2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము
7 - యుగములు మన్వంతరములు మొ. కాలవివరణ
సారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-
గంగాదేవి యొక్క శాపము వలన సరస్వతి వారికి స్థానము పుణ్యక్షేత్రమైన భారత భూమియందు ఆవతరించెను. భారత భూమిని పొందినందువలన భారతీయని, బ్రహ్మదేవునికి ప్రియురాలు కావున బ్రాహ్మియని, వాక్కులకు ఆధిష్టాన దేవత కావున వాణియని పిలువబడుచున్నవి.
శ్రీహరి సమస్త విశ్వమునందంతట ఉన్నప్పటికిని సముద్రమునందు శేషతల్పమున ఉన్నందువలన శ్రీహరికి సరస్వాన్" అని పేరు కలదు. అతనికి సంబంధించినది కావున
ఈమెకు “సరస్వతి" యను పేరు కలిగినది. ఆ సరస్వతీ నది అతి పవిత్రమైనది. పాపుల యొక్క పాపము లనే కట్టేలను దహించు ఆగ్నిశిఖవంటిది.
గంగాదేవి పాణీదేవియొక్క శాపమున తన అంశ స్వరూపముతో భూమిపై అవతరించినది. భగీరథుని ప్రయత్నము వలన భూమికి వచ్చినందువలన ఆమెను భాగీరథీ యని పిలుచుచున్నారు. గంగాదేవి నదీరూపమున భూమిపైకి దిగునప్పుడు ఆమే వేగముమ భూమి సహించుకొనలేక పోయినది. అందువలన పరమశివుడామెను తన శిరస్సున నిలుపుకొనెను.
లక్ష్మీదేవి ఇంకొక అంశముతో ధర్మర్వజ మహారాజు కుమార్తెగా సరస్వతీ దేవి శాపమున భారతదేశమున ఆవతరించినది. తరువాత శ్రీహరి శాపము వలన వృక్షరూపముగా మారినది.
ఈగంగా, లక్ష్మీ, సరస్వతులు భారతదేశమున కలియుగమున ఐదువేల సంవత్సరములవరకుండి తమ నదీ రూపమును వదలి శ్రీహరి పదమును చేరుకొందురు.
కలియుగమున పదివేల సంవత్సరములు గడచిన తరువాత కాశి, బృందావనము తప్ప మిగిలిన సమస్త తీర్థములు, శ్రీహరికి మూర్తి రూపమైన శాలగ్రామము, జగన్నాథుడు, వైష్ణవులు, పురాణములు, వేదోక్తకర్మలు, హరిపూజ, హరినామ సంకీర్తనం, సత్యం, ధర్మం, వేదములు చివరకు గ్రామములలో ఉండు గ్రామ్యదేవతలు సహితము శ్రీహరి ఆజ్ఞననుసరించి వైకుంఠమునకు వెళ్ళుదురు (అనగా వీటిపై ఆదరము తగ్గును.)
ఆ సమయమున శ్రీహరీపూజు తులసీపత్రములు లేకుండ . జరుగును. అప్పుడు ప్రజలందరు అబద్ధములాడుచు కపటములో వామాచార పరాయణులై యుందురు. ఏకోదశీవ్రతములు లోపించును. ప్రజలందరు ధర్మదూరులై శ్రీహరి గుణ కీర్తమునకు విముఖులగుదురు, క్రూరులు, డాంబికులు, మహాహంకార యుతులు, చోరులు, హింసించువారై యుందురు. స్త్రీ పురుష భేదము కాని స్వామి, భృత్యభేదము కాని కనిపింపదు.
స్త్రీలందరు స్వేచ్ఛగా తిరుగుచు భర్తలను తమ అదుపాజ్ఞలలో ఉంచుకొందురు. తర్జన భర్జనలతో తమ భర్తలను కొట్టుటకైనను వెనుకాడరు. ఇంటి యజమానురాలు సామాన్యపలే ఉండును. ఇంటి యజమాని భృత్యునివలె ఉండును. ఇంటికోడళ్ళు తమ గౌరవమును కోల్పోయి పనివారివలె ప్రవర్తింతురు. బాంధవ్యము కేవలము యోని సంబంధులతో మాత్రముండును. విద్యా సంబంధము కలవారితో పలుకనైనా పలుకరు, అందరు పరస్పర సంచయము లేనివారీవలె మెలగుదురు. పురుషులు తమ భార్యల మాటలను తప్పక విందురు.
