2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

Table of Contents

51 - కర్మ ఫలములను వివరించుట

శ్రీపార్వత్యువాచ- శ్రీపార్వతీదేవి శంకరునితో ఇట్లనినది-

శంకరా! నీతిజ్ఞులు, బ్రహ్మదేవుని వంశమున పుట్టిన ఆ బ్రాహ్మణులు సుయజ్ఞుని శపించిన బ్రాహ్మణునితో ఎటువంటి నీతి వచనములు పల్కిరో వాటిని సవివరముగా నాకు తెలియజేయుడని పార్వతీదేవి పలికెను.

శ్రీమహాదేవ ఉవాచ- శ్రీ శంకరుడిట్లు పలికెను –

మహర్షుల సమూహమంతయు తమ వినయ విధేయతలచేత స్తోత్రములచే ఆ బ్రాహ్మణుని సంతోషపెట్టి క్రమముగా ఇట్లు మాటలాడిరి.

సనత్కుమార ఉవాచ- సనత్కుమారుడిట్లనెను.

ఓ బ్రాహ్మణుడా! నీవు రాజగృహమునుండి బయటకు అడుగు పెట్టగానే వీవెంట లక్ష్మీదేవి, కీర్తి, బలము, యశస్సు, సుశీలము, ఆంతులేని ఐశ్వర్యము, పితృదేవతలు, అగ్నిదేవుడు, ఇతర దేవతలందరు లక్ష్మీభ్రష్టుడైన సుయజ్ఞుని ఇంటినుండి బయటకు వచ్చిరి.

మహారాజునకు గొప్ప శిక్షపడినది కావున కోపపడక, సంతోషపడుము. బ్రాహ్మణుడెప్పుడు త్వరగా సంతృప్తిని పొందుమ. బ్రాహ్మణుల మనస్సు అప్పుడే చిలికి చేసిన వెన్నవలె మృదువుగా ఉండును. అదివారీ తపస్సుచే పరిశుద్ధమై విర్మలముగా నుండును.

అందువలన ఓ బ్రాహ్మణుడా! నీవు మహారాజును క్షమింపుము. వెనకకు రమ్ము. రాజభవనమును నీయొక్క పవిత్రమైన పాదరేణువుచే పవిత్రము చేయుము. ఆ మహారాజును ఆశీర్వదింపుము. అని పనత్కుమారుడనెమ.

భృగురువాచ- భృగుమహర్షి ఇట్లనెను –

ఆతిథ ఎవరి ఇంటికి వెళ్ళి తన ఆశ భగ్నము కాగా అతని ఇంటినుండి తిరిగిపోవునో అతని పితృదేవతలు, ఇతరదేవతలు, ఆగ్ని వీరందరు ఆ గృహస్థు ఇంటినుండి బాధతో వెళ్ళిపోవుదురు. అతిథి దేవుని గౌరవించనీ గృహస్తు స్త్రీలమ, ఆవులమ, బ్రాహ్మణులము, చంపినవారితో, కృతఘ్నులు, గురుతల్పగులతో సమానమైన పాపమును పొందుము. ఐనమ ఓ బ్రాహ్మణుడా! నీవు మహారాజు చేసిన తప్పును క్షమించి అతని గృహముమ పావనము చేయుమని భృగుమహర్షి అనెమ.

పులస్త్య ఉవాచ- పులస్త్యమహర్షి ఇట్లవేమ –

అతిథి ఇంటికి రాగా ఆతనిని నిరాదరించిన గృహస్థునకు ఆతడు తాను చేసిన పాపములను సమర్పించి గృహపతి చేసిన పుణ్యమును తీసుకొని వెళ్ళును.

ఐనను ఓ బ్రాహ్మణుడా! రాజుచేసిన దోషమును క్షమింపుము. రోజు తన పూర్వకర్మ యొక్క దోషము వలన తప్పుచేసెను, అందువలన ఆ రాజును క్షమించి నీ ఇష్టమొచ్చిన చోటుకు వెళ్ళుమని పులస్త్యమహర్షి కోరెను.

పులహ ఉవాచ- పులహమహర్షి ఇట్లు పలికెను –

తాను రాజుననియో, అధిక విద్యావంతుడవనియో బ్రాహ్మణుని అవమాన పరచినచో, అతడు బ్రాహ్మణుడైనచో త్రివంద్యలయందు సంధ్యావందనము చేయని బ్రాహ్మణబ్రువుడు పొందు ఫలిత మనుభవించును. క్షత్రియుడైనచో లక్ష్మినీ కోల్పోయి ఏకాదశివ్రతమాచరింపనివాడు, విష్ణునైవేద్యమును భుజింపనివాడు పొందు పాప ఫలితముననుభవించును.

