2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

Table of Contents

54 –  సుయజ్ఞుడు గోలోకమున చేరుకొనుట

రాజోవాచ- మహారాజిట్లనెను-

సమస్తమువకు ఆధారమైనవాడు, కాలమునకు భయముచెందు శ్రీమహావిష్ణువునకు ఆధారమేమి? కాలముయొక్క మాయ ఎంత ఉండును? క్షుద్ర విరాట్ స్వరూపుని ఆయుః కాలమెంత? అట్లే బ్రహ్మదేవుడు, ప్రకృతి, మనువు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు వీరి ఆయుర్దాయమెంత? అట్లే ఇతర ప్రాకృత జనుల కాలమెంత?

విశ్వములన్నిటియొక్క పై భాగమున ఎవరున్నారు? లేక ఏలోకమున్నది? ఈ సందేహములనన్నిటిని తీర్పుమని సుయజ్ఞుడడిగాను.

సమస్త విశ్వములకు పైభాగమున గోలోకమున్నది. ఆది, ఆకాశమువలె చాలా విశాలమైనది. శ్రీకృష్ణుని యొక్క ఇచ్ఛననుసరించి ఏర్పడినది. ఆ గోలోకము అండరూపముననుండును. శ్రీకృష్ణుడు ప్రకృతితో కలసి సృష్టిచేయవలెనని అనుకొన్నప్పుడు క్రీడయందు అలసిపోయిన ఆ పరమాత్మయొక్క ముఖమున ఏర్పడిన జలబిందువే జలరాశిగా ఏర్పడి గోలోకమున దాని క్రిందనున్న ఇతరలోకములలోను వ్యాపించినది.

ప్రకృతియొక్క గర్భముతో కలిసిన (పుట్టిన) అండమునుండి పుట్టిన విశ్వమునకు ఆధారమైన శ్రీమహావిష్ణువునకు పైన పేర్కొనబడ్డ గోలోకము ఆధారమగుచున్నది. ఆ శ్రీమహావిష్ణువే మహావిరాట్రూపుడు. ఆతడు అతివిశాలమైన జలము పై పవళించియుండును. ఆ మహావిరాడ్రూపుడు రాధేశ్వరుడగు శ్రీకృష్ణునియొక్క పదునారవ అంశభాగము. ఆ మహావిష్ణువు. గడ్డిపరక వలె నల్లని రూపముననుండును. ఆతనికి నాలు. భుజములుండును. ఆతడు వనమాలను, పీతాంబరమును ధరించియుండును. ఆతడుండు నిత్యవైకుంఠము అన్ని విశ్వముల పైన నుండును.

శ్రీమహావిష్ణువు నివసించు వైకుంఠము ఆత్మవలె నిత్యమైనది. ఆకాశమువలె విస్తారమైనది. చంద్రబింబమువలె ప్రకాశించునది. ఆలోకము శ్రీకృష్ణపరమాత్మయొక్క ఇచ్ఛవలన ఏర్పడినది. ఆది నిర్లక్ష్యము. దానికి ఆశ్రయముగా ఇతర లోకములు లేవు. ఆ లోకముననున్న నిర్మాణములన్నియు రత్నములచే చేయబడినవి.

ఆ వైకుంఠమున నాలుగు భుజములు కలవాడు, వనమాలాధరుడుగు శ్రీమహావిష్ణువుండును. అతనికి లక్ష్మీదేవి, సరస్వతి, గంగ, తులసి అను నలుగురు భార్యలు. అతని దగ్గర సునంద నంద, కుముద, మొదలగు అనుచరులుందరు.

సర్వేశ్వరుడు, సర్వసిద్ధులను కలిగించువాడు, భక్తులను సదో అనుగ్రహించువాడగు శ్రీకృష్ణపరమాత్మ తన ఇచ్చవలన ద్విభుజూడుగా, చతుర్భుజుడుగా రెండు రూపములను ధరించెను. చతుర్భుజుడగు శ్రీమహావిష్ణువు వైకుంఠముననుండగా ద్విభుజుడైన శ్రీకృష్ణ పరమాత్మ గోలోకముననే ఉండెను.

వైకుంఠలోకము పైన యాభై కోట్ల యోజనముల దూరమున గోలోకమున్నది. అది అన్ని లోకములకంటే గొప్పనిది. ఆ లోకము వర్తులముగా నుండును. ఆ లోకమున అమూల్య రత్నములచే నిర్మింపబడిన మందిరములున్నవి. అచ్చటి స్తంభములు, మెట్లుకూడ మణులచేతనే నిర్మింపబడినవి. ద్వారములకు మణిదర్పణములుండును. భవనములపై అనేక కలశములుండును. అట్లే అనేక చిత్ర విచిత్రములైన శిబిరములచట కలవు. ఆ లోకము కోటయోజన విస్తీర్ణమై దానికి నూరురెట్లున్న పాడవుతోనుండును. అచ్చట విరజ అనునదియు శతశృంగమను పర్వతమున్నది. విరజానదియొక్క పొడవులో సగము, శతశృంగపర్వతముయొక్క వైశాల్యములో సగభాగమున్న పొడవు వైశాల్యములు కల బృందావనము కలదు. ఆ బృందావనములో దీర్ఘ వైశాల్యములలో సగమున్న రాసముండలము కలదు.

పద్మముయొక్క మధ్యనున్న కర్ణికవలె విరజానది శతశృంగపర్వతము బృందావనముల మధ్య గోలోకమున్నది.

