2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము
18 - శంకర శంఖచూడుల సంభాషణ
నారాయణ ఉవాచ - శ్రీమన్నారాయణుడిట్లు నారదునితో అనెను-
రాజగు శంఖచూడుడు శ్రీకృష్ణుని మనసులో ధ్యానించుకొని, బ్రాహ్మీముహూర్తమున పుష్పశయ్యనుండి లేచి, రాత్రి ధరించిన ప్రములమ వదిలివేసి, మంగళస్నానమును చేసి, ఉతికిన వస్త్రములు ధరించి, ముఖమున తిలకమును పెట్టుకొనెను. ఆతరువాత. ఆహ్నిక కృత్యములన్నియు తీర్చుకొని పెరుగు, నేయి తేనె మొదలగు మంగళవస్తు దర్శనము చేసెను. అటుపిమ్మట ప్రతిదినము చేయునట్లుగానే " మణిని, రత్నమును, వస్త్రమును బ్రాహ్మణులకు దానముచేసి యాత్రయందు మంగళము జరుగునట్లు రత్నమాణిక్యములను గురువువకు దానము చేసెను. అట్లే మంచి ఏనుగును, గుజమును, ఆవును దరిద్రుడైన బ్రాహ్మణునకు దానము చేసెను. ఆ తరువాత పుత్రుడగు నుచంద్రునకు రాజ్యభిషేకము చేసి అతనికి తన భార్యయగు తులసిని రాజ్యమును, అనుచరులను, కోశమును అప్పగించి యుద్ధమునకు బయలుదేరిను. అతని వెంట మూడులక్షల గుజములు, ఐదులక్షల ఏమగులు, పదివేల రథములు మూడుకోట్ల ధమర్ధరులు మూడుకోట్ల ఖడ్గధారులు, మూడుకోట్ల శూలాయుధ ధరులు బయలుదేరిరి.
యుద్ధశాస్త్ర విశారదుడు రథికులలో శ్రేష్టుడైన సేనాధిపతిని మహారథుడందురు. శంఖచూడుడు మూడులక్షల అక్షౌహిణుల సేవకు సేవాధిపతీని నియమీంచీ ముపై అక్షోహిణుల పేన వాద్యములో శిబిరమునుండి యుద్ధమునకై బయలుదేరెను. అతని ముందు గురువుల సమూహముండెను. శంఖచూడుడు పరమేశ్వరుడు నివసించియున్న పుష్పభద్రానదీతీరమందలి అక్షయ వట ప్రాంతమునకు బయలుదేరెను. ఆ ప్రాంతము సిద్దులకు సిద్దిక్షేత్రము. పిద్దామమను పేర ప్రసిద్ధిగాంచినది. ఆ పుణ్యక్షేత్రమున కపిలమహర్షి తపమాచరించెను. ఆ క్షేత్రము పశ్చిమ సముద్రమునకు తూర్పు, మలయ పర్వతమువకు పడమరదిశలో, శ్రీశైలమునకు ఉత్తర దిశలో గంధమాదన పర్వతమునకు దక్షిణమున నున్నది. పుష్పభద్రానది ఐదు యోజనములు విస్తరించి ఐదువందల యోజనముల పొడవై యున్నది. ఆ నదిలో ఎల్లప్పుడు నీరు నిండుగానుండును. ఆ వది వీత్యము సముద్రునితో సంగమించుటవలన సముద్రునకు ప్రియమైన భార్య యగుచున్నది శరావతీనది, గోమతీనదులలో కలిపి పశ్చిమ సముద్రమున ఆ నది కలియుచున్నది అని నారాయణుడు నారదునీతోననెను.
