దేవతలకు గురువైన బృహస్పతి తన బాధాపూరితమగు నీటూర్పుచే చంద్రుని ఒక నిమిషములోనే భస్మము చేయగలడు. అతనీ నూరు: ముక్కలుగా చేయగలుగును. ఐనను బృహస్పతి ధర్మమునకు భంగము కలుగునని చంద్రుని శపింపలేదు. కోపముచే శపించువాని తపస్సు క్షీణించును కాన బృహస్పతి చంద్రునీ శపింపలేదు, , తపస్వి, విష్ణుభక్తుడు, బ్రహ్మదేవుని పుత్రుడు, మహాజ్ఞానియగు అత్రిమహర్షికి పరస్త్రీ వ్యామోహము కలవాడు, ధూర్తుడైన ఇటువంటి చెడు పుత్రుడు కలిగెను. ఇది చాలా ఆశ్చర్యము.

బ్రహ్మదేవుని పుత్రులందరు. ధర్మపరాయణులు, విష్ణుభక్తులు అందరు బ్రాహ్మణులే. ఆతని మనుమలు దేవతలు, ద్విదాలు, రైత్యులని మూడు విధములుగా నున్నారు. సాత్విక గుణము కలవారు బ్రాహ్మణులు కాగా రజోగుణము కలవారు దేవతలు. తమోగుణ సంపన్నులు, రౌద్రులు, బలవంతులు, ఉద్ధులైనవారు దైత్యులు.

బ్రాహ్మణులు స్వధర్మనిరతులై శ్రీమహావిష్ణు పాదాబ్జములనెల్లప్పుడు సేవించుచుందురు. దేవతలు శిపుని, శక్తిని పూజింతురు. దైత్యులకు పూజయుండదు. విష్ణుభక్తులగు బ్రాహ్మణులు ముక్తిని గోరుచు శ్రీకృష్ణదాస్యమునెల్లప్పుడు ఆభిలషింతురు. దేవతలు ఐశ్వర్యమును కోరుదురు. అసురులు తొమసప్రవృత్తి కలవారు.

కోరికలేమియు లేని బ్రాహ్మణులయొక్క ధర్మము నిర్గుణుడు, ప్రకృతీకన్నను పరుడగు శ్రీకృష్ణుని అర్చించుట. వైష్ణవులగు బ్రాహ్మణులు స్వతంత్రముగా పరమపదమునకు పోవుదురు. కాని ఇతరదేవతలనుపాసించువారు. ప్రాకృతలయమున ఆ ఇతర దేవతలతో కలసి పరమపదమునకు పోవుదురు. చతుర్వర్ణములలో బ్రాహ్మణజాతి చాలా శ్రేష్ఠమయినది. వారు వైష్ణవులైనచో సాధుపురుషులగుదురు. నారాయణ మంత్రోపదేశము పొందని బ్రాహ్మణులకంటే చండాలుడు పరమశ్రేష్ఠుడు. వైష్ణవులు పరి పక్వతను పొందినను పొందకున్నను సాధుపు లేయగుచున్నారు. వైష్ణవుల నందరను సుదర్శన చక్రము అహర్నిశలు రక్షించుచుండును. అగ్నిలో పడిపోయిన ఎండు గడ్డిపోచ ఏవిధముగా క్షణములో భస్మమగునో అట్లే వైష్ణవులందు పాపము క్షణములో భస్మమైపోవును.