గోలోకమున గోవులు, గొల్లలు, గోపికలతో, రాసేశ్వరియగు రాధికాదేవితో శ్రీకృష్ణుడుండును. అతడు రెండు భుజములు కలిగి గోపాలరూపమువనుండును. అట్లే పరిశుద్ధమైన వస్త్రము, రత్నభూషణములు ధరించి, శరీరమునందంతట చందనమును పూసికొని, రత్నముల మాల ధరించియుండుము. అట్లే ఆతడు ఆచ్చట రత్నసింహాసనమున, రత్నచ్చత్రము క్రింద తనకు మిక్కిలి ప్రియమైన గొల్లలు సేవించుచుండగా, గోపికలు చామరములు ఏయుచుండగా కూర్చొనియుండును. - గోపికాట్రలు చక్కగ ఆలంకరించుకొని చిరునవ్వుతో ఆ పరమాత్ముని చూచుచుందురు.

సుయజ్ఞమహారాజ! లోకములకు సంబంధించిన విషయమును ఆగమ శాస్త్రమున చెప్పిన విధముగా పరమేశ్వరుడు నాకు చెప్పిన దానివి నో శక్తికి తగినట్లు చెప్పితీనీ. ఇక, కాలప్రమాణమును వినుమనీ బ్రాహ్మణుడనెను.

ఆరు పలముల బరువుగల పాత్రను తీసికొనవలెను. ఆపాత్ర యొక్క లోతు నాలుగంగుళములుండవలెను. దానికి మాపమెత్తు బంగారముచే చేసిన కత్తితో పన్నువి రంధ్రము నేర్పరుపవలెను. అట్లే నాలుగంగుళములు పొడవైవ నాలుగు కల నుంచవలెను. రంధ్రముమండి జారిపడు వీటివలన నీటిలోనున్న పాత్ర ఎప్పుడు ముసుగునో ఆ సమయమును దండమని పిలుతురు. అటువంటి రెండు దండముల పమయమున ముహూర్తమందురు. అట్టి ముహూర్తములు నాలైనచో ఒక యామమందురు. ఎనిమిది యామముల కాలము ఒక దీనమగును. పదునైదు దినములు ఒక పక్షమగును. రెండు వక్షములు ఒక మామగుమ. ఇది ఏత్సదేవతలకు ఒక దీనమగుమ. వారికి కృష్ణపక్షము పగలు శుక్లపక్షము రాత్రి. మానవుల సంవత్సరము దేవతలకు దినమగుమ, ఉత్తరాయణము వారికి పగలు. దక్షిణాయనము వారికి రాత్రి కాలము. మానవులు మొదలగు జీవులకు యుగధర్మముమ, వారివారి కర్మలనమపరించి వయస్సుండును.

ప్రకృతి, ప్రాకృతులగువారు, బ్రహ్మాదిదేవతల ఆయుస్సును గురించి వినుము.

కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అనునవి నాలుగు యుగములు. పన్నెండువేల దివ్య సంవత్సరములు నాలుగు యుగములగును. కృతయుగము నాలుగు దివ్య సహస్ర పరిమితము. త్రేతాయుగమున మూడు దీప్య సహాస్రములుండును. ద్వాపరయుగము రెండు దీవ్య సహస్ర వర్షపరిమీతము. కలియుగము వేయి దివ్య సంవత్సరములుండును. ఈ యుగముల సంధికాలము. సంధ్యంశకాలము రెండువేల సంవత్సరములుండును.

మానవ కాలమానము ప్రకారము నాలుగుయుగముల కాలము నలభైమూడు లక్షల ఇరవైవేల సంవత్సరములు, ఇందు కృతయుగము పదిహేడులక్షల ఇరవై ఎనిమిదివేల సంవత్సరములుండును. త్రేతాయుగము పన్నెండు లక్షల తొంభైయారు వేల సంవత్సరములుండును. ద్వాపరయుగము ఎనిమిది లక్షల ఆరవైనాల్గువేల సంవత్సరములుండును. కలియుగము తొలుగులక్షల ముప్పైరెండువేల సంవత్సరములుండును.

ఏడుదినముల వారము. పదహారు తిథులు, రాత్రింబగళ్ళు, రెండు పక్షములు, మాసము, సంవత్సరము అను ప్రకారముగా కాలముండును.

చక్ర మేవిధముగా గుండ్రముగా తిరుగుచుండునో అట్లే యుగములు మన్వంతరములు ఒకదాని తరువాత ఒకటి తిరుగుచుండును. మన్వంతరమనగా ఇరువదియొక్క దీవ్యయుగములు. మానవ మానప్రకారము మన్వంతరము ఇరువదిఐదువేల ఐదువందల ఆరుయుగములు.

ధర్మీష్టులైన మనువులయొక్క చరిత్రను శంకరుడు నాకు చెప్పినట్లు నీకు తెల్పుదునని బ్రాహ్మణుడు సుయజ్ఞానితో అనెను.

ఓ మహారాజా! మొదటి మనువు స్వాయంభువు. అతడు బ్రహ్మదేవుని పుత్రుడు. ఆ మనువుయొక్క భార్య పేరు శతరూప. అతడు పరమ ధర్మిష్ణుడు. మమవులలో శ్రేష్టుడు. విష్ణుమూర్తికి పరమభక్తుడు. ఆతని గురువు సాక్షాత్ శంకరుడే. ఆతడు నీకు ముత్తాత యగును. స్వాయంభువమము నర్మదానదీ తీరమున వేయి రాజసూయయాగములను, మూడు లక్షల అశ్వమేధయాగములను, మరో మూడు లక్షల నరమేధములమ, నాలుగు లక్షల గోమేధములమ శాస్తోక ప్రకారమున పూర్తిచే సెను.

