2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము
38 - సముద్ర మథన వృత్తాంతము
నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-
ఓ నారదా! దేవేంద్రుడు శ్రీమహావిష్ణువును మనస్సులో ధ్యానించుకొని బృహస్పతి, మిగిలిన దేవతాగణము వెంటరాగా బ్రహ్మలోకమునకు పోయెను. అచ్చట బృహస్పతి మహేంద్రుడు మొదలగు దేవతలు బ్రహ్మదేవునకు నమస్కరించిరి. బృహస్పతి బ్రహ్మదేవునకు దేవేంద్రుని వృత్తాంతమునంతయు వివరించగా బ్రహ్మదేవుడు నవ్వి ఇట్లనెను.
బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లనెను-
ఓ దేవేంద్రా! నీవు నా వంశములో పుట్టితివి. నాకు నీవు మునిమనుమడవు. నీ గురువు బృహస్పతి. నీవు దేవతలకు ఆధీపతివి. నీ మాతామహుడు దక్షప్రజాపతి. ఆతడు పరాక్రమవంతుడేకాక గొప్ప విష్ణుభక్తుడు. ఈవిధముగా తండ్రివంకవారు, తల్లివంకవారు, గురువు ఈ ముగ్గురు పవిత్రులైనచో అహంకారమునకు లావు ఉండదు.
పతివ్రతయగు తల్లి, జితేంద్రియుడైన తండ్రి, సాత్విక స్వభావము కల మాతామహుడు, మేనమామ కలవాడు అహంకారి కాబోలడు. సాధారణముగా మానవుడు తండ్రి వంకనున్నవారి దోషమున, తల్లివంకనున్న వారి దోషమున గురువుయొక్క దోషమువలన శ్రీహరిని ద్వేషించును. సర్వాంతర్యామియగు పరమాత్మ సమస్త దేహములందుండును ఎవరి దేహమును ఆ పరమాత్మవదలి వేయునో అతడప్పుడే శవమగును.
ఇంద్రియములకు ఈశ్వరుడనగు నేను జీవునకు మనోరూపమున ఉందును. శంకరుడు జ్ఞానరూపుడుగానుండును. శ్రీహరి ప్రాణరూపముననుండును. భగవతియగు రాధాదేవి బుద్దీరూపముననుండును. ప్రకృతియొక్క ఆంశస్వరూపమైన శక్తులన్నీ నీద్రాద్రూపముననుందురు. పరమాత్మకు ప్రతిబింబమైన జీవుడు శరీరమును ధరించి కర్మఫలములననుభవించుచుండును. - ఆత్మకు ఈశ్వరుడైన పరమాత్మ దేహమునుండి బయటకు వచ్చినచో మహారాజువేంట పోవు ఆతని అనుచరులవలె
మనోబుధ్యహంకారాదులన్నియు ఆ పరమాత్మవెంటపోవును.
నేను, పరమశివుడు, ఆదిశేషుడు, విష్ణువు, ధర్ముడు, మహావిరాట్ ఈ మేమందరము శ్రీకృష్ణుని యొక్క ఆంశస్వరూపులము. అతని భక్తులము కూడ. అట్టి పరమాత్మకు సమర్పించిన పుష్పమును నీవు తిరస్కరించితివి. పరమశివుడు ఏ పుష్పముచే శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మములను పూజించేనో ఆ పరమ పవిత్రమగు పుష్పమును దుర్వాసమహాముని నీకు ఇచ్చెను. కాని నీవు దురదృష్టము వలన దానిని గౌరవింపలేదు. శ్రీకృష్ణుని పాదపద్మములనుండి జారిపడిన పుష్పమునెవరు శిరస్సుపై ధరింతురో ఆతనిని సమస్త దేవతలు తొలుత పూజింతురు.
. దురదృష్టము నిన్ను మోసగించింది. అన్నిటికంటే అదృష్టము చాలా బలమైనదీ, అదృష్టములేని వానిని ఎవ్వరు కూడ రక్షింపలేరు. అందరిచే నమస్కరింపబడుచున్నవాడు, శ్రీనాథుడగు శ్రీకృష్ణుని ఎవరు గౌరవింపరో అతని దగ్గర మహాలక్ష్మి అసలే యుండదు. నీవు నూరు అశ్వమేధయాగములుచేసి సంపాదించుకొన్న లక్ష్మి శ్రీకృష్ణనిర్మాల్యమును పరిహరించుటవలన కోపముతో నిన్ను వదలిపోయినది.
అందువలన నీవు వెంటనే వైకుంఠమునకు పొమ్ము. నీవెంట నేను, దేవతల గురువైన బృహస్పతి కూడ వచ్చును. నీవా శ్రీకృష్ణపరమాత్మను ప్రసన్నముచేసికొని అతని అనుగ్రహమువలన మరల వీ స్వర్గలక్ష్మిని పొందెదవు.
బ్రహ్మదేవుడిట్లు మహేంద్రునితో పలికి దేవేంద్రుడు దేవతలందరు వెంటరాగా శ్రీనాథుడున్న వైకుంఠమునకు పోయెను.
