మూ॥ నంద ఉవాచ –
శ్రీభగవానువాచ ।
అను ॥ నందుడిట్లన్నాడు - శ్రీకృష్ణ! జగన్నాథ ! సుస్వప్నాన్ని గూర్చి నేను విన్నాను. వేదసారము, నీతి సారము, లౌకికము వైదికము విన్నాను. (1) వేటిని చూస్తే పాపమో ఇప్పుడు వినదలిచాను. ఏకర్మచేస్తే పాపమో, ఓ వత్స! దాన్ని నాకు చెప్పు. (2) వేదశాస్త్రములందు చెప్పబడ్డ మాట, వేదశాస్త్ర అనుయాయులు సంతప్తులు లోకులు, నీనోటి నుండి వినదలిచారు. (3) వేదములకు జనకుడవు నీవు. వైదికులైన సజ్జనులకు కూడా. బ్రహ్మాదులకు, సురులకు, మునులకు, జగత్తుకు జనకుడవు. (4) నీ నోటితో విన్నమాట ప్రమాణమైనది. అమృతవాక్కు. ఓ వత్స! వానితోనా దేహం అభిషిక్తమైతే, అది విచ్చేదమునకు, దాహమునకు కారణము. (5) కలలో ఎవని పాదకమలములు అన్ని కోరికల ఫలములనిచ్చేవో, బ్రహ్మాదులు చూడలేదో అది ఈ వేళ నా కనులకు గోచరమైంది. (6) ఇంతకన్నా నీ పాదాంబుజములను పాతకినైన నేను ఎక్కడచూస్తాను. మలమూత్రముల ధరించే నాశరీరం తనుచేసిన కర్మతో బంధింపబడింది. (7) ఓవత్స! ఇటువంటి రోజు నాకెప్పుడు లభిస్తుంది. బ్రహ్మాదులకు నాథుడవైన నీతో, పాపినైన నాకు సంవాదము (8) ఓ కృపానాథ! నా పైదయచూపు, నాదోషాన్ని క్షమించు. పిల్లవాడి బుద్ధితో చెడునడవడికనేను చేసినది దాన్ని క్షమించు, ఓమహేశ్వర! (9) బ్రహ్మ ఈశుడు, శేషుడు, మునులు నీ పాదాంబుజములను ధ్యానిస్తారు. సరస్వతి, నిన్ను స్తుతిస్తూ జడరూప మౌతుంది (స్తుతించలేక) నీకు శ్రుతి ఆమె (10) అని పలికి నందుడు, ఆనందం లేక, దుఃఖాకులుడైనాడు. మూర్చనందాడు. పుత్రుడు విడిపోతాడని చలించి ఏడ్చాడు. (11) భయపడి, భగవంతుడైన కృష్ణుడు ప్రయత్నపూర్వకంగా బోధించసాగాడు. జగత్పతి, అతనికి పరమమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చాడు. (12) శ్రీభగవానునిమాట ! ఓ నంద! ఓ తండ్రి! సర్వశ్రేష్ఠుడ! ప్రజమునకు నాథ! చైతన్యము నొదు. ఓ కళ్యాణుడ! పరమజ్ఞానాన్ని విను. (13) జ్ఞానులకును చాలా దుర్లభమైన పరమమైన ఆధ్యాత్మిక జ్ఞానమిది. వేదశాస్త్రములందు దాగినది. నీకే ఇస్తున్నాను, నేను. (14) ఓ నంద! మేలుకో, విను, ఆనందంగా, చాలా శ్రద్ధగా విను. జన్మ, మృత్యువు, ముసలితనము, రోగములు వానిని అభ్యసిస్తే (తలిస్తే) రావు (15) ఓ మహారాజ! స్థిరుడవుకా. ఓ వైజనాథ! వ్రజమునకు వెళ్ళు. జ్ఞానాన్ని పొంది ఎప్పుడూ ఆనందం కలిగి శోకమోహములు విడిచి ఉండు (16) సచరాచరమైన సంసారమంతా నీటి బుడగ వంటిది. కల వలె (ఉదయం కాగానే) మిధ్య ఔతుంది. మోహమునకు కారణము. (17) అబద్దము కృత్రిమ నిర్మాణమునకు