మూ॥ శ్రీ భగవానువాచ:
అను!! గృహస్థుడు ఎల్లప్పుడు బ్రాహ్మణుల దేవతల అర్చన చేస్తాడు. ఎల్లప్పుడూ నాలుగు వర్గాల వారు తమ ధర్మాచారణ చేయాలి. (1) దేవతలు మొదలగు వారంతా గృహస్థులవైపు ఆశగా చూస్తారు. అతిథిపూజ చేయని గృహస్థు ఎల్లప్పుడు అశుచియే (2) కర్మకాల మందు పితరులు, అతిథికాలమందుదేవతలు, అందరూ గృహస్థుని దగ్గరకు వస్తారు. నీటితోట్టి దగ్గరకు(నిపానం) ఆవులు వచ్చినట్లు (3) సాయంకాలమందు, ఆకలి గొన్నఅతిథి ప్రయత్నంగా వస్తాడు. ఆతనిని పూజించి, ఆశీస్సుపొందాలి. అప్పుడు గృహస్టు ఇంటినుండి ఆతడు పోతాడు (4)అతిథిపూజ చేయకపోతే గృహస్టుపాతకిఔతాడు ముల్లోకములోని పాపమంతా అతనికే వస్తుంది, అనుమానం లేదు (5) ఎవని ఇంటినుండి అతిథి ఆశలు అడుగంటి నశించి), పోతాడో, వాని పితరులు దేవతలు, అగ్నులు (6) నిరాశులైపోతారు, అతిథులు గృహస్థు ఇంటినుండి నిరాశులై వెళ్ళినట్టుగా. ఆడదానిని చంపినవాడు, ఆవును చంపినవాడు, కృతఘ్నడు, గురుతల్పం చేరిన బ్రాహ్మణుడు (7) వీరితో సమానమైన దోషం కలుగుతుంది, అతిధిని పూజించని వానికి. తనపాపాన్ని ఇచ్చి అతిథి యజమాని పుణ్యాన్ని తీసుకొని వెళ్తాడు. (8) అందువల్ల అందరి సేవను చేసి మంచి ఆశయంతో దేవాదులను పూజించి, పోషించతగినవారిని పోషించి ఆ పైన తాను భుజించే గృహస్థు ధర్మమెరిగినవాడు. (9) తల్లి ఇంట్లో లేదు, భార్యకులట అలాంటి గృహస్థు అడవికి పోవటం మంచిది. ఇల్లు, అరణ్యం కన్న దుఃఖకరమైంది. (10) దుష్టురాలు ఎప్పుడూ పతిని ద్వేషిస్తుంది. పతిని విషంతో సమానంగా చూస్తుంది. వాడికి తిండి పెట్టదు. ఎప్పుడూ బెదిరిస్తుంటుంది. (11) పూజించతగిన, మునితో సమానమైన వాణ్ణి, ఆపాపురాలు మాత్రం ఎప్పుడూ గడ్డిపోచలాగా తలుస్తూ, ఎప్పుడూ తిరస్కరిస్తుంటుంది. (12) ఆమె చెడుమాటలనే అగ్నితో దగ్గుడై చచ్చినవానిలా జీవిస్తాడు. దుష్టవంశంనుండి వచ్చిన దానిని పొంది బ్రతికినంత కాలం అట్లా జీవిస్తాడు. (13) వేదములలో చెప్పినట్టి, గృహణుల సదాచారాన్ని వినండి. గృహిణి పతిభక్తురాలు, దేవ, బ్రాహ్మణుల పూజించేది (14) ఆమె శుద్ధురాలు ప్రొద్దునే లేచి, పతిని, దైవాన్ని నమస్కరిస్తుంది. ఇంటి ముందు ఆవు పేడతో నీటితో శుభ్రం చేస్తుంది. (శుచి) (15) ఇంటి పనులు చేసి, స్నానం చేసి, సతి ఇంటికి వచ్చి, దేవుని బ్రాహ్మణుని, పతిని నమస్కరించి, గృహదేవతను పూజిస్తుంది. (16) ఇంటిపనిచేసి, సతిపతికి భోజనం పెట్టి, అతిథిని పూజించి, సతి సుఖంగా తాను తింటుంది. (17) పుత్రులతో పూజింపబడే తండ్రి శిష్యులతో పూజించబడే గురువు ఉత్తములు. పుత్రుడు, శిష్యుడు సేవకునిలా, ఆజ్ఞాపించగానే పనిచేయాలి. (18) శిష్యుడు గురువును తండ్రిని, పుత్రుడు పనులలో పురమాయించరాదు. తండ్రికి గురువుకు ఎల్లప్పుడూ తన సర్వస్వాన్ని ఇవ్వాలి (19) గురువును , తండ్రిని ఎప్పుడూ మనుష్యమాత్రునిగా (దేవతగా చూడాలి) తలచరాదు. మనుష్యునిగా తలిస్తే బ్రహ్మహత్యా పాపాన్ని పొందుతాడు, నిశ్చయము. (20) అట్లాగే తల్లిని తండ్రి కన్న ఎక్కువగా భక్తితో పూజించాలి. తల్లి పిదప గురువును భక్తితో పూజించాలి. (21) తండ్రి, తల్లి గురువు, భార్య, శిష్యుడు, పుత్రుడు వీరు ఎప్పుడూ భరించరానివారు. అనాథ, చెల్లెలు, కన్య, గురుపత్ని వీరు నిత్యము పోషించతగినవారు.
