2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము
21 - సాలగ్రామ వివరణ
నారద ఉవాచ - నారదుడు నారాయణునితోనిట్లనెను-
భగవంతుడగు నారాయణుడుతులసీదేవితో ఎట్లు సంగమించెనో ఆవృత్తాంతమునంతయు నాకు వివరముగా తెల్పగలరు.
నారాయణ ఉవాచ- సారాయణుడు నారదునితోనిట్లు పలికెను
నారాయణుడు దేవతాకార్యమును సాధించుటకై శంఖచూడుని వేషమును ధరించి తులసీదేవి గృహమును చేరెను. ఆమె ఇంటిముందు దుందుభీ వాద్యమును మ్రోగించుచు జయ శబ్దముతో తులసీదేవిని పిలిచెను. ఆప్పుడు శంఖచూడునివేషమున నున్న నారాయణుడు పలికిన జయ శబ్దమును విని తులసి తన భర్త దేవతలతోడి యుద్ధమున విజయము సాధించేనని భావించి మిక్కిలి ఆనందముతో ఆతనిని గవాక్షమునుండి (కిటికీ) చూచినదీ, వెంటనే తులసీ ఆధీక సంతోషముతో బ్రాహ్మణులకు దానములు చేసినది. అట్లే కారాగారబద్ధులకు, బిచ్చగాండ్రకు దానములు చేసినది.
అప్పుడు శంఖచూడవేషధారి యగు నారాయణుడు రథమునుండి కిందికి దిగి తులసీదేవి భవనములోనికి వె ళ్ళెను.
తులసీదేవి తనకేదురుగా నిలబడియున్న భర్తను (శ్రీహరిని) చూచి సంతోషముతో ఆతని కాళ్ళు కడిగి నమస్కరించి అతనిని రత్నసింహాసనమున కూర్చుండబెట్టెను. తరుపోత అతనికి కర్పూరాదీ సువాసన ద్రవ్యములచే సువాసితమై యున్న తాంబూలమునిచ్చి నా భర్త రణరంగమునుండి క్షేమముగా ఇల్లు చేరినందువలన, నా జన్మసఫలమైనది. నేను చేసిన పుణ్యకార్యములన్ని సఫలమైనవి అని తులసి పలికి రణరంగమున జరిగిన విషయములనన్నిటిని వివరింపుడని మధురమైన మాటలతో పలికినది.
తులస్యువాచ- తులసీదేవి ఇట్లనెను
ఓ ప్రభూ అసంఖ్యాకమైన విశ్వములనన్నిటిని సంహరించు పరమేశ్వరునితో నీవేవిధముగా యుద్ధము చేసితివి. ఆయుద్దమున నీకు విజయమెట్లు లభించినది అని తులసి అడుగగా శంఖచూడుని రూపుననున్న నారాయణుడామెతో ఇట్లనెను.
శ్రీహరిరువాచ- శంఖచూడుని వేషముననున్న శ్రీహరి ఇట్లు పలికెను
ఓ తులసీ నాకు వరమశివునకు మధ్య ఒక సంవత్సరకాలము యుద్ధము సాగినది. చివరకు ఆయుద్ధములో రాక్షసులందరు చనిపోయిరి. అప్పుడు బ్రహ్మదేవుడు మా ఇద్దరి మధ్య సంధిని చేసెను. దాని ప్రకారము దేవతల రాజ్యము దేవతల కీయబడినది. నేను ఇచ్చటికి రాగా శివుడు శివలోకమునకు పోయెను” అని పలికి శంఖచూడుని రూపమున నున్న శ్రీహరి శయ్యపై పరుండి తులసితో సంభోగమొనర్చెను. కాని సాధియగు తులసి సుఖసంభోగమున జరిగిన వ్యతిక్రమమువలన ఆతనిని శంకించి నీవెవ్వరవని శంఖచూడుని రూపమున నున్న ఆతనినడిగెను.
తులస్యువాచ- తులసీదేవీ ఈవిధముగా శ్రీహరితో అనెను
మాయావియగు నీవెవరవు? నన్ను మోసము చేసి అనుభవించితివి. నా పాతివ్రత్యమును మంటగలిపితివి. ఇన్ని మాటలెందులకు, నిన్ను ఇప్పుడే శపింతును అని తులసీ దేవి అనగా శ్రీహరి భయముతో అందమైన తన రూపును ధరించెను. తులసీదేవి తనకెదురుగా నిలుచున్న దేవదేవుడు, సనాతనుడు, నీలమేఘశ్యాముడు శరత్పద్మములవంటి నేత్రములు కలవాడు, కోటిమన్మథాకారుడు, రత్నభూషణములచే ఆలంకృతుడు, పీతవస్తుడు, చిరునవ్వుతో నున్న శ్రీహరిని చూచి కామిని వెంటనే మూర్ఛనొందినది. వెంటనే స్మృతికి వచ్చి తులసీదేవి శ్రీహరితో నిట్లనెను.