హేతువు, పాంచ భౌతికమైన ఈ శరీరం. ఈమాయ వల్ల , ఇది నిజమనే భావన వల్లనూ నరుడు ప్రతీతిని (ఆనందాన్ని) పొందుతున్నాడు. (18) కామక్రోధ లోభమోహములతో అన్ని కర్మలలో చుట్టబడి, మాయామోహితుడై ఎప్పుడూ జ్ఞాన హీనుడౌతున్నాడు, దుర్బలుడు. (19) నిద్ర, కునికిపాట్లు (తంద్ర), ఆకలి, దప్పిక, ఓర్పు, శ్రద్ధ, దయవీనితో , లజ్జ, శాంతి, ధృతి, పుషిద్ది, తుష్టి వీనితో చుట్టబడి (20) మనోబుద్ధిచేతనలతో ప్రాణ జ్ఞాన ఆత్మలతో కలిసి, అందరు దేవతలతో, వృక్షము కాకులతో కూడినట్లు ఉన్నాడు. (21)
అను! నేను ఆత్మను, సర్వేశుడను, సర్వజ్ఞానాత్మకుడను, మనస్సు, బ్రహ్మ ప్రకృతి, బుద్ధిరూపమైనది, ఇది సనాతనమైనది. (22) ప్రాణములు విష్ణువు. అది చేతన. పద్మ అధి దేవత.నేనుంటే అందరుంటారు, నేనుపోతే అందరు పోతారు. (23) నేను లేకుండా శరీరం వెంటనే పడిపోతుంది. నిశ్చయము. పాంచభూతము (శరీరము) తత్ క్షణమందే పంచభూతములందు లీనమౌతుంది. (24) నామసంకేతములు నిష్పలము. మోహమునకు కారణము. ఓ తండ్రి అజ్ఞానులకు శోకము, జ్ఞానులకు ఏమీ లేదు. (25) నిద్రాదిశక్తులు అవన్నీ ప్రకృతికళలు. లోభాదులు అధర్మము అంశాలు. అహంకారము ఐదవది. (26) సత్వాది మూడుగుణములు బ్రహ్మ విష్ణురుద్రాది అంశలు. శివుడు జ్ఞానాత్మకుడు. జ్యోతిస్వరూపుడనైన నేను ఆత్మ, నిర్గుణుడను (27) నేను ప్రకృతిలో ప్రవేశిస్తే అప్పుడు నేను సగుణుడనౌతాను. విషయములు సగుణములు బ్రహ్మ విష్ణురుద్రాదులు కూడా (28) ధర్మము నా అంశము. విషయి, శేషుడు, సూర్యుడు కలానిధి. ఇట్లా అన్ని మునులు , మన్వాదులు, దేవతలు నాకళాంశలు. (29) అన్ని దేహాలలో నేనున్నాను. అన్ని కర్మలలో లిప్తుడను (పూసుకోవడం) కాలేదునేను. నా భక్తుడు జన్మమృత్యు జరలను పోగొట్టుకున్నవాడు జీవన్ముక్తుడు (30) అన్ని సిద్దులకు ఈశ్వరుడు, శ్రీమంతుడు, కీర్తిమంతుడు, పండితుడు, కవి, ముప్పది నాలుగు విధములైన సిద్ధులనందినవాడు. అన్ని కర్మలను తొలగించుకున్నవాడు. (31) సిద్ధుడైన, ఆతనిని స్వయంగా చేరుతాను. భక్తుడు మరొకటికోరడు (నన్ను తప్ప). ఇరువది రెండు రకాల సిద్ధులు సిద్ధిసాధనమునకు కారణము. (32) ఓ నంద! సిద్ధమంత్రమును, నాముఖం నుండి విను, స్వీకరించు. అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకాశ్యం, మహిమా (33) ఈశిత్వము, వశిత్వము, కామముల అవసానము, దూరశ్రవణము, పరకాయ ప్రవేశము (34) మనస్సుతో వెళ్ళటం, సర్వజ్ఞత్వము. అభీప్సితము (పొందటం) వహ్ని స్తంభము, జలస్తంభము, చిరంజీవిత్వము. (35) కాయవ్యూహము, వాక్సిద్ధి, చచ్చినవానిని