ఓ తండ్రీ! ఈ విధంగా అందరి ధర్మాన్ని ఉత్తమమైనదాన్ని చెప్పాను. స్త్రీ జాతి సహజంగా శుద్ధురాలు. వారంతా పతివ్రతలు. (23) తొలుత స్త్రీజాతి తిని అంతా ఒకే విధంగా బ్రహ్మసృష్టించాడు . వారంతా ప్రకృతికి అంశలు,పవిత్రురాండ్రు.గొప్ప పండితులు. (24) కేదారకన్య శాపంవల్ల ఆధర్మం నశించిపోయింది. అప్పుడు కోపంతో బ్రహ్మకృత్య అనే స్త్రీని నిర్మించాడు. (25) కృత్యస్త్రీ జాతి. మూడు విధములు, ఇదివరలో బ్రహ్మ అట్లా నిర్మించాడు. ఓ ప్రజ! మొదటిది ఉత్తమ , ఆ పై మధ్యమ అధమ అని (26) ఉత్తమమైనది పతిభక్తురాలు. కొంచం ధర్మం కలది. ప్రాణాంతమందు కూడా వానినిజారునిగా అపకీర్తికరునిగా చేయదు. ఆమె భర్తను పూజించినట్లే అట్లా దేవతలను, ద్విజులను, అతిథులను పూజిస్తుంది. వ్రతములు, ఉపవాసములు చేస్తుంది. అన్ని పూజలు చేస్తుంది. (28) పెద్దలచే రక్షింపబడ్డా ప్రయత్నించి కూడా జారుని పొందదు, భయంవల్ల. రెండవది కృత్రిమమైనది మధ్యమ. కొద్దిగా భర్తను సేవిస్తుంది. (29) స్థానంలేదు. పండగలేదు, ప్రార్థించేనరుడు లేడు. ఓ నంద! అందువల్ల వారికి సతీత్వము కల్గుతుంది. (30) అధమురాలు, చాలా దుష్టురాలు. మిక్కిలి అసద్వంశజురాలు. అధర్మశీల దుఃశీల, దుర్ముఖ, కలహించేది. (31) రోజు భర్తను బెదిరించేది. ఎప్పుడు జారుణ్ణి సేవించేది. భర్తకు దుఃఖం కల్గించేది. భర్తను విషంగా చూచేది. (32) జారునిద్వారా ఉపాయంగా మనోహరుడైన భర్తను చంపుతుంది. వాడు ధర్మిష్ఠుడైనా, వరిష్టుడైనా, గొప్పవాడైనా ఈ భూమి పై (33) కామదేవునితో సమానుడైనా, జారునిగా కామంతో చూస్తుంది. మంచిచూపుతో, ఓరచూపుతో, ఆనందంతో ఆపాపురాలు ఎప్పుడూ చూస్తుంది. (34) మంచి వేషం గల పురుషుని, యువకుని, రతిలో శూరుని చూచి కామినులైన స్త్రీల యోని ఎల్లప్పుడూ తడిఔతుంది. (35) భర్తకు తిండి పెట్టదు. ఎప్పుడూ విషపు మాటలు మాట్లాడుతుంది. ఎప్పుడూ అధర్మాన్ని ఆలోచిస్తుంది. ఆనందంతో జారుని మిక్కిలిగా తలుస్తుంది. (36) పెద్దలు భయ పెట్టినా, నూరు విధాలుగా రక్షించినా ఆమె అటైనా జారుని పొందుతుంది. రాజులైనా ఆమెను సాధించలేరు (సవరించలేరు) (37) ఆమెకు ప్రియమైనది ఏది లేదు. అన్ని కార్యాధీనములు (అవసరాన్ని బట్టే). గోవులు అడవిలో రకరకాల