గురువుయొక్క ముఖతః విష్ణుమంత్రము ఎవరి చెవిలో ప్రవేశించునోఆతడే పరమ పవిత్రుడైన వైష్ణవుడని విద్వాంసులందురు. చెవులు తమ తండ్రివంకనున్న నూరు తరములవారిని తల్లివంశమునకు చెందిన నూరు తరములవారినీ, తన సోదరులను, తల్లిని ఉద్దరింతురు. గయలో పిండప్రదానము చేసినందువలన ఆ పిండమును భక్షించువాడు మాత్రము ముక్తుడు కాగా ఇపులు నూరుతరములవారిని సముద్ధరింతురు. నారాయణమంత్రమును గురుముఖతః పొందినంతమాత్రముననే అతడు జీవన్ముక్తుడగును. ఆ వైష్ణవుని చూచి యముడు గరుత్మంతుని చూచిన సర్పమువలే భయపడిపోవును. ఓ బృహస్పతీ! భారత భూభాగముననున్న గంగాది, పుణ్యతీర్ధములు మానవుల పవిత్రము చేయును. శ్రీకృష్ణమంత్రోపాసకులు తమ స్పర్శమాత్రమున జీవులను పవిత్రులుగా చేయుదురు. శ్రీకృష్ణమంత్రోపాసకులు భూమిపై తిరుగుచున్నందువలన వారి పాదపద్మములయొక్క ధూళివలన పాపాత్ములందరు విముక్తులగుదురు. భూమి పహితము పవిత్రమగుచున్నది.

వాయువు, అగ్ని, సూర్యుడు వీరందరు లోకమును పవిత్రముగా చేయుదురు. కానీ ఈ దేవతలు వైష్ణవులయొక్క స్పర్శమాత్రమున పవిత్రులైరి. వేను, బ్రహ్మదేవుడు, సర్వకర్మలకు సాక్షీభూతుడైన ధర్మదేవత మేమందరము వైష్ణవులతో కలిసియుండవలెనని సంతోషముగా కోరుకొందుము.

ఈ భారతదేశమున ఆందరకు వారువారు చేసికొన్న కర్మలననుసరించి ఫలితము లభించును. కాని వైష్ణవులకు కర్మఫలమంటదు. భక్తవత్సలుడైన శ్రీహరి తన భక్తులయొక్క పూర్వకర్మ ఫలమును నశింపజేయును. పైగా దయా సముద్రుడగు ఆ పరమాత్మ కృపతో తన స్థానమునే వారికిచ్చివేయును.

దుర్బలుడు, భయముచెందిన చంద్రుడు పరమవైష్ణవుడు ఆధిక తేజస్వీయగు శుక్రుని శరణుపొందెను. శక్తిమంతుడైన సుదర్శనచక్రము కూడ ఆ భృగునందనుని ఏమి చేయలేదు. ఐనను నా గురువగు శ్రీకృష్ణుని మంత్రప్రభావమువలన తారను ఉద్ధరించి నీకీయగలను. నీవు సత్యరూపుడు, పరబ్రహ్మస్వరూపుడు, ఈశ్వరుడగు శ్రీకృష్ణ పరమాత్మను సేవింపుము. ఆ పరమాత్మ సంతోష పడినచో నీ భార్య నీకు తప్పక లభించును.

ఓ సోదరుడా! నీకు కల్పతరువువంటి శ్రీకృష్ణమంత్రమును ఉపదేశింతును. ఇది కోటి జన్మలలో పొందిన పాపములనన్నిటిని తోలగించును. సమస్త ముంగళములను కలిగించును.

బ్రహ్మమొదలు స్తంబ పర్యంతమున్న ఈ చరాచర సృష్టి జలమునందు కన్పించు నీడవలె నశించిపోవును. అందువలన నీత్యుడగు శ్రీకృష్ణ పరమాత్మను నీవు సేవింపుము.

