మూ ॥ నారాయణ ఉవాచ :
శ్రీమహాదేవ ఉవాచ :
శ్రీమహాదేవ ఉవాచ :
అను ॥ నారాయణుడిట్లా - పార్వతి మాటనువిని గణేశుడు, శివుడు, కార్తికేయుడు, కాళి వీరలు ఆమెను ప్రశంసించారు. (1) భగవాన్ శంభుడు, పరురాలు జగత్తునకు మాతయైనది, జ్యోతి స్వరూపురాలు, పరమమైన మూలప్రకృతి, ఈశ్వరితో ఇట్లన్నాడు. (2) శ్రీమహాదేవుడిట్లా - ఓదేవేశ! నీవేది చెప్పావో అదంతా వేదోక్తమైనది, కోరతగినది. పరమాత్మతో సమరము, అయుక్తము, నవ్వతగినది. (3) సర్వభూషణములతో అలంకరింపబడ్డ ఆ కన్యకను బాణుడు ఇవ్వాలి. అది సమంజసము. కీర్తికరము, శుభాన్నిచ్చేది అని కర్మలలో (4) బాణుడు ఇవ్వకపోతే హిరణ్యకశిపుని సంతానము బాణుడు యుద్ధంలో పరాజ్ ముఖుడై, భయపడిపోతాడు. ఇది అపకీర్తికరము, ఓభగవతి! (5) రణశాస్త్ర విశారదుడైన బాణుడు సన్నద్ధుడై వెళ్ళని. ఓశివ! (పార్వతి) మేము బాణధారులము తరువాత తిరిగి వచ్చేట్లు చేస్తాము. (6) ఆమెను ఇవ్వమని బాణునితో చెప్పాము. కాని ఆతడు స్వీకరించలేదు. దుర్గ ఆతనికి బోధించింది. కాని ఆ మంచి మాటలను తెలుసుకోలేదు. (7) ఇంతలో ఈమనోరమమైన సభకే మహాధర్ముడు, వైష్ణవాగ్రణి, ఐన బలి వచ్చాడు. (8) వజ్రములతో నిర్మింపబడ్డ రథాన్ని ఎక్కి మహాబలుడు ఏడుగురు దైత్యులతో చుట్టబడి శ్వేతచామరములతో సేవింపబడుతూ (9) ఏడు లక్షల దైత్యేంద్రులు ఆవరించగా పరమ అస్త్రములను ఎరిగినవాడు వచ్చి, రథమునుండి వేగంగా దిగివచ్చి, గణేశునకు, పార్వతికి, శివునకు (10) కార్తికేయునకు నమస్కరించి ఆతడు సభలో కూర్చున్నాడు. ఆతనిని దూరం నుండే చూచి శంకరుడు తప్ప మిగిలిన వారంతా లేని నిలుచున్నారు. మహాదేవుడు ప్రియభాషణము చేసి, ఆతనితో అన్నాడు. (11) శ్రీమహాదేవుడిట్లా - భగవాన్! నీవు చతురుడవు. సర్వసంపదలనిచ్చేవాడివి. (12) వైష్ణవుల సమాగమమిది గొప్పలాభకారి. వైష్ణవుని స్పర్శ మాత్రముతో తీర్థములు కూడా పవిత్రమౌతాయి. (13) అన్ని ఆశ్రమములందు శుచియైనవాడు, బ్రాహ్మణుడు పూజితుడు. ఒకవేళ ఆ బ్రాహ్మణుడు వైష్ణవ మతస్థుడైతే అధికంగా పూజింపతగివాడు. (14) వైష్ణవుడైన బ్రాహ్మణుని కన్న పవిత్రమైనది లేదు. ఆతడు గాలికన్న పవిత్రుడు. అగ్నికన్న పవిత్రుడు. (15)
బలిరువాచ :
బలిరువాచ :