ఓలోకనాథ రాయివంటి నీకు దయలేదు. నీవు నాభర్తను మోసగించీ ఆధర్మ మార్గమున చంపితివి. నీవు దయాహీనుడవు. పాషాణము వంటివాడవు. అందువలన భూలోకమున పాషాణరూపుడవు కమ్ము. కొందరు ఆజ్ఞానమువలన నిన్ను కరుణాసింధువందురు. కాని నీభక్తుని తప్పులేకపోయినను ఇతరుల కొరకు ఆతనిని చంపితివి. నీవు దుర్మార్గుడవు, సర్వజ్ఞుడవైన నీవు ఇతరుల దుఃఖమును గమనింపలేదు.
తులసీదేవి శ్రీహరితో వైవిధముగా పలికి శ్రీహరి చరణముల పై వ్రాలి చాలాకాలమేడ్చినది. దయాసాగరుడు లక్ష్మీపతియగు నారాయణుడు తులసీని ఈవిధముగా ఓదార్చేను.
శ్రీభగవానువాచ- భగవంతుడగు శ్రీహరి తులసితో ఇట్లనెను.
సాధ్వియైన ఓ తులసీదేవీ నీవు భారతఖండమున నన్ను పొందవలేనని పెక్కేండ్లు తపమాచరించితివి. శంఖచూడుడు నీకై చాలాకాలము తపస్సు చేసెను. ఆ తపః ఫలితముగానే ఆతడు నీను భార్యగా పొంది చాలాకాలము సుఖముగానుండి తన శరీరమును వరలి పెట్టెను.
అట్లే నీతపఃఫలితమును పొందుటకు నీకిప్పుడు యోగ్యత లభించినది. నీవు ఈ నీ శరీరమును వదలి దివ్యదేహము ధరించి రాసక్రీడలో లక్ష్మీదేవివలే నీవుకూడ ఆమెతో కలిసి విహరింతువు. ప్రస్తుతమున్న నీయొక్క పార్థివశరీరము నదీరూపును దాల్చి గండకీనదీగా ప్రసిద్ధమగును. అది భారత ఖండములో పవిత్రమై ఆచ్చటి జనులకు పుణ్యమును కలిగించును. నీతల వెండ్రుకలు పుణ్యవృక్షములు కాగలవు, తులసీదేవి కేశములనుండి పుట్టిన చెట్లు తులసియను పేరుతోనే ప్రఖ్యాతి వహించును.
ఈ తులసి, దేవతార్చనమున పత్ర, పుష్పములలో ప్రధానస్థానమాక్రమించును. ముల్లోకములలోను, నాలోకములోను నాసమీపమున నున్న పుష్పములలో ఇవీ శ్రేష్టములగును. గోలోకమున, విరజానదీతీరమున, రాసప్రదేశమున, మాధవి, కేతకి, కుంద, మల్లికా పుష్పములు గల మాలతీవనమున, పుష్పములుండు స్థలములో తులసీవృక్షములు పుణ్యప్రదములు కాగలవు, పుణ్యప్రదమైన తులసీ వృక్షము క్రింద సమస్త తీర్థములు సమస్త దేవతలు నివసింతురు. తులసీపత్రములు పడిన స్థలము కూడ మిక్కిలి పవిత్రమైనది. తులసీ పత్రములున్న నీటితో ఎవరు స్నానము చేయుదురో వారు సమస్త తీర్థస్నాన ఫలితమును పొందుదురు. అట్లే సమస్త యజ్ఞములు చేసిన ఫలితమును ఆనుభవింతురు. అట్లే తులసీ పత్రములు శ్రీహరికి సమర్పించినచో వేయి ఆమత కలశములను అతనికి సమర్పించిన దానికన్న మిన్నగా శ్రీమస్నోరాయణుడు సంతోషపడును. అట్లే లక్షల కొలది గోవులు దానము చేసిన ఫలమునతడు పొందును.
చనిపోవునప్పుడు తులసీ తీర్థమిచ్చినచో మృతిచెందిన వ్యక్తి తాను పాపములనన్నీటిని పోగొట్టుకొనీ విష్ణులోకమునకు వెళ్ళును. ప్రతిదినము తులసీ తీర్థమును భక్తితో త్రాగు మానవుడు. జీవన్ముక్తుడగును పైగా అతనికి గంగానదిలో స్నానము చేసిన ఫలము లభించగలదు.