గురువుయొక్క ముఖమునుండి శ్రీకృష్ణమంత్రోపదేశము పొందనంతవరకు సంసారమున, భోగములపై, స్త్రీసుఖమున ఇచ్ఛ కలుగును. దుర్లభమైన శ్రీకృష్ణమంత్రము లభించినంతమాత్రమున మానవునకు కోరికలన్నియు నశించును. వైష్ణవులు ఇంద్రత్వమును, దేవత్వమును, మోక్షమును కోరుకొనరు. వారెల్లప్పుడు శ్రీహరి దాస్యమును, శ్రీహరి భక్తిని మాత్రము కోరుకొనెదరు, వైష్ణవులు శ్రీహరి భక్తిని తొలగించు మోక్షమును జ్ఞానమును, మృత్యుంజయత్వమును, సమస్త సిద్దులను, తన ఇతర కోరికలను, వాక్సిద్ధిని, బ్రహ్మపదవిని ఎట్టి స్థితిలోను కోరుకొనరు. శ్రీకృష్ణభక్తికాక ఇతర విషయములను వైష్ణవుడు కోరుకొనినచో అమృతమును వదలి విషమును భుజించువాడగును,

నేను, బ్రహ్మదేవుడు, విష్ణువు, ధర్ముడు. అనంతుడు, కశ్యపుడు, కపిలుడు, కుమారస్వామి, నరనారాయణమునులు, స్వాయంభువమనువు. ప్రహ్లాదుడు, పరాశరుడు, భృగువు, శుక్రుడు, దుర్వాసుడు, వసిష్ఠుడు, క్రతువు, అంగిరసుడు, బలి, వాలఖిల్యులు, వరుణుడు, అగ్నిదేవుడు, వాయువు, సూర్యుడు, గరుడుడు, దక్షుడు గణపతి వీరందరు శ్రీకృష్ణుని యొక్క గొప్ప భక్తులు. ఆ శ్రీకృష్ణదేవుని భక్తిగలవారందరు అతని అంశరూపులే.

అని చెప్పుచు బృహస్పతికి మహదేవుడు శ్రీకృష్టమంత్రమును ఉపదేశించెను.

లక్ష్మీమాయా కానుబీజాక్షరములు చతుర్థివిభక్త్యంతమైన కృష్ణుపదము కలది ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయనమః అను శ్రీకృష్ణమంత్రము. ఆ మంత్రముతోపాటు శ్రీకృష్ణ పూజావిధానమును, స్తోత్రమును, కవచమును, తత్పురశ్చరణమును, ధ్యానమును శంకరుడు గంగాతీరమున బృహస్పతికి, ఉపదేశించెను. సంసార సాగరమున కొట్టుమిట్టాడుచున్న బృహస్పతి శంకరునితో ఇట్లనెను.

ఓ మహాదేవ! నన్ను ఆజ్ఞాపించినచో శ్రీహరి తపస్సుచేసికొనుటకు పోవుదును. తార చంద్రుని దగ్గరనే ఉండనిమ్ము, ఆమెవలన నాకెట్టి ప్రయోజనము లేదు. సమస్తము నాకు విషముతో సమానముగా కన్పించుచున్నది. ఇది అంతయు అశాశ్వతమైనది. అందువలన నిత్యుడు, సత్యస్వరూపుడు, నిర్గుణుడగు శ్రీకృష్ణపరమాత్మను శరణు వేడెదను అని బృహస్పతి అనెను.

శ్రీమహాదేవ ఉవాచ-  మహాదేవుడిట్లనెను-

బృహస్పతీ! తన భార్య ఇతరుల ఆధీనమునందుండగా తపస్సు చేయుట మంచిదికాదు. మంచివానికి కలిగిన కష్టము మరణముకంటె గొప్పనిది. అందువలన నీవు బ్రహ్మాది దేవతలున్న నర్మదా నదీ తీరమునకు పొమ్ము, నేను కూడ నీవెంటనే అచ్చటికి వచ్చెదనని శంకరుడను.

శివునియొక్క మాటలు విని వెంటనే బృహస్పతి నర్మదానదీ తీరమునకు బయలుదేరెను. శంకరుడు కూడ వెంటనే అచ్చటకు వచ్చెను. శంకరుడు తన పరివారముతో ఆక్కడకు రాగా నర్మదానదీ తీరముననున్న దేవతలు, మునులు. మనువులందరు ఆ పరమశివునికి నమస్కరించిరి. శంకరుడు కూడ బ్రహ్మ, విష్ణువులకు నమస్కారము చేసెను. బ్రహ్మావిష్ణువు లా శివుని ప్రేమతో ఆలింగనము చేసికొనిరి.