ఆ మనువు యజ్ఞములు చేయుచున్నప్పుడు ప్రతిదినము మూడు కోట్ల బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనము చేయించుచుండెను. తరువాత ఆ బ్రాహ్మణులకు లక్షలకొలది అమూల్య రత్నములను, పదికోట్ల బంగారు నాణెములను, బంగారు కొమ్ములు కల (కొమ్ములకు బంగారురేకు చుట్టిన) లక్షలకొలది ఆవులను దానముచేసెను.

మునీశ్వరులకు పరిశుద్ధమైన లక్షవస్త్రములను, మంచి సస్యములున్న భూమిని, లక్షలకొలది ఏనుగులను, మూడు లక్షల గుజములను, లక్ష పల్లకీలను, వేయి రథములను, మూడుకోట్ల బంగారు పత్రములను దానముచేసెను. ఇంకను మూడుకోట్ల బంగారు ఆభరణములను, కర్పూరము మొదలగు సువాసన ద్రవ్యములు గల తాంబూలమును, మూడుకోట్ల బంగారు శయ్యలను, రత్నఖచితమైన మంచములను మాలలను విష్ణుమూర్తికి ప్రీతీకలుగుటకై శంకరుని ఆజ్ఞననుసరించి ప్రతిదీనము దానము చేయుచుండెను.

తనకు విద్యాగురువు, జ్ఞానగురువగు శంకరుని వలన మంచి జ్ఞానమును, శ్రీకృష్ణమంత్రమును, శ్రీకృష్ణదాస్యమును పొంది చివరకు శ్రీకృష్ణుని సన్నిధియైన గోలోకమును చేరుకొనెను.

. బ్రహ్మదేవుడు తనపుత్రుడగు స్వాయంభువమనువు ముక్తిని పొందేనని తెలుసుకొని తన పుత్రుని ముక్తికి కారణమైన శంకరుని స్తుతించెను. స్వయంభుపుత్రుడు కావున అతడు స్వాయంభువు ఆయెను.

స్వాయంభువ మనువు తరువాత బ్రహ్మదేవుడు ఇంకొక మనువును సృష్టించేను.

రెండవ మనువైన స్వారోచిషమనువు అగ్నిదేవుని పుత్రుడు. ఆ మనువుకూడ స్వాయంభువ మనువువలె వరమధార్మికుడు, అంతులేని దానములు చేసినవాడు. మూడవ, నాలుగవ మనువులు ప్రియవ్రత మహారాజు పుత్రులు. వారుకూడ గొప్ప ధార్మికులే. వారిద్దరు కృష్ణభక్తి పరాయణులు. వారీగురువు మహేశ్వరుడు. ఐదవ మనువు రైవతమనువు, ఆరవ మనువు విష్ణుభక్తి పరాయణుడైన చాక్షుష మనువు. ఏడవ మనువు సూర్యపుత్రుడైన శ్రాద్ధదేవుడు. ఎనిమిదవ మనువుకూడ సూర్యునియొక్క పుత్రుడే. అతని పేరు సావర్ణి. తొమ్మిదవ మనువు దక్షసావర్ణి, పదవ మనువు. పేరు బ్రహ్మసాపల్లి. పదకొండవ మనువు పేరు ధర్మసావర్ణి, పన్నెండవ మనువు రుద్రసావర్ణి. పదమూడవ మమపు దేవసావర్ణి, పదనాలుగవ మనువు ఆంతులేనీ జ్ఞాన సంపన్నుడైన చంద్రసావర్ణి.

ఈ మనువులందరు పరమ ధర్మిష్ఠులై మహాజ్ఞానులై శ్రీకృష్ణుని ఆరాధించినవారే. - మనువులయొక్క వయసెంత ఉండునో ఇంద్రుల వయస్సుకూడ ఆంతే ఉండును. అనగా ఇంద్రుని వయస్సుకూడ డెబ్సైయొక్క దివ్య యుగములు, మానవ మావముననుసరించినచో ఇరువదిఐదువేల ఐదువందల ఆరు యుగములుండును.

పదునలుగురు ఇంద్రులు గతించినచో బ్రహ్మదేవునకు ఒక పగలగుమ. అట్లే పదునలుగురు ఇంద్రులు గతించిన కోలము అతనికి రాత్రియగును. ఆ రాత్రినే బ్రహ్మ రాత్రియని యందురు. ఆ రాత్రిని వేదములలో కాలరాత్రియని చెప్పబడినది.

బ్రహ్మదేవునకు ఒకదినము గడచినచో దానిని క్షుద్ర కల్పమనీ అందురు.

చీరంజీవియగు మార్కండేయుడు ఏడు కల్పములవరకు జీవించును.

బ్రహ్మలోకము క్రిందనున్న లోకములన్నియు సంకర్షణుని (ఆదిశేషుని) ముఖమునుండి బయలుదేరిన ఆగ్నేవలన దగ్గములగుచున్నవి. ఆ సమయమున సూర్యుడు, చంద్రుడు, ఇతర బ్రహ్మపుత్రులందరు బ్రహ్మలోకమునకు పోవుదురు. ఆ బ్రహ్మరాత్రి గడచిన పిమ్మట అనగా క్షుద్రకల్పము తరువాత బ్రహ్మదేవుడు తిరిగి సృష్టికార్యమును ప్రారంభించును. ఈ బ్రహ్మరాత్రియందు దేవతలు మనుషులు, మానవులు మొదలగు జీవులన్నీయు చనిపోవును..