అందువలన నీవు ఆ మహారాజును క్షమించి, మహారాజు ఇంటికి వచ్చి అతని భవనమును పరిశుద్ధము చేయుమనీ పులహా మహర్షి అనెను.

క్రతురువాచ- క్రతుమహర్షి ఇట్లు పలికెను –

ఏ కులమునందు పుట్టినవాడైనను బ్రాహ్మణుని అవమాన పరచినచో యాగదీక్షను వదలివేసినవాడు పొందు పాపమును పొందును. ఇంకను అతడు ధనము, పుత్రులు, భార్య మొదలగు వారినందరను కోల్పోవును. అయినను ఓ బ్రాహ్మణుడా! మహారాజును క్షమించి అతని భవనమునకు వచ్చి దానిని పవిత్రము చేయుమని క్రతుమహర్షి కోరెను.

అంగిరా ఉవాచ- ఆంగీరసమహర్షి ఇట్లు పలికెను –

జ్ఞానవంతుడైన బ్రాహ్మణుడు ఇంకొక బ్రాహ్మణుని అవమాన పరచినచో అతడు భారతవర్షమున ఏడుజన్మల వరకు వృషహనడుమ అని పలికెను.

మరిచిరువాచ- మరీచి మహర్షి ఇట్లు పలికెను –

పుణ్యభూమియగు ఈ భారతక్షేత్రమున దేవతలను, బ్రాహ్మణులను, గురువును ఆవమాంచినవాడు విష్ణుభక్తి విహీనుడగును.

కశ్యప ఉవాచ- కశ్యప ప్రజాపతి ఇట్లనెను –

వైష్ణవుడగు బ్రాహ్మణుని అవమానపరచినవాడు విష్ణు మంత్రవిహీనుడగును. అట్లే విష్ణుపూజకు విముఖుడగును.

ప్రచేతా ఉవాచ- ప్రచేతసుడిట్లనెను –

అతిథియగు బ్రాహ్మణుని చూచి గౌరవముతో ఎవడు లేచినిలబడడో అతడీ భారతక్షేత్రమున పితృభక్తివిహీనుడగును. అట్లే అతడు ఏడు జన్మలవరకు ఏనుగై పుట్టుమ.

ఐనమ ఓ బ్రాహ్మణోత్తమా! త్వరగా వెనకకు పోయి సుయజ్ఞువకు ఆశీర్వాదమునిమ్ము అని ప్రచేతసుడనెను.

దుర్వాసా ఉవాచ- దుర్వాసమహర్షి ఇట్లనెను –

గురువునైనా, బ్రాహ్మణునైనా, దేవతామూర్తినైనా చూచిన వెంటనే నమస్కరింపనివాడు తరువాతి జన్మలో పందిగా పుట్టును. కానిచో అబద్దపు సాక్ష్యములు చెప్పువాడగును. అట్లే విశ్వాసఘాతకుడగును.

ఐనను మాతప్పులన్నియు క్షమించి మా ఆతిథ్యమును స్వీకరింపుమని దుర్వాసమహర్షి ఆ బ్రాహ్మణునితో ననెను.

రాజోవాచ- సుయజ్ఞ మహారాజిట్లనెను –

మీరందరు ధర్మమును విస్పష్టముగా తెలుపలేదు. మూడుడనగు నాకు ధర్మమును స్పష్టముగా బోధింపుడు. స్త్రీ గో, కృతఘ్నులు, గురుస్త్రీగమనము చేసినవారు, బ్రాహ్మణుని చంపిన వారికి ఏ పాపమంటుతో మీరు స్పష్టముగా తెలుపడని అనెను.

వసిష్ఠ ఉవాచ- వసిష్ఠుడు సుయజ్ఞానితో నిట్లనెను –

తెలిసి తెలిసి గోవధ చేసినవాడు ఒక సంవత్సరము తీర్థయాత్ర చేయవలెను. యపలు యవలకు సంబంధమైన వాటిని తినుచు దప్పియైనచో చేతితో నీటిని తాగుచు కాలము గడపవలెను. తరువాత నూరు ఆవులమ దక్షిణలలో బ్రాహ్మణులకు దానముచేయవలెను. తరువాత నూరుగురు బ్రాహ్మణులకు భోజనమును పెట్టవలెను. ఇట్లు ప్రాయశ్చిత్తము చేసికొప్పుచే పాపము పోవును. కానీ సమస్త పాపము తొలగిపోదు. పాపము కొంత మీగులుటచే అతడు దుఃఖమును పొందుచు చండాలుడగుచున్నాడు.

