భాగవత మహా పురాణము
77 - శాల్వుని ఉద్ధారము
శ్రీశుక ఉవాచ ।
శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- ఆ ప్రద్యుమ్నుడైతే నీటిని త్రాగి కవచము వేసుకొని ధనుస్సు పట్టుకొని సారథితో నిట్లనెను -- నన్ను వీరుడగు ద్యుమంతుని సమీపమునకు తీసుకుపొమ్ము.
రుక్మిణి పుత్రుడగు ప్రద్యుమ్నుడు తన సైన్యములను చెదరగొట్టుచున్న ద్యుమంతుని అడ్డుకొని, చిరునవ్వుతో ఎనిమిది బాణములను వేసి కొట్టెను.
ఆయన నాలుగు బాణములతో నాలుగు గుర్రములను, ఒక్కొక్క బాణముతో సారథిని, ధనుస్సును, ధ్వజమును కూడ కొట్టి, మరియొక బాణముతో తలను ఊడగొట్టెను. (వెరసి యెనిమిది).
గదుడు, సాత్యకి, సాంబుడు, చారుదేష్ణుడు మొదలైనవారు సౌభవిమానప్రభుడగు శాల్వుని సైన్యమును మట్టుబెట్టిరి. సౌభమునందలివారు మెడలు తెగి సముద్రమునందు పడిరి.
ఈ విధముగా పరస్పరము సంహరించుకొనుచున్న యాదవులకు, శాల్వపక్షీయులకు ఆ భయంకరమైన దొమ్మి యుద్ధము ఇరవై ఏడు రోజులు జరిగెను.
ధర్మరాజు ఆహ్వానమునందుకొని శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థమునకు వెళ్లాను. అచట రాజసూయము జరిగెను. దానిలో శిశుపాలుడు వధించబడెను. తరువాత ఆయన కురువంశములోని పెద్దలు, మహర్షులు, పాండవులు, కుంతల వద్ద సెలవు తీసుకొని ద్వారకకు వెళ్లాను. ఆపుడాయనకు ఘోరములైన శకునములు కనబడెను.
ఆయన తనలో ఇట్లు - తలపోసెను నేను పూజనీయులగు అన్నగారితో కూడి ఈ హస్తినాపురమునకు వచ్చితిని. చేదిరాజగు శిశుపాలుని పక్షమునకు చెందినవారు నిశ్చయముగా నా ద్వారకకు నష్టము కలిగించియుందురు.
శ్రీకృష్ణ భగవానుడు తన వారు చేయుచున్న ఆ యుద్దమును, సౌభవిమానమును, శాల్వరాజును చూచెను. ఆయన బలరాముని నగరరక్షణకు నియోగించి, సారథియగు దారుకునితో నిట్లనెను.
ఓ సారథీ! నా రథమును శీఘ్రమే నిశ్చయముగా శాల్వుని వద్దకు నడుపుము. నీవు భయపడవద్దు. సౌభవిమానాధిపతియగు ఈ శాల్వుడు మాయావి.
ఆయన ఇట్లు పలుకగా, దారుకుడు రథమునెక్కి యుద్ధభూమిలోనికి నడి పెను. ధ్వజము పైనుండే అరుణుని సోదరుడగు గరుడుని చూచి శ్రీకృష్ణ పక్షీయులు, శాల్వపక్షీయులు అందరు శ్రీకృష్ణుని గుర్తించిరి.
శాల్వుని సైన్యము ఇంచుమించు నష్ట మైనది. ఆతడు కూడ యుద్ధములో శ్రీకృష్ణుని చూచేను. ఆతడు శ్రీకృష్ణుని సారథిపై భయమును గొల్పే శబ్దమును చేయుచున్న బల్లెమును విసి రెను.
ఆకాశమునందు పెద్ద ఉలవలె దిక్కులను ప్రకాశింపజేస్తూ మీద వచ్చి పడుచున్న ఆ బల్లెమును కృష్ణుడు బాణములతో వంద ముక్కలు చేసెను.
ఆయన ఆ శాల్వుని కూడ పదహారు బాణములతో కొట్టెను. సూర్యుడు ఆకాశమును కిరణములతో నింపునట్లుగా ఆయన బాణముల గుంపులతో ఆకాశములో తిరుగుచున్న సౌభవిమానమును కొట్టెను.
శాల్వుడైతే శార్ఙమనే ధనుస్సు గల శ్రీకృష్ణుని ధనుస్సుతో కూడిన ఎడమ చేతిని బాణముతో కొట్టగా, ధనుస్సు చేతినుండి క్రింద పడెను. ఆ ఘటన ఆశ్చర్యమును కలిగించెను.
అచట యుద్ధమును తిలకించుచున్న ప్రాణులు పెద్ద హాహాకారమును చేసిరి. సౌభవిమానమునకు ప్రభుడగు శాల్వుడు బిగ్గరగా సింహనాదమును చేసి, దుష్టజనశిక్షకుడగు శ్రీకృష్ణునితో నిట్లనెను.