బ్రాహ్మణాది చాతుర్యర్ఘ్యముల యొక్క - కులాచార పద్ధతులు లోపించిపోవును. జనులందరు తమ ప్రాచీనశాస్త్ర గ్రంథములను వదలి మ్లేచ్చుల శాస్త్రములు పఠించుచు వారీ ఆచార వ్యవహారముల స్వీకరింతురు. ఉత్తమ వంశమున జన్మించిన వారందరు తమ తమ ఆచారవ్యవహారములను వదిలి పెట్టి భ్రష్టాచారులగుదురు. జనులందరు సత్యదూరులు కాగలరు. భూమి చక్కగా పండదు. చెట్లకు పండ్లు ఉండవు. స్త్రీలు సంతానరహితలు కాగలరు. ఆవులు పాలనివ్వవు. భార్యాభర్తలు సుఖములేక సంతోషమునకు దూరము కాగలరు. నదీనదములు బావులు మొదలగు వాటిలో నీరుండదు. అందరు ధర్మహీనులు పుణ్యహీనులు కాగలరు.
ఈ కలియుగమున లక్షలమంది జనులలో ఎవడో ఒకడు పుణ్యవంతుడు కాగలడు. అందరు దుష్టులు, వికృతమైన ఆకారము కలవారు కాగలరు. కొన్ని గ్రామములు, పట్టణములు జనరహితమై భయంకరముగా ఉండును. కొన్ని గ్రామములలో, పట్టణములలో తక్కువ ఇండ్లు మాత్రముండును. ఆరణ్యములలో నున్న వారి దగ్గర కూడ మిక్కిలిగా పన్నులు తీసికొని పీడింతురు. నీరులేక నదులలో చెరువులలో పంటలు పండింతురు. అట్లే చక్కని పంటభూములందు పంటలు పండవు. నికృష్టులు ధనము, బలము, అహంకారము కలవారై గొప్పవారుగా పరిగణింపబడుదురు. అదేవిధముగా ఉన్నత వంశమున పుట్టినవారు నికృష్టులుగా చూడబడుదురు. అబద్ధములు మాటాడు దుష్టులు సత్యము పలుకుచున్నట్లు కనిపింతురు. పాపులు పుణ్యవంతులుగాను, పాతకము చేయువారు తపస్సుచేసి కొనువారివలె, అవైష్ణవులు విష్ణుభక్తులవలె కన్పింతురు. అట్లే ఈ కలియుగమున దయ్యములను పూజించువారు. జానములేని మోసగాళ్ళు గౌరవింపబడుదురు. స్త్రీ పురుషులందరు పొట్టివారుగానో వ్యాధులతో బాధలు పడుదురు. పదునారు సంవత్సరములకే తలంతయు పండి ఇరువది సంవత్సరముల వయసు వచ్చు వరకు ఒడలు ముడుత బడి పూర్తిగా ముసలివారగుదురు. స్త్రీలు ఎనిమిది సంవత్సరములకే యువతులగుదురు. పదునారుసంవత్సరముల వరకు వారు ముసలివారగుదురు. డబ్బుకు కక్కుర్తిపడి తమ కూతుళ్ళను అమ్ముకొందురు. అట్లే తల్లిని, భార్యను, కోడలిని, చెల్లెలిని జారత్వమునకు ప్రోత్సహించి ఆ ధనముచే బ్రతుకజూతురు. కీర్తికొరకు తాము చేసిన దానమును వెనుకకు తీసికొనెదరు. ఆట్లే తానిచ్చినవి, పరులిచ్చినవి ఐన దేవ బ్రాహ్మణ గురువృత్తులను వెనుకకు తీసికొందురు.
తన కూతురు, అత్త, కోడలు, చెల్లెలు, సోదరుని భార్య అనే వావివరుసలు లేకుండా వ్యభిచరింతురు. ఈకలియుగమున ఒక పురుషునకు భార్యలెందరో ఒక స్త్రీకి భర్తలెందరో చెప్పలేము. అందరు అసత్యమాడువారే. అన్యాయముగా దొంగతనము చేసి ధనము సంపాదించువారే. ప్రజలందరు ఒకరి నొకరు హింసించుకొందురు. చంపుకొందురు. లత్తుక, లోహాము, రసము, ఉప్పును అమ్ముకొని బ్రతుకుదురు. బ్రాహ్మణులు తమ ధర్మములను వదలివేయుదురు. అమావాస్య రాత్రివేళలలో భుజింతురు. జందెములను తీసివేసి సంధ్యావందనములాచరింపరు. తమ ఇంట్లోని సదాచారములనన్నిటిని వదులుకొందురు. అన్ని ఆశ్రమములయందు వర్ణముల యందు సంకరమేర్పడగలదు.