ఓఅసుర! సర్వతీర్ధములకంటెను ఆతని నుండి భయపడుతాను. ఆతని దేహంలో పాపాలు వహ్నిలో ఎండిన గడ్డిపోచలు మొదలగువానివలె బూడిదౌతాయి.(16) బలిఇట్లా - ఓ జగన్నాథ! మహేశ్వర! నేను నీభృత్యుణ్ణి, ఎట్లా స్తుతిస్తున్నావు. ఓనాథ! నీవిచ్చిన పరమ ఐశ్వర్యము చాలా దుర్లభమైనది. (17) దైవంవల్ల ఈవేళ అన్నింటికన్న క్రింద సుతలంలో ఉంచబడ్డాను. ఓసురేశ్వర! భక్తుడనైన నానుండి ఐశ్వర్యాన్ని తీసి ఇంద్రునికిచ్చావు. (18) నీవు వామనరూపంలో ఇట్లా చేశావు. అంతట అన్ని రూపాల్లో ఉన్నావు. నాప్రాణము, ఆత్మజుడు, ముఖ్యుడు ఐన. బాణునకు మంచి బోధించు. (19) ఆత్మతో సహా యుద్దము దేవతలందును నిందించతగినది. అని పలికి, శివునకు నమస్కరించాడు, ఆ శివునకు శిరస్సువంచి నమస్కరించాడు. (20) సామవేదంలో చెప్పబడ్డ స్తోత్రంతో పరమేశ్వరుని స్తుతించాడు. ఆతని శరీరం అంతా పులకలతో నిండిపోయింది. కళ్ళవెంట కన్నీళ్ళొచ్చాయి. చాలా చంచలంగా ఉన్నాడు. (21) ప్రతిరోజు హృదయ పద్మంలో ధ్యానించగా, మనోహరంగా ఉండేవాడు. శుక్రుడిచ్చిన మంత్రాన్ని జపించి, ఏకాదశాక్షరిని జపించి ఉండేవాడు. (22) బలి ఇట్లా - అదితి ప్రార్ధనతో, మాతయైన దేవివ్రతంతో ఇదివరలో వామనరూపంలో నీవు నన్ను వంచించావు, ఓ ప్రభు! (23) సంపద రూపమైన మహాలక్ష్మిని భక్తునకు భక్తితో ఇచ్చావు. నాకంటే భక్తుడైన ఇంద్రునకు నాభ్రతకు, పుణ్యవంతునకు ఇచ్చావు, నిశ్చయము. (24) ఇప్పుడు వీడు నా పుత్రుడు. బాణుడు శంకరుని సేవకుడు. ఆభక్త బంధుత్వంతోనే దూరం నుండి ఆతనిని రక్షించావు. (25) తల్లితో సుతుడువలె పార్వతితో ఈతడు పరిపుష్టుడయ్యాడు. యువతి, సతి, ఐన ఆతని కన్యను బలవంతంగా గ్రహించావు. (26) కార్తికుడు వారించినా వాడిని చంపటానికి సిద్దమైనావు. పౌత్రుని దమనమందు సమర్థుడవై తిరిగి చంపటానికి వచ్చావు. (27) సర్వాత్ముడవు, అంతటా సమానమైన భావనగల వాడివని వేదములలో విన్నాము. ఓ జగన్నాథ! ఇట్లా వ్యతిక్రమము ఎందుకు చేస్తున్నావు. (28) నీతో చంపబడేవాడికి లోకంలో రక్షకుడెవ్వడు. సుదర్శనము యొక్క తేజము కోటిసూర్యుల కాంతిగలది, పరమైనది. (29) సురల యొక్క ఎవ్వని అస్త్రముతోను, అది ఇట్లా నివారింపబడేదికాదు. ఆసుదర్శనాస్త్రము అట్టిది. అస్త్రములలో శ్రేష్ఠమైనది, ఇష్టమైనది. (30)