శంఖచూడుడు రత్నవిమానమున వెళ్ళి పుష్పభద్రానదీ తీరమున వటవృక్షము కిందనున్న పరమశివుని చూచెను. అతడు సూర్యకోటి సమప్రభుడు. యోగాసనమున చిన్ముద్రలో నున్నవాడు. ఆ పరమశివుడు త్రిశూలమును, పట్టిశమము, పులి తోలుమ ధరించినవాడు. బంగారు మేనిపోడు. జటాజూటదారీ త్రినేత్రుడు మృత్యుంజయుడు, జ్ఞానదాత.
శంఖచూడుడు తన ఏమానమునుండి దిగి పరమేశ్వరునకు భక్తితో నమస్కరించెను. అట్లే శంకరుని ఎడమప్రక్కనున్న భద్రకాళికి ముందున్న కుమారస్వామికి భక్తితో, నమస్కరించెను. శంఖచూడుని నమస్కారములనందుకొన్న కాళి. స్కందుడు శంకరుడు అతనికి ఆశీస్సులనొసగిరి.
పరమేశ్వరుని దగ్గరనున్న గణమంతయు శంఖచూడుని చూడగనే నిలబడిరి. ఆ తర్వాత వారు పరస్పరము పంభాషణములు గావించుకొనిరి. సంభాషణానంతరము తన సమీపమున కూర్చున్న శంఖచూడునితో పరమేశ్వరుడిట్లు మాట్లాడెను.
శ్రీమహాదేవ ఉవాచ- మహాదేవుడిట్లు శంఖచూడునితో అనెను-
ఓ శంఖచూడుడా! లోకములను సృష్టించు బ్రహ్మదేవుడు అందరికి తండ్రివంటివాడు. అతని పుత్రుడు పరమ వైష్ణవుడైన మరీచి మహర్షి, ఆతని పుత్రుడు ధర్మిషుడైన కశ్యప ప్రజాపతి. దక్షప్రజాపతి కశ్యపునకు తన కుమార్తెలు పదముప్వురసు భక్తిలో ఇచ్చెను. ఆ దక్షప్రజాపతి పుత్రికలలో దనువు ఒక కూతురు. దనువునకు మంచీతేజస్సంపన్నులైన నలుబదిమంది పుత్రులు కలిగిరి. వారిలో మహాబలవంతుడగు విప్రచిత్తి ఒకడు. ఆతని పుత్రుడు పరమ ధార్మికుడు విష్ణుభక్తుడునైన దంభుడు. ఆతడు శుక్రాచార్యుని గురువుగా చేసికొని పుష్కరక్షేత్రమున శ్రీకృష్ణమంత్రమును లక్షసంవత్సరములు జపము చేసెను. అందువలన గొప్ప కృష్ణభక్తుడవగు నిన్ను పుత్రునిగా పొందెను.
నీవు పూర్వము శ్రీకృష్ణుని అనుచరులైన ఎనమండుగురు గోపకులలో ఒకడవు. రాధికాదేవి శాపమువలన దానవేశ్వరుడవై భారత భూమిపై నున్నావు.
విష్ణుభక్తుడు బ్రహ్మమొదలు స్తంబమువరకు అన్నియు ఆసత్యములని తలచును. అట్లే చతుర్విధమోక్షములను కూడ ఇష్టపడడు. బ్రహ్మత్వమైనను దేవత్వమైనను అతని దృష్టిలో తుచ్ఛమైనవి. ఇంద్రపదవిని. కుబేరత్వమును అసలే ఇష్టపడడు. అతనికి హరిసేవనమే శ్రేష్టమైనది.
కావున కృష్ణభక్తుడవగు నీకు దేవతల విషయము భ్రమరూపమైనది. అందువలన దేవతల రాజ్యమును వారికిచ్చివేసి సుఖముగా నీరాజ్యమున నుండుము. దేవతలు తమ రాజ్యమును తాము పాలించుకొందురు. మీరందరు కశ్యప ప్రజాపతి పుత్రులు. భాతృవిరోధము ఎవ్వరికిని కూడదు. బ్రహ్మహత్యాది పాపములు భాతృద్రోహపాతకమునకు పదునారవ వంతైన కాజాలపు, నీ సంపద కొంత నశించునని నీవు భావించినచో సమత యనునది ఎక్కడను సంభవించదు.
