మూ॥శ్రీ నారాయణ ఉవాచ :
నహుష ఉవాచ:
నారాయణుడిట్లన్నాడు: ఈ విధముగా అందరి .గర్వ భంగమును అంతా చెప్పాను. ఇంద్రుని గర్వభంగమును విస్తారంగా వినండి (1) ఇంద్రుడు దర్పంవల్ల సభలో శ్రేష్ఠమైన రత్న సింహాసనం నుండి లేవలేదు, బ్రహ్మిష్ఠుడైన బృహస్పతిని తన గురువును చూచికూడా లేవలేదు (2) తనకు అవమానం జరుగగా మాత్సర్యం కలవాడై చాలా కోపగించి గురువు వెళ్ళిపోయాడు. అట్లేనాధర్మం కలిగినవాడై కృపతో, స్నేహం వల్లను ఆతనిని శపించలేదు. (3) శాపం లేకుండానే ఆతని దర్పము చూర్ణమైంది. ఇతరుడైతే ధర్మబుద్ధి వల్ల ప్రేమవల్ల నోటి మాటతో అతిపాపాత్ముని శపించడు (4) ఐనా ఆతనికి ఫలితం వస్తుంది. ఓ నారద! ధర్మము వానిని హింసిస్తుంది. హింసించ తగిన సాపరాధుడైన వానిని ధార్మికుడు కోపంతో శపిస్తే (5) అపరాధం చేసిన వాడునశిస్తాడు. ధర్మి యొక్క ధర్మం నశిస్తుంది. ఆధర్మంతో ఇంద్రునకు బ్రహ్మహత్య పాపం కలిగింది. (6) భయపడి ఆతడుతన రాజ్యాన్ని వదలి సరోవరమునకు వెళ్ళాడు. సరస్సులోని తామరతూడు దారంలో తన నివాస మేర్పరచుకున్నాడు, అతడు. (7) హత్యపాపము పోలేకపోయింది. అది పుణ్యమైన విష్ణుసరోవరము, శ్రేష్ఠమైనది. ఈ భారత వర్షంలో, తపస్వులకు తపస్సునకు స్థానము. (8) పురావొదులు దానినే పుష్కర తీర్థమని అంటారు. రాజ్యభ్రష్టుడైన ఇంద్రుని చూచి, హరిభక్తుడైనరాజు (9) ధార్మికుడు నహుషుడనే వాడు బలవంతంగా ఆరాజ్యాన్ని హరించాడు. వరారోహ (గొప్ప పిరుదులు కలది), సంతానము లేనిది, సుందరి ఐన శచీదేవిని చూచాడు. (10) స్వర్గ గంగకు వెళ్తున్నది. హృదయంలో భాధపడుతోంది. నవయౌవనం కలది. రత్న అలంకారములతో అలంకరించుకున్న (11) మిక్కిలి కోమలమైనది, మంచి పలువరుస గలది, ఏదో మాట్లాడుతున్నది, అట్టి మహాసతిని చూచి, ఆ రాజేంద్రుడు యౌవనంతో, కామంతో మూర్ఛనందాడు. ఆమె ఎదురుగా నిలబడి చాలా వినయంగా, దాసుని వలెను ఇట్లా అన్నాడు (12) నషుహునిమాట - ధాతనడక చాలా విచిత్రమైంది సజ్జనులకు గూడా అర్థం కానిది. (13) భగాంగునకు (కోరికలేనివానికి) లుబునకు ఇటువంటి స్త్రీ, పరస్త్రీ యందు నా మనస్సు, ఇలాటి సుందరి ఎవనిదో? నా మనస్సు పరుని భార్య యందు లగ్నమైంది. (14)
ఈమె ముందు,రంభ ఎంతటిది, ఊర్వశి తిలోత్తమ లెంతటివారు మేనక, ఘృతాచి, రత్నమాల, కలావతి (15) కాలిక, సుందరి, భద్రావతి, చంపావతి ఈ అప్సరలంతా, ఇతరులు కూడా ఈమె పదహారవ కళను కూడా పొందలేరు. (16) ఈమెను వదలి మూఢుడు, మందబుద్దివాడైనా ఇతర స్త్రీ నెట్లా చేరుతాడు. మా స్త్రీలంతా చేటిలతో సమానము, అనుమానములేదు: (17) ఓ వరారోహ! నన్ను పొందు, మిక్కిలి ప్రీతిని పొందు, నీకింకరుణ్ణి, గోలోకమందు రాధ ఎట్లా కృష్ణుని వక్షమందు ఉంటుందో '18) వైకుంఠమందు, వైకుంఠుని ఉరమందు లక్ష్మి ఎట్లా ఉందో బ్రహ్మాణి సరస్వతి బ్రహ్మలోక మందు బ్రహ్మ వక్షమందు ఎట్లా ఉందో (19) మహాసాధ్విమూర్తి ఎట్లా ధర్ముని వక్షఃస్థలమందు ఉందో, పాతాలతల లక్ష్మి ఎట్లా అనంతుని వక్షమందు ఉన్నదో (20) గణేశుని యందు పుష్టి ఎట్లా ఉందో, కార్తికేయుని యందు దేవ సేన ఎట్లా ఉందో, వరుణుని యందు ఆతని భార్య (వరుణాని) ఎట్లాగో, అగ్నియందు స్వాహా ఎట్లాగో (21) మన్మథుని యందు రతి ఎట్లానో, సూర్యుని యందు సంజ్ఞ, వాయుపత్ని వాయువు యందు, రోహిణి చంద్రుని యందు, (22) అదితి దేవమాత, మీ అత్త కశ్యపుని యందు, మానసయైన పితృకన్య, మేన హిమవంతుని యందు (23) అగస్త్యుని యందు లోపాముద్ర, బృహస్పతి యందు తార, కర్దముని యందు దేవహూతి, వసిస్తుని యందు అరుంధతి, (24) మనువు యందు శతరూప, నలుని యందు దమయంతి, వీరంతా ఎట్లాగో అట్లాగ ఓ సుందరి! నా వక్షఃస్థలమందు నీవు సౌభాగ్యమంతురాలివి కమ్ము (25) అవలీలగా వేయిమంది ఇంద్రులను ఛేదించుటకు సమర్ధుణ్ణి నేను ఈశ్వరుణ్ణి. స్వామికన్న బలవంతుడైన జారుని