అను II అట్లాగే నీవు దేవతలందరికి ఈశ్వరుడు, పరుడవు, నీవెట్లాగో కృష్ణుడట్లాగే బ్రహ్మలకు బ్రహ్మ. (31) విష్ణువు సత్వగుణమునకు ఆధారము. శివుడు మంగళుడు సత్వమునాశ్రయించినవాడు, విధాత, సృష్టికర్త పితామహుడు స్వయంగా రజోగుణమునకు ఆధారము. (32) కాలాగ్ని స్వరూపుడు రుద్రుడు భగవాన్ విశ్వసంహారానికి కారకుడు తమస్సున కాశ్రయమైనవాడు. ఆతడు కూడా రుద్రులకు శ్రేష్ఠుడు గొప్పవాడు. (33) ఆతడే శంకరాంశ. ఇతర రుద్రులు ఆతని కళలే. నీవు నిర్గుణుడవు. వారికి ప్రకృతికి పరుడవు. (34) విశ్వస్వరూపులైన అందరికి పరమాత్మప్రాణము. బ్రహ్మ మానసము. శివుడు జ్ఞానాత్మకుడు. (35) శ్రేష్ఠురాలు అన్ని శక్తులకు, బుద్ది, ఈశ్వరి ప్రకృతి. అన్ని దేహములు కలవారి యందుకలజీవుడు, నీ ఆత్మకు ప్రతిబింబము. (36) జీవుడు తన కర్మఫలాన్ని అనుభవించేవాడు. నీవు స్వయంగా సాక్షివి. నీవుపోతే అందరూ పోతారు, రాజు వెంట ఆతని అనుచరులలాగ (37) నీవు లేక పోతే దేహముపడిపోతుంది. శవము, అస్పృశ్యము, తెలిసిన సజ్జనులు తెలుసుకోలేకపోతున్నారు. నీ మాయతో మోసగింపబడ్డారు. (38) నిన్ను భజించే సజ్జనులు, వారు ఈమాయను తరిస్తారు. ప్రకృతి మూడురకాలు, దుర్గ, వైష్ణవి, సనాతని అని. (39) నారాయణి వీరికన్న పరమైనది, ఓ ఈశానీ నీమాయదాటరానిది. ప్రతి విశ్వము లందు బ్రహ్మవిష్ణు శివాత్మకులు నీ అంశమే. (40) విశ్వములకన్నిటికి ఆశ్రయుడు ఆమహావిరాట్టు ఐనవాడు విశ్వేశుడు, యోగంతో నీటియందు పడుకుంటాడు, గోకులంలో పడుకున్నట్టు (41) ఆతడే వాసువు అనే భగవంతుడు. ఆతని దేవుడవు నీవు పరుడవు. వాసుదేవుడు అని ఖ్యాతినందాడు. తెలిసిన ప్రాచీలు చెబుతారు. (42) కలతో (భాగం) నీవే సూర్యుడివి. కళతో నీవే చంద్రుడివి. కళతో అగ్నివి. కళతో వాయువువు. (43) కళతో వరుణుడవు, కుబేరుడవు, యముడవు. కలతో నీవు మ హేంద్రుడవు, కళతో ధర్ముడవు (44) నీవే కళతో శ్రేష్టుడవు, ఈశానుడవు, నైఋతివి. మునులు, మనువులు, గ్రహములు వీరంతా ఫలమిచ్చేవారు. (45) కళ, కళ యొక్క అంశభాగంతోనే చరాచరజీవులంతా, నీవు బ్రహ్మవు. పరమజ్యోతివి. యోగులు ఎల్లప్పుడు ధ్యానిస్తుంటారు. (46)
నీభక్తులు ఆతనిని ఆదరిస్తున్నారు. అతనిని అంతరంలో ధ్యానిస్తున్నారు. వర్షాకాల మేఘంవలె శ్యాముడు, పచ్చని పట్టుబట్ట వస్త్రంగా గలవాడు. (47) కొద్దిగా నవ్వుతున్న ప్రసన్నమైన ముఖం కలవాడు, భక్తులకు ఈశుడు, భక్తుల పై వాత్సల్యం కలవాడు, ఒంటి నిండా చందనం పూసుకున్నవాడు, రెండు చేతులవాడు, మురళీధరుడు, (48) నెమిలి ఫించము తల పై గలవాడు, మాలతి మాలతో అలంకరింపబడినవాడు. అమూల్యమైన రత్నములతో నిర్మింపబడ్డ కేయూర, వలయాభరణములు కలవాడు (49) మణులతో చేసిన రెండు కుండలములు చెక్కిళ్ళ పై