2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము
36 – ఇంద్రునకు దుర్వాసమహర్షి శాపము పెట్టుట
నారద ఉవాచ- నారదుడిట్లు పలికెను-
వైకుంఠవాసిని, శ్రీమన్నారాయణునకు పత్నియగు మహాలక్ష్మి సింధుకన్యకగా ఎట్లు మారెను. ఆమె యొక్క ధ్యానము, కవచము, పూజావిధి మొదలగు వాని. నన్నిటిని నాకు వివరించుమని ఆడిగెను.
నారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను-
పూర్వము దూర్వాస మహర్షి శాపమున దేవేంద్రుడు, దేవతాసమూహము, మానవలోకము లక్ష్మిని కోలుపోయినది. లక్ష్మీదేవి స్వర్గమును, భూమిని వదలి వైకుంఠమునకు పోయి మహాలక్ష్మిలో లీనమైనది. ఆందువలన దేవతలు మిక్కిలి దుఃఖమునంది బ్రహ్మదేవుని దగ్గరకు పోయిరి. ఆక్కడ బ్రహ్మదేవుని వెంట పెట్టుకొని వైకుంఠమునకు పోయి పొరందరు మిక్కిలి దీనులై శ్రీమన్నారాయణుని శరణువేడిరి.
ఆప్పుడు నారాయణుని ఆజ్ఞవలన లక్ష్మీదేవి దేవేంద్రుని సంపత్స్వరూపిణియై క్షీరాబ్ది కన్యగా జన్మించినది.
దేవతలందరు శ్రీమహావిష్ణువు యొక్క ఆజ్ఞవలన రాక్షసులతో కలసి క్షీరసముద్రమును మథించి ఆచ్చట లక్ష్మీదేవిని దర్శించగలిగిరి. అట్లే వారు లక్ష్మీదేవి వలన వరమును పొందిరి. లక్ష్మీదేవి దేవతలకు అనుగ్రహమునొసగి, శ్రీమహావిష్ణువునకు పరమాలను సమర్పించి శ్రీమహావిష్ణువు పై తన సంతోషమును వ్యక్తపరచినది.
లక్ష్మీదేవి అనుగ్రహమువలన దేవతలు రాక్షసులాక్రమించుకొన్న రాజ్యమును తిరిగి సంపాదించుకొని ఆమెను స్తుతించిరి. పూజించిరి.
నారద ఉవాచ- నారదుడిట్లు పలికెను-
ముని శ్రేష్టుడగు దుర్వాసుడు దేవేంద్రుని ఏకారణమువలన శపించెను? సముద్రము పోరితో ఏవిధముగా మధింపబడినది? దేవేంద్రుడామెను ఏవిధముగా స్తుతించెను, లక్ష్మీదేవి దేవేంద్రులమధ్య ఎటువంటి సంభాషణ నడిచెను. దానినంతయు నాకు వివరింపుము. అని అడిగాను.
నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-
ఒకప్పుడు త్రిలోకాధిపతియైన దేవేంద్రుడు మధుపానము చేసి రహస్యప్రదేశమున రంభతో క్రీడింపసాగెను. అచ్చట ఆతడు కామము వలన కన్ను - గానకయుండెను.
ఆసమయమున వైకుంఠమునుండి కైలాసమున కేగుచు ఋషిపుంగవుడగు దుర్వాసమహర్షి అచ్చటికి వచ్చెను. ఆ ముని గ్రీష్మకాలమునందలి మధ్యాహ్న సూర్యునివలె వెలిగిపోవుచుండెను. బంగారు వన్నెతో గొప్పని జటాభారమును, తెల్లనీ యజ్ఞోపవీతమును, తెల్లని వస్త్రమును, దండకమండలువులను, చంద్రబింబమంత తిలకమును ఆ మహర్షి ధరించి యుండెను. అతని వెంట వేదవేదాంగపారంగతులైన అతని శిష్యులుండిరి.
వారిని చూచి దేవేంద్రుడు. వెంటనే వారి కందరకు నమస్కరించెను. ఆప్పుడు దుర్వాసుడు అతని శిష్యులు అతనికి ఆశీస్సులనొసగిరి. దుర్వాసుడతనికి విష్ణుమూర్తి తనకిచ్చిన పారిజాతపుష్పమును ఇచ్చెను. ఆ పుష్పము మృత్యువు, ముసలితనము, రోగము, దుఃఖము మొదలగు వానినన్నిటిని తొలగించునది. మోక్షమును కలిగించునది. మిక్కిలి మనోహరమైనది.
