2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము
35 - లక్ష్మీ పూజాది వర్ణనము
నారద ఉవాచ- నారదుడిట్లు పలికెను-
ఓనారాయణ! విర్గుణుడు, వీరాకృతి, పరమాత్మయగు శ్రీకృష్ణుని విర్మలమైన కీర్తిని సావిత్రియమ సంవాద సమయమున ఏన్నాను. ఆ శ్రీకృష్ణదేవుని గుణకీర్తన మంగళకరమైనది.
ఇప్పుడు నాకు లక్ష్మీదేవి చరిత్రను వినవలెవను కోరిక కలదు. ఆ దేవిని మొదట ఎవరు పూజించిరి? ఆమె ఏవిధముగా ఉండినది. అందువలన ఆ లక్ష్మీదేవియొక్క గుణ కీర్తన జరుగునట్లు ఆమె చరిత్రను నాకు వివరింపుము.
నారాయణ ఉవాచ- సారాయణుడిట్లనెను-
ఓ నారధా! పూర్వము సృష్టి ప్రారంభమున రాసమండలమువ శ్రీకృష్ణ పరమాత్మయొక్క ఎడమ భాగమునుండి ఒక దేవీ ఉదయించినది. ఆమె చాలా సౌందర్యము గలది. యౌవనవతి. పన్నెండు సంవత్సరముల కన్యవలె స్థిరమైన యౌవనము కలది.
తెల్లని చంపక పుష్పము వంటి కాంతి కలది. ఆందమైనది. శరత్కాలమందలి కోటి పున్నమి చంద్రుల వంటి ముఖసౌందర్యము గలది. అట్లే శరన్మధ్యాహ్న కాలమందలి పద్మమువంటి కన్నులు కలది.
ఆ దేవి పరమేశ్వరుని ఇచ్చననుసరించి వెంటనే రెండు రూపములతో కన్పించినదీ. ఇద్దరీ రూపము, రంగు, కాంతి, లేజస్సు, వయస్సు, వస్త్రములు, భూషణములు, గుణములు, చిరునవ్వు, చూపు, మాటలు, నడక, మధురస్వరము, ప్రేమగానుండుట అనునయము ఆన్నీయు సమానముగా నుండెను.
ఆ దేవి యొక్క ఎడమ భాగమునుండి ఏర్పడినదీ మహాలక్ష్మి, కుడిభాగమునుండి ఆవిర్భవించినది రాధాదేవి. వారిలో రాధ ద్వీభుజాడగు శ్రీకృష్ణపరమాత్మను భర్తగా వరించగా ఆ తర్వాత సుందరుడగు ఆ పరమాత్మను మహాలక్ష్మి వరించినది.
శ్రీకృష్ణుడు వారిపై గల గౌరవభావమున రెండు రూపములతో ఆవిర్భవించెను. ఆతనిలో కుడివైపున ఆవిర్భవించినవాడు ద్విభుజూడగు శ్రీకృష్ణుడు. ఎడమవైపున చతుర్భుజుడగు నారాయణుడుద్భవించెను. ద్విభుజుడగు శ్రీకృష్ణుడు చతుర్భుజుడగు నారాయణునకు మహాలక్ష్మిని ఇచ్చెను.
చల్లని చూపుతో ప్రపంచమును ఎల్లప్పుడు చూచునది (రక్షించునది) దేవతాస్త్రీలలో శ్రేష్ఠురాలు కాపున ఆమె మహాలక్ష్మియైనది. రాధికా ప్రియుడు ద్విభుజూడగు శ్రీకృష్ణుడు. మహాలక్ష్మి ప్రియుడు చతుర్భుజుడగు నారాయణుడు. ద్వీభుజుడగు శ్రీకృష్ణుడు గోప, గోపికలతో గోలోకముననుండెను. చతుర్భుజుడగు నారాయణుడు మహాలక్ష్మితో వైకుంఠమునకు పోయెను.
శ్రీకృష్ణ నారాయణులిద్దరు అన్ని విధములుగా సమానమైనవారు.
