2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము

Table of Contents

27 - శుభకర్మల ఫలితము

సావిత్ర్యువాచ- సావిత్రి యమునితో నిట్లనెను-

పుణ్యము చేసికొనిన మానవులు ఏయే కర్మలవలన స్వర్గలోకమును లేక ఇతరలోకములను చేరుచున్నారో ఆయా కర్మల గురించి విపులముగా తెలుపుడు

 యమ ఉవాచ- యమధర్మరాజిట్లనెను-

ఈ భారతదేశమున బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో ఆ అన్నమున మెతుకులెన్ని యున్నవో అన్ని సంవత్సరములు స్వర్గలోకమున సుఖపడును. అన్నదానమును మించిన దానము లేనే లేదు. అన్నదానము చేయు సందర్భమున మంచివాడు చెడ్డవాడు అను పాత్ర పరీక్షగానీ, కాల నియమముగాని తగదు.

దేవతలకు, బ్రాహ్మణులకు ఆసనమిచ్చి గౌరవించినచో ఆగ్నిలోకమున పదివేల సంవత్సరములుండును.

ఎల్లప్పుడు శ్రీహరినామ జపము చేయువాడు చిరంజీవిగా ఉండును. మృత్యువాతనిని చూచి పరుగెత్తును. శ్రీహరికి ఊయలను చేయించినచో పూర్లిమనాడు బ్రాహ్మీముహూర్తమున మృతుడై ముక్తినొందును. ఈలోకమున సుఖముగా నుండి చనిపోయి వైకుంఠమున కేగి అచ్చట శతమన్వంతర కాలము సుఖముగా నుండును. ఉత్తర ఫల్గుణీ నక్షత్రమున చేసిన దానము చాలా విశేషమైనది. దాని వలన రెండింతలు ఫలము లభించును. అతడు కల్పాంతము వరకు బ్రతుకునని బ్రహ్మదేవుడు తెలిపెను.

నూపులను దానము చేసినచో నూపుగింజల సంఖ్యగల సంవత్సరములు వైకుంఠమున నుండును. తరువాత మానవుడై పుట్టినను సుఖముగా ఉండును. ఈనూవులను రాగి పాత్రలో పోసి దానము చేసినచో సాధారణదానము కంటే రెట్టింపు ఫలితమును పొందును.

 అందమైనది, సద్గుణముల రాశి యైన కన్యను సాలంకృతముగా సవస్త్రముగా దానము చేసినచో పదునలుగురు ఇంద్రులు గతించువరకు చంద్రలోకమున సుఖముగా నుండును. ఆ తర్వాత గంధర్వలోకమున సుఖముగా నుండును. తరువాత వేలకొద్ది జన్మలలో సౌందర్యవతి సౌభాగ్యవతీ, మృదుభాషిణీ యగు కాంతను భార్యగా పొందును.

పండ్లతో నున్న వృక్షమును బ్రాహ్మణునకు దానము చేసినచో దానము చేసినవాడు ఆ చెట్టున ఎన్ని ఫలములున్నవో అన్ని సంవత్సరములు స్వర్గలోకమున సుఖముగానుండును. తరువాత మానవ జన్మనెత్తి మంచీ పుత్రుని కనును, అందువలన పండ్లతో నున్న చెట్లను అనేకము దానము చేయవలెనని. ఆనుచున్నారు. పండ్లను మాత్రము దానము చేసినచో చాలా కాలము స్వర్గమున నుండును.

అనేక ద్రవ్యములు, అవధాన్యములు కల ఇంటిని దానము చేసినచో ఆ దాత కుబేరలోకమున మన్వంతర కాలముండును. తిరిగి మానవ జన్మనెత్తి నప్పుడు గొప్ప ధనవంతుడగును.

ఎవరు సస్యశ్యామలమైన భూమిని భక్తితో బ్రాహ్మణునకు పుణ్యక్షేత్రమునకు వెళ్ళినప్పుడు దానము చేయుదురో వారు వైకుంఠమున మన్వంతర కాలముందురు. తిరిగి భూమిపై మానవుడై పుట్టినప్పుడు ఆధిక భూమి కలవాడగును. అతడు నూరు జన్మలవరకు చక్కని భూమినీ, ధనమును, పుత్రులను, అధికారము కలిగియుండును.