దేవేంద్రుడు దుర్వాసుడిచ్చిన పారిజాతపుష్పమును తీసికొని రాజ్యమదమువలన దానిని తన ఐరావతముయొక్క శిరస్సుపై నుంచెను. ఆ ఏనుగు పారిజాతపుష్పముయొక్క స్పర్శమాత్రముననే గుణమున, వయస్సున, కాంతితో, విష్ణుమూర్తిలో సమానమయ్యెను. అందువలన ఆ గజేంద్రము దేవేంద్రుని వదలి భయంకరమైన అడవికి వెళ్ళిపోయెను. ఆ సమయమున దేవేంద్రుడు దానిని పట్టుకొనలేకపోయెను.
దుర్వాసుడు తానిచ్చిన పుష్పమును దేవేంద్రుడు గౌరవించక, పారవేసిన విషయమును గమనించి కోపముతో అతనినిట్లు శపించెను.
దుర్వాసా ఉవాచ- దుర్వాసుడిట్లనెను-
ఓరే దేవేంద్రుడా! నీవు ధనము వలన మదించి నన్ను అవమానపరచితివి. నేను నీకిచ్చిన పుష్పమును గర్వించి ఏనుగుతలపై వదలి వేసితిని.
ఈపారిజాతపుష్పము ఎవరి శిరస్సున ఉండునో అతనిని తొలుత పూజింపవలెను. శివుని పుత్రుని శిరస్సు ఛేదింపబడినప్పుడు దీనినే (ఏనుగు శిరస్సుమ) ఛేదించి అతనికి అతుకుదురు. ఆని దుర్వాసుడనగానే ఇంద్రుడు దుర్వాసుని పాదములు పట్టుకొని ఏడ్చుచు ఇట్లనెను.
ఇంద్ర ఉవాచ- ఇంద్రుడిట్లనెను-
ఓ మహర్షీ! నీవు ఐశ్వర్యమదమత్తుడనైన నాకు తగిన శాపము విచ్చితివి. నీళాపమువలన వా సంపద పోయినను, సాకు కొద్ది జ్ఞానమును ప్రసాదించుము. ఐశ్వర్యము ఆపదలకు కారణమగుచున్నది. జ్ఞానమును పోగొట్టుచున్నది. ముక్తిమార్గమునకు ఆడ్డంకిగా ఉండును. శ్రీహరిభక్తినీ కలుగనీయదు. జన్మ, మృత్యువు, ముసలితనము, రోగము మొదలగువాటికి మూలకారణమగుచున్నది.
సంపదవలన మత్తుడైనవాడు ముక్తిమార్గమును చూడలేడు. ఆతడు సురామత్తుడైన వానివలె కన్పించును. అతని చుట్టు బంధువులున్నను ఆందరిని ద్వేషించును. సంపన్మత్తుడు. విషయంపటుడు, ఆతీకాముకుడు, ఆతిసాహసికుడు వీరు సత్వమార్గమును చూడలేరు.
విషయలంపటులు రాజసులు తామసులనీ రెండు విధములుగా ఉందురు. శాస్త్ర జనములేనివాడు తామసుడు కాగా శాస్త్రములన్నీ తెలీసినవాడు రాజసుడు, ఆభ్ శాస్త్రమున ప్రవృత్తిమార్గము నివృత్తిమార్గమని రెండు విధములు కల్పించుచున్నవి. ప్రాణులు ఎక్కువగా దు:ఖకారణమైన ప్రవృత్తి మార్గము నెంచుకొందురు. ఆది ఉత్పత్తి పరిణామములకు, జన్మ మృత్యు, జరాదులకు కారణమగుచున్నది. ప్రవృత్తి మార్గమున సంచరించువారు అనేక జన్మలెత్తుచు తాము చేసికొన్న కర్మలననుసరించి అనేక యోనులలో జన్మించుచున్నారు.
తరువాత శ్రీకృష్ణుని అనుగ్రహమువలన వారు సంత్సంగమును పొందుచున్నారు.
అనేక లక్షలమందిలో ఒకడు సంసార సాగరమునుండి తరించును, సాధుపురుషుడు సత్వగుణమనే దీపమునందుకొని ఇతరులకు ముక్తి మార్గమును చూపించును. అప్పుడు సాధారణ జీవుడు అనేక జన్మలలో చేసిన యోగములవలన, తపస్సువలన, నిరాహార దీక్షలవలన సుఖమునిచ్చు ముక్తిమార్గమును పొందును.