దేవతలందరు వైకుంఠమునకు పోయి అచ్చట సనాతనుడు, భగవంతుడు, పరబ్రహ్మస్వరూపుడు, తేజ: స్వరూపుడు గ్రీష్మకాల మధ్యాహ్న సమయమున ప్రజ్వలించుచున్న కోటి సూర్యులవంటికాంతి కలవాడు, పరమశాంతుడు, ఆదిమధ్యాంత రహితుడు, శ్రీనాథుడు అనంతుడగు నారాయణుని దేవతలు చూచిరి. అతనియొద్ద నాలు భుజములు కల ఆతని అనుచరవర్గము సరస్వతి, నాల్గువేదములు, గంగాదేవి ఉండిరి.
అప్పుడు బ్రహ్మదేవుడు, భార్యలతో సేవితుడైన శ్రీమన్నారాయణుని భక్తిచే తలలు వంచుకొని నమస్కరించిరి.
అప్పుడు బ్రహ్మదేవుడు చేతులు కట్టుకొని ఇంద్రుని వృత్తాంతమంతయు శ్రీమన్నారాయణునకు నివేదింపగా తమ ఆధికారమును కోల్పోయిన దేవతలందరు అతని పాదములపైబడి ఏడ్వసాగిరి.
శ్రీమన్నారాయణుడు ఆపదలలో మునిగి భయములో నున్నవారు, వస్త్రములు, ఆభరణములు లేనివారు, వాహనములు మొదలైనవి లేనివారు. సంపద తొలగిపోగా ముఖమున కాంతి లేనివారు పరివారము సహితము లేనివారగు దేవతాగణమును చూచి ఆపదలలోనున్నవారి భయమును పోగొట్టువాడై వారితోనిట్లనెను.
నారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను-
ఓ బ్రహ్మదేవుడా! దేవతలారా! నేనుండగా మీరు భయపడవద్దు, నేను మీకు పరమైశ్వర్యములనిచ్చు సుస్థిర లక్ష్మిని ఇచ్చెదను. ఐనను హితమైన నామాటను కొద్దిగా వినుడు.
ఈ ప్రపంచములలో నున్న జనులందరు ఎల్లప్పుడు నాకు ఆధీనులై ఉందురు. అట్లే నేను స్వతంత్రుడనైనను, నా భక్తపరతంత్రుడనై ఉందును. నన్ను ఎల్లప్పుడు సేవించు నా భక్తుని కోపించువాని ఇంటిలో లక్ష్మీదేవితో సహా నేనెల్లప్పుడు నివసించను.
దుర్వాసమహర్షి శంకరుని ఆంశవలన పుట్టినవాడు. పరమ వైష్ణవుడు. ఆతని శాపము వలననే నేను లక్ష్మీదేవితో కలసి మీ ఇండ్లనుండి బయటకు వచ్చితిని.
పూజావేళయందు శంఖద్వని లేనిచోట, తులసీ, సాలగ్రామశిలార్చన చేయనిచోట, బ్రాహ్మణులకు భోజనము దొరకనిచోట లక్ష్మీదేవి విలువదు. అట్లే నా భక్తులను నిందించుచోట, లక్ష్మీదేవి తనకవమానము జరిగినట్లు భావించి కోపముతో ఆ ఇంటినుండి వెళ్ళిపోవును. సాయందు భక్తిలేని మూరుడు ఏకాదళీ లీథినాడు శ్రీకృష్ణాష్టమీ దినమున భోజనము చేయును. కొందరు నా పేరు చెప్పుకొని ధవమార్జింతురు. మరికొందరు తమ కస్యలను విక్రయింతురు. కొందరు ఆతిథి అభ్యాగతులకు భోజనము పెట్టారు. కొందరు పాపులను ఆశ్రయింతురు. కొందరు బ్రాహ్మణులు శూద్రుడు పెట్టిన శ్రాద్దాన్నమును అందురు. కొందరు బీదబ్రాహ్మణులు శవములు కాల్చుచుందురు. వంటలు వండుచు బ్రతుకుచుందురు. కొంరు బ్రాహ్మణులు ఎద్దులపై కూర్చుండి పోవుచుందురు. యవనులను కొందరు బ్రాహ్మణులు సేవింతురు. దేవాలయమున అర్చనచేసి బ్రతుకుదురు. అట్లే మరికొందరు బ్రాహ్మణులు శూద్రులచే యాగములు చేయింతురు. ఇటువంటివారి ఇండ్లలో లక్ష్మీదేవి ఉండదు.
విశ్వాసఘాతి, మిత్రులను వంచనచేయు బ్రాహ్మణుడు, మానవులను చంపువాడు, కృతఘ్నుడు, అగమ్యాగమనము చేయు బ్రాహ్మణుల ఇంట లక్ష్మీదేవి ఉండదు. ఆట్లే అపవిత్రమైన హృదయముకలవాడు, క్రూరుడు, హింసించువాడు, పరులను నిందించు బ్రాహ్మణుల ఇంట, బ్రాహ్మణస్త్రీకి జన్మించిన శూద్రుని ఇంటిలో, బారస్త్రీకి పుట్టినవాడు, మహాపాపములు చేయువాని పుత్రుడు భర్త మరియు, సంతానము లేని స్త్రీ పెట్టిన అన్నము భుజించు బ్రాహ్మణుల ఇంటిలో లక్ష్మీదేవి ఉండదు.