స్త్రీ కోరుతుంది. (26) సుమేరుగిరి కూటమందు, దుర్గమమైన అత్యంత రహస్య స్థలమందు, లేదా చందన వాయువుతో రమ్యమైన మలయపర్వతరమ్య ప్రదేశమందు (27) ఓ సురసన! విశ్వసించతగిన నందన కాననమందు కాని, పుష్పభద్రానదీతట మందున్న శతశృంగ పర్వత సమీపమందుకాని, (28) గోదావరి తీరమందలి నీటియందు, చల్లనిగాలి కలిగిన దాని సమీపమందుకాని, చంపావతీ నదీతీరమందలి అందమైన చంపక కాననమందుకాని (29) శ్మశానమందుకాని శ్మశానానికి చాలా దగ్గరలో (దూరంలో) కాని రమ్యమైన మిక్కిలి జనం లేని వనమందుకాని, పర్వతమందు అతి రహస్య స్థలంలోకాని, కందరమందో, వనమందో (30) ద్వీపమందో, దుర్గమమైన దుర్గమందో, నది యందో, నదమందో ఏ జంతువు లేని అందమైన సముద్రపు ఒడ్డుయందో (31) విదగ్ధకు (నేర్పరి, చొరవ) విదగ్గునితో, నిర్జన ప్రదేశంలో సంగమము సుఖకరము. పుష్పములు చందనం గల శయ్య, పుష్పచందనములతో పూయబడిన వారికి సుఖకరము. (32)
అను! పుష్పచందనములతో పూయబడిన, నన్ను స్వీకరించి రతిని చేయి ఓ దేవి! బ్రహ్మ వరములతో ముసలితనము, చావులేని వాణ్ణినేను. (33) ఓ భద్ర! (శ్రేష్ఠమైనదాన) ఎప్పుడు సుస్థిరమైన యౌవనము గలనన్ను పతిగా చేసుకో. మంచి వేషం కల వాణ్ణి, సుందరుణ్ణి, ధీరుణ్ణి, కామశాస్త్ర విశారదుణ్ణి, నన్ను భర్తగా చేసుకో (34) శరత్పూర్ణిమ నాటి చంద్రుని వంటి ముఖం కలవాణ్ణి చంద్రవంశంలో పుట్టినవాణ్ణి, భూమి పైకి వచ్చిన, యాచించిన, ఊర్వశిని వదలినవాణ్ణి (35) నాకు పరస్త్రీల పై స్పృహ (కోరిక) లేదు. నిన్ను చూసి నామనస్సు లోలుపం కలదైంది (ఇచ్ఛ). నేను నా భార్యలను వదిలాను, రత్నభూషణములతో అలంకరించుకున్న వాళ్ళను వదిలాను. (36) ఓ వరానన! (కోర తగిన ముఖం) వారందరినీ దాసీలను చేసి రక్షిస్తాను. వరుణుని యొక్క రత్నేంద్ర సారమాలను (37) బ్రహ్మాస్త్రంతో, మిక్కిలి తేజోవంతమైన దానితో యుద్ధంలో వరుణుని జయించి నీకిస్తాను. చాలా దుర్బలుడైన వహ్నిని జయించి, వహ్నిశుద్దమైన వస్త్రములు రెంటిని (38) ఓ దేవి! నీకు ఈరోజే (ఇప్పుడే) ఇస్తాను. నన్ను నియోజకునిగా (భృత్యుడు, యజమాని) నియోగించుకో. మణీంద్రసార నిర్మితమైన మకరాకార కుండలములను (39) దేవమాతకు చెందిన వానిని దేవతలను జయించి నీకిస్తాను, ఓ సుందరి! మిక్కిలి అమూల్యరత్నములతో నిర్మించిన రెండు ఆభరణములను నీకరములకై (40) అతిదుర్లభమైన వాటిని రోహిణి దగ్గర ఉన్నవాటిని, చంద్రుణ్ణి జయించి ఇప్పుడే నీకిస్తాను. ఆతడు క్షయవ్యాధిగ్రస్తుడు. చాలా కృశించినవాడు మా పూర్వపురుషుడే (41) యుద్ధం లేకుండానే భయపడికాని, లేదా నామీది దయతోగాని నాకిస్తాడు. అల్ప (చిన్న) రత్నములతో నిర్మింపబడిన, ధ్వనించేకాలి అందెలను రెంటిని (42) పార్వతికి చెందిన వాటిని శివుని భిక్షమడిగియైనా ఈవేళే నీకిస్తాను. ఆతడు త్వరగా ఆనందించేవాడు, స్తుతికి పరవశుడు, భక్తులకు ఈశుడు, దయామయుడు (43) ఓ శుభే! అన్ని సంపదలనిచ్చే, పరమమైన కల్పతరువును నీకిస్తాను. అమూల్యమైన రత్నములతో నిర్మింపబడిన భుజకీర్తులను రెండిటిని, ఓ ప్రియ! (44) గంగకు చెందిన వాటిని, చాలా దుర్లభమైన వాటిని యుద్దము చేసి నీకిస్తాను. సూర్యపత్నికి చెందిన, మనోహరమైన, అందమైన భుజాభరణముల రెంటిని (45) మంచి రత్నముల సారములతో నిర్మింపబడిన వాటిని, ఓ సుశోభన! ఈవేళ నీకిస్తాను. అమూల్యరత్నములతో నిర్మింపబడిన, అతి నిర్మలమైన దర్పణమును (46) కామపత్నికి చెందిన దానిని అవలీలగా కాముని జయించి నీకిస్తాను. ఓ సుందరి! కమలకు చెందిన వాడిపోని క్రీడాకమలాన్ని (47) కమలాపతినిస్తుతించో, బిక్షమడిగో నీకిస్తాను. విశ్వములందు దుర్లభములైన అంగుళీయక రత్నములను (48) సావిత్రికి బ్రహ్మకు చెందిన (వానిని) స్తవం చేసి అడిగినీకిస్తాను. స్వయంగా తాను పాటపాడుతున్న మూర్చన శ్రుతులతో కూడిన (49) వాణియొక్క వీణను నారాయణ వ్రత మాచరించి నీకిస్తాను. విశ్వకర్మచే నిర్మింపబడిన రత్నపాశముల సంఘమును (50) కుబేరపత్నికి చెందిన దానిని, పాదాంగుళి విభూషణమును నీకిస్తాను (50 1/2)