ఈ విషయమంతయు నా గురువగు బృహస్పతితో మాటలాడుచున్నప్పుడు తెలిసికొంటిని. ఇంతకంటే నేను ఎక్కువగా తెలిసికొనలేకపోతివి. ఇప్పుడు ఈ కష్టసమయమున జ్ఞానసముద్రులైన మీమ్ము ఆదృష్టవశమున పొందీతీని, ఈ ఆపద వా పంపడవలన ఏర్పడినది ఐనను నన్ను తరింపజేయుటకు (మీవలన) ఇది. కారణమైనది.
అందువలన జ్ఞానముద్రుడపు దీనులకు బంధువు ఐన దుర్వాసమహర్షీ! ఈ దీనునకు సంసారమును తరింపజేయు జానము కొంతదైన ఉపదేశింపుము.
పరమజ్ఞానీ, సనాతనుడగు దుర్వాసమహర్షి ఇంద్రుని మాటలు విని సంతోషముతో ఈవిధముగా చెప్పనారంభించెను.
దుర్వాసా ఉవాచ- దుర్వాస మహర్షి ఇట్లు పలికెను-
ఓ మహీంద్ర! నీవు సుఖముగా ఉండవలెననీ ఆనుకొనుచు వన్సు ఈ ప్రశ్నవేసితివి. నేను తెలుపునది మొదలు దుఃఖముసు కలిగించినను పరిణామదశలో సుఖమును కలిగించును. ఇవీ గర్బయాతనలను తొలగించును. సంసార సముద్రమును తరింపజేయును. కర్మలనే చెట్ల మొలకలను తుంచివేయును, ఆవేక విధములగు పంతోషములను కలిగించును. అన్నిటికంటే ఇది చాలా శ్రేష్ట్రమైనది,
దానము, తపస్సు, వ్రతములు, ఉపవాసము మొదలగు కర్మలచేత ప్రాణులు స్వర్గాది భోగములననుభవింతురు. అందువలన కామ్యకర్మలయొక్క మూలముమ కష్టపడి చేదించి మోక్షమును పొందించు జ్ఞానమును పొందవలెను. అది సంకల్పా భావము అనగా కోరికలను కోరుకొనకుండుట.
సాత్వికమైన కర్మను పంకల్పము లేకుండనే చేయవలెను. శ్రీకృష్ణార్పణముగా సమస్త కర్మలు చేయువాడు పరబ్రహ్మలో విలీనమగును. సాధారణ సంసారులు మోక్షము కావలెనని కోరుకొందురు. కాని విష్ణుభక్తులు మాత్రము మోక్షమును కాక శ్రీహరి సేవాదీరూపమైన ముక్తిని కోరుకుందురు. వారు దివ్య శరీరమును ధరించి వైకుంఠముననో, గోలోకముననో ఉన్న పరమాత్మను అనుక్షణము సేవించుచుందురు. వారు జీవన్ముక్తులు మాత్రమే కాక తన కులమును కూడ ఉద్దరింతురు.
శ్రీ మహావిష్ణువును స్మరించుట, కీర్తించుట, అతనిని సదా ఆర్చించుట, అతని పాదములను సేవించుట, నమస్కరించుట, పోత్రములు చేయుట, ప్రతిదినము భక్తిలో శ్రీహరి నైవేద్యమును తీసుట, ఆతని పాదోదకమును త్రాగుట, ఆతని మంత్రమును బిపించుట అనువది సంసారమును తరింపజేయునవి. ఇవి అందరికి ఇష్టమైనవి.
ఈ విషయమును వాకు గురువైన మృత్యుంజయుడు తెల్పినందువలన దీనిని మృత్యుంజయ జ్ఞానమని అందురు. వెను ఆ మృత్యుంజయుని అనుగ్రహము వలన ఎట్టి సందేహములు లేక తిరుగుచున్నాను. ముల్లోకములలో దుర్లభమైన శ్రీహరిభక్తి కలిగించినవాడే నిజమైన తండ్రి, నీజమైన గురుపు, బంధువు, సజ్జనుడు. ఆ విధముగా కాక ఇతర మార్గములను చూపించు తండ్రి, గురువు, బంధువు మొదలగువారు అతనిని చెడగొట్టుచున్నారు. అతనిని చంపినవారగుచున్నారు:
ప్రపంచమున అందరికి శ్రీకృష్ణనామము మేలు కల్గించును. అతని ఆయుస్సును కూడ పెంచును. శ్రీకృష్ణ నామమున సంతతము స్మరించువానిని చూచి కాలుడు, మృత్యువు, రోగము, సంతాపము, శోకము, మొదలైవవి గరుత్మంతుని చూచిన సర్పములవలె పరుగెత్తిపోవును.