బ్రహ్మదేవుడు కూడ ప్రాకృతికలయ సమయమున నశించును. తరువాత భగవంతుని ఇచ్ఛవలన పునర్జన్మనెత్తుచున్నాడు. ఆతడు తపస్సుచేసి జ్ఞానమును సంపాదించుకొని క్రమముగా సృష్టిని చేయుచున్నాడు.
కృతయుగమున ధర్మము పరిపూర్ణముగానుండెను. త్రేతాయుగమున మూడు భాగములుండినది. ద్వాపరమున రెండు భాగములు మాత్రమే ధర్మముండినది. కలియుగమున తొలుత ఒక భాగముండి క్రమక్రమముగా క్షీణించుచుప్నది. కలియుగము యొక్క, చివరి భాగమున అమావాస్యనాడు చంద్రకళ యున్నట్లు ధర్మముండును.
సూర్యుని ప్రకాశము గ్రీష్మ ఋతువున ఉన్నట్లు శిశిరఋతువున ఉండదు. మధ్యాహ్నమున నున్నట్లు ఉదయమున సాయంకాలమున ఉండదు. మేఘములు కప్పినప్పుడు పగటిపూటనైనను సూర్యప్రకాశము ప్రచ్ఛన్నముగా నుండును. చంద్రుడు పున్నమవాడు ఎంత ప్రకాశించుచుండునో మీగిలిన దినములలో అంతగా ప్రకాశించడు. పూర్లిన తరువాత క్రమక్రమముగా క్షీణించి అమావాస్య తరువాత వృద్ధిపొందును. మేఘములు కప్పినప్పుడు రాహువు గ్రహించినపుడు అతనీ కొంత క్షీణించును.
బలి చక్రవర్తి ఇప్పుడు తన సంపదలన్నియు కోల్పోయి పాఖాళముననున్నాడు. భూమి ఒకప్పుడు సస్యశ్యామలమై కనీపించును. మరియొకప్పుడు నీటిలో మునిగిపోవును. ఈచరాచర సృష్టియంతయు పుట్టుచున్నది, నశించుచున్నది. ఆందువలన, సమతయనువది ఎచ్చటను లేదు.
నేను మృత్యుంజయుడను, ఆందువలననే అసంఖ్యాకమైన ప్రాకృతలయములు చూడగలుగుచున్నాను. పరమాత్మయే. ప్రకృతరూపుడు. అతడు సర్వజీవాత్మ, అనేక రూపములను ధరించువాడు, ఎవరు ఆ పరమాత్మ నామగుణ సంకీర్తనము ఎల్లప్పుడు చేయుచుందురో వారు కాలమును మృత్యువును జన్మ, రోగ, జరాభయమును జయింతురు. ఆ పరమాత్మయే. బ్రహ్మదేవుని సృష్టికొరకు. లోకరక్షణకై విష్ణువును, లోకసంహారమునకై నన్ను సృష్టించెను. నేను రుద్రులలో ఒకడైన కాలాన్ని రుద్రుని సంహార కార్యమున నియోగించీ ఆ పరమాత్మయొక్క నామగుణ సంకీర్తనమునెల్లప్పుడు చేయుచుందును. అందువలననే చేను మృత్యుంజయుడనైతిని. గరుత్మంతుని చూచిన సర్పము వలె నన్ను చూడగనే మృత్యువు పరుగెత్తుకొని పోపును అని శంకరుడు శంఖచూడునితో అనెను.
శంకరుడు ఈ విధముగా సభలో శంఖచూడునితో అనిన పిమ్మట అతడు మిక్కిలి వినయముతో పరమశివునితో ఇట్లనెను.