గడ్డి కోసం వెతికినట్లే కొత్తకొత్తవాణ్ణి ప్రార్థిస్తుంది ఈ స్త్రీ. (38) మెరుపు తీగకాంతి, జలంలో రేఖ ఎట్లాగో (క్షణికమో) ఆమే ప్రేమకూడా అట్లాంటిదే. ఎప్పుడు అధర్మం కలిగి, కపటం (అబద్ధం) చెప్తుంది,నిశ్చయము. (39) వ్రతమందో, ధర్మమందో, తపమందో, మనస్సు ఉండదు. గృహకర్మయందు కూడా. గురువులందు, దేవతలందు, మనసుండదు జారుని యందు, నిగనిగలాడుతూ (నిత్యనవంగా) చంచలంగా మనస్సు ఉంటుంది. (40) మూడు రకములైన స్త్రీ జాతి కథను నేను నీకు చెప్పాను. మూడు రకములైన భక్తుల లక్షణము విను, అని (41) గడ్డి పై పరుంటాడు నా గుణనామ కీర్తనలందు ఆసక్తుడు భక్తుడు. సంసారసుఖమునకు కారణమైన మనస్సును అక్కడి నుండి మరల్చి, నాయందుంచాలి భక్తుడు. (42)నా పాదాబ్జములను ధ్యానిస్తాడు. భక్తి భావంతో పూజిస్తాడు. ఆతని భక్తి కారణ రహితమైనది. సంకల్ప(కోరిక) రహితుడైన, వానికి దేవతలు ఆనందిస్తారు. (43)
అణిమాదికమైన, కోరతగిన, సర్వసిద్ధులను కోరరు. బ్రహ్మత్వము, అమరత్వము లేదా సురత్వము, ఇవి సుఖకారణములు. (44) ఇవి కోరరు. దాస్యము తప్ప సాలోక్యాదుల నాలిటిని కోరరు. నిర్వాణముక్తిని కాని ఇష్టమైన సుధాపానముకాని కోరరు (45) నాకు చెందిన (యందు) అతులమైన నిశ్చలమైన భక్తిని కోరుతారు. స్త్రీ పుంసభేదము లేదు. అన్ని జీవులలో భిన్నత్వముంది. (46) ఓవ్రజేశ్వర! శ్రేష్ఠులైన ఆ సిద్దులకు ఈశ్వరులైన వారికి ఆకలి దప్పికలు మొదలగునవి నిద్రమోహలోభాదులు లేవు. ఆ శత్రువులను (47) జయించి, దిగంబరులై రాత్రింబగళ్ళు నన్ను ధ్యానిస్తారు. ఓనంద! ఆతడు నాభక్తులలో శ్రేష్ఠతముడు. మధ్యమాది భక్తుల గూర్చి విను. (48) ఆ గృహస్థుడు కర్మలలో ఆసక్తుడుకాడు. పూర్వముచేసిన పురాతనమైన దానినుండి శుచిగా ఉంటాడు. ఎప్పుడూ పూర్వకర్మను నశింప చేసే కర్మను చేస్తాడు. (49) అపరమైన కర్మను ప్రయత్నపూర్వకముగా చేయడు, ఆతడు సంకల్పరహితుడు కనున ఉన్నది అంతా కృష్ణునిదే. ఈ కర్మకు నేను కర్తనుకాను. (50) అని కర్మతో, వాక్కుతో, మనస్సుతో ఎప్పుడూ చింతిస్తాడు. ఇంకా తక్కువ భక్తుడు అంతకన్నా న్యూనమైనవాడు. వాడు ప్రాకృతికుడని వేదాల్లో చెప్పబడ్డాడు. (51) యమునికాని, యముని దూతనుకాని కలలోకూడా చూడడు. వేయి మంది పురుషులను తొలి