బ్రహ్మదేవునకిట్టి రాత్రిపగలు (దినము) ముప్పదియైనచో ఒక బ్రహ్మపమగును. ఇటువంటి పన్నెండు మాసములు గడచినచో బ్రహ్మదేవునకు ఒక సంవత్సరమగును. ఈ విధముగా బ్రహ్మదేవువకు పదునైదు సంవత్సరములు గడచినచో దానిని దైనందిన ప్రళయమందురు. ఆ దైనందిన ప్రళయమును వేదములు తెలిసిన పెద్దలు మోహరాత్రియని అందురు. ఆ సమయమున సూర్యచంద్రులు దిక్పాలకులు, ఆదిత్యులు, వసవులు, ఏకాదశరుద్రులు, చతుర్ధశ మనువులు, ఋషులు, మునులు, గంధర్వులు, రాక్షసులు మొదలగువారందరు నశించి పోవుదురు.

ఆ సమయమున చిరంజీవులగు మార్కండేయుడు, లోమశుడు, పేచకుడనువారు మాత్రముందురు, ఇంద్రద్యుమ్నుడను రాజు, ఆకూపారుడు, కచ్చపుడు, వాడీజంఘుడు, బకుడు మొదలగు వారందరు నశింతురు. బ్రహ్మలోకము క్రిందమన్న నాగలోకములన్నియు అప్పుడు నశించిపోవును.

ఈ దైనందిన ప్రళయము గడచిన పిదప బ్రహ్మదేవుడు మరల లోకములను సృష్టించుము.

ఈవిధముగా నూరుసంవత్సరములు బ్రహ్మదేవుని ఆయుస్సు ఉండును. బ్రహ్మదేవునకు నూరు సంవత్సరములు నిండినచో బ్రహ్మదేవుడు గతించును. దానిని మహాకల్పమనీ అందురు. మహారాత్రి అనికూడ ఏలుతురు. ఆ సమయమున బ్రహ్మాండములన్నీయు నీటిలో మునిగిపోవును. దేవమాతయైన. అదితి, సావిత్రీదేవి, వేదములు, ధర్మము మొదలగునవన్నియు నశించుమ, మృత్యువు, ప్రకృతి, శివుడు మాత్రము మీగులుదురు.

ఆ సమయమున వైష్ణవులందరు వారాయణుని యందు లీనమగుదురు, సంహారకారుడైన కాలాగ్ని రుద్రుడు మొదలగు రుద్రులందరు తమోగుణముతో కలిసి మృత్యుంజయుడగు మహాదేవునియందు విలీనమగుదురు,

బ్రహ్మదేవుడు గతించినచో ఆ కాలము ప్రకృతికి ఒక ఏమీషకాలము. నారాయణునకు, మహాదేవునకు మహావిరాడ్రూపుడైన శ్రీమహావిష్ణువునకు కూడ నిమిషలమగును. ఆ నిమిషకాలము తరువాత శ్రీకృష్ణపరమాత్మయొక్క ఇచ్ఛనుసరించి మరల పృష్టికార్యము ప్రారంభమగును.

శ్రీకృష్ణునకు నిమేషము (రెప్పపాటు) లేదు. అతడు నిర్గుణుడు ప్రకృతికంటే విశిష్ఠుడు. సగుణులయొక్క నిమేషములకే కాలము, సంఖ్యా, వయస్సు అనునవి యుండును. నిర్గుణుడు విత్యుడు, ఆద్యంత రహితుడైన ఆ పరమాత్మకు కాల సంఖ్యావయ: పరిమితి ఎట్లుండును? "

ప్రకృతికి వేయి నిమేషములైనచో ఆ కాలమును దండమందురు. ఆరవై దండముల కాలము ప్రకృతికి ఒక దినమగుమ. ఆట్టి దినములు ముప్పది గడిచినచో ప్రకృతి మాసమగును. ప్రకృతి మాసములు పన్నెండు గడచినచో అది ప్రకృతి సంవత్పరమగును. ఆట్టి ప్రకృతి సంవత్సరములు నూరు గడచినచో ప్రకృతి లయము జరుగును. ప్రకృతియొక్క లయమును ప్రాకృత లయమని కూడ ఆందురు. అప్పుడు మూలప్రకృతి అందరిని సంహరించి శ్రీకృష్ణుని వక్షస్థలమున విలీనమైపోవును.

మూల ప్రకృతిని దుర్గయనియు, విష్ణుమాయ యనియు పెద్దలు చెప్పుదురు. ఆమె సనాతవి, సర్వక్తి రూపిణి, వారాయణి, ఆ దేవి శ్రీకృష్ణునకు నిర్గుణస్వరూపిణి, బుద్ధికి అధిష్టాన దేవత. ఆ దేవియొక్క మాయవలన బ్రహ్మ విష్ణు శివాదులందరు మోహమును చేందుచున్నారు. వైష్ణవులందరు ఆ దేవిని “మహాలక్ష్మి" యనియు "పరరాఢ" అవీయు పిలుచుచున్నారు. ఆ దేవి నారాయణునకు ఆర్ధాంగి, ఆతనికి ప్రియురాలు. నిర్గుణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ప్రాణములకు వీరుణమైన రాధాదేవి ఆధిష్టానదేవత. ప్రేమవలన ప్రాణములకంటె మిన్నయైనది. సుస్థిరమైన ప్రేమగలది.