ప్రజలున్న గొప్ప గ్రామమును బ్రాహ్మణునకు దానము చేసినచో ఆతడు లక్ష మన్వంతరముల వరకు వైకుంఠమున నుండును. తిరిగి మానవ జన్మనెత్తినచో లక్షగ్రామములకు అధిపతి కాగలడు. ఆవిధముగా లక్షజన్మల వరకు అనేక గ్రామముల కధిపతియగును.

ప్రజలు, చక్కని సస్యములు, అనేక పుష్కరిణులు, ఫలవృక్షములు గల గొప్పని నగరమును బ్రాహ్మణునకు దానము చేసినచో అతడు పదిలక్షల ఇంద్రుల వరకు వైకుంఠముననుండును, తరువాత తిరిగి భూమిపై మానవుడుగా జన్మించినప్పుడు నియుత (నూరుకోట్ల) నగరములకు రాజేంద్రుడగును. ఆ విధముగా నూరుకోట్ల జన్మల వరకు గొప్పని ఐశ్వర్యమును, అధికారమును పొందును.

 బావులు, చెరువులు, అనేక వృక్షములు, మంచి స్వభావముగల ప్రజలు గల నూరు నగరములున్న దేశమును బ్రాహ్మణునకు దానము చేసినచో ఆతడు కోటి మన్వంతరముల వరకు వైకుంఠమున గౌరవమునందుకొనును. తిరిగి మానవ జన్మనెత్తినప్పుడు ఈ జంబూద్వీపమున కధిపతియై, దేవేంద్రుని వలె పరమైశ్వర్య సంపన్నుడగును. ఆతడు కోటి జన్మలవరకు గొప్ప చక్రవర్తియై యుండును.

తన యధికారమునంతయు బ్రాహ్మణునకు దానము చేసినచో, నూరునగరములున్న దేశమును దానము చేసిన వ్యక్తి తనయధికారమునంతయు దానము చేసిన వ్యక్తి కంటే నూరు రెట్లు ఎక్కువ ఫలితమును పొందును.

సప్తద్వీపములనన్నిటిని దానము చేసిన పొనీకైనా సమస్త పుణ్యతీర్థములను సేవించిన వానికైనా, అన్నివిధములైన తపస్సు చేసిన వానికైనా, అన్ని విధములైన దానములను చేసిన వానికైనా, సమస్త సిద్ధులు పొందిన వానికైనా పునర్జన్మ ఉన్నది కాని శ్రీహరి భక్తునకు పునర్జన్మలేదు. ఆ వైష్ణవులు అసంఖ్యాకమైన బ్రహ్మదేవుల మరణమును చూచెదరు. వారు శ్రీహరి లోకమగు వైకుంఠమున గానీ, గోలోకమున గాని నీవపింతురు, విష్ణుమంత్రోపాసకులగు వైష్ణవులు చనిపోయిన తరువాత జన్మ, మృత్యు, జరలు లేని దివ్యరూపును ధరించి శ్రీహరి సారూప్యమును పొంది విష్ణుసేవను చేయుచుందురు. వారు గోలోకమున చాల కాలముండి అనేక ప్రాకృతలయములను చూచెదరు,

దేవతలు, సిద్ధులు, సమస్త ప్రపంచములు నశించునుగాని శ్రీకృష్ణభక్తులకు మాత్రము చావులేదు. వారికి ముసలితనము, చావు పుట్టుకలుండవు.

కార్తిక మాసమున శ్రీహరిని తులసితో పూజచేసిన వారు వారు పూజించిన తులసీ పత్ర సంఖ్యగల యుగములు శ్రీహరి సన్నిధిలో ముందురు. తిరిగి మానవులై పుట్టినను శ్రీహరి భక్తి కలిగి చిరంజీవులై సుఖముగా నుందురు.