భక్తుడు ఉద్దరిస్తాడు (52) మధ్యముడు నూరుగురు పురుషులను ఉద్దరిస్తాడు. ప్రాకృతుడు వారిలో నాల్గవ భాగాన్ని ఉద్దరిస్తాడు. ఇట్లా, ఓ తండ్రి భక్తులు మూడు విధాలు, నీ ఆజ్ఞ ప్రకారం చెప్పాను. (53) సావధానంగా బ్రహ్మాండ రచనకు చెందిన కథను విను. యత్నిస్తే బ్రహ్మాండ రచనార్థమును భక్తులు తెలుసుకుంటారు. (54) మునులు,సురలు, సజ్జనులు, దుఃఖంతో ఈ విషయం కొద్దిగా తెలుసుకుంటారు. విశ్వము యొక్క అర్థాన్నంతా నేను తెలుసుకుంటాను. బ్రహ్మ అనంతుడు మహేశ్వరుడు (55) ధర్ముడు, సనత్కుమారుడు, నరనారాయణ ఋషులు, కపిలుడు, గణేశుడు, దుర్గ, లక్ష్మి, సరస్వతి (56) వేదము, వేదమాత, స్వయంగా సర్వజ్ఞురాలైన రాధిక వీరు విశ్వము అన్ని తెలుసుకుంటారు. ఇతరుడెవ్వడూ తెలుసుకోలేడు. (57) బుద్దిమంతులంతా విషమత్వం వల్ల తెలుసుకోనే సమర్ధులుకారు. ఆత్మలాగ, ఆకాశము నిత్యము. అట్లాగే దిక్కులు పది నిత్యము (58) ప్రకృతి నిత్యమైనట్లే విశ్వగోళము నిత్యము. గోలోకం నిత్యమైనట్లే వైకుంఠము నిత్యము (59) ఒకసారి నేను గోలోకంలో రోజులాగా రాసక్రీడచేస్తుండగా నా వామభాగం నుండి పదహారు సంవత్సరాల బాలిక పుట్టింది. (60) తెల్లని చంపకం పూలవంటి రంగు గలది, శరత్కాల చంద్రుని వంటి కాంతి గలది, చాలా సుందరమైనది, స్త్రీలలో (అందకత్తెలలో) ఉత్తమోత్తమమైనది, అందమైనది (61) కొద్దిపాటి చిరునవ్వుతో ప్రసన్నమైన ముఖం గలది, కోమలమైన అవయవాలు గలది, మనస్సును హరించేది. వహ్నితో శుద్ధి చేయబడ్డ వస్త్రం ధరించింది, రత్న ఆభరణములతో అలంకరింపబడ్డది (62) మేఘపంక్తి (నల్లనిది) బలాకములతో అలంకరింపబడ్డట్టు, సిందూర బిందువుతో పాటు అందమైన చంద్రుని వంటి చందన బిందువులతో అలంకరించుకుంది. (63) పాపట క్రింది భాగము కస్తూరి బిందువులతో పాటు ఉజ్జ్వలంగా ఉంది. వెలకట్టలేని రత్నములతో చేయబడ్డ, నిగనిగలాడే ఆభరణ కాంతులతో ఉజ్జ్వలంగా ఉంది. (64) రత్న కుండములు గల చెవులతో చెక్కిలి భాగం వెలిగిపోతోంది. కుంకుమ, లత్తుకకస్తూరి, అందమైన చందన పత్రములు వీనితో (65) - విచిత్రమైన, మంచి చిత్రములుగల వాటితో కూడిన మంచికపోల స్థలములు కలిగి వెలిగిపోతోంది. గరుడుని ముక్కును జయించిన ముక్కు గలిగి ముత్యపు ముక్కెరతోను శోభిస్తోంది.