ఆతిదేశిక గోహత్యయందు అనగా పొరపాటువలన గోవధ జరిగినను, గోవధతో సమానమైన పాపము చేసినన, తెలిసి గోవధ చేసిన పాపములో సగము పాపమును పొందును. ప్రాయశ్చిత్తము వంటి దానిని చేసికొన్నమ పమ పాపమును పోగొట్టుకొనడు అని వసిష్ఠుడనెను.

శుక్ర ఉవాచ- శుక్రుడిట్లనెను –

స్త్రీహత్య చేసినచో గోహత్యను చేసిన పాపము కంటే రెండు రెట్లెక్కువ పాపమును పొందుము. ఆరవైవేల సంవత్సరములు నరకమున బాధలననుభవించును. ఆ తరువాత ఏడు జన్మముల వరకు పందీగను తరువాత ఏడుజన్మలు సర్పముగను పుట్టి తరువాత పరిశుద్దుడగును.

బృహస్పతిరుపాచ- బృహస్పతి ఇట్లనెను –

బ్రాహ్మణుని చంపినచో స్త్రీహత్యచేసిన దావీకి రెట్టింపు పాపమును పొందుమ. అతడు కుంభీపాకమను మహాభయంకరమైన నరకమున లక్షసంవత్సరములు నరకయాతన అనుభవించును. తరువాత అతడు నూరు సంవత్సరములు అశుద్ధమునందలి పురుగుగా నుండును. ఆ తర్వాత ఏడు జన్మలవరకు పర్పముగా ఉండి పరిశుద్ధుడగునని బృహస్పతి చెప్పెను.

గౌతమ ఉవాచ- గౌతమ మహర్షి ఇట్లనెను –

మేలుచేసిన వారికి అపకారము చేయువానికి బ్రహ్మహత్యాపాపమునకు నాల్గురెట్లెక్కువ పాపము లభించును. కృతఘ్నుని పాపపరిహారమునకై వేదమున ప్రాయశ్చిత్తము కన్పించదు. అందువలన కృతఘ్నుడు చాలా నీచుడని గౌతమ మహర్షి అనెను.

రాజోవాచ- రాజా ఇట్లు పలికెను –

వేదవేదార్థములు తెలిసిన వారిలో శ్రేష్ఠుడా! కృతఘ్నుడనగా ఎట్టివాడు? వారెన్నివిధములుగా నుందురు. వారి దోషములేట్లుండును చెప్పుమనెను.

ఋష్యశృంగ ఉవాచ- ఋష్యశృంగుడిట్లనెను –

సామవేదమువ కృతఘ్నులు పదహారు రకములుగా ఉన్నట్లు చెప్పబడినది. వారు తమ తమ ప్రత్యేక పాపములననుసరించి ఫలితమును సైతము ప్రత్యేకముగా పొందుచున్నారు.

సీత్కర్మ, సత్యము, పుణ్యము, స్వధర్మము, తపస్పు, ప్రతిజ్ఞ, దానము, స్వగోష్ఠి పరిపాలనము, గురుకృత్యము, దేవకృత్యము. కామ్యకృత్యము, బ్రాహ్మణారాధన, నిత్యకృత్యము, విశ్వాసము, పరధర్మము, ప్రదానము అనువాటిలో నిష్ఠగలిగియున్నవారిని చంపు పాపినీ కృతఘ్నుడని అందురు. ఇటువంటి కృతఘ్నులకు ప్రత్యేకమైన నరకములు కలవు. అట్లే వారు భిన్న భిన్నమైన జన్మలు పొందుదురు. అనేక విధములుగానుండు కృతఘ్నులు పొందు నరకములన్నియు యమలోకమున ఉన్నవని ఋష్యశృంగ మహర్షి చెప్పెను.

సుయజ్ఞ ఉవాచ- సుయజ్ఞుడిట్లనెను –

ఎటువంటి కృతఘ్నులు ఎటువంటి నరకమునకు పోవుచున్నారో ఆ విషయమును వివరముగా నాకు చెప్పుడని మహారాజడిగేను.

కాత్యాయన ఉవాచ- కాత్యాయనుడిట్లనెమ –

శపథముచేసి దానిని అనుష్ఠించని కృతఘ్నుడు కాలసూత్రనరకమున నాలుగు యుగములుండును. తరువాత ఏడుజన్మలు కాకిగామ, ఏడు జన్మలు గుడ్లగూబగా జన్మనెత్తును. తరువాత ఏడుజన్మలు రోగిష్ఠియై చివరకు పరిశుద్ధుడగును.