కార్తిక మాసమున శ్రీహరికి నేతి దీపమును పెట్టినచో ఆ నేయి ఎన్ని పలములు గలదో (పలము ద్రవ వస్తువులను కొలుచు ఒక చిన్న కొలత) అన్ని సంవత్సరములు శ్రీహరి సమీపమున నుండి, పునర్జన్మ నెత్తినప్పుడు విష్ణుభక్తి కలిగిన ధనవంతుడగును.

మాఘమాసమున గంగానదిలో ఆరుణోదయకాలమందు స్నానము చేసినవాడు అరువది వేల యుగములు వైకుంఠమున నుండును. అతడు తిరిగి మానవ జన్మనెత్తీనను జితేంద్రియుడై శ్రీహరి భక్తిని పొందును.

మాఘమాసమున ప్రయాగయందు అరుణోదయ కాలమున గంగాస్నానము చేసినవాడు లక్షమన్వంతరముల వరకు వైకుంఠముననుండును. తిరిగి మానవజన్మనెత్తినప్పుడు విష్ణుమంత్రమును పొంది చనిపోయిన తరువాత హరి దాస్యమును పొంది సారూప్య ముక్తిని పొందును.

గంగానదిలో ప్రతి దినము స్నానము చేసినచో సూర్యుని వలె పవిత్రుడై మాటిమాటికి అశ్వమేధయాగ ఫలితమును పొందును. ఆతడు వైకుంఠమున సూర్యచంద్రులున్నంతవరకుండి తిరిగి మానవజన్మనెత్తినచో స్వధర్మనిరతుడై, విద్వాంసుడై, జితేంద్రియుడై మహాతపస్వి కాగలడు.

మీన కర్కటక సంక్రమణములమధ్య (ఫాల్గుణ మాసము, ఆషాఢమాసములమధ్య) ఎండలు బాగా ఉన్నప్పుడు చల్లని సువాసనాభరితమైన నీటిని పోయువాడు ఇంద్రులు పదునలుగురు గలించు వరకు వైకుంఠములో నుండును. తిరిగి మానవ జన్మనెత్తినప్పుడు చక్కని రూపు కలవాడై సుఖముగా నుండును.

వైశాఖమాసమున శ్రీహరికి చందన సేవ చేసినచో ఆరువై వేల యుగములు వైకుంఠమున విష్ణుమందిరమున నుండును. తరువాత మానవ జన్మ నెత్తినప్పుడతడు సుఖముగా నుండును. అట్లే వైశాఖమాసమున బ్రాహ్మణులకు సత్తుపిండిని దానము చేసినచో ఆ సత్తుపిండిలో ఎన్నీ రేణువులున్నవో అన్ని సంవత్సరములు వైకుంఠమున శ్రీహరి మందిరమున నుండును. శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతముచేసినచో నూరు జన్మలలో చేసిన పాపములు నశించును. అతడు పదునాలుగురు ఇంద్రుల కాలము వరకు వైకుంఠమున నుండి తిరిగి మానవుడై పుట్టినప్పుడు తప్పక శ్రీకృష్ణభక్తిని పొందును.

ఈభారత వర్షమున శివరాత్రి వ్రతము చేయువాడు ఏడు మన్వంతరముల వరకు శివలోకమైన కైలాసమున నుండును. శివరాత్రి దినమున శివుని బిల్వపత్రములతో పూజించినచో ఎన్ని పత్రములతో ఆతడు శివపూజ చేసెనో అన్నీ యుగములు కైలాసమున శివుని మందిరమున నుండును. తరువాత తిరిగి మానవుడుగా జన్మనెత్తినప్పుడు శివభక్తినీ, విద్యను, పుత్రపౌత్రసంపదను, ధన ధాన్య సంపదను, భూసంపదను పొందును. ఆదే విధముగ చైత్రమాసమున లేక మాఘమాసమున వ్రతదీక్షపూనీ శివుని పూజించినచో అతడు శివలోకమున శ్రీవమందిరము ముందు చేత్రపాణియై శివభటుడగుచున్నాడు. లేక పై రెండునెలలలో నెలయంతయు లేక పక్షము దీనములైనా, పదీ దీనములైనా చివరకు వారము దీనములైనా శివార్చన చేసినచో ఎన్నిదినములు శివపూజ చేసెనో అన్ని యుగములు కైలాసమున గౌరవింపబడును.

శ్రీరామనవమీ వ్రతమును దీక్షపూని ఎవరు చేయుదురో వారు ఏడు మన్వంతరముల కాలము వైకుంఠమున విష్ణుమందిరమున నుందురు. ఆ తరువాత మానవ జన్మనెత్తినప్పుడు రామభక్తుడై జితేంద్రియుడై, మహాధార్మికుడగును.

శరత్కాలమున అశ్వయుజమాసమున ప్రకృతియగు దుర్గాపూజను దున్నపోతులు, గొట్టెలు, మేకలు, చెరకుగడలు, గుమ్మడికాయలు, నైవేద్యములు, ఉపహారములు, ధూపదీపాదులు, వాద్యములు, నృత్య గీతాదులతో చేసినచో అతడు కూడ ఏడు మన్వంతరముల వరకు శివలోకమైన కైలాసమున ఉండును. ఆ తరుపోత తీరిగి, మానవ జన్మనెత్తినప్పుడు నిర్మలమైన బుద్దిని, పుత్రపౌత్రులను, అంతులేని సంపదను, చతురంగబలమును కలిగి మహాప్రభావ సంపన్నుడైన చక్రవర్తి కాగలడు.

భాద్రమాసమున శుద్దాష్టమి నాడు మహాలక్ష్మిని ఒక పుణ్యక్షేత్రమున పక్షము వరకు షోడశోపచారములతో అర్చన చేసినచో అతడు సూర్యచంద్రులున్నంత వరకు వైకుంఠమున నీవసించును తరువాత తిరిగి మానవ జన్మనెత్తినప్పుడు చక్రవర్తి కాగలడు.

కార్తీక మాసమున పూర్ణిమనాడు కొందరు పురుషులకు గోపకుల వేషమును, కొందరు స్త్రీలకు గోపికల వేషమును వేసి రాసమండలము నిర్మించి రాధా సహితుడైన శ్రీకృష్ణుని ప్రతిమను అర్ఘ్య పాద్య ధూపదీపాదీ షోడశోపచారములతో అర్చించినచో

బ్రహ్మదేవుడు బ్రతికియుండువరకు గోలోకమున నివసించును. తరువాత తిరిగి మానవుడై పుట్టినప్పుడు శ్రీహరి భక్తి కలవాడై శ్రీహరీ మంత్రోపదేశమును పొంది శరీర త్యాగమును చేసినప్పుడు గోలోకమునకు వెళ్ళి అచ్చట శ్రీకృష్ణసారూప్యమును పొంది శ్రీకృష్ణునకు అనుచరుడు కాగలడు. ఆతనికి పునర్జన్మకానీ, ముసలితనముగానీ, చావుగాని యుండవు,

ఏకాదశీ వ్రతమును. ఎవరు చేయుదురో ఆతడు బ్రహ్మ దేవుని జీవిత కాలపర్యంతము వైకుంఠమున సుఖముగానుండును. అటుపిమ్మట తిరిగి మానవుడై పుట్టినప్పుడు శ్రీహరిభక్తిని పొంది చనిపోయిన తరువాత శాశ్వతముగా వైకుంఠముననుండును. ఆతవికి పునర్జన్మ అనునదసలే యుండదు.

భాద్రపద శుద్ధ ద్వాదశినాడు ఇంద్రుని పూజించినచో అరవై వేల సంవత్సరములు స్వర్గలోకమున పుజ్యాడై వెలుగును.

ఆదివారమున, సూర్య సంక్రమణమునాడు. శుద్ధసప్తమి నాడు సూర్యుని పూజించి ఆతనికి నైవేద్యమునిచ్చినచో సూర్యలోకమున సూర్యచంద్రులున్నంతవరకుండును. తిరిగి మానవజన్మనెత్తినను ఆరోగ్యవంతుడై ధనధాన్యములతో తులదూగును.