అను!! గజేంద్రముల గండ స్థలము నుండి, వచ్చిన ముత్యాలతో చేసిన భూషణములతో అలంకరించబడింది. ముత్యపు చిప్పనుండి విడివడిన ముత్యముల వంటి పలువరుసతో మనోహరమైనది. (67) వలితముతో (అశ్వంనడక) కూడినది. మిక్కిలి పండిన దొండపండు వంటి పెదవి కలది, శ్రేష్టమైనది. ఎప్పుడూ పూర్ణచంద్రుని నిందించే (అపహసించే) ముఖం గలది, పద్మముల వెక్కిరించే కళ్ళు గలది (68) కృష్ణసారం (జింక) వంటి పైకి వచ్చిన చాలా అందమైన కాటుకతో వెలిగేది. అమూల్యమైన రత్నములతో నిర్మింపబడిన కేయూరములతో, కంకణములతో వెలిగేది. (69) మణీంద్ర సమూహముల కాంతులతో వెలిగే రెండు శంఖములను చేతులలో కలిగి వెలిగేది. ఈ రత్నాంగుళులతో, అమృతాంగుళులతో అలంకరింపబడింది. (70) రత్న శ్రేష్ఠముల సమూహముల కాంతితో శబ్దించే కాలి అందెలతో వెలిగేది. రత్నపాశముల (పాచికల) సమూహముతో పాదాంగుళులతో వెలిగేది. (71) సుందరమైన లత్తుక ఎరుపుతో పాదముల అడుగు భాగంతో వెలిగేది. గజేంద్రము వంటి నడకగలది, అందమైనది, కామిని, సుందరమైన కనులు గలది. (72) ఆరమణి ఓర చూపుతో రమించుటకు ఉత్సుకత గలదైనన్ను చూచింది. రాసమునకు సిద్ధమై ఆమె నా ముందు ధరించింది (వచ్చింది). (73) అందువలన పూర్వులు తెలిసిన వారు రాధ అని అన్నారు. పూజింపబడిందామె. ఆమె ప్రకృతి ఆనందకరమైనది. అందువల్ల ఆమె ప్రకృతి, ఈశ్వరి(74) అన్ని పనులలో ఆమె శక్తురాలు కనుక శక్తి అని పిలవబడింది. అన్నిటికి ఆధారము. అన్ని రూపములుగలది, అన్ని విధముల మంగళమునకు ఆధారము. (75) అన్ని మంగళము లిచ్చుటలో సమర్ధురాలామె కనుక ఆమె సర్వ మంగళ. వైకుంఠంలో ఆమె మహాలక్ష్మి. మూర్తి భేదంలో ఆమె సరస్వతి. (76) వేదముల ప్రసవించి ఆమె అప్పుడు వేదమాత అని చెప్పబడింది. ఆమె, సావిత్రి, గాయత్రి, ధాత్రి ముల్లోకములకు కూడా. (77) ఇదివరలో దుర్గమును (వానిని) సంహరించి, ఆమె దుర్గగా చెప్పబడింది. సర్వదేవతల తేజస్సుతో పుట్టిన (ది . ఇదివరలో) సతి ఆమె. (78) అందువల్ల ఆద్య (తొలిది) ప్రకృతి అని ఆమెను తెలుసుకోవాలి. రాక్షసులందరిని సంహరించేది. అందరికి ఆనందాన్నిచ్చేది. ఆనందమూర్తి, ఆమె. దుఃఖ దారిద్ర్యముల నశింపచే సేది. (79) శత్రువులకు, భయం కల్గించేది, భక్తుల భయాన్నిహరించేది. దక్షుని కన్య, ఆమె సతి. శైలజాత పార్వతి అని పిలువబడింది. (80) అన్నిటికి ఆధారస్వరూపురాలామె. ఆమె భూమి కళ గలది. కళతో తులసి, గంగ ఆమె. కళతో సర్వస్త్రీరూపిణి ఆమె. (81) ఓ తండ్రి! ఆమె) శక్తితో, మళ్లీ మళ్ళీ సృష్టిని చేస్తున్నాను. రాసమధ్యమందున్న ఆమెను చూచాను. నా క్రీడ ఆమెతో (82) బ్రహ్మయొక్క నూరు సంవత్సరములకాలము, చాలాకాలము జరిగింది. అత్యద్భుతమైన, కుతూహం కల్గించే మహాశృంగారాన్ని చూచాను. (83) వారిద్దరి చెమటరాశి రాసమండలమందు స్రవించింది. అందువల్ల మనోహరంగా కల్గింది. ఆకార సరోవరమనే పేరుగలది. (84) చెమటధార విశ్వగోలమందు, కిందికి వేగంగా పడింది. బ్రహ్మాండ గోళము నీటితో నిండిపోయింది. (85) ఓ ప్రజేశ్వర! జలపూర్ణం కావటం కన్న ముందు సృష్టి అంతా శూన్యము. శృంగారం చివర, ఆమె యందు నేను వీర్యము నాధానం చేశాను (ఉంచాను) (86) బ్రహ్మయొక్క నూరు సంవత్సరముల కాలము ఆ రాధ గర్భం ధరించింది. దాని చివర ఆమె పరమ అద్బుతమైన పిల్ల వానిని కన్నది (87) వానిని చూచి దేవి కోపగించింది, ఏడ్చింది, ఆమె విషాదము నందింది. కాలితో వానిని కిందికి విశ్వగోలకంలోకి తోయసాగింది.