ప్రతిదినము నన్ను తులసీదళములతో పూజించినచో లక్ష అశ్వమేధయాగములు చేసిన ఫలితమును పొందును. తులసీ దళమును తనచేతిలో పట్టుకొని లేక శరీరమున ధరించి పుణ్యతీర్థమున చనిపోయిన వాడు వైకుంఠమును చేరును. తులసిమాలనుధరించినవానికి అనేక అశ్వమేధయాగములు చేసిన ఫలితము లభించును.
తులసీపత్రమును చేతితో తాకి దానిని తిరస్కరించువాడు సూర్యచంద్రులున్నంతవరకు నరకమున ఉండును. అట్లే తులసీపత్రమును తాకి తప్పుడు ప్రమాణమును చేసినచో అతడు పదునలుగురు దేవేంద్రులు గతించువరకు కుంభీపాకనరకమున నివసించును.
పూర్ణిమనాడు, అమావొస్యనాడు, ద్వాదశినాడు, సూర్య సంక్రమణకాలమున, తైలాభ్యంగనముచేయు సమయమున, స్నానము చేయక, మధ్యాహ్నమున, రాత్రికాలమున, సాయంప్రాతస్సంధ్యాకాలములలో అశుచిగానున్నప్పుడు జాతాశౌచ, మృతాశాచ కొలములలో రాత్రి కట్టుకున్న వస్త్రములను ధరించియున్నప్పుడు తులసీ దళమును తెంపినచో శ్రీహరి శిరస్సును ఛేదించిన పాపము లభించును.
శ్రాద్ధకాలమున, వ్రతములనుష్ఠించు సమయమున, దానము చేయునప్పుడు, దేవప్రతిష్టాకాలమున, దేవతార్చన కాలమున ఉపయోగించిన తులసీదళము మూడు దీనములవరకు పవిత్రమైయుండును. భూమిపై పడినను విష్ణువునకు సమర్పితమైన తులసీదళమును కడిగినచో పరిశుద్ధమై ఇతర కార్యముల యందుపయోగమునకు వచ్చును. వృక్షమునకు అధిష్టాన దేవతయగు తులసి గోలోకమున శ్రీకృష్ణునితో ప్రతిదినము రహస్యక్రీడలు సాగించును. గండకీనదికి ఆధిష్టాన దేవతగా నున్న తులసి భారతదేశమున జనులందరకు పుణ్యప్రదమై నా అంశస్వరూపుడైన సముద్రునకు భార్య కాగలదు.
స్త్రీ రూపమున నున్న నీవు వైకుంఠమున నా సన్నిధిలో లక్ష్మీదేవితో సమానమై మెలగగలవు.
ఓ తులసీ! నేను నీయొక్క శాపముననుసరించి భారత దేశమందలి గండకీనదీ తీరమున శిలారూపముతోనుందును. వజ్రములవంటి పండ్లు గల వఱకీటకములు వజ్రక్రిములు ఆ శిలలో చక్రమువంటి రంధ్రములను చేయును.
గండకీనదీ తీరమందు లభించు శిలలలో ఒకే రంధ్రముండి అందు నాలుగు చక్రములుండి వనమాలా విభూషితమై నల్లని రంగులో లభించు సాలగ్రామ శిల లక్ష్మీనారాయణము.
ఒకే రంధ్రమున నాలుగు చక్రములుండి వనమాల లేని నల్లని శిలను లక్ష్మీ జనార్దనమందురు.
రెండు రంధ్రములలో నాల్గు చక్రములు, గోష్పాదముండి వనమాల లేనిచో ఆ శిలను రఘునాథ సాలగ్రామముగా పేర్కొందురు.
రెండు చక్రములుండి నల్లగా, మిక్కిలి చిన్నగానుండు సాలగ్రామమును దధివామనమని అందురు. ఆ సాలగ్రామమునారాధించినచో గృహస్థులకు మేలు చేకూరును.
రెండు చక్రములు వనమాల కలిగియున్న చిన్న సాలగ్రామమును శ్రీధరమని అందురు. అదికూడ గృహస్థులకు శుభమును కలిగించుచున్నది.
గుండ్రముగా లావుగానుండి వనమాల లేక రెండు చక్రములు స్పష్టముగా కనిపించు సాలగ్రామమును దామోదరమందురు.
గుండ్రముగా, బాణవిద్ధమై రెండు చక్రములుండి మరీ చిన్నగా, మరీ లావుగా కొక మధ్య రీతిలోనుండి అమ్ములపొది ఉన్న సాలగ్రామమును రణరామమని. పిల్చేదరు.