శచ్యువాచ-
అను!! అని ఈ విధముగా పలికి నహుషుడు ఆమె పాదాంబుజములందు పడ్డాడు (51) రాజమార్గమందున్న రాజుతో, శచీదేవి భయపడి అతనితో ఇట్లా అన్నది. ఆతనిని లేపి, చేతితో పట్టుకొని, ఎండిపోయిన కంఠ ఓష్ఠ తాలుభాగములు కలదై (గొంతు, పెదవులు, దవడలు) ఆమహాసాధ్వి గురువైన హరియొక్క పాదాంభోజములను స్మరిస్తూ, స్మరిస్తూ (52) శచి ఇట్లా అంది - ఓ వత్స! మహారాజ! ఓ తండ్రి! భయమును తొలగించేవాడా, విను (53) అందరికి భయముల నుండి రక్షకుడు, రాజు. పాలకుడు, తండ్రి. ఈవేళ ఇంద్రుడు శ్రీనుండి భ్రష్టుడైనాడు. నీవు ఇప్పుడు స్వర్గంలో రాజువు (54) ఎవడు రాజో వాడు తండ్రితో సమానం, రక్షకుడు ప్రజలకు అనుమానం లేదు. గురుపత్ని, రాజపత్ని, దేవపత్ని, వధువు (కోడలు) (55) తండ్రి చెల్లెలు, తల్లి చెల్లెలు, శిష్యుని భార్య, భృత్యుని భార్య, మేనత్త, తండ్రి భార్య, భ్రాతృపత్ని, అత్త, చెల్లెలు, కూతురు (56) తల్లి ఇష్టదేవి ఇట్లా పదహారుగురు పురుషునకు తల్లులు. నీవు నరుడవు. నేను దేవ భార్యను. నీ తల్లి దేవతలకు ఇష్టమైనది (57) ఓవత్స! రమించుటకు. ఇష్టము కలవాడవైతే అదితిని, తల్లిని రమించుటకు వెళ్ళు. అందరికి, నిష్కృతి ఉంది కాని తల్లిని పొందిన (రతి) వానికి నిష్కృతి లేదు, ఓవత్స. (58) బ్రహ్మ వయస్సు ఉన్నంతకాలం, వాడు కుంభీపాక నరకంలో వండబడుతాడు. ఆ పిదప కృమిజన్మవచ్చి ఏడు కల్పముల కాలముంటాడు (పురుగు) (59) ఆ పిదప కుష్ఠురోగులు, మ్లేచ్చులుగా ఏడు జన్మలుంటారు. వారికి నిష్కృతే లేదు అని బ్రహ్మ అన్నాడు (60) ఈ విధముగా వైశ్య, క్షత్రియ, శూద్రులు బ్రాహ్మణ స్త్రీని పొందితే, ఓ రాజా! వేదములందు నిష్కృతి లేదు, అని అంగిరసునిమాట (61) సంసారులకు స్వర్గ సంపత్తి భోగము, సుఖము నిశ్చయము. ముముక్షులకు మోక్షము, తపస్వులకు కూడా మోక్షము. (62) బ్రాహ్మణులకు బ్రాహ్మణ్యము, మునులకు మౌనము, వైదికులకు, వేదాభ్యాసము, కవులకు కావ్య వర్ణనము (63) వైష్ణవులకు విష్ణు దాస్యము, విష్ణు భక్తి రసము పరమైనది. వైష్ణవులు విష్ణుభక్తి తప్ప ఇతరమైన ముక్తిని కోరరు. (64) మలముతో కూడిన, తడి తడియైన, దుర్వాసనకు నిలయమైన స్త్రీల యోనులందు సాధువులకు ఏం సుఖముంటుంది, ఓ సాధు! నాకు చెప్పు (65) ఓ రాజేంద్ర ! మండలాకారముగా నున్న రాజుల (చుట్టూ ఉన్న) కులమును వెలిగించే భారత దేశమందు, అనేక జన్మల పుణ్యం వల్ల నీకు జన్మ లభించింది. (66) చంద్ర వంశపు రాజులనే పద్మముల దీప్తి కొరకు, తేజస్వంతుడవైన నీవు గ్రీష్మ కాలమందలి మధ్యాహ్న సూర్యుని వలె ఆవిర్భవించావు (67) అన్ని ఆశ్రమములవారికి తన ధర్మాచరణ మిక్కిలి కీర్తికారి. తమధర్మ హీనులైన, మూఢచేతసులు నరకంలో పడ్డారు. (68) బ్రాహ్మణుని స్వధర్మమేమంటే మూడు సంధ్యలందు హరిఅర్చన చేయడం. ఆ హరి పాదోదకము, నైవేద్యము తినుట, అమృతము కన్న మిన్న (69) హరికి, నివేదించని అన్నము మలము, జలము మూత్రము, ఓ రాజ! నివేదించని దాన్ని భుజిస్తే బ్రాహ్మలంతా సూకరము లౌతారు (పందులు) (70) బ్రతికినంత కాలం భుజిస్తారు విప్రులు, కాని ఏకాదశినాడు భుజించరు. (రాదు) కృష్ణ జన్మదినమందు, శివరాత్రి యందు తినరాదు నిశ్చయము (71) అట్లాగే రామనవమి యందును భుజించరాదు. ప్రయత్నించి పుణ్యదినమందు తినరాదు. ఇది బ్రాహ్మల స్వధర్మము అనిబ్రహ్మ చెప్పాడు, ఓ రాజ ! (72)
నహుష ఉవాచ:
పతి సేవ పతివ్రతలకు వ్రతము, పరమమైన తపస్సు. పరపతి పుత్రునితో సమానము స్త్రీలకు ఇది ధర్మము. (73) ప్రజలు తమ సంతానాన్ని రక్షించినట్లు రాజు ప్రజలను రక్షించాలి. ప్రజలు తమ తల్లిని చూసినట్లుగా రాజు స్త్రీలను (తల్లిలా) చూడాలి.