ఓ తండ్రి! సర్వులకు ఆధారభూతుడు, మహా విరాట్టు, ఆతడు నీటిలో పడిపోయాడు. నీటిలో పడ్డ సంతానాన్ని చూచి, నేను, ఇదిరలో ఆమెను శపించాను. (89) ఓ విభు! ఇదివరలో నా శాపంతో ఆరాధ సంతాన హీనురాలైంది. అందువల్ల క్రమంగా దుర్గ, లక్ష్మి, సరస్వతి కలిగారు. (90) ఆ నలుగురు పరిపూర్ణులు, పుట్టింపబడ్డారు. నిశ్చయము. ఓవ్రజేశ్వర! ఇతర దేవతలు, ఆస్త్రీలు పుట్టించబడ్డారు. (91) ఓ ప్రజ! ఎవరి (స్త్రీలు) కళతో లేదా కలాంశ అంశతోకాని పుట్టాడో. ఏడింభుని వలన మహావిరాట్టు జన్మించాడో ఆతడు కళతో ఆశ్రయింపబడ్డాడు. (92) నేను ఆతనికి అమృతమయమైన అంగుషామృతమును ఇచ్చాను. ఆతడు తాగాడు. జలమందు స్థావర రూపంగా నిద్రిస్తున్నాడు. తన కర్మకు నిలయము. (93) జలము తలగడ, ఆతనికి యోగబలంతో జలమేతల్పము. అతని రోమకూపములు ఎల్లప్పుడు నీటితో నిండి ఉంటాయి. (94) క్రమంగా క్షుద్ర విరాట్టు తిరిగి ప్రత్యేకంగా నీటి యందు నిద్రపోతాడు. క్షుద్రుని నాభినుండి వేయిరేకుల కమలం ఉద్భవించింది. (95) ఈ వరుడైన బ్రహ్మ అక్కడ పుట్టాడు. కనుక ఇతడు కమలోద్భవుడు. ఆ విధి అక్కడ పుట్టి ఆతడు చింతాగ్రస్తుడైనాడు. (96) ఈదేహమెక్కడిది తల్లెక్కడ, నాతండ్రిక్కడ, బంధువులెక్కడ. ఆ కమలంలోనే దేవతల మూడు లక్షల సంవత్సరాల కాలం తిరిగాడు. (97) ఆపిదప, దేవతల ఐదు లక్షల సంవత్సరాల కాలం తపస్సు చేస్తూ నన్ను స్మరించాడు. అప్పుడు కమలంలోనే ఉండి నేనిచ్చిన మంత్రాన్ని జపించాడు. (98) దేవతల ఏడు లక్షల సంవత్సరాల కాలం నియమంగా నిగ్రహంగా, శుచిగా జపించాడు. ఆపిదపనాతో వరాన్ని పొంది ఆ బ్రహ్మ సృష్టి చేశాడు. (99) మాయతో ప్రతిబ్రహ్మాండ మందు బ్రహ్మవిష్ణువు, శివుడు, దికాల్పలురు, పన్నెండు మంది సూర్యులు, పదకొండు మంది రుద్రులు (100) నవగ్రహాలు, ఎనిమిది మంది వసువులు, అట్లాగే మూడుకోట్ల దేవతలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, యక్ష గంధర్వ కిన్నరులు (101) భూతాదులు, రాక్షసులు, ఈ విధంగా చరాచర సృష్టి సర్వమూ కలిగింది. ప్రతివిశ్వంలో క్రమంగా ఏడు స్వర్గములు నిర్మింపబడ్డాయి (102) ఏడు సాగరములు, ఏడు దీవులతో భూమి, బంగారు భూమి, అట్లాగే చీకటి స్థలము, (103) ఏడు పాతాళాలు, వీటితోనే బ్రహ్మాండము నిర్మింపబడ్డాయి. ప్రతి విశ్వంలో చంద్రసూర్యులు, పుణ్యక్షేత్రమైన భారతము వచ్చాయి. (104) ఓ వ్రజేశ్వర! ఈ గంగాది తీర్థములు. అంతటా వచ్చాయి. మహావిష్ణువునకు రోమకూపములెన్నో క్రమంగా అన్నీ వచ్చాయి (105) అవన్నీ అసంఖ్యాకములైన విశ్వములే, నిశ్చయము. వీటన్నిటి పైభాగంలో (విశ్వమునకు ఈశులు) వైకుంఠము, నిరాశ్రయంగా ఉంది (106) నాఇచ్చతో నిర్మించబడ్డ వేదములు, చెప్పటానికి అసాధ్యములు. కుత్సితయోగులకు