జ్యేష్ఠమాసమునందలి శుద్ధ చతుర్దశినాడు సావిత్రీదేవిని పూజించినచో బ్రహ్మలోకమున ఏడు మన్వంతరముల వరకు గౌరవము నందుకొనును. అతడు మరల జన్మనెత్తినను ధనవంతుడు, అమితవిక్రమ సంపన్నుడు, చిరంజీవి, మిక్కిలి జ్ఞానవంతుడు అగును.

మాఘమాసమునందలి శుద్ధ పంచమినాడు (శ్రీపంచమి) సరస్వతీ దేవిని భక్తితో షోడశోపచారములతో పూజించినచో బ్రహ్మ యుండునంతవరకు వైకుంఠమున నుండును. ఆ తరువాత మానవజన్మ నెత్తినను కవిగానో పండితుడుగానో అగును.

ఆవును, బంగారు మొదలగు వస్తువులను బ్రాహ్మణునకు దానము చేసినచో నిత్యము భక్తిగల ఆ వ్యక్తి ఆవు శరీరమున -నున్న వెంట్రుకల సంఖ్యకు రెట్టింపు సంవత్సరములు వైకుంఠమున విష్ణుదేవుని మందిరమున శ్రీహరితో కలిసి యుండును, తరువాత తిరిగి భూమిపై జన్మించినను విష్ణుభక్తుడై గోప్ప చక్రవర్తి కాగలడు. గొప్పజ్ఞానము కలిగి విద్వాంసుడుగా కూడ ప్రసిద్ది చెందును.

బ్రాహ్మణులకు మృష్టాన్నమును పెట్టినచో ఆ బ్రాహ్మణుల శరీరములందెన్ని వెంట్రుకలున్నవో అన్ని సంవత్సరములు వైకుంఠమున సుఖపడును. ఆ తరువాత తిరిగి భూమిపై మానవ జన్మనెత్తినప్పుడు ధనవంతుడై మిక్కిలి సుఖపడును. ఇంకను విద్వాంసుడు, మంచి పరాక్రమవంతుడు చిరంజీవి కూడ ఆగును.

ఎవరు శ్రీహరి నామములను సదా ఉచ్చరింతురో, వారు ఉచ్చరించిన నామముల సంఖ్య ఎంతుండునో అన్ని యుగములు వైకుంఠమున సుఖముగానుందురు. తరువాత తిరిగి మానవ జన్మనెత్తి నప్పుడు తప్పక విష్ణుభక్తిని పొందుదురు. ఇదే శ్రీహరి నివసించు పుణ్యక్షేత్రమున చేసినచో ఫలితము కోటి రెట్లెక్కువ ఉండును. అట్లే శ్రీహరి ఉండు పుణ్యక్షేత్రమున శ్రీహరి నామములను కోటి మార్లు జపించినచో అతడు సమస్త పాపరహితుడై జీవన్ముక్తుడగును. అతనికి పునర్జన్మ ఉండదు. వైకుంఠమున శ్రీహరి సారూప్యమును పొందును.

మట్టితో శివలింగమును చేసి ప్రతిదినము శివుని ఆర్చించినచో శివలింగములందలి మట్టి రేణువులెన్ని కలవో అన్ని సంవత్సరములు శివలోకమున గౌరవమునందును. అతడు తిరిగి భూలోకమున మానవజన్మనెత్తినప్పుడు మహారాజపదవిని పొందును.

ప్రతిదినము సాలగ్రామ పూజ చేసి సాలగ్రామాభిషేక తీర్థమును తీసికొన్నచో నూరుగురు బ్రహ్మల కాలము వైకుంఠమున సుఖముగా నుండును. తరువాత పునర్జన్మ పొందినప్పుడు మిక్కిలి దుర్లభమైన హరి భక్తి, తరువాత వైకుంఠమున శాశ్వత - సుఖములభించును.