ప్రకాశిస్తున్నాయి. వజ్రముల ఉంగరము, శబ్దిస్తున్న కాలి అందెలు వీనితో ప్రకాశిస్తున్నాడు. (50) కోటి మన్మథుల లీలవంటి కాంతిగలవాడు, శరత్కాల పూర్ణచంద్రుని నిందించే ముఖం కలవాడు, కోటి చంద్రులతో సమానమైన కాంతిగలవాడు. (51) గోపికలు కోట్ల కోట్లకొలది చిరునవ్వునవ్వుతూ చూస్తున్నారాయనను. వయస్యులు, పక్కనున్న గోపాలురు తెల్లని చామరలతో సేవిస్తున్నారు. (52) గోపలబాలుని వేషంలో ఉన్నాడు. రాధవక్షఃస్థలమందున్నాడు. ధ్యానమునకు సాధ్యంకాడు, ఆరాధించుటకు కష్టమైనవాడు. బ్రహ్మ ఈశ, శేషులతో నమస్కరింపబడేవాడు. (53) సిద్దేంద్రులు, మునీంద్రులు, యోగీంద్రులు వీరంతా నమస్కరిస్తూ స్తుతిస్తారు. వేదములచే నిర్వచింపరానివాడు, పరుడు స్వేచ్ఛామయుడు, విభువు. (54) స్థూలముకన్న స్టూలతమమైన రూపము, సూక్ష్మముకన్న సూక్ష్మతర రూపం కలవాడు, పరుడు, సత్యస్వరూపుడు, నిత్యుడు, ప్రశస్తుడు. ప్రకృతికన్నపరుడు, ఈశ్వరుడు. (55) నిర్లిప్తుడు, నిరీహుడు, భగవంతుడు, సనాతనుడు. ఇట్లా ధ్యానించి వారంతా పవిత్రులైనారు. మృదువైన దూర్వ అక్షతలు, జలముతో ధ్యానించారు. (56) లక్ష్మిపద్మములతో అర్చించిన పాదపద్మమందు దూర్వ అక్షతలు ఉంచుటకు ఇచ్చగించారు. నిన్ను వేదములు స్తుతించుటకు అశక్తములు. ఆసరస్వతి అశక్తురాలు. (57) శేషుడు స్తుతించుటకు అశక్తుడు. స్వయంభువు, శంభుడు, ఈశ్వరునిస్తుతించలేరు. గణేశుడు, దినేశుడు, మహేంద్రుడు కూడా స్తుతించలేరు. (58) కుబేరుడు స్తుతించలేడు. జడబుధులైన ఇతరుల గూర్చి చెప్పేదేముంది. గుణాతీతుడు, కోరికలు లేనివాడు, పరుడు నిరుణుడు, ఆతనిని ఏం స్తుతిస్తాను. (59) ఈ అసురుడు అపండితుడు. సురుడు (దేవత) కాడు. క్షమించతగినవాడు బలిమాటను విని జగత్పతి అతనితో అన్నాడు. శ్రీమాన్,పరిపూర్ణతముడు, భక్తవత్సలుడు, ఆతడు భక్తునితో. (60)
మూII శ్రీభగవానువాచ :
అను । భగవానుడిట్లా –
భయపడకు, ఓవత్స! ఇంటికి వెళ్ళు. నేను సుతలాన్ని రక్షించాను. (61) నా ప్రసాదంతో, వరంతోనీపుత్రుడు అజరామరుడౌతాడు. మూర్ఖుడు, దర్పంగల ఆతనికి దర్పహాని చేస్తాను. (62) భక్తుడు, తపస్విఐన ప్రహ్లాదునకు వరమిచ్చాను. సంతోషమైన మనస్సుతో అన్నాను. నీ వంశము వారిని నేనుచంపను అని. (63) నీ పుత్రునకు మృత్యుంజయమైన పరమైన జ్ఞానాన్ని ఇస్తాను. నీవు చేసిన ఈస్తోత్రము సామవేదమందు చెప్పబడినది. ఇష్టమైనది. (64) ఇదివరలో సనత్కుమారునకు