కన్పించదు. భక్తులు కాని వారికి కూడా, నిశ్చయము (107) ఆ పైన గోలోకము ఏబది కోట్ల యోజనముల విస్తీర్ణముది. గాలితో ధరించబడుతోంది. విచిత్రమైనది. గొప్ప ఆశ్రయము కలది (108) మిక్కిలి అందమైన నిర్మాణము నిత్యరూపమైనది, నా ఇచ్ఛతో నిర్మించాను. నూరు శిఖరములు గల పర్వతముతో, పుణ్యమైన వృందావనముతో (109) మంచిరాస మండలముతో, విరజానదితోను కూడింది. కోటి యోజనములు విస్తీర్ణముకల కొండమీది విశాల ప్రదేశము కలది విరజ, ఓ ప్రజ!
పొడవు దానికి నూరురెట్లెక్కువ, చుట్టూ శుభమై, ఉత్తమమైనది. అమూల్యమైన రత్న సమూహములతో వజ్రమాణిక్యములతో (111) అసంఖ్యాకములైన కౌస్తుభాదిమణులతో కూడి మనోహరమైనది. అక్కడ కూడా ప్రతిమందిరము, అమూల్యరత్నములతో నిర్మించబడినది (112) ప్రాకారము మనోహరమైనది. విశ్వకర్మ ఎప్పుడూ చూడనట్టిది గోపికలు, గోపకులు కామధేనువులు వీటితో ఆవరించబడింది (113) కల్ప వృక్షములు, పారిజాత వృక్షములు, అసంఖ్యాకమైన సరోవరములు, కలది. కోట్ల కొలది పుష్పోద్యానములతో ఆవరించబడింది, రాసమండలము (114) నూరుకోట్ల కొలది గోపకులతో చుట్టబడిన మందిరములతో చుట్టబడింది. రత్న దీపములు కలది. పుషతల్పములు కలది (115) వాసనగల చందనపు వాసనలతో, కస్తూరి కుంకుమలు గలవానితో కూడింది. క్రీడకు ఉపకరించే భోగవస్తువులు, తాంబూలములు, వాసనగల జలముగలది (116) వాసనగల రమ్యమైన ధూపములు కలది, మాలలు గలది, రత్నముల అద్దములు గలది. ఎప్పుడు రక్షకులతో రక్షింపబడేది. మూడుకోట్ల రాధదాసీలతో కూడినది (117) అమూల్యరత్నాభరణములతో, వహ్నిశుద్ధమైన వస్త్రములతో కూడినది. లక్షమందించిన ఏనుగులతో చుట్టబడింది. సైన్యముతో క్రమంగా చుట్టబడింది (118) నవయౌవ్వనముగలిగిన, రూపంలో సాటిలేని వారుకలది. ఓప్రజ! చంద్రబింబమువలె గుండ్రముగా ఉన్నది, రమ్యమైనది (119) అమూల్య రత్నములతో చేయబడింది. పదియోజనముల విశాలమైనది. రమ్యమైన కస్తూరి కుంకుమలు కలది, వాసనగల చందనముతో అర్చింపబడింది (120) పండ్లు చిగురుటాకులు గలది మంగళఘటములు కలది. పెరుగు , పేలాలు, ఆకులు నిగనిగలాడే గడ్డిమొలకలతో పండ్లతో కూడింది (121) శుభకరమైన, అందమైన అరటి స్తంబములతో, అసంఖ్యాకమైనవానితో మనోహరమైనది. పట్టుదారముతో కట్టబడిన, నిగనిగలాడే చందనపు చిగురుటాకులు గలది (122) చందనముతో కూడిన మాలలతో భూషణములతో అలంకరింపబడింది. అమూల్యమైన రత్నములతో చేయబడింది. నూరు శృంగములతో మనోహరమైనది (123) పైకి కోటియోజనములు (ఎత్తు) పొడవు, దానికన్న పదింతలు ఎక్కువ, ఏబదికోట్ల యోజనములు, పర్వతములతో కూడిన కొండమీది విశాల ప్రదేశముకలది (124) మిక్కిలి అందమైనది, వేదములతో నిర్వచింపరానిది. దానికి కూడా ప్రాకారమువలె, గోలోకమునకు మనోహరమైనది (125) చుట్టూ చుట్టబడినది, రమ్యమైనది, వజ్రహారములతో కూడినది, అక్కడ రమ్యమైన వృందావనమున్నది. అది చందనపు చెట్లతో కూడినది (126) రమ్యమైన కల్పవృక్షములతో, మందారములతో, కామధేనువులతో కూడినది. శోభనమైన మనోహరమైన పుష్పోద్యానములతో అలంకరించబడింది (127) రమ్యమైన క్రీడా సరోవరములతో, ఇంకా రమ్యమైన రతిమందిరములతో కూడింది. రహస్యంగా, రాసయోగ్యమైన స్థలముగలది, మిక్కిలి రమ్యమైనది (128) అసంఖ్యులైన రమ్యమైన గోపికా గణములతో, రక్షకులతో రక్షింపబడింది. చుట్టూ గుండ్రని ఆకారము గలది. మూడు లక్షల యోజన వైశాల్యముగలది, శ్రేష్ఠమైనది (129) తుమ్మెదల ధ్వని గలది, పుంస్కోకిలల ధ్వనితో కూడినది. అక్కడ రమ్యమైన అక్షయ వటము రహస్యమందు ఉంది. చాలా విశాలమైనది (130) వేయి యోజనముల ఎత్తు, దానికి నాల్గింతలు వ్యాప్తి కలది. గోపికలకు కల్పవృక్షమది. అన్ని కోరిన ఫలితములనిచ్చేది (131) క్రీడకు కావలసిన వానితో ఆవరించబడింది. మూడు లక్షల రాధ దాసీలు గలది. విరజాతీరమందలి నీటియొక్క చల్లని గాలితో (132) మెల్లని దానితో పుష్పములతో కూడిన మంచి వాసన కలవానితో పవిత్రమైంది. అసంఖ్యాకమైన దాసీగణముతో వృందావనమందు ఆనందించేది (133) నా ప్రాణాధిదేవతమైన రాధ ఆమె అక్కడ క్రీడిస్తోంది. ఆ ఈమె శ్రీరాముని శాపంతో ఇప్పుడు వృషభానుని సుతగా ఉంది. (134) ఓప్రజ! బ్రహ్మాది దేవతలతో, సిద్దేంద్రులైన మునీంద్రులతో (సిద్ద, ఇంద్ర, మునీంద్ర) పూజింపబడింది. సిద్దులతో, గుణములతో, బలములతో, బుద్దితో, జ్ఞానయోగములతో, విద్యతో (135) ఓతండ్రి! అన్ని విధముల నాతో సమానమైనది, ప్రియమైనది, నమస్కరింప తగినది అని ఓ నంద! బ్రహ్మాండముల వర్ణనను ఇట్లా చెప్పాను, తగినట్లుగా పరిమితంగా చెప్పాను, ఇంకా ఏమి వినదలిచావు (136) అని బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండమందు ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాద మందు భగవంతుని నందుని సంవాదమందు ఎనుబది నాల్గవ అధ్యాయము.
Summary of chapter 84 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Celebrating sacred botanical manifestations of divine energy, this chapter details the spiritual merits of planting, watering, worshipping, and circumambulating the holy Tulasī plant, the Dhātrī tree, and the Bilva tree. The text declares that Lord Śrī Kṛshṇa resides eternally near a Tulasī garden, and offering a single Tulasī leaf with love satisfies the Lord more than mountains of gold. Similarly, honoring the Dhātrī and Bilva trees bestows health, long life, and spiritual purity upon the household.