శ్రీకృష్ణమంత్రమున ఉపాసన చేయు బ్రాహ్మణుడు, అంత్యజుడైనను, బ్రహ్మలోకమునండీ గోలోకమునకు పోవును. తన లోకమున దాటి గోలోకమునకు పోవుచున్న ఆ విష్ణుభక్తుని చూచి బ్రహ్మదేవుడు, సిద్ధులు, దేవతలు అందరు అతనిని రవింతురు.
పరమశివుడు చెప్పిన శ్రీకృష్ణ విషయమైన జ్ఞానము అన్ని జానములకు, తపస్సుకు సారభూతమైనది. ఈ ప్రపంచమున కన్పించు బ్రహ్మాది దేవతలు, జడ్జడ పదార్థములన్నియు క్షణికమైనవి. ప్రకృతికి అతీతుడు రాధాప్రియుడు శ్రీకృష్ణ పరబ్రహ్మయే తమైన వాడు.
శ్రీకృష్ణమంత్రము. సుఖమును, భుక్తిని, ముక్తిని, ఇచ్చుమ. ఆ మంత్రము సిద్ధయోగములను సమస్త సంపదలవిచ్చును, - యోగులు, సిద్ధులు, యతులు, మహర్సులు అందరు కర్మ ఫలమును తప్పక అనుభవింతురు. కాని శ్రీహరి భక్తులు దానికి ఆడితులు. వారి స్పర్శ తగిలినంతమాత్రముననే పాపములు భస్మీపటలమగును. రోగములు, పాపములు వారిని చూచి భయపడును. ఆయై గురువునుండి శ్రీకృనమంత్రమును పొందగగానే మానవులు పంపారకారాగారమునుండి విముక్తులగుదురు. ఆ. మంత్రము కర్మభోగమమ ఇనుపపంకెళ్లను ఛేదించును. పూయాజాలమును మాయాపాశములను తొలగించును.
ఇంకను ఆది గోలోకమునకు మార్గము చూపుమ, ముక్తికి ప్రధాన కారణము. భక్తియను వృక్షాంకురమును దినదినము ప్రవర్ధమానమగునట్లు చేయును. తపస్సులన్నింటికి ఆదిపారభూతమైనది. యోగములకు, సిద్ధులకు, వేదములకు, వ్రతములు పూజలు, దానములు, తీర్థస్నానములు యజ్ఞములు మొదలగువాటికన్నిటికీ సారమైనది.
ఆ మంత్రము నిష్టలో జపించినవారి. తండ్రివంశమువారు లక్షతరములవరకు, తల్లి వంశమువారు మారు తరములవరకు ఉద్ధరింపబడుదురు. ఆట్లే తల్లి, తండ్రి, గురువు, సోదరుడు, భార్య, బంధువులు, శిష్యులు, సేవకులు, అత్తామామలు వారి సంతానమునంతను ఈ మంత్రము పవిత్రము చేయును. అట్లే అతనిని అతనితోటివానినీ గురుపత్నిని, గురుపుత్రుని అందరిని శ్రీకృష్ణ భక్తుడు ఉద్ధరించును.
శ్రీకృష్ణమంత్రమును గురువు వలన ఉపదేశము పొందినంత మాత్రమున ఆతడు జీవన్ముక్తుడై తన స్పర్శవలన తీర్థ స్థానములను, భూమీవి పవిత్రము చేయును.
అనేక జన్మలవరకు కృష్ణమంత్రము లభించని మానవునకు ఆతనీ పుణ్యవిశేషమువలన ఇతర దేవతామంత్రమును లభించును.
ఆ మంత్రముచే ఆ దేవతను ఏడు జన్మలవరకు ఆరాధించి, సేవించి తానొచ్చిన పుణ్యకర్మవలన సూర్యమంత్రమును పొందుమ, సమస్త కర్మలకు సాక్షియగు. ఆ సూర్యుని మూడు జన్మలవరకు ఆరాధించి ఆతని అమగ్రహమువలన గణపతి మంత్రోపదేశము పొందును.
సమస్త విఘ్నములను తొలగించు ఆ వినాయకుని మూడు జన్మలవరకు ఆరాధించి, విఘ్నములన్ని తొలగిపోగా గణపతియొక్క అనుగ్రహమువలన దివ్యజ్ఞానమును పొందును. వీఘ్న నాయకుడొసగిన జ్ఞానదీపమువలన అజ్ఞానాంధకారము తొలగిపోయి మహామాయయైన దుర్గామంత్రమతనికి లభించును.