యజ్ఞం చేయటం, విష్ణువును, దేవ, విప్రులను సేవించుట, దుష్టుల నివారణము, శిష్టులను రక్షించుట (75) ఇది క్షత్రియ ధర్మము అని బ్రహ్మ ఇదివరలో చెప్పాడు. వైశ్యులకు వాణిజ్యము, ధర్మము సంపాదించుకొనుట స్వధర్మము. (76) శూద్రులకు విప్ర సేవ పరమధర్మంగా విధించబడింది. ఓ రాజ! సర్వము హరియందు వదలుట సన్యాసుల ధర్మము, నిశ్చయము. (77) ఎర్రటి ఒకేవస్త్రాన్ని ధరించుట, దండము ధరించుట మట్టికమండలువు ధరించుట, అంతటా (అందరియందు) సమానదృక్పథము, ఎప్పుడూ నారాయణుని స్మరించుట (78) రోజూ తిరుగుట, ఇంటింటా ఉండక పోవుట, లోభంతో, విద్యనుకాని మంత్రాన్ని కాని ఎవ్వరికి చెప్పకుండుట (79) భిక్షువు ఆశ్రమము నిర్మింపకుండుట, ఇతరుల వస్త్రమును ధరింపకుండుట, ఇతరులతో సహవాసము చేయకుండుట, మోహరహితుడుగా నుండుట, చేరిక (నలుగురితో) లేకుండుట, (80) మోహరహితుడుగా పదార్థాన్ని తినకుండుట, స్త్రీ ముఖమును చూడకుండుట, తినతగిన పదార్థాన్ని ఇష్టమైన దానిని ప్రతి (సన్యాసి) గృహస్థును యాచించకుండుట (81) ఇవన్ని సన్యాసి ధర్మములు అని బ్రహ్మ అన్నాడు. అని నీకు చెప్పాను. ఓ పుత్ర! ఓ వత్స! సుఖకరంగా వెళ్ళు (82) అని, మార్గంలో మహేంద్రాణి పలికి ఊరకుంది. అప్పుడు రాజైన నహుషుడు వంకరగా బాగా తలతిప్పి శచితో ఇట్లా అన్నాడు (83) నహుషుడిట్లో అన్నాడు - ఓ దేవి, నీవేదైతే చెప్పావో అదంతా విపర్యయము (తలక్రిందులు). వేదమందు చెప్పిన యథార్థ ధర్మాన్ని నీకు చెప్పుతాను, తెలుసుకో (84) ఓ వేద సుందరి! అందరు తమ కర్మల ఫలమును అనుభవించాలి. స్వర్గమందో, పాతాలమందో, ఇతర ద్వీపమందుకాదు అని శ్రుతియందు చెప్పారు (విన్నాం). (85) పుణ్యక్షేత్రమైన భారతమందు శుభమైనదో, అశుభమైనదో కర్మచేసి, ఆ కర్మ చేసినవాడు, కర్మలకు బద్ధుడైనందువల్ల (బంధం) ఆ ఫలాన్ని మరోచోట అనుభవిస్తాడు. (86) హిమాలయంనుండి సముద్రం దాకా పుణ్యక్షేత్రము, ఈ భారతభూమి. అన్ని స్థలముల కన్న శ్రేష్ఠమైనది. మునులకు తపస్సు చేసుకునే ప్రదేశము. (87) అక్కడ జీవి జన్మను పొంది, విష్ణు మాయతో వంచితుడై, హరి సేవను వదిలి నిరంతరం ఎల్లప్పుడు విషయముల సేవ చేస్తున్నాడు. (88) అక్కడ మహాపుణ్యమును చేసి పుణ్యవంతుడు స్వర్గమునకు వెళ్తాడు. కన్యలందరిని స్వీకరించి, స్వర్గంలో చిరకాలము ఆనందంగా ఉంటాడు. (89) నరుడు, మానవశరీరాన్ని వదలి స్వర్గానికి వస్తాడు. నేనే నా శరీరంతో వచ్చాను. ఓ సుందరి! నా పుణ్యమెంతో, చూడు (90)
అనేక జన్మల పుణ్యం వల్ల కోరిన స్వర్గానికివచ్చాను. ఇంకేమి నాకు, నీ దర్శనము ఏదో ఒక పుణ్యం వల్ల లభించింది. (91) ఇది కర్మస్థలము కాదు. స్వర్గము భోగస్థలమే. భోగస్థలమందు భోగవస్తువును వదలటం ప్రశస్తముకాదు. (92) ఇక్కడ భోగులకు నీవు, భావానురక్తురాలివి, (మనోవికారం) రసికురాలివి, అనుభవించతగినదానివి. యజమాని లేని ద్రవ్యమును అనుభవించుట, సుఖకరము. తెలివి తక్కువవాడు దాన్ని వదులుతాడు. (93) విరోధం లేని సుఖాన్ని వదిలేవాడు పశువే, అనుమానం లేదు. వెళ్ళు, ఓ కాంత! (కోరతగినది) ఇంటికి వెళ్ళి మనోహరమైన పడకను ఏర్పాటు చేయి (94) రమణీయమైనది, రహస్యంతో ఉండేది, శ్రేష్ఠమైనది, మిక్కిలి రతిని కూర్చేది అట్టి పడకను ఏర్పరచు. మనస్సుయందు ద్వైధీభావాన్ని (ఔనా కాదా అన్నట్లు) వధులు, నిశ్చయము, ఓవరవర్షిని (మంచిరూపం) (95) ఓ వరానన! నాతోపాటు, వరమైన మందిరమందు ఆనందించు శ్రేష్టమైన