ఈ విధముగా కలియుగమున సమస్తము మ్లేచ్ఛమయము కాగా వృక్షములు హస్త ప్రమాణముననే ఉండును. మానవులు బొటన వ్రేలియంత ఎత్తు మాత్రముందురు.
అప్పుడు విష్ణు యశుడను బ్రాహ్మణునికి నారాయణుని అంశాంశములో కల్కియను పుత్రుడు కలుగును. అతడు మిక్కిలి బలవంతుడు. ఎత్తైన గుట్టమునెక్కి పొడవైన కరవాలముతో మూడు దినములలో ఈ భూమిపైనున్న మేచ్చులసందరిని వధించి అందర్ధానమునొందును. అందువలన: భూమీ అరాజకమై దస్యుల వశము కాగలదు.
అప్పుడు ఆరు దినములు రాత్రింబగళ్ళు కుండపోతగా వర్షము కురియును. దానివలన ఇండ్లు, చెట్లు, అన్ని కూడా పూర్తిగా మునిగిపోవును. తరువాత ద్వాదశాదిత్యులందరు ఉదయించినందువలన ఆ ఎండచే భూమీయంతయు ఎండిపోవుమ.
కలియుగము తరువాత కృతయుగము వచ్చును. అప్పుడు తపస్సు, సత్యములతో ధర్మము పరిపూర్ణము కాగలదు. బ్రాహ్మణులు వేదజ్జులై ధర్మిష్ఠులై తపస్సు నాచరింతురు. స్త్రీలందరు ధర్మము కలిగి పతివ్రతలై యుందురు. రాజులు తమ తమ ధర్మముల నాచరించుచు పుణ్యకర్మలు చేయుచుందురు. వైశ్యులు, శూద్రులు తమ తమ ధర్మములననుసరించి పుణ్యకర్మలు చేయుచుందురు. వైష్ణవులందరు విష్ణుమంత్రమును జపించుచు విష్ణుయజ్ఞములనాచరింతురు. ఆందరు ప్రతిసృతి. పురాణముల చదువుచు ధర్మకార్యముల నాచరింతురు. ధర్మము సంపూర్ణముగానుండు కృతయుగమున ఆధర్మము లేశమాత్రము కన్పించదు.
త్రేతాయుగమున ధర్మము మూడు పాదములతో నుండగా ద్వాపరమున రెండు పాదములతో, కలియుగమున, ఒకే పాదమున ఉండును. తరువాత సమస్త ధర్మలోపము జరుగును.
కాల ప్రమాణమిట్లున్నది.
వారములు ఆరుకలవు. అట్లే ప్రతిపదారీతిథులు పదహారు కలవు. (ప్రతిపత్ నుండి చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య అనునవి).
సంవత్సరములో ఉత్తర, దక్షిణాయనములు రెండు. నాలుగుజాములు దీనము, నాలుగుజాములు రాత్రి. ఎనిమిదో జాములు గల దివములు ముప్పదీయైనచో నెల. నెలలో శుక్ల, కృష్ణపక్షములు రెండు. ఇట్టి సంవత్సరములు గడువగా, గడువగా యుగమగుచున్నది. అట్టి యుగములు నాలుగున్నవి.
మానవుని సంవత్సరము దేవతలకు ఒక దినము. మానవులకు మూడువందల అరువది యుగములు గడిచినచో దేవతలకది ఒక యుగము. దేవయుగములు డెబ్బదిఒకటి గడచినచో అది ఒక మన్వంతరము. ఇంద్రుని వయస్సు ఒక మన్వంతర కాలముండును. ఇరువది ఎనిమిది ఇంద్రులవయస్సు బ్రహ్మకు ఒక దినమగును. ఆ బ్రహ్మకు నూటెనిమిది సంవత్సరములు పూర్తియైనచో ఆతనీ ఆయుర్దాయము పూర్తియగును.
