2 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - ప్రకృతి ఖండము
8 - పృథ్వీ స్తోత్రము
నారద ఉవాచ- నారదుడిట్లనెను-
శ్రీహరి యొక్క ఒక నిమేషకాలములో బ్రహ్మదేవుని ఆయుర్దాయము తీరిపోవుననీ, అప్పుడు ప్రాకృతిక ప్రళయము జరుగుననియు, ఆసమయమున భూమీ కన్పింపకపోవుననియు, సమస్త లోకములు నీటిలో మునిగిపోవునని, సమస్తజీవులు శ్రీహరిలో విలీన మగుననీ మీరింతకు పూర్వము తెలిపితిరి.
ప్రాకృతిక ప్రళయ కాలమున భూమి అంతర్ధానమై ఎక్కడ ఉండును? సృష్టిజరుగునప్పుడు మరల ఎట్లు ఆవిర్భవించును. అన్ని జీవులకు ఆశ్రయభూతమైన ఆ భూమి పూజ్యురాలెట్లయ్యెను, ఆ భూమి జన్మవృత్తాంతమెట్టిది? మొదలగు విషయములను మీరు నాకు వివరింపుడు.
శ్రీనారాయణ ఉవాచ- నారాయణుడిట్లు పలికెను-
సృష్టి ప్రారంభ సమయమున సమస్తజీవులు శ్రీకృష్ణునినుండి పుట్టునని సమస్త ప్రళయకాలములందు శ్రీకృష్ణుని యందే ఆంతర్జానము చెందునని తీరిగి అతని నుండే ఆవిర్భవించునని వేదములు తెల్పుచున్నవి.
అందరకు మంగళముల నిచ్చునది విఘ్నముల పోగొట్టునదీ, పుణ్యమును కలిగించునది ఐన భూమి జన్మవృత్తాంతమును వినుము.
కొందరు ఈ భూమి మధుకైటభులను రాక్షసుల మెదళ్ళవలన ఏర్పడినదందురు. మధుకైటభుల విష్ణుమూర్తితో యుద్ధము చేయునప్పుడు విష్ణువు యొక్క తేజస్సునకు సంతోషపడి వారు విష్ణువుతో ఇట్లనీరి, మమ్ము నీరు కన్పించని స్థలమున చంపుమని కోరుకొనిరి. అట్లే శ్రీహరి వారినీ చంపగా వారి మేదస్సు దానిపై బడుటవలన భూమి మేదినీ యను పేర ఖ్యాతి నందినది. అనగా ప్రళయ కాలమున నీటిలో మునిగి యున్న భూమి వారు బ్రతికి యుండగనే నీటినుండి పైకి వచ్చినందువలన స్పష్టముగా కన్పించినది. అట్లే వారి మరణానంతరము మధుకైటభుల మేదస్సువలన పెరిగి స్పష్టముగా కన్పించినదని ఆందురు.
కానీ ధర్ముని వలన పుష్కర క్షేత్రమున భూమి పుట్టుక గురించి విని యుంటిని, ఆది పేదప్రోక్తము సమస్త జన సమ్మతమైనది. ఆ విషయమేమనగా నీటిలో నున్న మహావిరాట్పురుషుని శరీరమున ఏర్పడిన మలము కాలక్రమముగా సమస్త శరీరమున వ్యాపించినది. ఆమలము. మహావీరాట్పురుషుని ప్రతీ రోమ కూపమున నిండిపోయినది. అది మరల మరల ఆవిర్భవించినది. తిరోధానము చెందినది. ఆ మలమే భూమిగా ఏర్పడినది. సృష్టికాలమున జలమునుండి పైకి వచ్చినందువలన ఆవిర్భవించిన దని, ప్రళయకాలమున జలమునందు మునిగియున్నందువలన అంతర్ధానము చెందినదని చెప్పబడినది.
ప్రతిలోకమున భూమి కలదు. ఆభూమీయందు పర్వతములు ఆడవులు, సప్తసముద్రములు, సప్తద్వీపములు హిమాలయము, మేరువువంటి పర్వతములు కలవు. అట్లే అచ్చట గ్రహములు, చంద్రుడు. సూర్యుడు, బ్రహ్మవిష్ణు శివాది దేవతలుందురు. అనేక పుణ్యతీర్ణములు పుణ్యభూమియైన భారతదేశము, అచ్చట ఉన్నవి. ఆ భూమీ క్రింద సప్త పాతాళములు పైన బ్రహ్మలోకము, ధ్రువలోకము ఆ పైన శ్వతమైన గోలోక వైకుంఠలోకములుండును. ఈలోకములన్నియు సహజమైనవీ ఆసహజమైనవి కూడ. ప్రాకృత ప్రళయమున బ్రహ్మదేవుని ఆయుస్సు ముగియగనే అసహజమైన లోకములు నశించును.