మణులతో వెలిగిపోయే అమూల్యమైన రత్నమాలను (96) లక్ష్మి వక్షః స్థలమందు ప్రకాశించే దానిని యాచించి నీకిస్తాను. అందరికి అతిదుర్లభమైన, అనంతుని శిరస్సు యందలి మణిని (97) ముల్లోకములలో లభించని దానిని ఓ సుందరి! నీకిస్తాను. నారాయణుని వక్షః స్థలమందు ఉన్న కౌస్తుభ మణిరత్నమును (98) నారాయణ వ్రతము చేసి, ఆతనిని యాచించి, నీకిస్తాను. చంద్రశేఖరమౌళి యొక్క సంపన్నమైన చంద్రభూషణమును (99)ముసలితనము, మృత్యువు, వ్యాధి వీనిని హరించేదానిని, సమర్థమైన దానిని, ఆనందం కల్గించేదానిని, ప్రియమైన దానిని, మిక్కిలిగా విశ్వమందు కష్టసాధ్యమైన దానిని (లభించని) విశ్వములతో నమస్కరించతగిన దానిని, సుందరమైన దానిని (100) విశ్వనాథ వ్రతముచేసి, సంపాదించి నీకిస్తాను. నిశ్చయము. శ్రీసూర్యుని యొక్క మణులలో శ్రేష్ఠమైన శ్యమంతకమణిని, నీకిస్తాను. (101) భక్తితో సూర్యవ్రతం చేసి, ముల్లోకములలో దుర్లభమైన దానిని, ప్రతినిత్యం ఎనిమిది భారముల (2 వేల పలములు, 1 భారము) బంగారం ఇచ్చేదాన్ని (పుట్టించేది) 102) జర, మృత్యువులను హరించేది, శ్రేష్టమైనది. ఆనందాన్నిచ్చేది, అలాంటిదాన్ని ఓ ప్రియా! నీకిస్తాను. అమూల్యరత్నములతో నిర్మింపబడిన, మనోహరమైన, శ్రేష్ఠమైన పాత్రను (103) ఎప్పుడూ మధువుతో నిండిన దానిని, మన్మథునికి చెందిన దానిని, నీకిస్తాను. అమూల్యమైన రత్నములతో నిర్మించబడిన దానిని, తేజస్సులో సూర్యునితో సమానమైన దానిని (104) రకరకాలైన చిత్రవిచిత్రములు కలదానిని, ఈశ్వరేచ్ఛతో నిర్మింపబడిన దానిని నిర్మలమైనది, మండలము (వర్తులము)గా ఉండేది, శ్రేష్ఠమైన మణులతో ప్రకాశించేది (105) లక్ష చేతుల పరిమితి గలది (కొలత), చదరంగా ఉండేది, అట్టి శ్రేష్ఠమైన చాలా ఇష్టమైన, దుర్లభమైన (లక్ష్మి యొక్క) పద్మయొక్క పద్మాసనమును, ఓ సుందరి! (106) పద్మాలయ వ్రతమును చేసి, సంపాదించి తప్పకుండా నీకిస్తాను. అని ఇట్లా పలికి నహుషుడు, ఆమె మార్గాన్ని అడ్డగించి (107) తిరిగి మాటి మాటికి మహేంద్రాణి యొక్క పాదములందు పడ్డాడు. రాజు మాటలు విని, కంఠము, పెదవులు, తాలువులు ఎండిపోగా (తడారిపోగా) గురువైన హరిని మాటి మాటికి స్మరిస్తూ, మహేంద్రాణి ఆతనితో ఇట్లా అంది (108)
మూII శచ్యువాచ :
అను!! శచీదేవి ఇట్లా అంది । అచేతనుడు, మూడుడు, ఏది చేయాలో, ఏది చేయకూడదో తెలియనివాడు (109) కామాతురుడు ఐన వాని కథ ఎన్ని విధములుగా ఉంటుందో ఈవేళ వినబోతున్నాను (వినిపించ). మధువుచే మత్తుడు, (ఇప్పసార), సురాపాన మత్తుడు, కామముచే మత్తుడు, విచేతనుడు (110) (వీరు) కామంతో ఆవరించబడిన మనస్సుగల కామి మృత్యువును లెక్కింపరు. ఓ మత్తుడ ! నేను తల్లిలాంటిదాన్ని రజస్వలను, నన్ను ఈ వేళ విడిచి పెట్టు (111) ఓ రాజ! ఈవేళ నాకు ఋతువు (ముట్టు)లో తొలిదివసము, నిశ్చయము. ముట్టులో తొలిరోజున స్త్రీ చాండాలి అనబడుతుంది. (112) రెండవరోజున మ్లేచ్ఛ, అట్లానే మూడవ రోజున రజక (చాకలిది). నాల్గవ రోజున భర్తకొరకైతే శుద్ధమైనది. దైవపితృ కార్యములందు శుద్ధురాలు (113) కాదు. ఆమె ఆరోజున పరము కొరకైతే అసచ్చూద్రురాలితో సమానమైనది. రజస్వలయైన కాంతను తొలిరోజున పొందినవాడు (114) బ్రహ్మహత్యలో నాల్గవ భాగమును పొందుతాడు. ఇందులో అనుమానం లేదు. వాడు (ఆపురుషుడు) దైవ, పితృకర్మలందు కర్మారుడుకాడు. (115) వాడు అందరికన్నా అధముడు, నిందితుడు, అపకీర్తి కరుడు. రెండవరోజు