బ్రహ్మదేవుని ఆయుర్దాయము పూర్తియైనచో అప్పుడు ప్రాకృతప్రళయము సంభవించును. ఆప్రళయమున భూమి కనిపింపదు. లోకములన్నియు జలమున మునిగిపోవును. అప్పుడు బ్రహ్మవిష్ణు, శివాదిదేవతలు, మునులు, జీవులన్నియు పరాత్పరుడైన శ్రీకృష్ణునీయందు లీనమగును. ప్రకృతియంతయు పరమాత్మయందు లయము చెందును కావున అది ప్రాకృతిక లయము. బ్రహ్మదేవుని జీవితకాలము లేక ప్రాకృతిక లయ కాలము పరమాత్మయగు శ్రీకృష్ణదేవునకు ఒక నిమేషకాలము.
ఈ విధముగా సమస్తలోకములు సమస్తజీవులు నశించుచుందురు. గోలోకము వైకుంఠము మాత్రము శాశ్వతముగానుండును అచ్చట శ్రీకృష్ణపరమాత్మ తన అనుచరులతో శాశ్వతముగా నుండును.
పరమాత్మయొక్క నిమేషకాలమువరకు ప్రళయముండును. ఆటుపిమ్మట సృష్టి మరల ప్రారంభమగును.
ఈ విధముగా అనేక సృష్టిలయములు జరిగినవి. ఈసృష్టిలయముల సంఖ్య, బ్రహ్మాండముల సంఖ్య, బ్రహ్మాది దేవతల సంఖ్య ప్రపంచమున ఎవరికిని తెలియదు.
బ్రహ్మాండములకు సమస్త జీవులకు ఈశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మయే. అతడు ప్రకృతి కంటే అతీతుడు. బ్రహ్మాది దేవతలు ఆ పరమాత్మయొక్క ఆంశస్వరూపులు. అతని ఆంశాంశ స్వరూపము మహావిరాణ్మూర్తి, దానియొక్క అంశము విరాట్స్వరూపము. విరాట్ స్వరూపముయొక్క అంశస్వరూపమే ఈ ప్రకృతి.
కృష్ణపరమాత్మ గోలోకమున ద్విభుజుడుగాను, వైకుంఠమున చతుర్భుజుడుగాను కనిపించును. బ్రహ్మ మొదలుకొని గడ్డిపరకవరకు అంతయు ప్రకృతికి సంబంధించినది. ఈ ప్రకృతికి సంబంధించిన ప్రతీది కూడ నశించుచునేయున్నది. అదినశ్వరమైనది. ఈ సృష్టికంతయు మూలస్వరూపమనతగిన పరమాత్మ నిత్యము సనాతనము కూడ.
ఆ పరమాత్మ స్వేచ్చామయుడు, నిర్లిప్తుడు, నిర్గుణుడు, నిరాకారీ, అయినను భక్తులననుగ్రహించుటకై ఆకారమును ధరించిన వాడు, మిక్కిలి అందగాడు, మేఘమువలె నల్లనివాడు రెండు భుజములు కలవాడు, మురళిని ధరించిన గొల్లవాడు, సర్వజ్ఞుడు. అందరిచే సేవించబడినవాడు, పరమాత్మ, ఈశ్వరుడు కూడ.
కమలమునుండి జన్మించినవాడు. జ్ఞానస్వరూపుడు ఐన బ్రహ్మదేవుడు విశ్వములనన్నిటిని సృష్టించును. సమస్త తత్వజ్ఞానము నెరిగినవాడు, మృత్యువును జయించినవాడు అగు శివుడు విశ్వసంహారము చేయుచున్నాడు. జ్ఞానమువలన, తపస్సువలన పరమాత్మతో సమానమైనవాడు, మహావిభూతులతోనున్నవాడు, సర్వజ్ఞుడు, విశ్వమంతయు వ్యాపించినవాడు, సమస్తసంపదలను ఇచ్చువాడు, సర్వేశ్వరుడైన విష్ణువు ఆందరిని రక్షించుచుండును.