విష్ణమాయాస్వరూపిణి, దుర్గతిని పోగొట్టు దుర్గాదేవిని, సరస్వతీదేవిని, లక్ష్మీదేవిని, రాధను అందరిని భజించి వారి అనుగ్రహమువలన జ్ఞానానంద రూపుడు, కృష్ణజ్ఞానమునకు ఆధిదేవతయగు మహాదేవమంత్రమును అతడు పొందును.
మహాదేవమంత్రము మంగళరూమైనది, సమస్త మంగళములను కలిగించునది. ఆనందదాయకమైనది. అది అమరత్వమును, దీరాయుస్సును ప్రసాదించును. ఇంద్రత్వము, మనుత్వము, రాజేంద్రత్వము ఆ మంత్రానుగ్రహమువలన తేలికగా లభించును. అట్లే ఆ మంత్ర ప్రభావమువలన శ్రీహరి భక్తికూడ లభించును. ఆ పరమశివుని మంత్రమును మూడుజన్మలవరకు జపించి అన్ని కోరికలు తీర్చు ఆ పరమేశ్వరుని అనుగ్రహమువలన శ్రీహరి భక్తిని పొందును.
అప్పుడతనికి శ్రీహరి భక్తుల సాహచర్యమువలన శ్రీకృష్ణమంత్రము తప్పక లభించును.
పరమశివుని అనుగ్రహమువలన లభించిన జ్ఞానమువలన తత్వమును తెలిసికొని ఈ చరాచర సృష్టియంతయు క్షణికమైనదని భావించి నిర్మల జ్ఞానమును పొంది మరల ఆ మహాదేవుని అనుగ్రహమువలననే, హరిభక్తిని పొందును. తరువాత శ్రీకృష్ణమంత్రమును ఉపదేశముపొంది పాంచ భౌతిక దేహమువదలిన తరువాత వైకుంఠమునకో లేక గోలోకమునకో పోయి ఆచ్చట భగవద్ధాప్యమును చేయుచుండును.
విష్ణుమంత్రోపాసకులు, గంగాదీపుణ్యతీర్థముల సేవించువారు తమతమ ధర్మమును చక్కగా నిర్వర్తించు భిక్షుకులకు పునర్జన్మ అనునది ఉండదు.
పుణ్యతీర్థముల సేవించువారు ప్రతిదినము ఆ పుణ్యతీర్థములందు స్నానము చేయుచు తమ పాప ప్రక్షాళనము చేసికొనవలెను. అట్లే పుణ్యకార్యములు చేయుచు సదా శ్రీహరి భజనము చేయవలెను, ఇది పుణ్యతీర్థములను సేవించువారి ధర్మము.
విష్ణుమంత్రోపాసకులు ఎల్లప్పుడు శ్రీహరిమంత్రమును జపించుచుండవలెను. అట్లే శ్రీహరి సేవాకార్యక్రమములయందు పదా నిమగ్నులై యుండవలెను. ఇంకను శ్రీహరి వ్రతములు, ఉపవాసము చేయుచుండవలెను. ఇదీ విష్ణు సేవకుల ధర్మము.
సన్యాసులు మంచి అన్నమైనా, చెడిపోయిన అన్నమైనా సమానముగా చూడవలెను. రాయి, బంగారములను సమానముగా చూడవలెను. దండము, కమండలము, కాషాయవస్త్రములను ధరింపవలెను. స్థిరముగా ఒకచోటనుండక ప్రతిదినము ఒక చోటినుండి మరియొకచోటికి పోవలెను. లోభము మొదలగు గుణములను వదిలి పెట్టి మంచి ఆచారముకల బ్రాహ్మణుల ఇంటిలో భోజనము చేయవలెను. ఎవరినీ స్వార్థమునకై యాచించరాదు. వ్యాపారము చేయరాదు. ఆశ్రమమును ఏర్పరచు కొనరాదు. అన్ని విధములైన చెడ్డపనులను వదిలివేసి శ్రీమన్నారాయణునీ ఎల్లప్పుడు ధ్యానించుచుండవలెను. అట్లే బ్రహ్మచారిగానుండి ఎవరితోను ఎక్కువగా మాట్లాడక మౌనముగా నుండవలెను. సమస్త విశ్వమును బ్రహ్మమయముగా భావించుకొనవలెను. ఆందరిపై సమానమైన బుద్ధి కలిగి హింస, మోసము, కోపము, అహంకారము మొదలగు గుణములను వదలి పెట్టవలెను. యాచన చేయకుండ లభించిన ఆన్నము మృష్టాన్నమైనను, కాకపోయినను సంతోషముతో భుజింపవలెను. భోజనమునకై ఎవరిని యాచనచేయకూడదు. స్త్రీల ముఖమును చూడరాదు, స్త్రీల సమీపమున కూర్చోవరాదు. చివరకు స్త్రీయొక్క బొమ్మనైన తాకరాదు. ఇవన్నియు సన్యాసులు అనుష్ఠింపవలసిన ధర్మములని బ్రహ్మదేవుడు తెలిపెను.