రజస్వల స్త్రీని పొందినవాడు (116) కామంతో పరిపూర్ణుడైతే గోహత్యాపాపమును పొందుతాడు నిశ్చయము. (బ్రతికినంత కాలం పితృ, విప్ర, సురల, అర్చన యందు అధికారి కాడు (117) వీడు మనిషికాడు, అపకీర్తి గల వాడు ఔతాడు అని అంగీరసుని వచనము. రజస్వలమైన భార్యను తృతీయదివసమందు ఎవడు పొందుతాడో (118) మూడుడు భ్రూణ హత్యాపాపాన్ని పొందుతాడు, ఇందులో అనుమానం లేదు. ముందు వానివలె వాడు కూడా పతితుడే. అన్ని కర్మలలోను అరుడు కాడు (119) నాల్గవరోజున ఆ స్త్రీ అసచ్ఛూద్ర. విచక్షుణుడు ఆమెను పొందరాదు. ఓ మూడుడ! తల్లిలాంటి దానినైన నన్ను బలవంతంగా పొందదలిస్తే (120) ఋతుదివసములుగడిచాక పొందాలనుకుంటే (తగదు. తల్లిని అని). శచి, వచనమును విని, నవ్వి అట్లా నహుషుడు (121)
సువ్రతముకల శక్రకాంతను గూర్చి, మధురముగా, శాంతముగల నహుషుడు ఇట్లన్నాడు. దేవపత్ని ఎప్పుడూ శుద్ధురాలు. నీవు చెప్పినది అది తక్కువయైన మానవకాంత గూర్చి (122) మానవునకు, దేవత (స్త్రీ) శయనమందు, భోజనమందును అపరిశుద్ధురాలుకాదు. కర్మక్షేత్రమైన భారతదేశమందు, రజస్వలను సంభోగిస్తే (123) నీవు చెప్పిన పాపం కల్గుతుంది. ఓ సుందరి! ఈదుర్గమందు కాదు వేదోక్తమైన ఆ శుభ అశుభకర్మలు కూడా కర్మక్షేత్రమందు (124) బ్రహ్మతేజస్సుతో వెలిగిపోయే వైష్ణవులకు కాదు. అగ్నిమండుతూ ఉంటే ఎండిన గడ్డిపోచలు (125) భస్మమైనట్లుగా వైష్ణువుని యందు పాపములు భస్మమౌతాయి. వైష్ణవుడు ఎల్లప్పుడు అగ్ని, సూర్యుడు, బ్రాహ్మణుడు వీరికన్న తేజస్వంతుడు (126) విష్ణుచక్రంతో రక్షింపబడుతూ ఉన్నస్వతంత్రమైన మదించిన ఏనుగు. వైష్ణవులకు, తమ కర్మలను గూర్చిన విచారము లేదు. అనుభవము లేదు (127) సామవేద మందు కౌథుమియందు చెప్పబడింది, బృహస్పతిని అడుగు. చంద్రవంశ్యులమైన వైష్ణవులుగా మమ్ములను అందరు తెలుసుకొని ఉన్నారు (128) చంద్రవంశపు వారు హరిని తప్ప మరోదేవుని సేవించరు. సద్వంశమందు పుట్టిన బ్రాహ్మణుడుకాని, క్షత్రియుడు కాని (129) దేవమాయతో వంచింపబడి విష్ణుమంత్రమును గ్రహింపడు. మంత్రమేమిటి? దేవతలెవరు? యముడు మమ్ములను శాసించేవాడు కాదు (130) బ్రహ్మ విష్ణువులను తప్ప అందరిని శాసించుటకు సమర్ధుణ్ణనేను. ఇంటికివెళ్ళి శయ్యను ఏర్పరచు. త్వరగా నీ ఇంటికి వస్తాను (131) ఋతుగమనం వల్ల కలిగే పాపం ఏదైనా ఉంటే అదినన్నే పొందుతుంది. నీకేమిటి, ఓ శోభన! వెళ్ళు. అని పలికి రాజు నహుషుడు ముఖము, చూపులు వికసించగా (132) రత్నముల పల్లకిని ఎక్కి నందనకాననమునకు వెళ్ళాడు. ఆశచి ఇంటికి వెళ్ళలేదు. గురువు (బృహస్పతి) ఇంటికి వెళ్ళింది (133) వెళ్ళి కుశాసనమందు కూర్చున్న బృహస్పతిని చూచింది. తార ఆతని పాద కమలములను సేవిస్తోంది. ఆతడు బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్నాడు (134) చేతిలో జపమాల ఉంది.ఎప్పుడైన తనకిష్టమైన కృష్ణుని జపిస్తున్నాడు. పరమమైన, పరమానంద స్వరూపుడైన, ఈశ్వరుడైన పరమాత్మను జపిస్తున్నాడు. (135) నిర్గుణుడు, నిరీహుడు, స్వతంత్రుడు, ప్రకృతికన్నపరుడు, స్వేచ్ఛామయుడు, పరమైన బ్రహ్మ భక్తులననుగ్రహించే కొరకు రూపమెత్తినవాడు అట్టి కృష్ణుని జపిస్తూ (136) ఉన్న, ఆనందాశ్రువులు నిండిన కనులుగల గురువును భూమి పై తలుంచి నమస్కరించింది. ఆమె ఏడుస్తోంది. నేత్రములందు కన్నీళ్ళున్నాయి. భక్తి సాగరంలో మునిగిఉంది (137) దుఃఖసముద్రంలో మునుగుతూ హృదయంలో తనను తాను నిందించుకుంటూ (పరితపిస్తూ), భయంతో బ్రహ్మిష్ణుడు, కృపానిధియైన తన గురువును స్తుతించింది. (138)