అన్ని విధములైన తపస్సులు అన్ని విధములైన వ్రతములాచారించినచో వైకుంఠమున పదునలుగురు ఇంద్రుల కాలము వరకు ఉండును. తరువాత భారతదేశమున తిరిగి జన్మించి మహారాజగును. ఆ తర్వాత అతడు ముక్తిని చెందును. అప్పుడతనికి పునర్జన్మ కలుగదు.

ఎవరు సమస్త తీర్థములలో స్నానము చేయుదురో వారు ముక్తిని పొందుదురు. వారికి పునర్జన్మ అనునది లేనేలేదు. పుణ్యక్షేత్రమైన భారతదేశమున అశ్వమేధయాగము చేసినవారు ఆ అశ్వమునకు ఎన్ని రోమములున్నవో అన్నీ సంవత్సరములు దేవేంద్రుని అర్ధాసనమున కూర్చొని ఇంద్రునితో సమానులగుదురు. రాజసూయయాగము చేసినచో అశ్వమేధయాగము కంటే నాల్గురెట్లు ఎక్కువ ఫలములభించును.

నరమేధము చేసినన, గోమేధము చేసినను అశ్వమేధయాగ ఫలములో సగము ఫలితమును మాత్రము పొందుదురు, పుత్రకామేష్టి యాగము చేసినచో సుపుత్రుడు కలుగును కాని నరమేధమునకు లభించు ఫలములో సగము మాత్రము లభించును. లొంగలేష్టియందు గోమేధముతో సమానఫలము లభించును. అట్లే విప్రేష్టియందు, వృద్ధయాగమున కూడ గోమేధ ఫలితములభించును.

పద్మయజ్ఞమున వృద్దియాగఫలములో అర్థ ఫలితమే లభించును. విశోక యజ్ఞమువలన దుఃఖనాశనము జరుగును. కాని స్వర్గఫలము మాత్రము పద్మయాగ ఫలములో సగభాగమే లభించును. విజయ యాగములో రాజువిజయమును పొందును. పద్మయాగఫలముతో సమానమైన స్వర్గఫలము లభించును. ప్రాజాపత్యయాగము వలన సంతానము, రాజులకు ఆధిక రాజ్యము లభించును. స్వర్గఫలము మాత్రము పద్మయాగఫలములో ఆర్థ భాగము మాత్రము లభించును. సమృద్ధియాగమువలన అంతులేని ఐశ్వర్యము, పద్మయాగ ఫలితముతో సమానమైన స్వర్గఫలము లభించును.

అన్ని యజ్ఞములలో నారాయణ యజ్ఞము చాలా గొప్పనిది. దీనిని పూర్వము. బ్రహ్మదేవుడు అనేక. సంభారములతో చేసెను. ఆక్కడనే దక్షువకు శంకరునకు కలహమేర్పడినది. అప్పుడు అల్లరి చేసిన నందీశ్వరుని బ్రాహ్మణులు శపించిరి. నందీశ్వరుడు కూడ. కోపముతో బ్రాహ్మణులనందరిని శపించెను. అందువలననే శంకరుడా యజ్ఞమును నాశనము చేసెను.

పూర్వము దక్షప్రజోపతి కూడ ఈవిష్ణుయజ్ఞమునాచరించెను. ఆ యజ్ఞమునకు ధర్మదేవత, కశ్యపుడు, ఆదిశేషుడు, కర్దమ మహర్షి స్వాయంభువ మనువు, అతని పుత్రుడగు ప్రియవ్రతుడు, శివుడు, సనత్కుమారుడు, కపిలుడు, ధ్రువుడు మొదలగువారు వచ్చిరి. నారాయణక్రతువు చేయవలెననిన వేయి అశ్వమేధయాగములు చేయుటకు వలసిన వస్తువులు కావలెను, అట్లే ఆ యజ్ఞమువలన వేయి ఆశ్వమేధయాగములు చేసినంత ఫలము లభించగలదు. ఇట్టి విష్ణుయజ్ఞమును మించిన యజ్ఞము వేదములలోనే కప్పించదు. ఆ యజ్ఞము చేసిన వాడు. ఆనేక కల్పాంతరముల వరకు జీవించి యుండును. జీవన్ముక్తుడు కూడ అగుచువాడు. అతడు జ్ఞానమున, తేజస్పులో విష్ణుమూర్తితో సమానుడగుచున్నాడు.