నారాయణుడు, మహాదేవుడు తమ తమగణములను ఉపసంహరించుకొని శుద్ద సత్వస్వరూపుడు, నిర్గుణుడు అగు శ్రీకృష్ణ పరమాత్మునిలో విలీనమగుదురు. గోపులు, గోపికలు, దూడలతోనున్న గోవులన్నియు ప్రకృతిలో లీనముకాగా ఆ ప్రకృతి పరమాత్మయందు విలీనమగును. సమస్త క్షుద్ర విష్ణువులు శ్రీమహావిష్ణువులో విలీనము కాగా మహావిష్ణువు ప్రకృతియందు విలీనమగును. ఆ ప్రకృతి పరమాత్మలో విలీనమగును. ప్రకృతి, యోగనిద్ర ఈ రెండు శ్రీకృష్ణురమాత్మయొక్క నయనములలో మాయ మరియు ఈశ్వరేచ్ఛ వలన నివాసముండినవి.

ప్రకృతియొక్క ఒక దిన (రాత్రిందినము) కాలమున శ్రీకృష్ణుడు బృందావనమున అమూల్యమైన రత్నతల్పమున, పరిశుద్ధమైన వస్త్రము పై గంధము, మాలలయొక్క సువాసనలు గుబాళించుచుండ నీద్రపోవును.

ఆ పరమాత్మ మేల్కొనగానే మరల సమస్త సృష్టికార్యక్రమము ప్రారంభమగును. నిర్గుణుడగు శ్రీకృష్ణపరమాత్మ తప్ప మిగిలిన వారందరు ప్రాకృతులు.

ఆ శ్రీకృష్ణ పరమాత్మను నమస్కరించుట, ఆతనిని స్మరించుట ఆతనిని ధ్యానము, ఆతని అర్చన, ఆతని. మంగళ గుణకీర్తనచేసినచో సమస్త మహాపాపములు నాశనమై పోవును.  శ్రీమహాదేవుని వలన విన్న ఈ విషయమంతయు నీకు తెల్పితిని.

సుయజ్ఞ ఉవాచ- సుయజ్ఞ మహారాజిట్లనెను-

కాలాగ్నిరుద్రుడు సమస్త విశ్వములను సంహరించువాడవి. ఆతడు తమోగుణుడని, మీరు చెప్పితిరి. అట్లే ఆ కాలాగ్ని రుద్రుడు బ్రహ్మదేవుని జీవిత కాలాంతమున మృత్యుంజయుడైన శివునిలో విలీనమైనట్లు చెప్పితం. ఆ మృత్యుంజయుడు ప్రాకృత లయమున నిర్గుణుడైన శ్రీకృష్ణ పరమాత్మలో విలీనమై మృత్యువును పొందినందువలన అతడు మృత్యుంజయుడెట్లు ఆగుసు?

అట్లే అసంఖ్యాకమైన లోకములు శ్రీమహావిష్ణువుయొక్క రోమములలోనున్నట్లు చెప్పితిరి. అట్టి శ్రీమహావిష్ణువునకు మూలప్రకృతిమాతగా ఎటైనది? అని సుయజ్ఞాడడిగెను.

సుతపా ఉవాచ- సుతపుడను బ్రాహ్మణుడిట్లు పలికెను-

బ్రహ్మదేవుని ఆయుస్సు తీరి అతడు గతించినప్పుడు సమస్త లోకములమ, బ్రహ్మదేవుని సైతము సంహరించు మృత్యుకిన్య నీటిలో కనిపించు ప్రతిబింబమువలె నశించిపోవుచున్నది. ఎందరో మృత్యుకన్యలు, కోట్లకొలది బ్రహ్మదేవతలు నశించినను, శివుడు మాత్రము నశింపలేదు. అతడు సమయముననుసరించి విర్గుణుడు, సత్వరూపుడగు శ్రీకృష్ణ పరమాత్మలో విలీనమగును. పరమశివుడు మృత్యుకన్యను జయించెనుగాని, మృత్యుకన్య అతనినెప్పుడు జయించలేదని ప్రతీ కల్పమున చెప్పబడినది. విత్యులగు శివుడు, నారాయణుడు. ప్రకృతి ఈ ముగ్గురు నిత్యుడైన శ్రీకృష్ణ పరమాత్మలో వీలీనమగుట వాస్తవముకాదు. వీరుణుడు, పురుషోత్తముడగు శ్రీకృష్ణుడు కాలముననుసరించి సగుణుడగుచున్నాడు, అతడే తన మాయవలన సొరాయణుడుగా, శివుడుగా, ప్రకృతిగా రూపమునొందుచున్నాడు. వీరు ముగ్గురు పరమాత్మతో సమానమైనవారు. అతని అంశరూపులు. ఆగ్నీకి నిప్పురవ్వలకు భేదములేనట్లే వీరికి పరమాత్మకు మధ్య భేదములేదు.

రుద్రులు, ఆదిత్యులు, మొదలగు వారినందరిని బ్రహ్మదేవుడు సృష్టించెను. అందువలన వారందరివి మృత్యుకన్య జయించినది. కాని పరమశివుడు సత్వరూపుడు, నిత్యుడు, సనాతనుడు ఆగు. శివుని మృత్యుకన్య ఎప్పుడు జయించలేదు కావున అతడు మృత్యుంజయుడగుచున్నాడు.