సృష్టి ప్రారంభకాలమున శ్రీకృష్ణునిచే మహావిరాట్పురుషుడు సృష్టించబడును. వారాహీ దేవత భూమికి అధిష్టాన దేవత. ఆమె దేవతలు గంధర్వులు మానవులందరిచే పూజలనందుకొనుచున్నది. వారాహీదేవీ వరాహరూపమున నున్న విష్ణుమూర్తి యొక్క భార్య. వారి పుత్రుడే మంగళుడను కుజుడు. అతని కొడుకు సుయశుడు.
నారద ఉవాచ- నారదుడిట్లనెను-
సమస్త జీవులకు ఆశ్రయమైన ఈ భూమిని ఏరూపముతో ఆందరు పూజించినారు. ఆ పృథివియొక్క పూజావిధానమును ఉద్ధరణ క్రమమును వివరముగా తెలుపుడు. ఆట్లే కుజుని యొక్క జన్మ ప్రకారమును కూడ వివరించుడని నారదుడు వేడుకొనెను.
నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-
బ్రహ్మదేవునిచే నుతులు గొన్న ఆదివరాహస్వామి హిరణ్యాక్షుని చంపి భూమిని పాతాళమునుండి ఫైకెత్తెను. అతడు భూమిని సముద్రపు నీటిపై. పద్మపత్రమువలె నుంచెను. నీటినుండి పైకి వచ్చిన భూమిపై బ్రహ్మ దేవుడు జీవులనన్నిటినీ సృష్టించెను.
భూమికి అధిదేవతయైన. వారాహీ దేవియొక్క మనసు నెరిగిన 'ఆదీవరాహామూర్తీ దివ్య వర్షకాలము రాత్రింబగళ్ళు ఆమెతో క్రీడింపసాగెను. వారాహీదేవియొక్క ఆంగస్పర్శవలన వరాహమూర్తి మైమరచి పోయెను. దీవ్యవర్షము తరువాత సుహలోనికి వచ్చిన ఆ స్వామి భూమిని గొప్పగా పూజించి ఇట్లు పలికెను.
మహావరాహ ఉవాచ- మహావరాహమూర్తి ఇట్లు పలికెమ-
మంగళమూర్తియైన ఓ భూదేవీ! నీవు జీవులందరకు ఆధారముకమ్ము, నీన్ను దేవ గంధర్వ మానవులందరు ఎల్లప్పుడు గౌరవింతురు. గృహారంభసమయమున, గృహప్రవేశసమయమున బావులు, చెరువుల త్రవ్వునపుడు, వ్యవసాయము చేయు సమయమున దేవతలు మొదలైనవారందరు నీ పూజను. తప్పక చేయుదురు. పై కర్మలలో నీ పూజను చేయనీవారు నరకమునకు తప్పక పోవుదురు.
వసుధోవాచ- భూదేవి ఇట్లు పలికెను-
భగవన్ నీయొక్క ఆజ్ఞననుసరించి చరాచర విత్వమును అవలీలగా మోయగలను. కానీ ముత్యమును, ముత్యపుచిప్పను. శివలింగమును, శాలగ్రామళీలను, శంఖమును, దీపమును, రత్నమును, మాణిక్యముమ, యజ్ఞ సూత్రమును, పుష్పముమ, పుస్తకమును, తులసీదళమును, జపమాలను, పుష్పమాలను, కర్పూరమును, బంగారమును, గోరోచనముమ, చందనమును, సాలగ్రామజలమును మాత్రము ఏమాత్రము మోయలేను. అనగా వీటిని భూమిపై పరాసరి పెట్టకుండ ఏ ఆకో, ఏ పీటనో వేసి వాటిపై పెట్టవలెను.
శ్రీ భగవానువాచ- భగవంతుడైన నారాయణుడిట్లనెను-
ఓ భూదేవీ! నీవు పేర్కొనిన ద్రవ్యములను జ్ఞానము లేక ఎవడు భూమిపై ఉంచునో వాడు మారు సంవత్సరములు నరకలోకమున నుండును అని చెప్పి ఊరకుండెను.
భూదేవి విష్ణువూర్తియొక్క తేజస్సుచే మంచి తేజస్సుగల కుజుని కన్నది. శ్రీహరియొక్క ఆజ్ఞపై దేవతలందరు భూమిని పూజించిరి. కాణ్వశాఖలో చెప్పబడిన పద్ధతి ప్రకారము ఆమెను ధ్యానించి స్తుతించిరి. అట్లే మూలమంత్రముతో నైవేద్యము మొదలగు వాటినిచ్చిరి.