తీర్థముల సేవించువారు. శ్రీహరి మంత్రోపాసకులు, సన్యాసులు తమతమ ధర్మములను వదలి ప్రవర్తించినచో వారు చెడిపోవుదురు. పైగా జీవులకందరకు అతిభయంకరమైన జన్మదు:ఖమును నరక దుఃఖముననుభవింతురు.
దేవతాస్త్రీల యోనియందున్నను, పందుల యోనులందున్నను, క్షుద్రజంతువులు, పశువులు మొదలగుపోని యోనులందున్నను గర్భదుఃఖము అన్నీ ప్రాణులకు సమానముగానే యుండును. ఆ ప్రాణులు గర్భమునందుండగా పూర్వజన్మలలో చేసిన పాపకార్యములనన్నిటిని స్మరించుకొనును. గర్భమునుండి బయటకు రాగానే విష్ణుమాయవలన అన్నీటినీ మరచిపోవుచున్నారు, దేవతలైనా కీటకములైనా జన్మించునపుడు గర్భమున తమ దేహమును కష్టపడి తామే రక్షించుకొనును.
శుక్రశోణితములు స్త్రీయొక్క యోనిలో పురుషుని శుక్రము పడినప్పుడు వెంటనే రెండు కలిసిపోవును. ఆ పిండమున స్త్రీ రక్తము ఎక్కువగా వున్నప్పుడు తల్లిపోలిక వచ్చును. లేక శుక్రము ఎక్కువగా నున్నచో ఆ శిశువునకు తండ్రి పోలిక వచ్చును. .
సరిసంఖ్యగల తిథులలో గర్భమేర్పడినచో పుత్రుడగును. అట్లే ఆది, మంగళ, గురువారములలో గర్భముకలిగినచో పుత్రుడు కలుగును. లేక బేసిసంఖ్యగల తిథులలో సోమ, బుధ, శుక్ర, శనివారములలో గర్భము కలిగినచో స్త్రీ యగును.
ప్రథమ యామములో జన్మించినవాడు ఆల్పాయుష్కుడగును. రెండవజామున, మూడవజామున జన్మించినవారి వయస్సు ఎక్కువగా ఉండును. నాల్గవ జామున జన్మించినవాడు చాలాకాలము బ్రతుకును. అట్లే జీవి తమతమ పూర్వ కర్మలననుసరించి సుఖవంతుడగనో దుఃఖవంతుడుగనో అగుచున్నది.
తాను పుట్టిన సమయమెటువంటిదో ఆ శిశువు అట్లే యుండును. అనగా పుట్టిన సమయముననుసరించి శిశువు స్వభావము భాగ్యము ఏర్పడుచున్నవి.
విజ్ఞాలు ప్రసూతి విషయమున ఇటువంటి చర్చచేయుచున్నారు.
రక్తశుక్లములు కలిసిపోయిన తరువాత ఒకరాత్రికి కలలాకారమునొందును. ఆటుపిమ్మట దినదిన వృద్ధి కనిపించును. ఏడు దినములలో ఆది రేగుపండంత యగును. తరువాత నెలలో అది బొంగరమంతయగును. మూడు నెలలలో చేతులు కాళ్ళులేని పిండముగా రూపొందును. ఐదవనెలలో ఆ పిండమునకు అన్ని అవయవములు చేకూరును. తరువాత ఆరవనెలలో జీవమేర్పడి సమస్త తత్వమును తెలసినందువలన పంజరములో నున్న పక్షివలె దుఃఖించుచు స్వల్పస్థలమున ముడుచుకొనియుండును. తల్లియొక్క ఆమేధ్యస్థలముననుండి తల్లి తీసికొను ఆహారమును తినుచుండును. తత్వమునెరిగియున్నందువలన హాహాకారము చేయుచు పరమేశ్వరుని సదా చింతించుచుండును. ఈవిధముగా మాతృగర్భములో నాలుగు నెలలు వరకయాతనలననుభవించి తగు సమయమున గర్భమునుండి బయటికి వచ్చును.