మృత్యుంజయుడైన పరమశివుని రెప్పపాటు కాలమున ఎందరో బ్రహ్మదేవులు గతించిరి. ఆదిసృష్టి సమయమున జగద్గురువగు శ్రీకృష్ణపరమాత్మ బృందావనమున ప్రకృతికి వీర్యాదానము చేయగా ఆ పరమాత్మ వామభాగమునుండి ఉద్భవించిన ఆ రాసేశ్వరియగు రాధాదేవి బ్రహ్మదేవుని ఆయుస్సుండునంతవరకు, గర్భమును ధరించెను. ఆ తరువాత పరాప్రకృతి రూపిణియగు ఆ రాధాదేవి గోలోకమందలి రాస్తమండలమున ఒక అండమును కనెను. రాధాదేవి ఆ అండమును చూచి బాధకు గురికాగా కోపముతో ఆ అండమును గోలోకమునుండి అధోభాగమున నున్న విశ్వగోళకమున పడవేసెను.

ఆ రాధాదేవి తవ సంతానమును వదిలి పెట్టి ఏడ్చుచుండగా శ్రీకృష్ణపరమాత్మ మహాయోగజ్ఞానమును బోధించి ఆమెను ఓదార్చిమ.

విశ్వగోళకమున పడిపోవుచున్న ఆ ఆండమునుండి సమస్తలోకములకు ఆధారభూతుడగు మహావిరాట్పురుషుడు (మహావిష్ణువు) ఉదయించెను.

సుయజ్ఞ ఉవాచ- సుయజ్ఞ మహారాజిట్లనెను-

ఓ మహాత్మా! నా జీవితము ధన్యమైనది. నా జన్మ సఫలమైనది.. భగవంతునిపై భక్తిని కలిగించిన మీ శాపము వా పాలిట వరమైనది. సమస్త మంగళములకు మంగళరూపమైన శ్రీహరి భక్తి అందరకు తేలికగా లభించునదికాదు. వేదములందు చెప్పబడిన భక్తి పంచకము శ్రీహరి భక్తితో సమానమైనదికాదు. అందువలన ఆందరికి లభింపని శ్రీకృష్ణపరమాత్మ భక్తి నాకు కలుగునట్లు అనుగ్రహింపుడు.

పవిత్రమైన జలముండు తీర్థములు మాత్రమే తీర్థములుకాదు. ఆట్లే మట్టి, శీలానిర్మితములైన వారు మాత్రమే దేవతలు కాజాలరు. పైగా తీర్థములు, దేవతలు, చాలాకాలము సేవించినగానీ పవిత్రము చేయరు. కానీ శ్రీకృష్ణ భక్తులు దర్శనమాత్రముననే వారిని పవిత్రముగా చేతురు. అన్ని ఆశ్రమములలో (వర్ణములలో) బ్రాహ్మణజాతి చాలా శ్రేష్టమైనది. వారిలో స్వధర్మనిరతులైనవారు చాలా శ్రేష్ఠులు. కృష్ణమంత్రోపాసకుడు, కృష్ణభక్తి పరాయణుడు, ప్రతిదినము శ్రీహరి నైవేద్యమును భుజించువాడు స్వధర్మవిరతుడైన

బ్రాహ్మణునికంటె శ్రేష్ఠుడు.

జ్ఞానసముద్రుడు. వైష్ణవుడు, శంకరుని శిష్యుడు, బ్రాహ్మణ శ్రేష్ఠులగు మీరుండగా జ్ఞానమునకై శాపవిమోచనమునకై నేనెవరినీ శరణుపొందవలెను? మీ శాపమువలన నేనిప్పుడు కుష్టురోగగ్రస్తుడనైతిని. ఈ విధముగా అశుచీవైవ నేను తపస్సు ఎట్లు చేయగలుదునో తెలుపుడని సుయజ్ఞుడు సుతపుతో ననెను.

సుతపా ఉవాచ- సుతపుడను ఆ బ్రాహ్మణుడిట్లనెను-

సనాతని యగు విష్ణుమాయ శ్రీహరిపై భక్తిని కలిగించును. ఆమె అనుగ్రహించిన వారికి మాత్రమే శ్రీహరి భక్తివి కలిగించును. మాయచే మోహితులైనవారికి ఆ దేవి శ్రీకృష్ణ భక్తిని కలిగించక వంచించుచు ఆశాశ్వతమైన ధనమునిచ్చును.

ఆందువలన శ్రీకృష్ణ ప్రేమ రూపిణి, శ్రీకృష్ణుని ప్రాణములకు ఆధిదేవత, శక్తిస్వరూపిణి. సమస్త సంపదల నొసగునది, నీర్గుణ స్వరూపిణియగు రాధాదేవిని సేవింపుము, ఆమెను సర్వారాధ్యుడైన శ్రీకృపడే ఆరాధించుచు సేవించును. ఆమెను సేవించి అనుగ్రహము పొందినచో నీవు త్వరగా గోలోకమునకు పోయెదవు.

శ్రీకృష్ణ భక్తులు నిర్గుణుడు, కష్టముతో ఆరాధింప తగినవాడు, ధ్యానముచేతనే సాధ్యమైన శ్రీకృష్ణుని అవేక జన్మలలో చాలాకాలము సేవించి గోలోకమును చేరుచున్నారు. అందువలన శ్రీకృష్ణుని సేవించుటకంటె మాతృమూర్తియగు రాధాదేవిని సేవించుట బహుసులభము. దయామూర్తి, సమస్త సంపదల వొసగునది శ్రీమహావిష్ణువువకు మాతృరూపిణి అగు రాధాదేవిని సేవించిన భక్తులు త్వరగా గోలోకమును చేరుకొందురు.