ఆనవసరముగా గోళ్ళతో గడ్డిని గిల్లువాడు, అట్లే గోళ్ళతో భూమిపై వ్రాయుచుండువాడు, కుటీలుడు, మలినమైన బట్టలు ధరించువాడు సూర్యోదయమువరకు రెండు పర్యాయములు భుజించువాడు, పగటి పూజ నిద్రపోపు వాడు, పగటిపూట మైథునము చేయు బ్రాహ్మణుల ఇండ్లలో లక్ష్మీదేవి నివసించదు. సదాచారము లేనివాడు, శూద్రుడు చేసిన దానము స్వీకరించువాడు, యాగదీక్షితుడు కావి బ్రాహ్మణుల ఇంట లక్ష్మీదేవి ఉండదు.
తడియారని కాళ్ళతో, లేక నగ్నముగా పడుకొనువాడు ఎల్లప్పుడు ధర్మమును గురించి విపరీతముగా మాట్లాడుచు తాను మాత్రము ధర్మమనుష్ఠింపనివాడు, నూనె అంటుకొని శిరస్నానము చేసిన తరువాత మర్మాంగమును స్పంచువాడు, వ్రతములు ఉపవాసములు చేయనివాడు, సంధ్యావందన మాచరింపనివాడు, విష్ణుభక్తి లేనివాడు, బ్రాహ్మణులను నిందించువాడు, వారిని ద్వేషించువాడు, దయాహీనుడు, ఇటువంటివారి ఇండ్లలో లక్ష్మీదేవి నివసించదు.
శ్రీహరి పూజ, శ్రీహరి గుణకీర్తనము జరుగుచోట, శంఖముల ద్వనీ, శంఖము, సాలగ్రామ శీల, తులసి, తులసీ సేవ, నమస్కారములు జరుగు ప్రదేశమున, శివలింగార్చన, పరమశివుని గుణకీర్తన జరుగుస్థలమున, సమస్త దేవతార్చన జరుగు ప్రదేశమున లక్ష్మీదేవి ఎల్లప్పుడు నివసించును.
శ్రీమహావిష్ణువు దేవతలతోనిట్లు పలికి, లక్ష్మీదేవితో నీవు నీయొక్క అంశస్వరూపమున పాలసముద్రమున జన్మించుమని చెప్పెను. అట్లే బ్రహ్మదేవునితో మీరందరు పాలసముద్రమును చీలికి ఆ పాలకడలినుండి పుట్టిన లక్ష్మిని దేవతలకు ఇమ్మని చెప్పెను.
శ్రీహరియొక్క ఆజ్ఞననుసరించి దేవతలందరు క్షీరసాగరమునకు వెళ్ళిరి.
క్షీరసాగరమున మందరపర్వతముమ కవ్వముగా, ఆది కూర్మమును పాత్రగా, వాసుకిని చిలుకుటకు ఉపయోగించు తాడుగా చేసికొని ఆ సముద్రమును మథించిరి. అప్పుడు బిపక్వరుడైన ధన్వంతరి, ఆమృతకలశము, ఉచ్ఛై: శ్రీవమను ఆశ్వరాజము, కౌస్తుభాది నావారత్నములు, ఐరావతమను ఏమగు, లక్ష్మీదేవి ఆవిర్భవించిరి..
లక్ష్మీదేవి క్షీరసాగరమున పవళించియున్నవాడు, సుందరుడు, సర్వేశ్వరుడు అగు విష్ణుమూర్తి మెడలో వైష్ణవియగు లక్ష్మీదేవి వన(ర?) మాలను వేసింది. ఆమెను బ్రహ్మ, శంకరుడు మొదలగు దేవతలు పూజింపగా ఆ లక్ష్మీదేవి దేవతలపై దుర్వాసమహర్షి శాపమును పోగొట్టు దయాదృష్టిని ప్రసరింపచేపినది.
ఆ మహాలక్ష్మీదేవియొక్క అనుగ్రహమువలన, ఆమె ఇచ్చిన వరమువలన దైత్యులాక్రమించుకొనిన దేవలోకమును దేవతలు తిరిగి పొందిరి.
నారదా! ఉత్తమమైన లక్ష్మి ఉపాభ్యాసమును నీకు నేను వివరించితిని. ఇంకను వినదలచినదేదైనా ఉన్నచో ఆడుగుము.
శ్రీ బ్రహ్మవైవర్తమను మహాపురాణమున రెండవదైన ప్రకృతిఖండమున నరనారాయణుల సంవాదమున తెల్పబడిన లక్ష్మీ ఉపాఖ్యానములో సముద్రమథనమను ముప్పై ఎనిమిదవ అధ్యాయము సమాప్తము