ఓ మూర్ఖ! రుక్మిణి మా మిత్రుడు, అన్న అగు శిశుపాలునకు భార్య కావలసియుండగా, నీవామేను మేము చూచుచుండగనే లెక్క చేయకుండా అపహరించితివి. పైగా, ఆ మా మిత్రుడు యుద్ధమునకు సంసిద్ధుడై లేని సమయములో, సభ మధ్యలో నీవాతనిని సంహరించితివి. అందువలన ---
నాకు పరాజయము లేదని గర్వించే అట్టి (మిత్రహాంతకుడవైన) నిన్ను ఇప్పుడు -- నీవు నా యెదుట నిలబడే పక్షములో -- వాడి బాణములతో తిరిగి రాని స్థానము (మృత్యువు) నకు పంపెదను.
శ్రీభగవానువాచ।
ఓ మూడా! నీవు వ్యర్థముగా వదరుచున్నావు. దగ్గరలోనున్న మృత్యువును చూడకున్నావు. శూరులు పురుషకారమును చూ పేద రే గాని, అధికప్రసంగమును చేయరు.
శ్రీకృష్ణ భగవానుడు కోపముతో నిట్లు పలికి భయంకరమగు వేగము గల గదతో శాల్వుని కొంకులపై కొట్టగా, ఆతడు రక్తమును క్రక్కుకుంటూ వణికిపోయెను.
గద తిరిగి శ్రీకృష్ణుని వద్దకు రాగా, శాల్వుడైతే అంతర్ధానమాయెను. తరువాత రెండు ఘడియల సమయము గడిచేను. అంతలో ఒక వ్యక్తి వచ్చి శ్రీకృష్ణ భగవానునకు తల వంచి నమస్కరించి ఏడుస్తూ ఇట్లు పలికెను -- నన్ను దేవకీ దేవి పంపినది.
ఓ శ్రీకృష్ణా! శ్రీకృష్ణా! నీవు గొప్ప భుజశక్తి, తండ్రియందు అధికమగు ప్రేమ గలవాడవు. శాల్వుడు నీ తండ్రిని కట్టి, కసాయి పశువును వలె, లాగుకొని వెళ్లినాడు.
ఆ అప్రియవార్తను విని శ్రీకృష్ణుడు ప్రేమ కారణముగా మానవుల స్వభావమును పొందెను. వసుదేవునిపై దయచే ఆయన మనస్సు చెడిపోయేను. ఆయన ప్రాకృతమానవుడు వోలే ఇట్లు పలి కెను.
బలరాముడు అజాగ్రత్తనేరుగడు. ఆయనను దేవతలు, రాక్షసులు కూడ జయించలేరు. మిక్కిలి అల్పుడగు శాల్వుడు ఆయనను ఎట్లు జయించి నా తండ్రిని చెరబట్టినాడు? విధి బలీయము.
శ్రీకృష్ణుడీ విధముగా పలుకుచుండగనే సౌభవిమానమునకు ప్రభుడగు శాల్వుడు ఆవిర్భవించెను. ఆతడు వసుదేవుని పోలినవానిని తీసుకువచ్చి శ్రీకృష్ణునితో నిట్లు పలికెను.
ఓ మూర్ఖా! ఈతడు నీకు జన్మనిచ్చిన తండ్రి. నీవు ఈయన కొరకే ఈ లోకములో జీవించుచున్నావు. నీవు చూచుచుండగనే నేను ఈయనను సంహరించెదను. శక్తి ఉన్నవాడవైనచో, కాపాడుము.
మాయావియగు శాల్వుడు శ్రీకృష్ణుని ఈ విధముగా నీరసించి, కత్తితో వసుదేవుని తలను నరికి, దానిని తీసుకొని ఆకాశమునందున్న సౌభవిమానమును ప్రవేశించెను.
శ్రీకృష్ణుడు స్వయంసిద్ధ జ్ఞానస్వరూపుడు. కాని, తనవారియందలి ఆసక్తిచే ఆయన రెండు ఘడియల కాలము ప్రకృతికార్యమగు దేహభావమునందు మునిగి యుండెను. కాని, ఆ మహానుభావుడు అది శాల్వునిచే ప్రసరింపజేయబడిన అసురుల మాయయని గుర్తించెను. ఆ మాయ మయుడు నేర్పినది.
స్వప్నములో కనబడిన వస్తువులు నిద్ర లేచేక కనబడవు. అదే విధముగా, శ్రీకృష్ణ భగవానుడు తన సహజస్థితిని పొంది చూడగా అక్కడ యుద్ధభూమిలో దేవకీ పంపిన దూత గాని, తండ్రి మొండెము గాని కనబడ లేదు. కాని, ఆకాశములో సంచరిస్తూ సౌభమనే విమానమునందు శత్రువు శాల్వుడు కనబడెను. అపుడాయన వానిని వధించుటకు ఉద్యుక్తుడాయెను.