తీసుకు రావడం అభీప్సితము సృష్టిచేయడం, ప్రాణాకర్షణ. (36) ఓం సర్వేశ్వరాయ, సర్వవిఘ్నవినాశినే మధుసూదనాయ స్వాహా, అని ఈ మంత్రము, మహాగూఢమైనది. అందరికి కల్పవృక్షం లాంటిది. (కోరికలిచ్చేది) సామవేదంలో చెప్పబడింది. సిద్ధులకు అన్ని సిద్ధులను ఇచ్చేది. (37) దీనితో యోగులు, సిద్ధులు, మునీంద్రులు, సురలు వీరికి నూరు లక్షల జపంతో మంత్ర సిద్ది సజ్జనులకౌతుంది. (38) నారాయణ క్షేత్రమందు హవిష్యాన్నము భుజిస్తూ జపిస్తే సిద్ధి కల్గుతుంది. ఓ తండ్రి! కాశికి మణికర్ణికకు వెళ్ళి జపం చేయి. (39) నీటికింద నారాయణ క్షేత్రము నాలు విధాలుంది విను. అక్కడ నారాయణుడే స్వామి. మరోస్వామి లేడు. (40) ఇక్కడ మరణిస్తే జ్ఞానములభిస్తుంది. లోకంలో ఆతనికి రూపమేర్పడుతుంది. వ్రతం లేకున్నా మంత్రంతో జీవన్ముక్తుడౌతాడు, అనుమానం లేదు. (41) ప్రజాన్ని (దేశం) పవిత్రం చేయి, ఓ ప్రజనాథ, ప్రజానికి వెళ్ళు. దేన్ని చూస్తే పాపమో ఓ తండ్రి చెప్తాను. విను (42)
అను ॥ దుఃస్వప్నము పాపమునకు బీజము కేవలము విఘ్నమునకు కారణమౌతుంది. గోవును చంపినవాడు, బ్రాహ్మణుని చంపినవాడు, కృతఘ్నడు, కుటిలుడు (43) దేవఘ్నుడు, పితృమాతృఘాతుకుడు, పాపి, విశ్వాసఘాతుకుడు, దొంగ సాక్ష్యం చెప్పేవాడు, ఆతిథ్యమందు విశేషముగా మోసగించేవాడు (44) గ్రామయాజిని అని దేవుడు విప్రుల సొమ్మును హరించేవాడు, అశ్వత్థామును చంపేవాడు (చెట్టు), దుష్టుడు, శివ విష్ణువులనిందించేవాడు (45) దీక్షితుడుకానివాడు, అనాచారి, సంధ్యాహీనుడు ఐన బ్రాహ్మణుడు, దేవలుడు, వృషభమునెక్కేవాడు, శూద్రులకు వండేవాడు (46) శూద్రుల శవాన్ని కాల్చేవాడు, శూద్రుల శ్రాద్ధ అన్నాన్ని తినేవాడు, భర్త సంతానములేనిది, ముక్కుకోయబడ్డది, దేవబ్రాహ్మణ నిందకురాలు (47) పతిభక్తిలేనిది, విష్ణుభక్తిలేనిది, శూద్రవిధవస్తీ, చండాలస్తీ వ్యభిచరించేది, (48) ఎప్పుడు కోపముగల దుష్టుడు, ఋణగ్రస్తుడు, జారస్త్రీకి కల్గినవాడు, దొంగ, మిధ్యావాది, శరణాగతుణ్ణి పంపించేవాడు (49) మాంసాపహారి, బ్రాహ్మణుడు, వృషలీపతి (స్త్రీకి), శూద్రుడు బ్రాహ్మణిని పొందేవాడు, వడ్డికిచ్చే బ్రాహ్మణుడు, (50) చేరరానిస్త్రీని చేరేవాడు, దుష్టుని, నాల్గవజాతికి చెందిన నరాధముడు, వీరిని చేరరాదు. తల్లి, సవతితల్లి, అత్త, చెల్లెలు (51) గురువుభార్య, కొడుకుభార్య, సోదరుని ప్రియమైన భార్య, తల్లి చెల్లెలు, తండ్రి చెల్లెలు, మేనల్లుని భార్య (52) మేనమామ భార్య. కొత్త పెళ్ళికూతురు, చిన్నాన్న భార్య (పెదనాన్న), రజస్వల, తండ్రికి తల్లికి చెందిన తలిదండ్రులు, ఈ పద్దెనిమిది మందిని పొందరాదని చెప్పారు. (53) ఓ ప్రజ! దీనిని సామవేదంలో చెప్పారు, సజ్జనులు వీరిని రక్షించాలి. వీరిని చూచిన, ముట్టిన (పాపబుద్ధితో) నరుడు బ్రహ్మహత్య పాపాన్ని పొందుతాడు. (54) అందువల్ల వారిని విధి వశాత్తు చూచినా సూర్యుని చూచి, హరిని స్మరించాలి. (వారిని దైవాంగా చూడాలి). కామంతో చూచిన వారు నిందించతగిన వారౌతారు. (55) అందువల్ల సజ్జనులు శాపభీతులై చూడరు, ఓ ప్రజేశ్వర! రాహువుచే మింగబడ్డ సూర్యచంద్రులను పండితులు చూడరు (56) జన్మ (ఒకటి) ఎనిమిది, ఏడు, పన్నెండు, పది స్థానములందలి సూర్యుడు, జన్మనక్షత్రమందు, నాల్గవస్థానమందు చంద్రుడుంటే మరణము సంభవిస్తుంది. (57) నష్టమైన చంద్రుని చూడరాదు, భాద్రపదంలోని శుక్లకృష్ణ పక్షములందును, చతుర్థిచంద్రుని విడువాలి (చూడరాదు) అని విద్వాంసులన్నారు. (58) చంద్రుడు తారాపహరణము చేయుట కలంకము, అతిదుష్కరమైనది. ఓ నంద! ఆతనికి ఇచ్చినా, కోరికతో చూచిన దోషమే. (59) అనుకోకుండా చూస్తే నరుడు, మంత్రపూతమైన నీటిని త్రాగాలి. అప్పుడు వెంటనే శుద్ధుడౌతాడు. భూమి పై నిష్కలంకుడౌతాడు. (60) సింహము ప్రసేనుణ్ణి చంపింది. సింహాన్ని జాంబవంతుడు చంపాడు. ఓ సుకుమార! ఏడవకు, ఈస్యమంతకమునీది. (61) అనే మంత్రంలో పవిత్రమైన జలమును, చక్కగా త్రాగాలి, నిశ్చయము. అని అంతా నీకు చెప్పాను. ఇంకా నీకు ఏమి చెప్పాలి. (62) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు శ్రీకృష్ణ జన్మఖండ ఉత్తరార్ధమందు నారాయణ నారద సంవాదమందు భగవంతుని నందుని సంవాదమందు డెబ్బది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 78 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Illustrating the unyielding power of Truth and Dharma, Maharshi Nārada narrated the histories of King Trishanku and his illustrious descendant King Harishchandra. King Harishchandra sacrificed his kingdom, wealth, wife, and freedom to uphold a solemn promise made to Sage Vishvāmitra, enduring immense personal suffering without ever uttering a falsehood. Pleased by his flawless adherence to Truth, Lord Śrī Vishṇu Himself appeared on the cremation grounds, restored the king's family and kingdom, and elevated Harishchandra and his citizens directly to the heavenly realms.