దేవతలందరీలో శ్రీ మహావిష్ణువు, వైష్ణవులలో శంకరుడు, శాస్త్రములన్నిటిలో పేదములు, చతుర్వర్ణములలో బ్రాహ్మణులు, నదులలో గంగానది, పవిత్రమైన వారిలో వైష్ణవులు. వ్రతములన్నిటిలో ఏకాదశీ వ్రతము, పుష్పములలో తులసి, నక్షత్రములలో చంద్రుడు, పక్షులలో గరుత్మంతుడు, స్త్రీలలో ప్రకృతి (దుర్గ), ఆధారమగు వస్తువులలో భూమి, శీఘ్రముగా వెళ్ళునవి, చంచలములు అగు ఇంద్రియములలో మనస్సు, ప్రజాపతులలో బ్రహ్మదేవుడు, తోటలలో బృందావనము, వర్షములలో భరతవర్షము, శోభకలవారిలో లక్ష్మీదేవి, విద్వాంసులలో సరస్వతి, పతివ్రతలలో దుర్గాదేవి, సౌభాగ్యవతులగు స్త్రీలలో రాధాదేవి, అట్లే యజ్ఞములన్నిటిలో విష్ణుయజ్ఞము చాలా శ్రేష్ఠమైనది.

అశ్వమేధయాగములు వంద చేసినచో తప్పక ఇంద్రపదవి లభించును. వేయి ఆశ్వమేధయాగములు చేసి పృథుమహారాజు వైకుంఠమునకు పోయేను.

ఆన్నీ పుణ్యతీర్థముల యందు చేసిన స్నానమునకు, సమస్తయజ్ఞదీక్ష స్వీకరించుటకు, సమస్తవ్రతములకు, సమస్త తపస్పులకు, నాలుగు వేదములను పఠించుటకు, భూప్రదక్షిణమునకు. ఆన్నీటికిని ముక్తిని కలిగించు శ్రీకృష్ణపాదసేవనమే ఫలము. ఈ విషయము పురాణములన్నిటిలోను, అన్ని వేదములందును, అన్ని ఇతిహాసములందును కనిపించును.

శ్రీకృష్ణుని వర్ణనము, అతనిని ధ్యానించుట, అతనీ నామములను గుణములను కీర్తించుట, ఆ శ్రీకృష్ణుని స్తుతించుట, స్మరించుట, నమస్కరించుట, జపము చేయుట, శ్రీకృష్ణపాదోదకమును, అతని నైవేద్యముమ అనుభవించుట అందరకు ఇష్టమైనవి. ఆందరకు సమ్మతమైనవి.

ఆందువలన సావిత్రి! నిర్గుణుడు, ప్రకృతి కంటే ఆతీతుడు, పరబ్రహ్మయగు శ్రీకృష్ణుని సేవింపుము. నీవు నీ భర్త ప్రాణములను తీసికొని సుఖముగా నీ ఇంటికి వెళ్ళుము అని యముడు సావిత్రితో అనెను.

ఓ సావిత్రి! నీవు కోరుకొన్న మానవులయొక్క కర్మవిపాకమునంతయు నీకు తెల్పితివి. ఇది అందరకు ఇష్టమైనది. అందరు ఒప్పుకొన్నది. మానవులకందరకు పరతత్వమును ఇచ్చునది అని చెప్పెను.

శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణములో రెండవదైన ప్రకృతిఖండములో నారద, నారాయణుల సంవాదమున తెలుపబడిన సావిత్ర్యుపాఖ్యానమున శుభ కర్మ వీపాకములను తెలుపు ఇరువది ఏడవ అధ్యాయము సమాప్తము.