2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

Table of Contents

50 - సుయజ్ఞోపాఖ్యానము

పార్వత్యువాచ- పార్వతీదేవి శంకరునితో నిట్లనినది-

మహాదేవా! సుయజ్ఞుడను రాబెవ్వరు? అతడే వంశమున పుట్టెను? అతనికి బ్రాహ్మణశాపమెందులకు తగిలినది? పరమాత్మయగు శ్రీకృష్ణుని ధర్మపత్ని, శ్రీకృష్ణునిచే పూజలనందుకొనిన రాధాదేవిని మానవమాత్రుడగు సుయజ్ఞుడెట్లు పూజించెను.

శ్రీరాధాదేవియొక్క పాదపద్మములను దర్శింపవలెనని బ్రహ్మదేవుడు ఆరవై వేల సంవత్సరములు పుష్కరక్షేత్రమున ఆమెనుగురించి తపస్సుచేసినను ఆ దేవిని దర్శించుకొనలేకపోయెనుగదా. అట్లే వైష్ణవులలో పరమశ్రేష్ఠులగు మీకు కూడ దర్శనమివ్వని ఆదేవి మానవులకెట్లు దర్శనమొసగినది. ముల్లోకములను సృష్టించు బ్రహ్మదేవుడు ఆ సుయజ్ఞునకు కవచమును, ధ్యానమును, స్తోత్రమును, పూజావిధిని, ఎట్లిచ్చెనో ఈవిషయములనన్నీటిని సవివరముగా నాకు తెలుపుడు.

 శ్రీ మహాదేవ ఉవాచ- శ్రీమహాదేవుడు పార్వతితో ఇట్లు పలికెను-

ఓ పార్వతీ! స్వాయంభువుడను మనువు మనువులందరిలో మొదటివాడు. ఆతడు బ్రహ్మదేవుని పుత్రుడు. అతని భార్యపేరు శతరూప. ఆ స్వాయంభువ మనువుయొక్క పుత్రుడు ఉత్తానపాదుడు. అతని పుత్రుడు ధ్రువుడు. ధ్రువుని పుత్రుడు కీర్తియనువాడు. ఆతని పుత్రుడు ఉత్కళుడు, అతడు గొప్ప నారాయణభక్తుడు. అతడు పుష్కరక్షేత్రమున వేయి రాజసూయయాగములు చేసెను. ఆ యాగమున బ్రాహ్మణులకు రత్నపాత్రలను, అమూల్యరత్న రాసులను దానముచేసెను. ఆ ఉత్కళమహారాజు చేసిన యజ్ఞము చాలా గొప్పగానుండెను.

 ఉత్కళ మహారాజు గొప్పయజ్ఞమును చేసినందువలన బ్రహ్మదేవుడతనికి దేవతలందరి సన్నిధిలో సుయజ్ఞాడను పేరును (బిరుదును) పెట్టెను. ఆవిధముగా సుయజ్ఞుడను పేరును ధరించి రత్నములను, సమస్తసంపదలను రత్నములచే అలంకరింపబడిన కొమ్ములు గల పదిలక్షల గోవులను దక్షిణలతో బ్రాహ్మణులకు దానముచేసెను. ఇంకను పన్నెండు లక్షల గోవులను సంతోషముతో బ్రాహ్మణులకు ఇచ్చేను. "అట్లే ఆరుకోట్ల బ్రాహ్మణులకు భక్ష్యభోజ్య పరమాన్నములతో భోజనము పెట్టెను. ఆదేవిధముగా లక్ష బ్రాహ్మణులకు చక్కగా భోజనమును పెట్టెను.

సంతృప్తిగా భోజనము చేసిన ఆ బ్రాహ్మణులు మనువంశమున పుట్టిన ఆ మహారాజును పొగడక ఆతని పితృదేవతలను కొనియాడిరి. సుయజ్ఞమహారాజయజ్ఞముయొక్క చివరిదినమున ముప్పైఆరు లక్షల కోట్ల బ్రాహ్మణులు తృప్తిగా భోజనము చేసిరి. బ్రాహ్మణభోజనము తరువాత వారికి దానమిచ్చిన రత్నరాశులను వారు తమ ఇంటికి తీసికొని పోలేక కొంత ధనమును ఇతరులకిచ్చి, మిగిలిపోయిన ధనరాశిని మోయలేక తోవలోనే వదిలి పెట్టిపోయిరి..

మహారాజు, బ్రాహ్మణ భోజనము తరువాత ఇతరులకందరికి భోజనము పెట్టెను. ఐనను అన్నరాశులు అచ్చట చాలా మిగిలిపోయెను.

సుయజ్ఞమహారాజు యజ్ఞమును పూర్తిచేసి తన భవనమున నున్న రత్నసింహాసనమున కూర్చొనేను. ఆ సింహాసనమున రత్న నిర్మితములైన అనేక ఛత్రములున్నవి. అందమైన రంగురంగుల వస్త్రములచే అదీ ఆలంకరింపబడియున్నది. చందనము మొదలగు సుగంధద్రవ్యములతో సువాసితమైనది. పూర్ణకలశములు, చందన వృక్షపల్లవములు, ఆరటి చెట్లచే ఆలంకరింపబడినది. అచ్చట వస్తువులు, వాసవుడు, చంద్రుడు, రుద్రులు, ఆదిత్యులు మునులు మొదలగు దేవతలుండిరి.