బ్రహ్మ ఇచ్చాడు. పుణ్యతమమైన సిద్ధాశ్రమమందు, ప్రశస్తమైన సూర్యపర్వమందు ఇచ్చాడు. (65) గౌరి మందాకిని ఒడ్డుయందు గౌతమునకు ఇచ్చింది. శంకరుడు, శిష్యునకు భక్తునకు దయాళువై ఇచ్చాడు. (66) విరజాతటమందు శివునకు బ్రహ్మకునేనిచ్చాను, ధీమంతుడైన కుమారుడు (స్వామి) భృగువునకు ఇదివరలో ఇచ్చాడు. (67) బాణునకు నీకు ఇస్తున్నాను. బాణుడు దీనితో నన్ను స్తుతిస్తాడు. ఈస్తోత్రము మహాపుణ్యమైనది. గురుముఖం నుండి ఉపదేశం పొంది (68) ఎన్నుకొనబడి, వస్త్రచందనభూషణములతో పూజింపబడిన వానికి మహాపుణ్యము. స్నానం చేసి రోజు చదివేవాడు. పూజాకాలంలో భక్తితో చదివేవాడు. (69) కోటిజన్మలలో వచ్చిన పాపంనుండి ముక్తుడౌతాడు. ఇందులో అనుమానం లేదు. స్తోత్రము ఆపత్తులను ఖండిస్తుంది. అన్ని సంపదలకు కారణము (70) దుఃఖశోకములను నివారిస్తుంది, భవసాగరంనుండి ఘోరమైన దానినుండి దాటిస్తుంది. గర్భవాసాన్ని ఖండిస్తుంది. జర, మృత్యువులను హరిస్తుంది. పరమైనది. (71) బంధనములు,రోగములు వీటిని ఖండిస్తుంది. భక్తులకు అలంకారము. దీనిని పఠించినవాడు అన్ని తీర్థములలో స్నానం చేసినట్టు, అన్ని యజ్ఞములలో దీక్షితుడైనట్లు (72) అన్ని వ్రతములలో వ్రతమాచరించినవాడు, తపస్సుచేసిన వారిలో తపస్వి. అన్నిదానముల ఫలం పొందుతారు. అదే సత్యము. (73) లక్షసార్లు స్తోత్రం పఠిస్తే నరులకు స్తోత్ర సిద్ధిఔతుంది. అన్ని సిద్ధులను పొందుతాడు, ఒకవేళ స్తోత్రం సిద్ధించిన వాడైతే (74) ఈలోకంలో దేవతలతుల్యుడు. చివర హరిస్థానానికి పోతాడు. (75)
అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధ మందు నారాయణ నారద సంవాదమందు బాణయుద్ధమందు బలిచేసిన శ్రీకృష్ణ స్తోత్ర మనునది నూట పందొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 119 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Summarizing the core theology of the Purāṇa, this confidential chapter expounds upon the absolute non-difference between Goddess Śrī Rādhā and Lord Śrī Kṛshṇa. They are the supreme non-dual truth expressed as energy and the energetic source, existing eternally as one soul in two physical forms to taste the infinite sweetness of divine love, inviting all living beings to return to their eternal spiritual home.