శంఖచూడ ఉవాచ - శంఖచూడుడిట్లు పలికెను-
పరమశివా! మీరు చెప్పినదంతయు సత్యమే. నేను కాదనజలను. ఐనను నా నివేదనమును కొంతమీరు కూడ వినవలెను.
జాతి ద్రోహమువల్ల గొప్ప పాపము సంభవించునని మీరు మాటిమాటికి ఆంటిరి. కాని బలిచక్రవర్తి సర్వస్వమును అపహరించి అతనిని ఎక్కడికి పంపిస్తారు. ఈ ఐశ్వర్యమంతయు నా పరాక్రమముచే సంపాదింపబడినది. దానిని కాదని ఎవ్వరందురు. హిరణ్యాక్షుని అతని తమ్ములతో సహా దేవతలేవిధముగా హింసించినది అందరకు తెలియును. శుంభనిశుంభాదీ రాక్షసులను దేవతలెట్లు చంపిలో ఆందరకు తెలియును, ఇంకను సముద్ర మథన సమయమున మేము కష్టపడగా దేవతలు అమృత రూపఫలితమును పొందినారు.
ఈప్రపంచమంతయు పరమేశ్వరునికి క్రీడా భాండమువంటిది. అతడు ఎవరికి ఎంత ఇచ్చిన అది వారికి ఆంతే చెందును. దేవదానవ యుద్ధము ఎల్లప్పుడు ఏదో ఒక నిమిత్తమున జరుగుచున్నదే. వారికి పరాజయము జయము సంభవించినవి. అట్లే మాకును జయపరాజయములు లభించినవి.
అందువలన పరనూత్మకు సమబంధువులమైన మన మధ్య జోక్యము నిష్పలమగును. ఈమాటలతోటి తగపును చూచిన నాకు చాలా సిగ్గువేయుచున్నది. ఇది యుద్ధమున జరిగినచో గొప్ప కీర్తి కలుగును. లేక ఆందు ఏరోబియమే లభించిన కీర్తి హాని సంభవించును అను శంఖచూడుని మాటలు విని త్రిలోచనుడు నవ్వి మహాభయంకరుడైన దానవేశ్వరునితో ఇట్లు పలికెను.
శ్రీమహాదేవ ఉవాచ- శ్రీ మహాదేవుడిట్లనెను –
ఓ శంఖచూడుడా! బ్రహ్మదేవుని వంశములో పుట్టిన మీతో యుద్దము చేసినచో సిగ్గుపడుటెందులకు? పరాజయము వలన చెడు పేరు వచ్చునని భయమెందులకు? మీతో తొలుత శ్రీహరియే యుద్ధమునాచరించినాడు. మధుకైటభులతో హరీణ్యకశిప, హిరణ్యాక్షులతో శ్రీహరియే యుద్ధమొనర్చినాడు.
నేను త్రిపురాసురులతో యుద్ధము చేసితిని. సర్వమాతయగు దుర్గాదేవి శుంభనిశుంభులతో పరమాద్భుతముగా యుద్దమొనరించినది.
నీవు శ్రీకృష్ణదేవుని అనుచరుడవు. ఇంతవరకు చనిపోయిన రాక్షసులందరు నీకంటే తక్కువ వారే. అందువలన నీతో యుద్దము చేసినచో నేను సిగ్గుపడవలసిన పని ఏమాత్రము లేదు, ఐనను వ్యర్థమైన మాటలు కట్టి పెట్టి నాతో యుద్ధము మాత్రమే చేయవద్దనీ నిశ్చయముగా నేను చెప్పుచున్నాను.
శంకరుని మాటలు విని లాభము లేదనుకొని శంఖచూడుడు తన అమాత్యులతో కలసి . అచ్చటినుండి లేచెను.
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణములోని రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణ సంవాదములో చెప్పబడిన తులస్యుపాఖ్యానములో శివ శంఖచూడుల సంవాదమను పదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.