మహాలక్ష్మి యోగ శక్తివలన అనేక రూపములుగా మారినది. వైకుంఠమున పరిపూర్ణతమయైన మహాలక్ష్మిగా ఉండును. ఆమె శుద్ధ సత్వ స్వభావము కలది. సమస్త సౌభాగ్యములు కలది. స్త్రీలందరిలో ప్రేమ మూర్తియై ప్రధానమైనదిగా ఆమె కన్పించును.
ఆ మహాలక్ష్మి స్వర్గలోకమున ఇంద్రుని సంపదకు మారురూపైన స్వర్గలక్ష్మిగా రూపొందినది. పాతాళమున, భూలోకమున నున్న రాజాలకు ఆమె రాజలక్ష్మి యైనది. అన్ని గృహములలో గృహలక్ష్మిగా ఆమె తన అంశచే గృహిణిగా ఐనది. అట్లే గృహ యజమానులకు సంవత్స్వరూపయగు సర్వమంగళ మంగళమైనది. అట్లే ఆవులలో ఆమె గోవులకు మాతయగు సురభిగాను, యజ్ఞభార్యయగు దక్షిణాదేవిగాను, క్షీరాబ్ధికవ్యగాము, చంద్రునిలోను, సూర్యమండలమున, సమస్త భూషణములయందు జలజములలో శోభారూపిణిగను మారినది. అట్లే సమస్త సస్యములందు దేవ ప్రతిమలయందు మంగళ కుంభముల యందు మాణిక్యములందు రత్నమాలలయందు, పాలలో, చందసమున, ఆందమైన వృక్షములందు నూతన మేఘములందు లక్ష్మి కనిపించును.
లక్ష్మీదేవిని మొదట నారాయణుడు వైకుంఠమున పూజించెను. తరువాత బ్రహ్మదేవుడు, అటుపిమ్మట శంకరుడామెను పూజించెను. నారాయణుడు క్షీరసముద్రమున ఆమెను పూజించగా భారతదేశమున మనువు, రాపోలు, ఋషులు, మునులు, గృహస్థులు, గంధర్పులు మొదలగువారు ఆమెమ పూజించుచున్నారు. పాతాళలోకమున వాగులు మొదలగువారు ఆమె పూజను చేయుచున్నారు.
బ్రహ్మదేవుడు చేసిన లక్ష్మీపూజ భాద్రపద శుద్ధ అష్టమి మొదలుకొని పది హేను దీనములవరకు జరుగును. శ్రీమహావిష్ణువు చేసిన లక్ష్మీపూజ చైత్రమాసమున, పుష్యమాసమున, భాద్రపదమాసమున ప్రతి మంగళవారము చేయవలెను. మనువు జు శ్రీదేవిని ఫాల్గుణమాసమువ, పుష్యమాసమున పూజించెను.
లక్ష్మీదేవిని మంగళుడను రాజూ పూజించినందువలన ఆ దేవి మంగళమైనది. అదేవిధములో ఆదేవిని కేదారుడు, వీలుడు, నలుడు. సుబలుడు, ధ్రువుడు, ఉత్తానపాదుడు, ఇంద్రుడు, బలిచక్రవర్తి, కశ్యప ప్రజాపతి, దక్షప్రజాపతి, కర్దముడు, సూర్యుడు, ప్రియవ్రతుడు, చంద్రుడు, కుబేరుడు, వాయువు, యముడు అగ్ని, వరుణుడు పూజించిరి.
ఈవిధముగా మహాలక్ష్మినీ అందరు అన్ని చోట్ల నమస్కరించుచున్నారు. పూజించుచున్నారు. ఆదీవి సమస్తసంపదలకు సమస్యైశ్వర్యములకు అధిదేవత కావున ఆందరిపూజలనందుకొనుచున్నది అని నారాయణుడు నారదునీతోపనను. .
శ్రీ బ్రహ్మవైవర్తమహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణ సంవాదే సమయమున చెప్పబడిన లక్ష్మీ ఉపాఖ్యానమున శ్రీమహాలక్ష్మీస్వరూపము, పూజావర్ణనములు కల ముప్పది ఐదవ అధ్యాయము సమాప్తము.