అట్లే వేయి సంవత్సరములవరకు బ్రాహ్మణుల పాదోదకమును వీపు స్వీకరించినచో కుష్ఠురోగ నిరుక్తుడవై మన్మథునీ . వంటి ఆకారమును పొందెదపు. బ్రాహ్మణుల సేవించుచు వారి పాదోదకమును స్వీకరించునపుడు భూమిపై వారి పాదోదకమెంతకాలము పడునో ఆంతవరకు ఆ భక్తుని పితృదేవతలు తరణ జలమును కమలపత్రములలో ఆనందముగా స్వీకరించెదరు. భూమి పైనున్న సమస్త తీర్థములు సముద్రముననున్నవి. సముద్రముననున్న సమస్త తీర్థములు విప్రుల పాదోదకముననుండును. ఆ ఉదకము సమస్త పాపములను, రోగములను పోగొట్టును. సమస్త తీర్థములందున్న నీటితో సమానమైనది. భుక్తినీ, ముక్తిని కలిగించును. బ్రాహ్మణుడు మానవరూపముననున్న సాక్షాత్ శ్రీమహావిష్ణువు. ఆతడు చేసిన పూజను సమస్త దేవతలు సంతోషముతో స్వీకరింతురు.

సుతపుడు పైవిధముగా సుయజ్ఞమహారాజునకు ఉపదేశించి ఆ మహారాజొనర్చిన పూజను స్వీకరించి సంవత్సరకాలము దాటిన తరువాత వత్తునని చెప్పిపోయెను.

సుయజ్ఞమహారాజు సుతపబ్రాహ్మణుడు చెప్పినట్లు సంవత్సరకాలము బ్రాహ్మణులను సేవించుచు వారికి భక్తితో భోజనము పెట్టుచు వారి పాదోదకమును స్వీకరించెను. అందువలన అతనికంటిన కుష్టువ్యాధి మటుమాయమయ్యెను. ఆ సమయమున పూర్వము చెప్పినట్లే సుతప బ్రాహ్మణుడు ఆ మహారాజు ఇంటికి తిరిగివచ్చెను.

సుతపబ్రాహ్మణుడతనికి రాధికాదేవి పూజావిధానమును స్తోత్రమును, కవచమును, మంత్రమును, పామవేదమునందు చెప్పబడిన ఆమె ధ్యానమును ఆంతయు మహారాజునకు చెప్పెను. తరువాత ఓ రాజా! నీవు వెంటనే తపస్సు చేయుటకు అడవికి పొమ్ము అని చెప్పగా రాజువెంటనే అడవికి వెళ్ళాను. అప్పుడతని భార్యలు మూడురాత్రులు శోకముచే మూర్ఛనొంది చనిపోయిరి. బంధువులు దు:ఖించిరి.

ఐనను సుయజ్ఞుడు పుష్కరమునకు వెళ్ళి అచ్చట తీవ్రమైన తపమాచరించెను. ఆతడచ్చట నూరు దివ్య సంవత్సరములు సుతపుడు చెప్పిన రాధికా మంత్రమును జపించెను.

అప్పుడాదేవి రథముపై ఆచ్చటకు వచ్చి ఆ మహారాజునకు దర్శనమొసగెను. ఆ రాధికాదేవి దర్శనమాత్రముననే అతని పాపములన్ని తొలగిపోయినవి. ఆతడు తన మానవదేహమును వదలి దివ్య శరీరము ధరింపగా రాధాదేవి ఆతనిని తన రథము పై నుంచుకొని గోలోకమును చేరెను. ఆ విధముగా రాధాదేవి అనుగ్రహము వలన ఆమె వెంట వెళ్ళిన సుయజ్ఞడు విరజానదినీ ఆవరించియున్న గోలోకమును చూచెను.

గోలోకముచుట్టు శతశృంగమను పర్వతమున్నది. అచ్చట బృందావనము, రాసమండలమున్నది. అట్లే గోవులు, గోపికలు, గొల్లలున్న అందమైన రత్నమయ మందిరములున్నవి. అందలి మందిరములలో అనేక చిత్రవిచిత్రములున్నవి. అనేక కల్పవృక్షములున్నవి. ఆ మందిరములచుట్టు అనేక పారిజాతవృక్షములున్నవి. అనేక కామధేనునుపులచ్చటనున్నది. ఆ లోకము చంద్రబింబమువలె గుండ్రముగను, చాలా. విశాలముగాను ఉన్నది. అది వైకుంఠము కంటే యాభైకోట్ల యోజనముల దూరమున సైభోగముననున్నది. ఆది శూన్యములో ఎట్టి ఆధారము లేక స్థిరముగ నున్నది. ఆది ఆకాశమువలె నిత్యమైనది. నేను (మహాదేవుడు} సారాయణుడు, ఆనంతుడు, బ్రహ్మవిష్ణవులు ధర్మదేవత కుద్రవిరాడ్రూపములు, గంగాదేవి, లక్ష్మీదేవి, సరస్వతి నీవు (పార్వతి) విష్ణుమాయ, సావిత్రి, తులసి గణపతి, సనత్కుమారుడు, స్కందుడు, వరనారాయణ మునులు, కపిలమహర్షి, దక్షిణాదేవి యజ్ఞాడు, బ్రహ్మపుత్రులు. వాయువు, వరుణుడు, చంద్రుడు, సూర్యుడు, రుద్రుడు, అగ్ని, ఇతర కృష్ణ భక్తులు, భూలోకముననున్న విష్ణుభక్తులు ఈ గోలోకమును చూచెదరు. కాని ఇతరులెవ్వరు దీనిని సందర్శింపలేరు.