ఆ సమయమున అక్కడకు వచ్చిన బృహస్పతి బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులకు నమస్కరించెను.

బృహస్పతి ఆక్కడకు వచ్చి సూర్యుని, ధర్మదేవతను, అనంతుని, నరుని, నన్ను (నారాయణుని), మునీశ్వరులను, తన గురువును, తండ్రిని భక్తితో నమస్కరించి ఆ సభలో కూర్చుండెను. అప్పుడు విష్ణుమూర్తి బృహస్పతి గురించి ఒక ఆలోచన చేసి బ్రహ్మదేవుడు చంద్రశేఖరులతో ఇట్లు వివరించెను.

విష్ణురువాచ- విష్ణుమూర్తి ఇట్లు పలికెను-

మీరిద్దరు మునులు అందరు కలిసి సముద్రతీరమునకుపొండు. అచ్చట శుక్రుని దగ్గరకు ఒక దూతను పంపుడు. యుద్ధమువలన చాలా కష్టములు ఏర్పడును. అందు సంశయము లేదు.

ఆందువలన నా ఆశీర్వచనము వలన బృహస్పతి తనభార్యను తిరిగిపొందును. దేవతలు స్తుతించినచో శుక్రాచార్యులు సంతోషపడుమ. అందువలన ఆసీసర్లమను శుక్రుని ఆశ్రమమునకు మీరందరు కలిసిపోయి అతనిని స్తుతింపుడు. శత్రువు ఎంతటి బలవంతుడైనను పొగిడినచో వశమైపోవునని వేదము చెప్పుచున్నది. శుక్రాచార్యుడు శ్రీకృష్ణుని చక్రముచే రక్షింపబడుచున్నందువలన ఆడవిని దేవతలు జయింపలేరు. అందువలన అతనిని పొగడి పనివి సానుకూలము చేయుటయే మంచిది.

మీరు నన్ను ప్రార్థించినందువలన సంతోషపడి తద్వీపము మండి ఇచ్చటకు వచ్చితిని అని శ్రీమన్నారాయణుడు ఆచ్చటనే అదృశ్యమయ్యెను.

శ్రీమన్నారాయణుడు శ్వేతద్వీపమునకు పోగానే దేవతలందరు చాలా బాధపడిరి.

మునులు దేవతలున్న ఆ సభలో బ్రహ్మదేవుడు వారిని సంబోధించి శంకరునకు సమ్మతమైనది, వీటిపారమగు మాటను ఇట్లు పలికెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడిట్లు పలికెను-

ఓ దేవతలారా! నాకు శంకరునకు, ధర్మదేవతకు సర్వసాక్షియగు విష్ణువునకు కూడ దైత్యుల పై దేవతల పై సమానమైన ప్రేమకలదు. ఇప్పుడు చంద్రుడు దైత్యులకు గురువగు శుక్రుని శరణుజొచ్చెను. శుక్రునీ దేవతలు జయించలేదు. అందువలన అతడు మీమాట వినడు. పైగా అతనిని మీ శత్రువులగు దైత్యులు పూజించుచున్నారు,

అందువలన తారకొరకు నేను శుక్రుని ఇంటికి వెళ్ళేదను. మీరందరు సముద్రతీరముననే ఉండుడని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పి తాను శుక్రుని దగ్గరకు పోయెను. బ్రహ్మదేవుని మాటవనుసరించి దేవతలందరు సముద్రతీరమువకు పోయిరి.

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమున నారద నారాయణుల సంవాదమున తెల్పబడిన శ్రీకృష్ణుడుపదేశించిన తారాదేవి ఉద్దరణోపాయజ్ఞానమను అరవయవ అధ్యాయము సమాప్తము.