ఈవిధముగా భూదేవి మూడులోకములయందు పూజనీయురాలాయెను.
నారద ఉవాచ- నారదుడిట్లు పలికెను-
భూదేవతా ధ్యాన మేవిధముగానుండును? ప్రోత్ర పద్దతి, ఆదేవతయొక్క మూలమంత్రము మొదలగునవి పురాణములలో నీగూఢముగా నున్నవి. వాటిని తెలుసుకొనవలెనను కుతూహలము నాకు గలదు అని అడి గెను.
నారాయణ ఉవాచ- నారాయణుడిట్లు పలికెను-
భూదేవిని తొలుత వరాహమూర్తి పూజించెను. అటుపిమ్మట బ్రహ్మదేవుడు, అతని తర్వాత పృథు చక్రవర్తి, ఆ తర్వాత దేవతలు, మునులు, మానవులు భూమిని పూజించిరి. భూదేవత మూలమంత్రము ధ్యానమంత్రము స్తోత్రము ఈ విధముగా ఉన్నవి.
"ఓం హ్రీం శ్రీం వాం వసుధాయై స్వాహా" అనునది మూలమంత్రము. తెల్లని చంపకపుష్పములవంటి శరీరము కలది, మారు చంద్రులతో సమానమైన కాంతి గలది, శరీరరమునందంతట చందనము కలది! సర్వ భూషణములను ధరించినది, రత్నములకు ఆధారమైనది, రత్నగర్భ, సముద్రములతో నున్నది, మేలిమి బంగారము వంటి వస్త్రములు ధరించునది, చిరునవ్వుతో కూడుకున్నది. ఆగు భూదేవిని నేను ధ్యానింతును. ఇది ధ్యానశ్లోకము,
ఈధ్యానశ్లోకముతో భూదేవి సమస్తజనులచే పూజింపబడినది. ఇక కాణ్వ శాఖయందు చెప్పబడిన స్తోత్రము ఈప్రకారముగా ఉన్నది.
విష్ణురువాచ- విష్ణుమూర్తి ఇట్లు పలికెను-
ఓ భూదేవి ! నీవు యజ్ఞవరాహమునకు భార్యవు. నీవు నాకు సర్వకార్యములందు జయము కలునట్లు చేయుము. నీవు జయ స్వరూపిణివి ఆజయ స్వరూపిణివి కూడ. నీవు జయమునిచ్చుదానవు. జయశీలవు. సమస్త చరాచరసృష్టికి ఆధారభూతురాలపు, సమస్తమునకు కారణభూతురాలవు, సర్వశక్తి సమన్వితవు. అన్నికోరికలు తీర్చుదానవు, స్థిరముగా ఉండుదానవు. సమస్త సస్యములకు నీలయమైనదానవు, సమస్త సస్యముల నిచ్చుదానవు. సమస్త సస్యములను హరించుదానవు, సర్వ సస్య స్వరూపిణివి. నీవు మంగళ స్వరూపవు. మంగళ వస్తువులకు ఆధారభూతవు. మంగళములనిచ్చు నీవు మాకు మంగళములనొసగుము. ఓ భూదేవి! నీవు రాజులకు సర్వస్వమవు, రాజుల యొక్క ఆహంకార రూపిణివి. అట్టి నీవు మాకు భూ సమృద్ధిని కలుగజేయుము.
ఆత్యంత పుణ్యప్రదమైన పృథివీ స్తోత్రమును భూపూజ చేసి పఠించినచో కోటి జన్మలలో చేసిన పాసమంతయు నాశనమగును. అతడు చక్రవర్తిగా కూడ కాగలడు. అట్లే ఈ స్తోత్రమును పఠించినందువలన భూమి దానము చేసిన పుణ్యమును పొందును. ఇతరులకు దానము చేయబడిన భూమిని అపహరించినందువలన కలుగు పాపము తోలగును. భూమీని త్రవ్వినచో కలుగు పాపము, దిగుడుబావులలో మైల ఉంటుకొనిన పాదములనుంచి కడుగుకొనినచో కలుగు పాపము, ఇతరుల ఇంటిలో శ్రాద్ధము చేసినందువలన కలుగు పాపము, భూమిపై వీర్య జ్యోగము చేసినందువలన, దీపాదీ ద్రవ్యములనుంచి నందువలన కలుగు పాపములన్నితొలగును. ఆంతేకాక ఈ స్తోత్రమును పఠించినందువలన నూరు అశ్వమేధయాగములు చేసినచో కలుగు ఫలితము లభించును.
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణ సంవాదమందున్న పృథివ్యుపాఖ్యానములో పృథివీస్తోత్రమను ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