మూ॥ శచ్యువాచ:
అను!! శచి ఇట్లా అంది - ఓ మహాభాగ! భీతురాలిని, శరణాగతురాలిని ఐన నన్ను రక్షించు రక్షించు. నీవు శక్తిమంతుడివి. శోకసాగరమందు మునిగిన నీదాసినైన, నన్ను రక్షించు (139) ఈశ్వరుడు లేని వాడైనా, ఈశ్వరుడు కలవాడైనా, బలవంతుడైనా మిక్కిలి దుర్బలుడైనా (గురువు), తన శిష్యుని భార్యను, పుత్రులను శాసించుటకు, ఎల్లప్పుడు యుక్తమైనవాడే (140) నీవు, నీ శిష్యుని తన రాజ్యమునుండి దూరమయ్యేట్టు చేశావు. దోషశాంతి ఉంది. ఇప్పుడు మేర (హద్దు) కల్పించు (141) అనాధను సర్వశూన్యను ఐన నన్ను, శూన్యమైన ఆ అమరావతిని, సంపదలతో శూన్యమైన నా ఆశ్రమాన్ని చూడు. ఓ కృపానిధి! రక్షించు (142) శత్రువుతో గ్రహించబడే నన్ను రక్షించు. ఈదేశమునకు నీకింకరుని తీసుకురా. ఆతనికి నీ చరణ రేణువులను ఇచ్చి, ఆతనికి శుభ ఆశీర్వచనములిమ్ము (143) అందరిగురువులకన్న జన్మనిచ్చినవాడు పరుడైన గురువు. తండ్రికన్న నూరురెట్లెక్కువ తల్లి. ఆమె పూజించతగింది, నమస్కరించ తగింది, గొప్పది (ప్రధానము), (144) విద్యనిచ్చువాడు, మంత్రమునిచ్చువాడు, సేవ్యుడు, తల్లికన్న నూరురెట్లు ఎక్కువ గురువు (145) మంత్రము మొదలగువానిని చెప్పడం వల్లనే గురువని చెప్పబడతాడు, బుధులచే, నమస్కరించతగిన ఈ గురువు వేరు. ఆరోపింపబడిన గురువు మరొక్కడు (146) అజ్ఞానమను చీకటితో గుడ్డిమైన వానికి జ్ఞానమనే కాటుకపుల్లతో కళ్ళు తెరిపించేవాడు, అలాంటి ఈ గురువునకు నమస్కారము (147) దీక్షితుడుకాని వానికి మూరునకు నిష్కృతిలేదు, నిశ్చయము. అన్ని కర్మలలోను అనరుడైన వానికి ఆ పశువునకు నరకమందు ఉనికి (148) జన్మదాత, అన్నదాత, అట్లాగే ఇతరమైన గురువులు ఉన్నారని తెలుసు. ఘోరమైన సంసార సాగరము నుండి దాటించుటకు వారంతా సమర్థులుకారు (149) విద్య, మంత్ర, జ్ఞానములనిచ్చేవాడు దాటించుటలో, నిఫుణుడు. అతడు శిష్యుని ఉద్ధరించుటకు సమర్థుడు. ఈశ్వరుడు.ఈశ్వరునికన్న పరమైనవాడు (150) గురువు విష్ణువు, గురువు బ్రహ్మ గురువు దేవుడు, మహేశ్వరుడు. గురువు ధర్మము, గురువు శేషుడు, నిర్గుణుడైన (గుణాతీతుడైన) గురువు అన్ని ఆత్మలలో ఉండేవాడు (151) సర్వతీర్థములకు ఆశ్రయుడు, సర్వదేవతలకు ఆశ్రయుడు గురువు. సర్వదేవతల స్వరూపుడు, గురు రూపంలో ఉన్న స్వయంగా హరి ఆతడు (152) ఇష్టదైవం కోపగిస్తే రక్షించుటకు గురువు సమర్థుడు. గురువుకోపగిస్తే అభీష్టదైవం రక్షించ సమర్థుడు కాడు (153) ఎవని పై గ్రహములన్ని కోపగించాయో, దేవబ్రాహ్మణులు కోపగించారో అవినీవే కోపగించినట్టు. గురువే దేవతలు కదా (154) గురువుకన్న ఆత్మ ప్రియమైందికాదు. గురువుకన్న సుతుడు ప్రియమైన వాడుకాడు. గురువుకన్న ధనము ప్రియమైనది కాదు అట్లాగే ప్రియమైన భార్యకూడా గురువుకన్న ప్రియమైనదికాదు (155) గురువుకన్న ధర్మము ప్రియము కాదు, తపము ప్రియము కాదు. సత్యము ప్రేమ పాత్రమైనది కాదు. గురువుకన్న పరమైన పుణ్యములేదు (156) గురువుకన్న మరో శాసకుడు లేడు, గురువుకన్న పరమైన బంధువులేడు. దేవుడు, రాజు, శాసకుడు ఇవన్నీ శిష్యులకు గురువే ఎల్లప్పుడు (157) అన్నం పెట్టటానికి ఎంతకాలం శక్తి ఉంటుందో, అంతకాలమే అన్నం పెట్టేవాడు, వాడిని (తినేవాడిని) శాసించగలడు. కాని, ప్రతిజన్మలోను శిష్యులకు గురువు శాసకుడు ఔతాడు.
