మూ॥ శ్రీనారాయణ ఉవాచ :
శ్రీరాధికోవాచ :
అను II నారాయణుడిట్లన్నాడు : ఉద్దవుని మాటలు విని రాధిక చైతన్యం పొంది లేచిశ్రేష్ఠమైనరత్న సింహాసనమందు ఆమె కూర్చున్నది. (1) హృదయంలో బాధపడుతూ దేవిమధురంగా ఇట్లా అన్నది. ఏడుగురు గోపికలు భక్తితో తెల్లని చామరలు చేత ధరించి ఆమెను సేవిస్తున్నారు. (2) రాధిక ఇట్లా అన్నది ఓ వత్స! నన్ను సంపదను మరచి, నీవు మధురకు వెళ్ళు. నీకు ఈభవ సాగరమందు దీనివల్ల అధర్మం కలగదు. ఇప్పుడు నా మాటలన్నీ, అక్కడివెళ్ళిచెప్పు. నాప్రభువు, పరమానందుడైన శ్రీకృష్ణుని త్వరగా తీసుకురా. (4) స్త్రీలలో, స్త్రీ జన్మలో, అటువంటి భర్తను పొంది ఎవతెకు భర్తతో విభేదం కల్గింది. నేను తప్ప ఇంకెవడైనా దుఃఖితురాలు ఉందా (5) నాకేమి బోధిస్తావు. నాకు చెప్పతగిన బోధలేదు. ఓ ఉద్దవ! ఆత్మలేకుండా, శరీరధారుల దేహము నిష్పలమైనది. ఎప్పుడూను. (6) ప్రీతితో కూడినసౌభాగ్యమును, నిత్య నూతనమైన గౌరవమును, మిక్కిలి దుర్లభమైన ప్రేమను, రహస్యమైన నవ సంగమమును, (7) ఎప్పుడూ మనస్సులో స్మరిస్తుంటాను. మనస్సులో మరొకటి లేదు. రాత్రిపూట నిద్ర లేక స్మరించటం వల్ల దుఃఖం పెరుగుతుంది. (8) ఓ వత్స! శోకసాగరమందు మునిగిన నన్ను తప్పక ఉద్దరించు. జీవులకు అభయప్రధానం చేస్తే అది నరులకు తీర్ధ స్నానం వల్ల కలిగే ఫలాన్ని ఇస్తుంది. (9) ఎంత బోధించినా కుదుట పడటం లేదు. మనస్సువారింపరానిది. పరమాత్మయైన కృష్ణుని పాదాంబుజములను చింతిస్తున్నాను. (10) ఆతని గుణాలను, మహిమను, ప్రీతిని, ప్రేమసముద్రాన్ని వీటిని స్మరించి స్మరించి ఆసౌభాగ్యం తలచి తలచి నా మనస్సు స్థిరంగా ఉండకుండైంది. చంచలమైంది. (11) జగత్తులో యువతులకు ఇటువంటి దుః ఖమెవరికి ఉంది. శ్రీకృష్ణువియోగ దుఃఖాన్ని నేను తప్ప ఎవరెరుగుదురు. (12) సీతకు కూడా కొంచెం తెలుసు. విధిబోధితురాలనై నేను ఎరుగుదును. నా అంత దుఃఖితురాలు ఈముల్లోకములలో స్త్రీలలో లేదు (13) నా మనోవ్యథను విని ఎవతే ప్రసిద్ధిని పొందుతుంది. ఓ సుత! ఉద్దవ! ఏయువతికి నా అంత దుఃఖం ఉంది. (14) రాధిక వంటి స్త్రీ ఇదివరలో లేదు. ఇకముందు పుట్టదు. దుఃఖిని , విరహతపురాలు, సుఖ సౌభాగ్యములు లేనిది. (15) కల్పవృక్షాన్ని పొంది, జగత్పతియైన పతిని పొంది, నిర్డయుడు, పాపియైన విధాతచే మోసగింపబడ్డాను. (16) ఆతని పాదపద్మములను చంద్రముఖమును రూప వేషములను చూడటం వలన జన్మ జీవనము సఫలము, కళ్ళుమనస్సు స్నిద్దమౌతాయి. (17) ఆతని పేరు విన్నంత మాత్రం చేత ఐదు ప్రాణములు బాగా ఆనందిస్తాయి. స్తుతించినంతనే వికసిస్తాయి,ఆత్మ స్నిగ్ధమౌతుంది. (18) సురత మందు స్పృశించినంత మాత్రం చేత ముల్లోకములలో కీర్తి లభించింది. అట్టి ఈశ్వరుని, ఎంత సంపద '(ఎట్టి) వస్తే మాత్రం ఎట్లా విస్మరిస్తాను, ఓ వత్స! (19) రూపము ముల్లోకాలను. జయించేది. ఆతడు సద్గుణాలనే వహిస్తాడు. ఆతడు విధితో నిర్మింపబడలేదు. అతడే విధిని నిర్మించాడు. (20) విధికి విధాతయైన, అన్నిసంపదలనిచ్చే, కల్పవృక్షమున కంటే పరుడై శాంతుడైన, మనోహరుడైన ఆ లక్ష్మీకాంతుని ఎట్లా మరుస్తాను. (21) సర్వేశుడు, అన్నిటికి బీజరూపుడు, పరమాత్మ ఈశ్వరుడు, అట్టి పతిని, ఎట్టి సంపద వస్తే మరచిపోతాను, ఓ తండ్రి! (22) చంద్రునో, మన్మథునో, అశ్వనీ కుమారులనో మథునం చేస్తే ఇట్టి రూపం రాదు. విశ్వంలో ఈతని గుణసామ్యం కలవాడు లేదు.
