నారద ఉవాచ - నారదముని అనెను :
ఓ మునిశ్రేష్టుడా! ఆ తరువాత ఆ పరమాత్మ యొక్క లీలా చరిత్రములో ఏయే రహస్యము జరిగెను? శ్రీకృష్ణ పరమాత్మ సందుని గృహము నుండి (రేపల్లె నుండి) మధురకిల్లెను. ఆ హరి యొక్క వియోగము చేత కృష్ణుని యందే నిలుపుకున్న మనస్సు గల నందుడు గాని, గోపికలు గాని యశోద గాని ప్రాణములెటు నిలుపుకొనిరి? కనురెప్ప పాటు అంత సమయము కూడ కృష్ణ వియోగము కళినచో జీవించనట్టి రాధాదేవి ప్రాణేశ్వరుడు లేకుండ తన ప్రాణముల. నెటు నిలుపుకొనెను? ఏఏ గోపాలుడు పండుకొన్నను కూర్చున్నను భోగములనుభవించినను కృష్ణుని వెన్నంటియే అతని సంగములో నుండిరో అంతటి బంధువును ఎడబాసి ప్రజములో ఎట్లు జీవించిరి? అతనిని ఎట్లు మరచిరి? శ్రీకృష్ణుడు మధురానగరమునకు పోయి ఏయే అద్భుత కర్మలు చేసెను? తన లీలో శరీరమును వదిలి స్వస్థానమునకు (గోలోకము) చేరబోవు వరకు ఏమీ జరిగెను? ఆ వృత్తాంతమంతటిని నాకు చెప్పుదువు గాక.
శ్రీనారాయణ ఉవాచ - శ్రీనారాయణ మహర్షి పలికెను:
కంసుడు శ్రీకృష్ణుని రప్పించుటకై ఒక మీషగా ధనుర్యము నాచరించెను. ఆ యజ్ఞమును దర్శించవలెనని రాజుచేత ఆహ్వానింపడిన భగవంతుడు (శ్రీకృష్ణుడు) మధురానగరమునకు పోయెను. కంసుడు కృష్ణుని తోడ్కొని వచ్చుటకై రేపల్లెకు భగవంతునికి ప్రియుడైన అక్రూరుని పంపెను. అక్రూరుడు బలరామాదులతో బాటు శ్రీకృష్ణుని తీసుకొని మధురకు వచ్చాను, కృష్ణుడు తన జన్మచేత పవిత్రము చేయబడిన మధురకేగి (తనను తిరస్కరించిన ఒక చాకలివానీని ఎదిరించిన) చాణూరముష్టికులనెడి మల్లురను, కువలయాపీడమనెడి గజమును సంహరించి రాజైన కంసుని సంహరించెను. ఆపన్నులకు బంధువైన శ్రీహరి తన తలిదండ్రులైన దేవకీ వసుదేవులను ఉగ్రసేనుడు మొదలగు బంధువులను వారి ఆపదల నుండి ఉద్ధరించెను.
తనను వాంఛించిన కుళ్ళతో వేడుకగా శృంగార క్రీడ జరిపి గోపికానాథుడు ఆ కుబను శరీరబంధము తొలగించి గోలోకమును పొందించెను (ముక్తిని ప్రసాదించెను). తనకు పూమాలలు సమర్పించిన మాలాకారునికి కృపతో మోక్షమిచ్చెను. తన అంతరంగ భక్తుడైన ఉద్ధవుని ప్రజమునకు పంపి (తన వియోగమునకు తపించిపోవుచున్న) గోపికలకు అతని ద్వారా జ్ఞానోపదేశము చేసెను. తరువాత ఉపనయన సంస్కారమును (గర్గుని ద్వారా) పొంది జ్ఞాన శక్త్యాది షడజైశ్వర సంపన్నుడైనను అవంతీనగరమందున్న సాందీపని ముని వద్దకేగి ఆ గురువు వద్ద విద్యలను గ్రహించెను.
తరువాత జరాసంధుని జయించి కాలయవనుని సంహరించీ మధురానగరమున ఉగ్రసేనుని శాస్త్రీయముగా రాజునొనర్చెను. పశ్చిమ సముద్ర తీరమునకేగి అక్కడ (విశ్వకర్మతో) ద్వారకాపురిని నిర్మింపజేసి (దానిని యాదవుల రాజధానిగా జేసి నివసించేను). తననెదిరించిన నీచరాజసమూహమును జయించి రుక్మిణీదేవిని హరించెను (అగ్రమహిషిని చేసికొనెను) కాళింది, లక్షణ, శైబ్య, (భద్రాదేవి) సత్యభాష, జాంబవతీ మిత్రవింద నాగ్నజితి అను రాజకన్యలను వివాహము చేసికొనెను.
భయంకరమైన యుద్ధములో ప్రాగ్జ్యతీషపురికి రాజైన నరకాసురుని సంహరించి అతనిచేత బంధింపబడిన రాజకన్యలను పదునారు వేలమందిని వారి కోరిక ప్రకారము వివాహము చేసికొని అందరితో విహరించెను. స్వర్గమునకు పోయి ఇంద్రుని అవలీలగా జయించి పారిజాత వృక్షమును (సత్యభామ కోరికననుసరించి) అపహరించెను. భక్తరక్షణ కొరకై తన నెదిరించిన శంకరుని గెలిచి బాణాసురుని యొక్క వేయి హాస్తములను ఖండించెను. తన పౌత్రుడైన (ప్రద్యుమ్నుని కుమారుడగు) అనిరుద్ధుని విడిపించుకొని తిరిగి ద్వారకకు వచ్చెను. తరువాత ఏకకాలములో అందరు భార్యల గృహములలో ఏకరూపమున తనను చూపించి లోకులననుగ్రహించెను.