ప్రకృతి సర్వశక్తులు కలది, ఈశ్వరి, మహామాయకూడ. బ్రాహ్మణులకు పూజ్యురాలు, వేదములకు అధిష్టాన దేవత, వేదములకు తల్లి వంటిదీ సావిత్రీదేవి. విద్యాంసులందరిచే పూజింపతగిన దేవత సరస్వతి. పరమాత్మను సేవించి తపమాచరించి సర్వసంపదలను ఇవ్వగలిగిన దేవత మహాలక్ష్మి. ఆమె ధనధాన్యములకు అధిదేవత. అట్లే పరమాత్మను సేవించి తపస్పుచేసి సమస్తలోకములందు పూజ్యురాలైన దుర్గాదేవి సమస్త గ్రామాధిదేవత. సమస్తసంపదలనిచ్చునది. ఆందరిచే స్తుతింపబడినది, సర్వజ్ఞారాలు దు:ఖములను పోగొట్టునది. శ్రీకృష్ణ ప్రేమకు అధిదేవత, ఆపరమాత్మ వామభాగమునుండి ఆవిర్భవించిన రాధికాదేవి శ్రీకృష్ణుని సేవించి ప్రేమించి అతని ప్రాణములకన్న మిన్నయైనది.
రాధ శ్రీకృష్ణపరమాత్మను సేవించి అందరికంటే ఆందమైన రూపును, సౌభాగ్యమును, గౌరవమును, శ్రీకృష్ణుని వక్షస్థలమున స్థానమును పొందినది. శతశృంగపర్వతమున విరాహారయై, నిశ్వాసరహితయై పరమాత్మను గురించి తపస్సుచేసి మిక్కిలి కృశించిపోయినందువలన శ్రీకృష్ణుడు ఆ రాధికను తన రొమ్మునకు 'హత్తుకొని దయలో స్త్రీలందరకు దుర్లభమైన వరమును ఆమెకిచ్చెను. ఓ రాధా! నీవెల్లప్పుడు నా వక్షస్థలముననే ఉండుము. నీ పౌభాగ్యము, ప్రేమ, గౌరవముల వలన స్త్రీలందరిలో నీవు గౌరవింపబడుదువు. నేను నికెల్లప్పుడు అందుబాటులో ఉందును అనెను.
ఈవిధముగా జగన్నాథుడైన శ్రీకృష్ణుడు రాధాదేవిని తన ప్రియురాలుగా సపత్నీ రహితగా చేసెను.
ఏయే దేవతలు, పరమాత్మగురించి ఎంత తపస్సు చేసినారో వారి వారి తపస్సుననుసరించి ఫలితమును పొందినారు.
దుర్గాదేవి హిమాలయ పర్వతముపై వేయి దివ్య వర్షములు తపస్సు చేసి అందరికి పూజనీయురాలైనది. సరస్వతీదేవి గంధమాదన పర్వతముపై లక్ష దీవ్య వర్షములు తపస్సు చేసినది. లక్ష్మీదేవి పుష్కర తీర్థమున నూరు దీవ్యయుగములు తపస్సు చేయగా, సావిత్రిదేవి మలయ పర్వతమున - ఆరుపై వేల దివ్య వర్షములు తపస్సుచేసి పూజనీయురాలైనది.
శంకరుడు, బ్రహ్మ, విష్ణువు, ధర్ముడు శతమన్వంతరములు పరమాత్మను గురించి తపస్సు చేయగా ఆదిశేషుడు ఒక మన్వంతరము, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు కూడ ఒక మన్వంతరము, వాయువు నూరు దివ్యయుగములు తపస్సు చేసి లోక పూజ్యులైరి.
ఈవిధముగా శ్రీకృష్ణ పరమాత్మ గురించి తపస్సుచేసి సమస్త దేవతలు, మునులు, రాజులు బ్రాహ్మణులు తదితరులు రసమును పొందిరి.
నాగురువు వలన ఎన్నో పురాణ విషయమును నాకు తెలిసినంతవరకు నీకు తెల్పితిని.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణే ద్వితియే ప్రకృతిఖండి నారద నారాయణ సంవాదే యుగతన్మాహాత్మ్య మన్వంతరకాలేశ్వరగుణ నీరూపణం నామ సప్తమోఽధ్యాయః॥
శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణములో రెండవదైన ప్రకృతి ఖండములో నారద నారాయణ సంవాద సమయమున యుగము, దాని మహాత్మ్యము, మన్వంతరకాలము, ఈశ్వరుని గుణములను తెలుపు ఏడవ అధ్యాయము సమాప్తము.