ఓ పరీక్షిన్మహారాజా! నీవు రాజువే గాక ఋషివి కూడా. పూర్వాపరవిచారము లేని కొందరు మహర్షులు ఈ పైన చెప్పిన విధముగా వర్ణించుచున్నారు. కాని, వారు తమ వచనములలోని విరోధమును గుర్తించలేకున్నారు సుమా! ఇది నిశ్చయము.
అజ్ఞానులయందు ఉదయించే శోకము, మోహము, ఆసక్తి, భయము ఎక్కడ? ఖండితము కాని జ్ఞానము (శాస్త్రార్థపరిజ్ఞానము), విజ్ఞానము (అనుభవము), ఈశ్వరభావము గల పూర్ఖుడగు శ్రీకృష్ణ భగవానుడెక్కడ?
శ్రీకృష్ణ భగవానుని పాదముల సేవచే ఆత్మజ్ఞానము వర్ధిల్లి సాధకులు అనాదియైన ఆత్మ-అనాత్మ-అవివేకమనే పిశాచమును పారద్రోలెదరు. వారు ఆ ఈశ్వరుని కాలాతీతమగు ఆత్మనుగా సాక్షాత్కరించుకొనెదరు. సత్పురుషులచే పొందబడే ఆ పరమాత్మకు మోహమెక్కడిది?
శాల్వుడు ఆయుధముల గుంపులతో బలముగా కొట్టుచుండెను. ఆత నిని మొక్కవోని పరాక్రమము గల శ్రీకృష్ణుడు బాణములతో కొట్టి కవచ మును, ధనుస్సును, తల పైనుండే మణిని కూడ ఛిన్నాభిన్నము చేసెను. ఆయన ఆ శత్రువుయొక్క సౌభవిమానమును గదతో పగులగొట్టెను.
శ్రీకృష్ణుడు తన చేతినుండి ప్రయోగించిన గద ఆ విమానమును వేయి ముక్కలుగా చూర్ణము చేయగా, అది నీటిలో పడిపోయేను. శాల్వుడు దానిని వదిలి పెట్టి నేల పైకి దిగెను. ఆతడు గదను పైకెత్తి వేగముగా శ్రీకృష్ణ భగవానుని పైకి దూసుకు వెళ్లెను.
మీదకు దూసుకువచ్చుచున్న ఆ శాల్వుని గదతో కూడిన చేతిని శ్రీకృష్ణుడు బల్లెమువంటి బాణముతో నరి కెను. అపుడాయన వానిని వధించుటకై ప్రళయకాలమునందలి సూర్యుని పోలియున్న చక్రమును చేతిలోనికి తీసుకోనెను. అచ్చెరువును గొలిపే ఆ చక్రముతో ఆయన, సూర్యునితో కూడియున్న ఉదయపర్వతము వలె ప్రకాశించెను.
శ్రీకృష్ణ భగవానుడు అదే చక్రముతో, ఇంద్రుడు వజ్రముతో వృత్రా. సురుని తలను వలె, కిరీటకుండలములతో కూడిన మహామాయావియగు శాల్వుని తలను నరికెను. అప్పుడు జనులు హాహాకారములను చేసిరి.
శ్రీమద్భాగవతమహాపురాణే దశమస్కంధే సప్తసప్తతితమోఽధ్యాయః ॥
ఓ పరీక్షిన్మహారాజా! పాపియగు ఆ శాల్వుడు నేలగూలెను. వాని సౌభమనే విమానము కూడ గదచే చూర్ణము చేయబడెను. అంతరిక్షములో దేవగణములు భేరీలను మ్రోగించిరి. మిత్రుల పగను తీర్చుటకై దంతవక్త్రుడు వచ్చెను.
శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్దములో శాల్వుని ఉద్ధారమును వర్ణించే డెబ్బది ఏడవ అధ్యాయము ముగిసినది (77).
Summary of chapter 77 of the Bhāgavata Mahā Purana is as follows:
Following the destruction of the Saubha airship, Śālva's ally Dantavakra (the king of Karūsha and an expansion of the Vaikuṇṭha gatekeeper Vijaya) arrived on the battlefield holding a heavy mace to challenge Kṛshṇa. Śrī Kṛshṇa stepped down from His chariot and met Dantavakra in single combat. Kṛshṇa struck Dantavakra's chest with His Kaumodakī mace, shattering his heart and killing him instantly. As with Śiśupāla, a radiant spiritual spark emerged from Dantavakra's body and merged into Kṛshṇa's lotus feet. Kṛshṇa then killed Dantavakra's brother Vidūratha, successfully completing the elimination of the major asuric tyrants who burdened the earth.