బ్రహ్మ, ఈశుడు,శేషుడు వీరలు ఆపరమాత్మను ధ్యానిస్తారు. ఎట్టి సంపదలభిస్తే ఆ ప్రభువును మరిచిపోతాను, ఓ తండ్రి! (24) సాటిలేని మనోహరమైన ఆ రూపాన్ని కలలో చూస్తారు. అట్టివారు అందరు అన్నీ వదిలి ఆతనినే రాత్రింబగళ్ళు ధ్యానిస్తారు. (25) ఆతని గుణాలతో పర్వతం నీరై ద్రవిస్తుంది. ఎండిన కర్ర కరిగిపోతుంది. చచ్చినచెట్టు మొగ్గ తొడుగుతుంది. గాలి స్తంభిస్తుంది. (26) సూర్యుడు సముద్రము భక్తి భావంతో ఆగిపోతాయి. ఇట్టివానిని ఏ సందవస్తే మాత్రం అట్టి ప్రియునిమరచిపోతాను, ఓ పుత్ర! (27) ఆతని భయంతో గాలి వీస్తోంది. సూర్యుడు ఎండకాస్తున్నాడు. ఇంద్రుడు వర్షిస్తున్నాడు, అగ్ని కాలుస్తున్నాడు. ప్రాణులలో మృత్యువు సంచరిస్తున్నాడు. (28) ఆతని భయంతో చెట్లు పండ్లనిస్తున్నాయి. సకాలంలో పుష్పిస్తున్నాయి. తమ ఆత్మ విషయంలో సముద్రములు, గ్రహములు, మునులు, సురలు భయంగా ఉన్నారు. (29) కాలమునకు కాలము, సంవర్తుడు, స్రష్టనుసహరించేవాడు. ఈశ్వరుడు, స్వాధీనుడు, స్వతంత్రుడు. స్వయంగా ఆత్మ అనే పేరుగలవాడు. (30) ఓ భక్త! ఏ సంపదచూచి ఆ ప్రభువును మరచిపోతాను. ఆతడు విడిపోతే నాకు ప్రబోధం లేదు. ఇక బుధుడు ఎట్లామేల్కొలుపుతాడు. (31) సావిత్రి సరస్వతులు నన్ను మేల్కొలుపటానికి శక్తులు కారు. వేదములు, వేదాంగములు, సజ్జనులు సురలు (32) వేయి తలలవాడు అనంతుడు, వేదములకు జనకుడైన బ్రహ్మ శంభుడు గణేశుడు, యోగీంద్రులు గురువునకు గురువైనవాడు వీరెవరు నన్ను బోధపరుపలేరు. (33) ఉన్నదానికి మార్గం ఆలోచించాలి. మార్గం శూన్యమైతే దిక్కేది. సుఖము,దుఃఖము శుభము, అశుభము, అంతా కాలం వల్లనే సిద్ధిస్తాయి. (34) కాలాన్ని తప్పించలేము. జగత్తులో అంతా కాలం వల్ల సాధించతగిందే . ఓవత్స! లే సుఖంగా, మనోహరమైన మధురకు వెళ్ళు. (35) ప్రజవాసాన్ని వదిలి నీవు కూడా వెళ్ళటానికి ఉత్సాహంగా ఉన్నావు. ఎక్కువ కాలము కృష్ణ వియోగము దుః ఖకారణము, సుఖకారికాదు. (36) జన్మమృత్యుజర అను మూడు స్థితులనుండి రక్షించే చంద్రముఖం ఆతనిది. రాధిక యొక్క ఈమాటలన్ని విని ఉద్ధవుడు అధికంగా ఏడ్చాడు. బంధువుల వియోగంతో భయపడ్డ, ఏడుస్తున్న రాధికను చూచి, ఉద్ధవుడు దుః ఖించాడు. (37) అని బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు రాధ ఉద్ధవ సంవాదమందు తొంబది ఐదవ అధ్యాయము సమాప్తము. ॥
Summary of chapter 95 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Deepening the description of Vraja, this chapter illuminates the confidential sweetness of the sacred bowers of Vṛndāvana and the transcendent glory of Rādhā-Kuṇḍa and Śyāma-Kuṇḍa. Manifested from the divine tears and pastimes of Śrī Rādhā and Śrī Kṛshṇa, these holy ponds represent the liquid form of supreme divine love. Bathing in Rādhā-Kuṇḍa with pure faith grants the rare jewel of unalloyed Rādhā-dāsya, the eternal loving service of Goddess Śrī Rādhā.