ఏడు చక్రములు, ఛత్రము, బోణము కలిగి మధ్యమాకారమున నుండు సాలగ్రామమును రాజరాజేశ్వరమందురు, దానిని పూజించినచో రాజ సంపదలు కలుగును.
పదునాలుగు చక్రములతో లావుగాను, నల్లగానున్న సాలగ్రామము ధర్మార్థ కామమోక్షములనే చతుర్వర్గ ఫలితమునిచ్చు 'అనంత' సాలగ్రామము.
రెండు చక్రములు, గోష్పదము, లక్ష్మిని కలిగి చక్రాకారమున మధ్యమముగా నున్న నల్లని సాలగ్రామమును మధుసూదనమని ఏలుతురు.
ఒకే చక్రమున్న సాలగ్రామమును సుదర్శనమని, చక్రము కనపడక యున్నచో గదాధరమనీ రెండు చక్రములతో శుద్ధ స్ఫటిక కాంతితో నుండు సాలగ్రామమును హయగ్రీవమనీ అందురు.
మిక్కిలి వెడల్పైన రంధ్రముతో రెండు చక్రములతో వికటముగా నున్న సాలగ్రామము వైరాగ్యమును వెంటనే కలిగించు నరసింహసాలగ్రామము.
మిక్కిలి వెడలైన రంధ్రము, వనమాల, రెండు చక్రములు గల సాలగ్రామము గృహస్థులకు సుఖసంపదలనిచ్చు లక్ష్మీనృసింహ సాలగ్రామము.
రంధ్రము యొక్క ప్రారంభభాగముననే రెండు చక్రములుండి సమానముగాను, లక్ష్మీదేవి కలిగియున్న సాలగ్రామము వాసుదేవము, అది సమస్త వాంఛలను తీర్చును.
సూక్ష్మమైన చక్రము, రంధ్రమున , ఎక్కువఛిద్రములున్న నల్లని సాలగ్రామము ప్రద్యుమ్నము. అది గృహస్థులకు మేలును కలిగించును.
రెండు చక్రములు ఒకదానికొకటి తగులుకొని యుండి కింది భాగము విశాలముగా నుండునది సంకర్షణ సాలగ్రామము. అది గృహస్థులకు శభమును కల్గించును.
పచ్చని కాంతితో గుండ్రముగా నుండు సాలగ్రామము అనిరుద్ధము, ఆది గృహస్థులకు సుఖశాంతులనిచ్చును.
శాలగ్రామ శిలయుండుచోట శ్రీహరి ఎల్లప్పుడు నివసించును, అచ్చట లక్ష్మీదేవి సమస్త పుణ్యతీర్థములతో కలిసియుండుమ.
సాలగ్రామ శిల చత్రాకారమున నున్నచో రాజ్యము లభించును. అట్లే గుండ్రని సాలగ్రామము వారాధించిన ఆధీక సంపద కలుగును. రథము వంటి శాలగ్రామము దు:ఖమును, శూలము యొక్క చివర భాగముప్పట్లు వాడిగా యున్న సొలగ్రామము మరణమును కలిగించును. నీకు కారమున నున్న సాలగ్రామము దారిద్ర్యమును కలిగించగా నలుపు పసుపు రంగులు కలిసియున్న సాలగ్రామము హానిచేయును. ఆదే విధముగా భగ్నచక్రమున్నచో వ్యాధిని కలిగించును. పగిలిపోయిన సాలగ్రామము ఇంటి యజమానికి తప్పక మరణమును కలిగించును.
సాలగ్రామమున్నందువలన ఆఇంటిలో చేసిన వ్రతములు, దానము, దేవతాప్రతిష్ఠ దేవతాపూజ, శ్రాద్ధము మొదలగునవి ప్రశస్తమగుచున్నవి.
సాలగ్రామమునభిషేకించిన నీటిని శిరస్సుపై ప్రోక్షించుకొన్నచో సమస్త పుణ్యతీర్థములందు స్నానము చేసిన ఫలము. సమస్త యజ్ఞములు చేసిన పుణ్యము లభించును. అట్లే అన్ని విధములైన దానములు చేసిన పుణ్యము, భూమి ప్రదక్షిణము చేసిన ఫలితము, సమస్త ప్రతములు ఉపవాసములుచేసిన పుణ్యము దొరకును,
సమస్త పుణ్య తీర్థములు సాలగ్రామ శిలాతోయమును శిరస్సుపై చల్లుకొనువాని స్పర్శను కోరుకొనును. ఆతడు పరమ పవిత్రుడై జీవన్ముక్తుడగును. సాలగ్రామము నర్చించినచో అతనికి సమస్త వేదములు చదివిన పుణ్యము, ఆన్నీ విధములైన తపస్సులు చేసిన పుణ్యము లభించును.