తీర్థయాత్రల సందర్భమున వసుదేవుడు యోగమందుండగా (ధ్యానమగ్నుడై) - అక్కడ తన ప్రాణముల కధిష్టాన దేవతయైన రాధాదేవిని హరి దర్శించెను. నిండుగా నూరు సంవత్సరములు గడచిపోగా సుదాముని యొక్క శాపము (రాధాదేవికి) విమోచనమైన కాలములో - (మరల రాధను దర్శించిన స్వామి) ఆమెను తీసుకొని తిరిగి పుణ్యవంతమైన బృందావనమునకు పోయెను. ఆ జగన్నాథుడక్కడ రాధతో బాటు పదునాల్గు సంవత్సరములు భారత వర్షమందలి పుణ్యక్షేత్రమైన రాసమండలములో రాసక్రీడలొనర్చిను. అక్కడి నుండి మరల నందమందిరమునకు వచ్చి పదకొండు సంవత్సరములు గడిపి - ఆ విభుడు మధురలో ద్వారకలో నిండుగా వందసంవత్సరములు నివసించెను.
జగములన్నిటిలో విస్తరించిన పరాక్రమము (శక్తి) గల శ్రీకృష్ణుడు తన అవతార ప్రయోజనమైన భూ భారమును తొలగించి ఒక వంద ఇరువది యైదు సంవత్సరములు భూమండలమందు నివసించి - అత్యంత ప్రాచీనుడై ఉండి అత్యంతము నవీనుడుగా ప్రకాశించి గోలోకమును చేరబోయెను. యశోదానందులకు రాధాదేవి తల్లిదండ్రులైన కలావతీ వృషభానులకును స్వామి తన గోలోకమందు సమీపమున వర్తించగల మోక్షస్థితినీ (సామీప్య మోక్షము) కృపజేసెను. శ్రీకృష్ణునితో బాటు గోలోకేశ్వరి గోపీనాయిక ఐన రాధాదేవియు ఆసక్తితో వేడుకలో - యుగయుగమందును భూమండలమున వేదోక్తమైన ధర్మ సేతువు బంధించి (శిథిలమగుచున్న ధర్మమును తిరిగి తిరిగి తమ అవతారములతో దృఢపరచి జీవకోటిని రక్షించుచుందురు. ఓ నారద మహర్షి సంక్షేపముగా ఇట్లు శ్రీకృష్ణచరిత్ర) మొత్తము చెప్పబడినది సుమా.
ఈ శ్రీకృష్ణ చరిత్ర చాల మనస్సునానందింపజేయునది. ధర్మార్థ కామమోక్షములనెడి చతుర్విధ పురుషార్థములను ఫలముగా విన్నవారికి - చదువు వారికి ఇచ్చునది.
నారదా! ఈ సృష్టిలో చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని ఒక చిన్న గడ్డి వేరు వరకు అంతయు నశించునదియే. కనుక పరమానంద . దాత ఆనందమయుడు ఐన ఆనందనందనునే రాధాకృష్ణ యుగళ రూపమున నున్న స్వామిని భజింపుము. ఆ పరంబ్రహ్మ తన. ఇచ్ఛననుసరించి రూపములు ధరించువాడు. జీవకోటికంతటికి అంతరాత్మ ఐనవాడు సర్వమునకు ప్రభువైనవాడు ప్రకృతికతీతుడు అవ్యయుడు (క్షీణవృద్ధులు లేనివాడు) ఇట్టివాడనీ ఎవరికిని వ్యక్తముగాకున్నను (స్పష్టముగా తెలియకున్నను) భక్తులననుగ్రహించుట కొరకు ఒక రూపము ధరించువాడు. సత్యనిత్య స్వతంత్రుడు - సర్వేశ్వరుడు. ప్రకృతి కంటే అతిశయించి ఉన్నవాడు. త్రిగుణములు లేనివాడు సర్వకాముడు కనుక వాంఛలు లేనివాడు. ఒక్క ఆకారమన్నది లేనివాడు. (సర్వాకారుడు కనుక), మిక్కిలి రంజించు ఆనందమయుడు. అట్టి ఆనందరూపుడైన శ్రీకృష్ణుని భజింపుము.
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణమందలి శ్రీకృష్ణ జన్మఖండములో నారాయణ మహర్షి నారదుల నడుము సంవాద రూపమున నున్న రాధికాశ్రీకృష్ణ సంవాదమును ఏబది నాల్గవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 54 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
A foolish king named Paunḍraka of Karūsha, deluded by false pride and bad counsel, falsely declared himself to be the supreme Lord Vāsudeva, wearing artificial conch, disc, and mace, and demanding that everyone worship him. Accompanied by his ally King Kāsīrāja, Paunḍraka sent a insulting message to Lord Kṛshṇa challenging His divinity. Lord Kṛshṇa marched to the battlefield of Kāshi, effortlessly destroyed Paunḍraka's false insignia and army, and severed the impostor's head with His Sudarshana Chakra, restoring absolute truth and eliminating the arrogant blasphemer before returning to Dvārakā.