సుయజ్ఞాడు సింహాసనమున కూర్చుండి విశ్రాంతి తీసుకొనుచున్న సమయమువ మాసిన బట్టలతో తడి ఆరిపోవుచున్న కంఠముతో నున్న ఒక బ్రాహ్మణుడచ్చటికి వచ్చెను. వెంటనే అతడు రత్నసింహాసనమున మాటలు ధరించీ చందనమునద్దుకొని కూర్చొనియున్న సుయజ్ఞాని ఆశీర్వదించెను. రోజా చిరునవ్వుతో చేతులు జోడించుకొని ఆ బ్రాహ్మణునకు నమస్కరించెను. కాని సింహాసనమున ఏమాత్రము లేచి నిలబడలేదు. అట్లే అచ్చటనున్న సభాసదులందరు ఏమాత్రము ఆసనములనుండి లేచి నిలబడలేదు. పైగా చిన్నగా నవ్విరి.

ఆ బ్రాహ్మణుడు అచ్చటనున్న మునులకు దేవతలకు నమస్కరించి కోపముతో రాజును ఇట్లు శపించెను. “ఓ సుయజ్ఞా! నీవు రాజ్యమదమున నన్ను అవమానపరచినందువలన వెంటనే రాజ్యమును కోల్పోయెదపు. ఆట్లే నీవు త్వరలో కుష్టురోగమువలన బాధచెందెదవు, బుద్దిని కోల్పోయి, ఉపద్రవములతో కష్టపడెదవు అనీ సుయజ్ఞుని శపించి కోపముతో ఊగిపోవుచు అచ్చటనున్న సభాసదులను శపింపబోయెను.

ఆంతకుముందు ఆ బ్రాహ్మణుని చూచి నవ్విన సభాసదులందరు వెంటనే లేచి అతనికి నమస్కరించిరి. అందువలన ఆ బాపడు కోపమును ఉపసంహరించుకొనెను.

సుయజ్ఞమహారాజు బ్రాహ్మణుని సమీపమునకు వచ్చి అతనిని నమస్కరించి భయముతో బాధపడుచు, ఏడ్చుచు సభలోనుండి బయలుదేరెను.

గొప్పని బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచున్న గూడరూపియైన ఆ బ్రాహ్మణుడు కూడ సభనుండి బయలుదేరెను. అప్పుడు అచ్చటనున్న పులహుడు, పులస్త్యుడు, ప్రచేతసుడు, భృగుమహర్షి, ఆంగీరసుడు, మరీచి, కశ్యపుడు, వసిష్ఠమహర్షి క్రతువు. శుక్రుడు, బృహస్పతి, దుర్వాసుడు, లోమశుడు, గౌతముడు కణాదుడు, కణ్వుడు, కాత్యాయనుడు, కథుడు, పాణిని, జాజులి, ఋష్యశృంగుడు, విభాండకుడు, తైత్తిరి, ఇదిశలి, మార్కండేయుడు, మహాతపుడు, సనకుడు, సనందుడు, వోడుమహర్షి పైలుడు, సనాతనుడు, పవచ్కుమారుడు. నరనారాయణులు, పరాశరుడు. జరత్కారువు, సంవర్తుడు. కరభుడు, భరద్వాజుడు, వాల్మీకి, ఔర్వుడు, చ్యవమడు, అగస్త్యుడు, అత్రి, ఉతథ్యుడు, సంకర్త, ఆస్తీకుడు, ఆసురి, శిలాలి, లాంగలి, శాకల్యుడు శాకటాయమడు. గర్గుడు, వళ్పుడు. పంచశీఖుడు, జమదగ్ని, దేవళుడు, జైగీషవ్యుడు, వామదేవుడు, వాలఖిల్యులు, శక్తి, దక్షుడు, కర్దముడు, ప్రసన్నుడు, కపిలుడు, విశ్వామిత్రుడు, కౌత్సుడు. ఋచీకుడు, అఘమర్షణుడు మొదలగు ఋషులు, పితృదేవతలు, అగ్ని, శ్రీహరికి ప్రియమైన వైష్ణవులు, దిక్పాలకులు మొదలగు దేవతలందరు భయపడుచు ఆ బ్రాహ్మణుని వెంట నడచిరి.

వారందరు బ్రాహ్మణుని నిలునీలుమని వారించుచు నీతిని బోధించుచు ఒక చోట అతనిని నిలిపిరి.

శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమున నారదనారాయణుల సంవాదములోని గౌరీశంకరుల సంవాదమున చెప్పబడిన రాధాచరిత్రలోని సుయజ్ఞ మహారాజు ఉపాఖ్యానమను యాభయ్యవ అధ్యాయము సమాప్తము.