విష్ణుమూర్తియొక్క మాయవలన జన్మనెత్తగానే తన పూర్వజ్ఞానము నంతయు మరచిపోవును. వాటినుండి శైశవమువరకు మలమూత్రముల మధ్యనుండును. తన స్వాతంత్ర్యమును కోల్పోయి ఇతరులకధీనమై దోమలు మొదలగువానిని సైతము నివారించుకొనలేడు. అట్లే పురుగులు కుట్టుచున్నప్పుడు దుఃఖముతో మాటిమాటికి ఏడ్చును. పాలుకూడ తాగలేడు తనకు కావలసినవాటిని అడుగుకొనలేడు.
ఆ విధముగా బాల్యమువరకు ఆతని మాటలు స్పష్టముగా ఉండవు. బాల్యమున అనేక యాతనలననుభవించి యావనమును పొందును. ఆప్పుడు విష్ణుమాయవలన గర్బాది యాతనలనన్నిటిని మరచిపోవును. తరువాత ఆహారము, మైథునము మొదలగు వాటికై అనేక మోహములలో మునిగి. పుత్రులు, కళత్రము మొదలగువారిని కష్టపడి పోషించును.
ఈ విధముగా తన వారినెంతవరకు పోషింపగలగునో అంతవరకే అతనికి గౌరవముండును. తనవారిని పోషింపలేని దశలో బంధువులు ఆతనిని చులకనగా చూతురు, తాను పూర్తిగా ముసలివాడైనప్పుడు చెపుడు, దగ్గు, దమ్ము మొదలగు రోగములచే పూర్తిగా పరాయత్తుడగును. అప్పుడు అయ్యో పుణ్యతీర్థములను సేవించలేదు, సత్సంగము చేయలేదని బాధపడుచు మరల భారతభూమిపై మానవ జన్మనెత్తినచో పుణ్యక్షేత్ర దర్శనము చేయుచు శ్రీకృష్ణుని దర్శించుకొందునని తలచును.
ఈవిధముగా మనస్సులో అనుకుంటున్న ఆ బుద్దిహీనుని యమదూతలు మృత్యుకాలము దాపురించగనే తీసికొనిపోవుదురు. యమదూతలు చేతిలో పాశమును, దండమును ధరించి, అధిక కోపమున ఎజ్జుని కన్నులు కలవారై వీకృతాకారములో భయంకరముగానుందురు. వారు ఎవ్వరికిని కనిపించరు. కానీ ఇట్టి బుద్ది హీనులకు కనిపింతురు, వారు మహాభయంకరులైన ఆ యమదూతను చూడగానే ఆతిభయముతో మలమూత్రములను వదలి తమ పాంచభౌతికమైన దేహమును వదలిపెట్టుదురు.
బొటనవేలంత ఉన్న జీవుని పాశములతో కట్టి ఆ జీవీని భోగదేహముననుంచి నరకమునకు వెంటనే తీసికొని వెళ్ళును. జీపుడు యమలోకమునకు పోయి అచ్చట రత్నసింహాసనముపై కూర్చొనియున్న యమధర్మరాజును చూచును.
యమధర్మరాజు సమస్త ధర్మములు తెలిసినవాడు. ధర్మాధర్మ విచారము తెలిసియున్నందువలన బ్రహ్మదేవుడతనిని ఆ స్థలమున నీయోగించెను.
అతడు మేలిమి బంగారము చిన్నెలు కల వస్త్రమును, రత్నభూషణములను ధరించి మూడుకోట్ల భటులు సేవింపుచుండగా శ్రీకృష్ణనామమును శుద్ద స్పటిక మాలతో జపముచేయును. అట్లే శ్రీకృష్ణుని పాదములను మనస్సులో ధ్యానము చేయుచు పులకించిన శరీరముతో, గద్గద కంఠముతో, కన్నీళ్ళు కారుచుండగా అందరినీ సమానముగా చూచును.
అతడు మంచీ తేజస్సుతోనున్నను మహాభయంకరుడు. శరత్కాలమందలి పున్నమిచంద్రునివంటి దేహకాంతి కలవాడు. అతనికెదురుగా చిత్రగుప్తుడున్నాడు. అతడు పుణ్యము చేసినవారికి శాంతస్వరూపుడై కనిపించును. కాని పాపులకు మాత్రము ఆతీ భయంకరముగా నుండును.
చిత్రగుప్తు డాజీవుని విచారించుచుండగా ఆ జీవి చేసిన పుణ్యపాప కర్మలకు తగిన ఫలమును యమధర్మరాజిచ్చును. ఈవిధముగా జన్మలెత్తుచున్న జీవులకు శ్రీకృష్ణుని పాదములను సేవించునటువంటి నివృత్తి మార్గము లభించదు.