శ్రీసనందన ఉవాచ- శ్రీసనందను డిట్లనెన –

పుణ్యకర్మలు చేసి తన కీర్తిని పెంచుకొనుటకై వాటిని గురించి చెప్పుకొనువాడు కూడ కృతఘ్నుడే. అతడు తస్తసూర్మి అను నరకమున మూడు యుగములవరకుండి నరకయాతవలననుభవించి తరువాత ఐదుజన్మలు కప్పగాను, తరువాత మూడు జన్మలు ఎండిగాను జన్మించి ఆ తరువాత మూగవాడై మహావ్యాధిగల దరిద్రుడగును. ఆ తరువాత పరిశుద్ధు డగును అని సనందనుడనెను.

సనాతన ఉవాచ- సనాతనుడిట్లనెను –

బ్రాహ్మణుడు త్రి సంధ్యలలో సంధ్యావందనము చేయక, తర్పణలు చేయకుండా స్నానము చేయుచు, విష్ణుమూర్తికి నివేదించిన అన్నమును విసర్జించి, విష్ణుపూజను చేయక విష్ణమంత్రమును జపింపక, ఏకాదశీవ్రత విహీనుడై శివరాత్రి, శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి మొదలగు దినములలో భోజనము చేయుచు పితృకర్మలను వదలివేయుచు బ్రాహ్మణులకు నిర్దిష్టమైన ధర్మమును వదలివేయు వాడు కూడ కృతఘ్నుడే యగును.

ఆట్టి కృతఘ్నుడు కుంభీపాక నరకమున పదునలుగురు ఇంద్రులు గతించువరకు యమయాతనల ననుభవించును. తరువాత ఏడు జన్మలు చండాలుడై నూరుజన్మలు గద్దగాపుట్టి, నూరుజన్మలు పందిగా జన్మించి, తరువాత ఏడు జన్మలు వృషవాహకుడైన బ్రాహ్మణుడై, తరువాత ఏడు జన్మలు శవములను తగులబెట్టువాడై, తరువాత వృషలీపతియగు బ్రాహ్మణుడగును. ఇంకను అనుభవింపవలసిన పాపమేమైనా ఉన్నచో రౌరవ నరకమునకు వెళ్ళి అచ్చట నరకయాతనలననుభవించును. తరువాత పాపీగా పుట్టి తరువాత నరకయాతనలననుభవించును. తిరిగి పాపిగా పుట్టును. ఇట్లు నరకబాధలు పొంది ఐదేసి జన్మలు గాడిదగాను, పిల్లిగాను, కప్పగాను జన్మించి పాప ఫలితమునంతయు అనుభవించును. ఇట్లు పాప ఫలితమునంతయు అనుభవించిన తరువాత పరిశుద్ధుడగునని సనాతనుడు చెప్పెను.

సుయజ్ఞ ఉవాచ- సుయజ్ఞా డిట్లు పలికెను –

బ్రాహ్మణుడు శూద్రుల ఇంటిలో వంటచేసినచో, శవములను తగులబెట్టినచో, శూద్రుల అన్నమును తినినచో, శూద్రస్త్రీని అనుభవించినచో వృషవాహనుడైనచో అతని తప్పేమి కలదు. వీటిని చక్కగా నాకు వివరించి చెప్పుమని అడిగెను.

పరాశర ఉవాచ- పరాశర మహర్షి ఇట్లనెను –

బ్రాహ్మణుడు చదువుకొనక శూద్రుల ఇండ్లలో వంటలు చేసిపెట్టుచు జీవించుచున్నచో అసీపత్రమను నరకమున డెబ్భైయొక్క యుగములుండును. అటుపిమ్మట ఏడేడు జన్మలు గాడిదగాను, ఎలుకగాను, జిల్ల పురుగుగామ పుట్టును. అటుపిమ్మట అతడు పరిశుద్ధుడగును.

జరత్కారురువాచ- జరత్కారు మహర్షి ఇట్లనెను –

స్వయముగా కాని, భృత్యునితోకాని వృషభమువాహనముగా చేసికొని తిరుగు బ్రాహ్మణుడు కృతఘ్నుడని చెప్పబడుచున్నాడు. అతడు వాహనముగాచేసికొని తిరుగునపుడు వృషభమును కొట్టును కావున అతనికి బ్రహ్మహత్య చేసినంత పాపము కలుగును. వృషభములను ఎండలో దిప్పుచు వాటికి ఆకలి దప్పులగుచున్నను వాహనముగా తిప్పును కావున అతడు నూరు బ్రహ్మహత్యలు చేసిన పాపమును పొందును.