ఆచ్చట రత్నసింహాసనమున రత్నమాల కిరీటములు, రత్నభూషణములు, పరిశుద్ధమైన పీతవస్త్రములు ధరించిన శ్రీకృష్ణపరమాత్మను సుయజ్ఞుడు చూచెను. ఆ పరమాత్మ శరీరమువందంతట చందనము ఉన్నది. అతడు గోపవేషముననుండెను, ఆతని శరీరకాంతి నూతన మేఘమువలెనండెను. ఆ పరమాత్మ రెండు భుజములు కలవాడు, అతని హస్తమున ఎల్లప్పుడు మురళియుండును. ఆ దేవదేవుడెల్లప్పుడు భక్తులననుగ్రహించుచుండును. అతడు స్వేచ్ఛామయుడు, పరబ్రహ్మ, నిర్గుణుడు, ప్రకృతికంటే మిన్నయైనవాడు, ధ్యానమువలన మాత్రమే ఆతడు లభించును. మావంటివారికి సైతము ఆతడు దుర్లభుడు. ఆ గోపికామనోహరువికి పన్నెండుగురు ప్రధాన గోపాలురు ఎల్లప్పుడు చామరములను వీచుచుందురు. అతనిని పరిశుద్ధమైన వస్త్రములు ధరించిన గోపికలు కామముతో చిరునవ్వులు నవ్వుచు చూచుచుందురు. ఆతడు రాసముండలమున ఉండగా సుయజ్ఞుడు ఆ దేవదేవుని రాధాదేవి అనుగ్రహము వలన చూచేను.

ఆ పరమాత్మమ నాల్గువేదములు ఆకారమును ధరించి ఎల్లప్పుడు స్తుతింపుచుండును. మనోహరమైన రాగములు, సంగీతము వాద్య యంత్రములనుండి వచ్చుచుండగా సంతోషమువవతడు ఏనుచుండుమ. నిత్య, సపోతనియగు ప్రకృతి మరియు నీవు ఆ పరమాత్మ పాదపంకజములను అఖండతులసీ దళములలో కస్తూరి, కుంకుమ కలిసిన గంధచందనములలో దూర్వాంకురములలో, అక్షతలతో, పారిజాత ప్రసూనములతో ఎల్లప్పుడు పూజించుచుందురు. ఇంకన ఆ పరమాత్మకు మీరు పవిత్రమైన విరజానదీ తీర్థముతో ఆర్ఘ్యము నిచ్చుచుందురు.

ఆ శ్రీకృష్ణుడు చక్కగా ప్రసవముగామండువాడు, స్వతంత్రుడు, పమస్తకారణములకు కారణమైనవాడు. అన్ని ప్రాణులకు అంతరాత్మయైనవాడు, పర్వేశుడు, సమస్తమునకు ఆధారభూతుడు, మిక్కిలి పూజించతగినవాడు, పవాతమడు, పమస్త సంపదల స్వరూపము, సమస్త సంపదల నొసగువాడు. సర్వమంగళరూపి, సర్వమంగళ కారణుడు, సర్వమంగళదాత, సమస్తమంగళములకు మంగళకరమైనవాడు.

ఆటువంటి గోపికా వల్లభుని చూడగానే సుయజ్ఞుడు తొందరగా రథమునుండి దిగి పులకించిన శరీరము కలవాడై ఆనందబాష్పములు రాలగా పరమాత్మ పాదములకు నమస్కరించెను.

శ్రీ కృష్ణపరమాత్మ సుయజ్ఞ మహారాజునకు తనపై భక్తిని, ఆప్పులము ఒసగెను. ఇవి మావంటివారికి కూడ దుర్లభమైనది.

తరువాత రాధాదేవి రథమునుండి దిగి గోపికలు చెలికత్తెలు సేవించుచుండగా కొందరు నేతచామరములను వీయుచుండగా శ్రీకృష్ణ పరమాత్మ సమీపమునకు వచ్చి అతనిని ఆలింగనము చేసికొనెను. శ్రీకృష్ణపరమాత్మ ఆమెను పలుకరించి గౌరవించెను.

తొలుత రాధాదేవి పేరునుచ్చరించి శ్రీకృష్ణుని పేరు (రాధాకృష్ణుడు, రాధామాధవుడు) ను ఉచ్చరింపవలెనని వేదములు తెలిసిన పెద్దలు పలుకుచున్నారు. ఆ విధముగా కాక తొలుత కృష్ణుని తరువాత రాధాదేవి నామముమచ్చరించినచో, లేక అఖిల ప్రపంచములకు మాత, కృష్ణునకు ప్రాణములకంటె గొప్పవిది శక్తిరూపిణియగు రాధను నిందించినచో వారు సూర్యచంద్రులున్నంతవరకు నరకమున బాధలు పడుదురు. తరువాత భూలోకమున జన్మించినను భార్యపుత్ర విహీమలై రోగపీడితులగుదురు.

ఓ పార్వతీ! నీకింతవరకు రాధికోపాఖ్యానమును చెప్పితిని. నీవు భగవతి, వైష్ణవి, విష్ణుమాయ, సనాతని, వారాయణి మూలప్రకృతి ఈశ్వరి అను పేర్లతో ప్రకాశించుచున్నావు. నీవు పర్వజ్ఞారాలపైనను, సమస్త చరాచర రూపిణినైనను, స్త్రీలలో అత్యుత్తమురాలిపైవను తెలియనట్లు వప్నుడిగితివీ అని శంకరుడు పార్వతీదేవితో ననేమ.

శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమునందలి రెండవదైన ప్రకృతిఖండమున వారదనారాయణ సంవాదమున చెప్పబడిన సుయజ్ఞమహారాజునకు గోలోక ప్రాప్తియను ఏబదినాల్గవ అధ్యాయము సమాప్తము.