దుర్వాస మహర్షి ఈవిధముగా తెలిపి నీ కోరికలనన్నిటిని ఆడుగుమని, అవి ఏవియు నాకు అసాధ్యముకావు కావున వాటినన్నీటిని నీకిత్తునని చెప్పెను.
మహేంద్ర ఉవాచ- దేవేంద్రుడిట్లు పలికెను-
కల్పవృక్షమువంటి ఓ మహర్షీ! నా ఇంద్రపదవి పోయిన తరువాత ఎంత ఐశ్వర్యమున్నను ఫలితమేమున్నది. అందువలన నాకు మీరు పరమపదమును ఇప్పించుడు అని ఇంద్రుడనగానే మునిశ్రేష్ఠుడైన దుర్వాసుడు నవ్వి వేదసారమని చెప్పదగిన మాటను ఇట్లు చెప్పెను.
దుర్వాసా ఉవాచ- దుర్వాసమహర్షి ఇట్లనెను-
ఓ మహీంద్రా! సంసారమున ఆసక్తిగలవారికి పరమపదము మిక్కిలి దుర్లభమైనది. మీవంటివారికి ప్రాకృతలయమున కూడ ముక్తిదొరకదు.
పర్యము జరిగినపుడు ఈ చరాచర ప్రపంచము ఆవిర్భవించుచున్నది. అట్లే లయము జరిగినప్పుడు మాయమగుచున్నది. నిద్రపోవుట మేల్కొనుట తిరిగి నిద్రపోవుట మరల మేల్కొనుట అన్నట్లు కాలము చక్రములోనీ ఆరెలవలె నిత్యము తిరుగుచుండును. ఇదంతయు ఈశ్వరేచ్చ ననుసరించి జరుగుచున్నది.
విపలములు ఆరవై ఐనచో ఒక పలము కాలమగును (ఘడియ). ఆరవై పలములు ఒక దండకాలము. రెండు దండములు ఒక ముహూర్తకాలమగును. ముప్పై ముహర్తార్తములకాలము ఒక దినము (రాత్రి, పగలు). పదునైదు దినములను పక్షమందురు. శుక్ల కృష్ణపక్షములు కలసినచో ఒక సెలయగును. రెండు నెలలను ఋతువందురు. మూడు ఋతువులు ఒక ఆయనమగును, రెండు ఆయనముల కాలము ఒక సంవత్సరము. నలభైమూడులక్షల ముప్పైవేల సంవత్సరములు నాలుగుయుగములగును. ఇరవై ఐదు వేల ఐదువందల ఆరపై మానవయుగములు దేవేంద్రునకు మనువునకు జీవితకాలమగుచున్నవి. ఎనిమిది లక్షల ఎనీమిదివేల ఇంద్రులు గతించినచో అది బ్రహ్మదేవుని జీవితకాలమగుచున్నది. బ్రహ్మదేవుడు మరణించినపుడు ఈ సృష్టిలయమగుచున్నది. దానినే ప్రాకృతిక లయమందురు. ఇది పరమాత్మయగు శ్రీకృష్ణునకు రెప్పపాటు కాలము.
భూమియందలి రేణువుల సంఖ్యను లెక్క పెట్టలేనట్లు సృష్టి లయముల సంఖ్యను ఎవ్వరు లెక్కించలేరని శ్రీమహాదేవుడు తెలి పెను.
మహేంద్రా! నేనింతవరకు నీకు సృష్టిసూత్రమును గురించి వివరించితిని. ఇంకను నీవేమైనా ఆడుగదలచినచో అడుగుమని దుర్వాసుడనగా దేవేంద్రుడు తనకుండిన ఐశ్వర్యము మాత్రమే (ఇంద్రత్వము) కావలెననీ ఆడుగగా ఆ మహర్షి ఇంద్రునితో నీవనుకొన్న ఇంద్రత్వము త్వరలోనే పొందగలవని చెప్పి తన మార్గమున తాను వెళ్ళెను.
శ్రీబ్రహ్మవైవర్తమను మహాపురాణమున రెండవదైన ప్రకృతిఖండములో నారదనారాయణ సంవాదమున తెల్పబడిన దుర్వాసదేవేంద్రుల సంవాదములో ఇంద్రునకు దుర్వాసుడు పెట్టిన శాపాది వృత్తాంతములు గల ముప్ఫయ్యారవ అధ్యాయము సమాప్తము.