వృషభవాహనులగు బ్రాహ్మణులు తాగు నీరు మూత్రము వంటిది. అన్నము అశుద్దముతో సమానమగును. వారు పితృదేవతలను అర్చనసేయు అధికారమును కోల్పోవుదురు. వారు చంద్రసూర్యులున్నంతవరకు లాలాకుండమను నరకమున బాధలననుభవింతురు. అచ్చట అశుద్దమును తినుచు, మూత్రమును తాగుచుందురు. నరకమున అతనిని యమకింకరులు శూలములతో మూడుపూటలు బాధలు పెట్టుదురు. ముఖముపై పిడుగులు వేయుదురు, సూదులతో ముఖమును పొడుతురు.

ఇట్లు నరకయాతనలననుభవించిన తరువాత ఆ కృతఘ్నుడు అరవై వేల సంవత్సరములు మలముననుండు పురుగుగా జన్మించును. అటుపిమ్మట ఐదుజన్మలు కాకిగాను, ఒక జన్మ కొంగగాను, ఐదు జన్మలు గద్దగాను, ఏడుజన్మలు నక్కగాను పుట్టును. ఆ తరువాత దరిద్రుడై మహావ్యాధితో బాధపడును. అటుపిమ్మట అతడు పరిశుద్దుడు కాగలడు అని అనెను.

భారద్వాజ ఉవాచ- భారద్వాజ మహర్షి ఇట్లనెను –

శవములను తగులబెట్టు బ్రాహ్మణుడు కూడ కృతఘ్నుడని పిలువబడుచున్నాడు. నూరు సంవత్సరములవరకు అతడు బ్రహ్మహత్యాపాపమును పొందుచున్నాడు. ఈ నూరు సంవత్సరములు బ్రహ్మహత్యా పాపము చేసినవాడనుభవించు నరకయాతనలను ఇతడు కూడ అనుభవించును. అతనివలే ఇతడు కూడ అనేక జన్మలెత్తును.

అదేవిధముగ శూద్రుని ఇంటిలో శ్రాద్ధాన్నమును భుజించినచో శవదహనము చేసిన బ్రాహ్మణుడు పొందుపాప ఫలితముననుభవించును.

విభాండక ఉవాచ- విభాండక మహర్షి ఇట్లనెను –

శూద్రులు పెట్టు పితృశ్రాద్ధమున అన్నమును తిను బ్రాహ్మణుడు సురాపానము చేయువాడు. బ్రాహ్మణుని చంపువాడు పొందు పాపమును పొందును. అతడు పితృదేవతలను, ఇష్టదేవతలను అర్చనసేయు అర్హతను గోల్పోవును.

మార్కండేయ ఉవాచ- మార్కండేయుడిట్లనెను –

బ్రాహ్మణుడు శూద్రస్త్రీతో వ్యభిచరించినచో కలుగు పాపము వేదమున చెప్పబడినది. అతడు కృతఘ్నులందరిలో గొప్పవాడు. అతడు పదునలుగురీంద్రులు గతించువరకు కృమిదంష్ట్రమను నరకమున క్రిములతో బాధలందుచుండును. అచ్చట యమకింకరులు బాగుగా వేడిచేసిన లోహప్రతిమను ప్రతిదినము కౌగలించుకొనునట్లు చేయుదురు. ఆతరువాత అతడు జారస్త్రీయొక్క యోనిలో కృమిగా వేయి సంవత్సరములుండును. ఆ తరువాత శూద్ర జన్మనెత్తి పరిశుద్ధుడగును.

సుయజ్ఞ ఉవాచ- సుయజ్ఞమహారాజిట్లనెను –

ఇంకను నాకు ఇతర కృతఘ్నులు ఎటువంటి కర్మఫలమును పొందుదురో చెప్పుడు. నాకు బ్రహ్మశాపము కూడ వరముగా మారినది. ఆపదలు లేకుండ సంపదలెవ్వరికి లభింపవుగదా!

నేను ధన్యుడను, కృతకృత్యుడవైతిని నాజీవితము సఫలమైనది. ఎందుకనగా నా ఇంటికి ముక్తులైన మునులు దేవతలు విచ్చేయుట నా ఆదృష్టముననే జరిగినదని సుయజ్ఞడనెను.

శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతి ఖండమున నారదనారాయణుల సంవాదములోని గౌరీశంకరుల సంవాదమున తెల్పబడిన రాధోపాఖ్యానమున నున్న నృపమునీసంవాదమున చెప్పబడిన కర్మవిపాకమను యాభైఒకటవ అధ్యాయము సమాప్తము.