గురు రువాచ :
భర్త ఎట్లా పూర్వజన్మననుసరించి లభిస్తాడో అట్లాగే మంత్రము, విద్య, గురువు, దైవములభిస్తారు. అన్ని జన్మలలో బంధనంగా అందరికన్నా పైన ఉన్నాడు (159) ఏ జన్మలో జన్మనిస్తాడో ఆ తండ్రి గురువు, నమస్కరింప తగినవాడు. ఇతర గురువులు అట్లాగే. తల్లి ప్రతి జన్మలోనూ గురువే (160) విప్రులలో నీవు శ్రేష్ఠుడవు, తపస్సులలో గొప్పవాడివి. ఓ బ్రహ్మన్! బ్రహ్మజ్ఞానం కలవారిలో బ్రహ్మనెరిగినవాడివి (161) మునిశ్రేష్ఠ! ఆనందించు నన్ను, ఇంద్రుని ఇప్పుడు ఆనందింపజేయి. నీవు ఆనందిస్తే, ఎల్లప్పుడు గ్రహదేవతలు సంతుష్టులౌతారు. (162) ఓ బ్రహ్మన్! ఆ శచీదేవి ఇట్లా పలికి, తిరిగి పెద్దగా ఏడ్చింది. ఆ ఏడ్పును చూచి తారకూడా మాటిమాటికి పెద్దగా ఏడ్చింది (163) తార, పాదముల పై పడింది, మాటిమాటికి ఏడ్చింది. నా అపరాధాన్ని క్షమించు, అని పడింది. గురువు ఆనందపడి ఆమెతో ఇట్లన్నాడు (164) గురు విట్లా ఓ తారా! లే. శచికి అంతా మంచే జరుగుతుంది. నా ఆశీస్సులతో, మ హేంద్రుని తన భర్తను, వెంటనే పొందుతుంది (165) అని పలికి ఆ గురువు విరమించాడు, ఓ నారద. తార, చరణములందు పడింది, తిరిగి ఏడ్చింది కూడా (166) శచిని, తార పట్టుకొని తన రొమ్ము యందు ఉంచుకొని, ఉత్తమమైన, అనేకరకాలైన ఆధ్యాత్మ విషయములను బోధించింది (167) పూజాకాలమందు, శచిచేసిన గురుస్తోత్రాన్ని చదివిన వారికి గురువు, అభీష్టదైవము ప్రతిజన్మలో సంతుష్టుడౌతాడు (168) గ్రహ, దేవ, ద్విజులు, సంతోషించి, ఆతనిని, ఎల్లప్పుడు అనుగ్రహిస్తారు. రాజులు బంధువులు సంతుష్టులై ఎల్లప్పుడు అన్ని విధముల సహకరిస్తారు (169) గురుభక్తిని విష్ణుభక్తిని, వాంఛితమును పొందుతారు, నిశ్చయము. ఆతనికెప్పుడూ ఆనందమే ఉంటుంది. ఎప్పుడూ దుఃఖముండదు (170) పుత్రులను కోరేవాడు పుత్రుని, భార్యను కోరేవాడు ప్రేమను పొందుతారు. మంచి రూపము గల, గుణవంతురాలైన పుత్రులను పొందే సతిని పొందుతారు, నిశ్చయము (171) రోగంతో బాధపడేవాడు రోగవిముక్తుడౌతాడు, బంధితుడు బంధనమునుండి ముక్తుడౌతాడు. అరకొరగా కీర్తికలవాడు మంచి కీర్తిని పొందుతాడు. మూర్ఖుడు పండితుడౌతాడు (172) ఆతనికెప్పుడూ బంధువిచ్ఛేదము కలుగదు, నిశ్చయము. ధర్మము రోజూ పెరుగుతుంది అతనికి, విపులము, నిర్మలమైన యశములభిస్తుంది (173) పుత్రపౌత్ర ధనములతో కూడిన పరమైశ్వర్యమును పొందుతాడు. ఇక్కడ అన్ని సుఖాలు అనుభవించి శ్రీహరిస్థానాన్ని పొందుతాడు (174) ఆతనికి పునర్జన్మలేదు నిశ్చయంగా హరిదాస్యము లభిస్తుంది. విష్ణుభక్తి రసాళిలో మునిగిపోతాడు, నిశ్చయము. (175) విష్ణుభక్తి రసామృతమును ఎల్లప్పుడు తాగుతాడు, శాంతుడుగా ఉంటాడు జన్మమృత్యుజరా, వ్యాధి, శోక, సంతాపములను నశింపచేసేది ఈ స్తోత్రము (176) అని శ్రీబ్రహ్మవైవర్తమందు మహాపురాణమందు శ్రీకృష్ణు జన్మ ఖండమందు, ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాద మందు ఇంద్రుని దర్పభంగమనే ప్రకరణమందు శచీదేవి శోకమును తొలగించే దానియందు శచిచేసిన గురుస్తోత్రమును చెప్పుట అనునది ఏబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము. (59)
Summary of chapter 59 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Fulfilling the inevitable decree of time and cosmic destiny that required the departure of the Yādava dynasty from earth, the young Yādava princes playfully dressed the noble youth Jambavatī's son Samba in female garments and brought him before the visiting sages Vasishṭha, Nārada, and Vishvāmitra, mocking them and asking if the pregnant woman would give birth to a boy or a girl. Recognizing the prank through their mystic vision, the enraged sages cursed the princes, declaring that the boy would give birth to a magical iron mace that would completely annihilate the entire Yādava clan.