శాలగ్రామమునభిషేకించిన తీర్థమును ప్రతినిత్యము స్వీకరించుచున్నవానికి అది జరామరణములను పునర్జన్మమును పోగొట్టి, దేవతలు ఇష్టపడు ప్రసాదమగును, బ్రహ్మహత్యాది పాపములన్నియు ఆ భక్తుని చూడగనే గరుత్మంతుని చూచిన సర్పములవలె పరుగెత్తును. అతడు శ్రీహరి సాన్నిధ్యమున నుండి అచటినుండి అనేక ప్రాకృతలయములను చూచును. అతని పాదరేణువులవలన ఈ భూమి పవిత్రమగుచున్నదీ, అతని పితరులు లక్షతరముల వాండ్డినను ముక్తి చెందుదురు.
శాలగ్రామాభిషేక తీర్థమున మృత్యుకాలమందు పొందినచో వారు సమస్త పాపవిముక్తులై వైకుంఠమును చేరుకొందురు. అతడు కర్మఫలితము లన్నిటినండి విముక్తుడై శ్రీహరిపాదమున విలీనమగును.
సాలగ్రామమును చేతిలో పెట్టుకొవీ అబద్ధమైన ప్రమాణములు చేసినచో బ్రహ్మదేవుడున్నంతవరకు కూర్మదంష్ట్రమనే నరకమును పొందును, సాలగ్రామ శిలను నిరాదరణచేసినచో లక్షమన్వంతరములవరకు ఆసి పత్రమనే నరకమును పొందును. పాలగ్రామముపై తులసీ పత్రములను తెంపివేసినచో అతనికి తరువాత జన్మలో భార్యా వియోగము సంభవించును.
శంఖమునందు తులసీ పత్రములను తుంచి సమర్పించినచో ఆతడు ఏడు జన్మలవరకు రోగమనుభవించును. అట్లే భార్యావిహీనుడు కూడ కాగలడు. సాలగ్రామమును, తులసిని, శంఖమును ఒకచోట ఉంచి పూజ చేసినచో ఆతడు గొప్ప జ్ఞానమును పొందును. అట్లే శ్రీహరికి ఇష్టమైన భక్తుడు కూడ కాగలడు.
స్త్రీ పురుషులిద్దరు పరస్పరాను రాగముతో ఒకసారి కలిసినను ఆ తరువాత వారిరువురకు వియోగమేర్పడినచో ఇరువురకు దుఃఖము కల్గును. నీవు శంఖచూడునకు ఒక మన్వంతరము వరకు భార్యవు. తరువాత ఇద్దరకు వియోగము జరుగవలసినదే. అందువలన శంఖచూడునితో నీ కేర్పడిన వియోగము నిమిత్త మాత్రమైన దుఃఖమును మాత్రము కలిగించినది.
ఈవిధముగా శ్రీహరీ తులసిని ఓదార్చి ఊరకుండగా ఆమె తన శరీరమును వదిలి పెట్టి దివ్యరూపమును ధరించినది. లక్ష్మీదేవి వలె తులసి కూడా శ్రీహరి వక్షస్థలమున చోటుచేసికొన్నది. ఈ విధముగా శ్రీహరికి లక్ష్మీ, సరస్వతి, గంగ, తులసి భార్యలైరి.
తులసీ దేహమునుండి గండకీనది ఆవిర్భవించినది. అట్లే ఆ నదీతీరమున శ్రీహరియొక్క అంశవలన పుణ్యప్రదమైన పర్వతము ఏర్పడినది. ఆ పర్వతమునందలి శిలలను కీటకములు అనేక విధములుగా తొలుచుచున్నందువలన నీలమేఘమువలె నల్లని శీలలు నీటిలో పడిపోవును. శ్రీహరికి కలిగిన ఉపతాపమువలన భూమిపై పడిన సాలగ్రామశీలలు పింగళవర్ణమున ఉన్నవి.
నారదా! ఈ విధముగా తులసీదేవి చరిత్రనంతయు నీకు విశదీకరించితిని. ఇంకను వీవు వినగోరుచున్న విషయమేదైన ఉన్నచో చెప్పెదను.
శ్రీ బ్రహవైవర్తమను మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణుల సంవాదమువ తెల్పబడిన తులసీ ఉపాఖ్యానమను
ఇరువది ఒకటవ అధ్యాయము సమాప్తము.
